మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

Advertisement - 2

Image3

........

Advertisement - 3

Image3

........

ప్రకటనల కోసం 90358 80349 నెంబర్ కు సంప్రదించండి.
|

⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!

చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.

💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి

చిలకలూరిపేట ​- సి.ఆర్. కాలనీలో హైడ్రామా - వీధి కుక్కల కోసం కన్నీరు పెట్టుకున్న జనం... వెనుదిరిగిన మున్సిపల్ సిబ్బంది!

చిలకలూరిపేట ​- సి.ఆర్. కాలనీలో హైడ్రామా - వీధి కుక్కల కోసం కన్నీరు పెట్టుకున్న జనం... వెనుదిరిగిన మున్సిపల్ సిబ్బంది!

చిలకలూరిపేట: పట్టణంలో వీధి కుక్కల సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోంది. అయితే, ఈ సమస్యను పరిష్కరించే క్రమంలో మున్సిపల్ అధికారులకు ఒక విచిత్రమైన, సున్నితమైన సవాలు ఎదురవుతోంది. చిలకలూరిపేటలోని సి.ఆర్. కాలనీ (C.R. Colony) లో తాజాగా జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం.

​కాలనీలో కుక్కల బెడద తీవ్రంగా ఉందంటూ చింతల విష్ణు ప్రియ గారు పబ్లిక్ గ్రీవెన్స్ (పరిష్కార నివేదిక) ద్వారా ఫిర్యాదు చేశారు. స్పందించిన మున్సిపల్ అధికారులు, సెప్టెంబర్ 22న కుక్కలను పట్టుకునేందుకు సిబ్బందిని పంపారు. కానీ, అక్కడికి చేరుకున్న సిబ్బందికి స్థానికుల నుండి ఊహించని స్పందన ఎదురైంది.

కుక్కల కోసం కన్నీరుమున్నీరు...

వీధి కుక్కలను పట్టుకుని సిబ్బంది బండిలో ఎక్కిస్తున్న దృశ్యాన్ని చూసి ఆ వీధిలోని కొందరు స్థానికులు తట్టుకోలేకపోయారు. వాస్తవానికి అవి వీధి కుక్కలే అయినప్పటికీ, రోజూ వాటికి అన్నం పెడుతూ ఉండటం వల్ల ఆ కుక్కలతో వారికి ఒక ఎమోషనల్ బాండింగ్ ఏర్పడింది. కుక్కలను తీసుకెళ్లిపోతున్నారని తెలిసి వారు కన్నీరుమున్నీరుగా విలపించారు. "అవి మా కుక్కలే, వాటిని ఏమీ చేయొద్దు దయచేసి వదిలేయండి" అంటూ ఏడుస్తూ సిబ్బందిని బ్రతిమిలాడారు. వారి ఏడుపు చూసి అధికారులు సైతం చలించిపోయి, కుక్కలను అక్కడే వదిలేశారు.

రాత్రి వేళల్లో రెచ్చిపోతున్న కుక్కలు - భయపడుతున్న కాలనీ వాసులు:

అన్నం పెడుతున్న వారి పట్ల ఆ కుక్కలు విశ్వాసంగా, సాధు జంతువుల్లాగానే ఉంటున్నాయి. కానీ అసలు సమస్య వేరే వారి రూపంలో వస్తోంది. రాత్రి వేళల్లో ఆ వీధి గుండా వెళ్లే ద్విచక్ర వాహనదారులపై, అపరిచితులపై ఈ కుక్కలు విపరీతంగా దాడికి దిగుతున్నాయి. వెంటపడి తరమడం, మీదకు ఎగబడటం వంటివి చేస్తుండటంతో మిగిలిన ప్రజలు, రాత్రి వేళల్లో డ్యూటీలు ముగించుకుని వచ్చే వారు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.


అధికారుల కఠిన హెచ్చరిక:

స్థానికుల కన్నీళ్లు, విజ్ఞప్తుల మధ్య మున్సిపల్ అధికారులు వారికి ఒక విషయాన్ని స్పష్టం చేశారు. "మీకు వాటిపై అంత ప్రేమ ఉంటే, పెంపుడు కుక్కల్లాగా మీ ఇంటి కాంపౌండ్ వాల్ లోపలే ఉంచుకోండి. కానీ ఇలా వీధుల్లో వదిలేసి ఇతరుల ప్రాణాలకు ముప్పు తెస్తే మాత్రం ఊరుకునేది లేదు. ఈసారికి మీ బాధ చూసి వదిలేస్తున్నాం. మళ్లీ ఇలా వీధుల్లో కుక్కలు దాడి చేస్తున్నాయని ఫిర్యాదు వస్తే మాత్రం... మున్సిపల్ బండి తీసుకొచ్చి శాశ్వతంగా ఇక్కడి నుండి తీసుకుపోతాం" అని గట్టిగా హెచ్చరించి వెనుదిరిగారు.

చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ ప్రత్యేక విజ్ఞప్తి:

పట్టణ ప్రజలకు మా మనవి ఒక్కటే... మూగ జీవాలకు పట్టెడన్నం పెట్టడం పుణ్యకార్యమే. మీ దయాగుణాన్ని మెచ్చుకోవాల్సిందే. కానీ మీకున్న ప్రేమ ఇతరులకు ప్రాణసంకటంగా మారకూడదు. పగలు సాధువుగా ఉండే వీధి కుక్కలు, రాత్రిళ్లు అపరిచితులపై ప్రమాదకరంగా దాడులు చేస్తున్నాయన్నది వాస్తవం. దయచేసి దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. మీరు కుక్కలను పెంచుకోవాలనుకుంటే ఇంటి హద్దుల్లోనే ఉంచుకుని బాధ్యత వహించండి. వీధుల్లో వదిలేసి ఇతరుల భయానికి, ఇబ్బందులకు కారణం కావొద్దు.

చిలకలూరిపేట కరెంటు వినియోగదారులుకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు " 0 "చేసుకోవచ్చు మరిన్ని వివరాలు కోసం కింది నెంబర్ కి కాల్ చేయండి - +91 70135 89826 - ఆదిత్య సోలార్

 మరిన్ని చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి. వాట్సప్ ఛానల్ ని ఫాలో అవ్వండి.

https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g

Share:

చిలకలూరిపేట - బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో ఆధార్ అప్‌డేట్‌ల పేరిట పగటి దోపిడీ!

చిలకలూరిపేట - బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో ఆధార్ అప్‌డేట్‌ల పేరిట పగటి దోపిడీ!

అధికంగా డబ్బులు గుంజుతున్నారని పట్టణవాసి నాయుడు శివ ఆరోపణ.. అధికారులకు వినతిపత్రం అందజేత.

​చిలకలూరిపేట (స్పీడ్ న్యూస్): కేంద్ర ప్రభుత్వం ప్రజల సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన ఆధార్ కేంద్రాలు కొందరు సిబ్బంది కాసుల కక్కుర్తికి కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. సామాన్యుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని నిలువుదోపిడీకి పాల్పడుతున్నారు. తాజాగా చిలకలూరిపేట పట్టణంలోని గాంధీపేటలో ఉన్న బీఎస్ఎన్ఎల్ ప్రధాన కార్యాలయంలోని ఆధార్ కేంద్రంలో అప్‌డేట్‌ల పేరుతో ప్రజల నుంచి ఇష్టానుసారంగా అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త నాయుడు శివ తీవ్రంగా ఆరోపించారు.

​అసలేం జరిగిందంటే..

పట్టణంలోని సుబ్బయ్య తోట ప్రాంతంలో నివసించే నాయుడు శివ కుటుంబ సభ్యులు తమ ఆధార్ కార్డులో పేరు మార్పు, ఇతర అప్‌డేట్‌ల నిమిత్తం బుధవారం గాంధీపేట బీఎస్ఎన్ఎల్ ఆఫీస్‌లోని ఆధార్ సెంటర్‌కు వెళ్లారు. అక్కడ పని పూర్తయిన తర్వాత ప్రభుత్వ నిబంధనల ప్రకారం తీసుకోవాల్సిన నిర్దేశిత రుసుము కాకుండా, సదరు కంప్యూటర్ ఆపరేటర్ దౌర్జన్యంగా అదనపు డబ్బులు డిమాండ్ చేసినట్లు శివ ఆరోపించారు. ఎందుకు ఎక్కువ అడుగుతున్నారని ప్రశ్నించిన వారిపై నిర్లక్ష్యంగా, దురుసుగా సమాధానం ఇచ్చారని మండిపడ్డారు.

​నిత్యం ఎంతో మంది సామాన్యులు, వృద్ధులు, విద్యార్థులు తమ ఆధార్ పనుల కోసం ఉదయం నుంచే క్యూ లైన్లలో నిలబడితే.. ఇలాంటి ఆపరేటర్లు మాత్రం వారి అవసరాన్ని బట్టి జేబులు గుల్ల చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

​అధికారులకు ఫిర్యాదు.. చర్యలకు డిమాండ్

ఈ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నాయుడు శివ.. వెంటనే స్పందించి స్థానిక బీఎస్ఎన్ఎల్ ఉన్నతాధికారిని స్వయంగా కలిసి లిఖితపూర్వకంగా వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నుంచి అదనపు వసూళ్లకు పాల్పడుతున్న సదరు కంప్యూటర్ ఆపరేటర్ పై, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న సంబంధిత సిబ్బందిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆ వినతిపత్రంలో డిమాండ్ చేశారు.

​ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, ఆధార్ కేంద్రం వద్ద ప్రజలకు స్పష్టంగా కనిపించేలా 'ప్రభుత్వ నిర్దేశిత రుసుములతో కూడిన బోర్డు'ను ఏర్పాటు చేయాలని కోరారు. అమాయక ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని, ఈ దందాను అరికట్టకపోతే ప్రజల పక్షాన నిలబడి పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తామని ఆయన అధికారులకు విన్నవించారు.

చిలకలూరిపేట కరెంటు వినియోగదారులుకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు " 0 "చేసుకోవచ్చు మరిన్ని వివరాలు కోసం కింది నెంబర్ కి కాల్ చేయండి - +91 70135 89826 - ఆదిత్య సోలార్


 మరిన్ని చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి. వాట్సప్ ఛానల్ ని ఫాలో అవ్వండి.

https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g

Share:

చిలకలూరిపేట - సీజ్ చేసిన గోడౌన్లలో మాయమైన బాణాసంచా.. అధికారుల రియాక్షన్ ఏంటి ?

చిలకలూరిపేట - సీజ్ చేసిన గోడౌన్లలో మాయమైన బాణాసంచా.. అధికారుల రియాక్షన్ ఏంటి ?

ఫైర్ సేఫ్టీ లేదు.. అనుమతులు లేవు.. ఇక్కడ ఏ చిన్న ప్రమాదం జరిగినా ప్రాణాలకు గ్యారెంటీ లేదు!

​చిలకలూరిపేట ప్రజలారా అప్రమత్తం! మన పక్కనే ప్రాణాలను బలితీసుకునే డెత్ ట్రాప్‌లు ఉన్నాయా? అంటే తాజా పరిణామాలు అవుననే అంటున్నాయి. కాకినాడలో జరిగిన అగ్నిప్రమాదంలో 28 మంది అమాయకులు సజీవ దహనమైన ఘటనతో రాష్ట్రం ఉలిక్కిపడింది. ఈ క్రమంలో నిద్రలేచిన అధికారులు చిలకలూరిపేటలో తనిఖీలు చేపట్టగా... కళ్లు బైర్లు కమ్మే నిజాలు వెలుగులోకి వచ్చాయి. అసలు మన ఊళ్లో ఏం జరుగుతుందో తెలుసుకోండి.

అసలేం జరిగింది?

​కాకినాడ ఘటన నేపథ్యంలో చిలకలూరిపేట రూరల్ పరిధిలోని బొప్పూడి, పసుమర్రు గ్రామాల పరిధిలో ఉన్న బాణాసంచా గోడౌన్లు, దుకాణాలపై జాయింట్ యాక్షన్ కమిటీ (రెవెన్యూ, పోలీస్, ఫైర్ విభాగాలు) కొరడా ఝుళిపించింది. రెండు రోజుల క్రితం ఒకసారి, ఈరోజు (గురువారం) మరోసారి క్షేత్రస్థాయిలో విస్తృత తనిఖీలు నిర్వహించారు.

​ఈ తనిఖీల్లో వెలుగుచూసిన విస్తుపోయే నిజాలు ఇవే:

  • నిబంధనలు గాలికి: వ్యాపారం ప్రారంభించడానికి ముందు తీసుకోవాల్సిన కనీస 'ఫైర్ సేఫ్టీ' సర్టిఫికెట్లు ఇక్కడి దుకాణదారుల వద్ద లేవు.
  • అధికారుల నిర్ధారణ: చిలకలూరిపేట పరిసర ప్రాంతాల్లోని ఈ గోడౌన్లకు అసలు ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు, అనుమతులే లేవని స్వయంగా జిల్లా అధికారే స్పష్టం చేయడం గమనార్హం.

అతిపెద్ద ట్విస్ట్: తాళాలు అధికారుల దగ్గరే... సరుకు మాత్రం మాయం!

​ఈ మొత్తం వ్యవహారంలో ప్రజలను, అధికారులను విస్మయానికి గురిచేసిన అసలు పాయింట్ మరొకటి ఉంది.

​నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని మొన్నటి తనిఖీల్లో అడిషనల్ ఎస్పీ, డీఎస్పీలు బొప్పూడి పరిధిలోని బాణాసంచా గోడౌన్లను పరిశీలించి, వాటికి తాళాలు వేసి కీస్ తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కానీ, ఈరోజు (గురువారం) ట్రైనీ డీఎస్పీ, రూరల్ ఎస్సై అనిల్, మండల తహశీల్దార్ షేక్ హుస్సేన్ మరియు ఇతర శాఖల అధికారులు ఆ గోడౌన్లను అధికారికంగా తనిఖీ చేయడానికి వెళ్లి తాళాలు తెరిచారు. లోపల చూస్తే సరుకు (బాణాసంచా) లేదు! అధికారుల చేతిలో తాళాలు ఉండగానే... సీజ్ చేసిన గోడౌన్లలోంచి లక్షలాది రూపాయల బాణాసంచా ఎలా మాయమైంది? ఎటు వెళ్లింది? ఈ వ్యవహారం వెనుక ఉన్నదెవరు? అనేది ఇప్పుడు చిలకలూరిపేటలో హాట్ టాపిక్‌గా మారింది.

చిలకలూరిపేట ప్రజల పక్షాన స్పీడ్ న్యూస్ అడుగుతున్న ప్రశ్నలు:

  1. ​ఎలాంటి అనుమతులు లేని ఈ మృత్యుకూపాలకు ఇన్నాళ్లూ కరెంట్ ఎలా ఇచ్చారు? వ్యాపారం ఎలా చేసుకోనిచ్చారు?
  2. ​సీజ్ చేసిన గోడౌన్ల నుంచి సరుకు రాత్రికి రాత్రే జనావాసాల్లోకి మారిందా? అయితే ప్రజల ప్రాణాలకు రక్షణ ఏది?
  3. ​అధికారుల కన్నుగప్పి సరుకును మాయం చేసిన వారిపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోబోతున్నారు?

​కాకినాడ తరహా విషాదం మన చిలకలూరిపేటలో జరగకముందే అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని, బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

ఇకపై కరెంట్ బిల్లు కట్టే అవసరం లేదు - పూర్తి వివరాల కోసం ఇప్పుడే కాల్ చేయండి - +91 70135 89826 - ఆదిత్య సోలార్ - సోలార్ గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకొని ఆ తర్వాతే బిగించుకోండి.

 మరిన్ని చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి.

https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g

Share:

చిలకలూరిపేట రూరల్ - భర్త అనుమానం.. బలిగొన్న ప్రాణం

చిలకలూరిపేట రూరల్ - భర్త అనుమానం.. బలిగొన్న ప్రాణం

కట్టుబడివారిపాలెంలో విషాదం.. వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య
అనాథలైన ముగ్గురు పసిపిల్లలు.. కేసు నమోదు చేసిన రూరల్ పోలీసులు
​చిలకలూరిపేట (స్పీడ్ న్యూస్): భర్త అనుమానం ఆ సంసారంలో చిచ్చురేపింది. కట్టుకున్న వాడే కక్ష కట్టడంతో ఆ వివాహిత తల్లడిల్లిపోయింది. రోజురోజుకూ వేధింపులు శృతిమించడంతో.. ఆ నరకం భరించలేక తన ప్రాణాలనే తీసుకుంది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం కట్టుబడివారిపాలెం గ్రామంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
​పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మక్కే తిరుమల (28) అనే మహిళను ఆమె భర్త వీరాంజనేయులు గత కొంతకాలంగా అనుమానంతో తీవ్రంగా వేధిస్తున్నాడు. భర్త పెట్టే శారీరక, మానసిక హింసను భరించలేక తీవ్ర మనస్తాపానికి గురైన తిరుమల జీవితంపై విరక్తి పెంచుకుంది. ఈ క్రమంలోనే గత నెల 28వ తేదీ (శుక్రవారం) సాయంత్రం 5 గంటల సమయంలో ఇంట్లో ఎవరూ లేనిది చూసి, ఓ శీతల పానీయంలో ఎలుకల మందు (పేస్టు) కలుపుకుని తాగేసింది.
​అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను గమనించిన కుటుంబ సభ్యులు, ప్రాణాపాయ స్థితిలో ఉన్న తిరుమలను హుటాహుటిన మెరుగైన వైద్యం నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి (GGH)కి తరలించారు. దాదాపు వారం రోజుల పాటు అక్కడ మృత్యువుతో పోరాడిన తిరుమల.. పరిస్థితి విషమించడంతో ఈరోజు చికిత్స పొందుతూ కన్నుమూసింది.
​అనాథలైన ముగ్గురు పిల్లలు..
తిరుమల మృతితో కట్టుబడివారిపాలెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. పసిప్రాయంలోనే తల్లి దూరం కావడంతో ఆ ముగ్గురు పిల్లలు దిక్కుతోచని స్థితిలో అనాథలుగా మారారు. తల్లి లేని లోటును తలచుకుని వారు రోదిస్తున్న తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది.
​తన కుమార్తె మరణానికి అల్లుడు వీరాంజనేయులు పెట్టిన వేధింపులే కారణమని, నిష్కారణంగా తన బిడ్డను పొట్టనబెట్టుకున్న అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతురాలి తల్లి తాటికొండ శివపార్వతి పోలీసులకు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ ఫిర్యాదు చేశారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిలకలూరిపేట రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ముమ్మరం చేశారు.

ఇకపై కరెంట్ బిల్లు కట్టే అవసరం లేదు - పూర్తి వివరాల కోసం ఇప్పుడే కాల్ చేయండి - +91 70135 89826 - ఆదిత్య సోలార్ - సోలార్ గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకొని ఆ తర్వాతే బిగించుకోండి.

 మరిన్ని చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి.
Share:

చిలకలూరిపేటలో 20 ఏళ్ల నిస్వార్థ సేవ.. ఉచిత యోగాతో 10 వేల మందికి ఆరోగ్య సిరి! త్వరలో కొత్త బ్యాచ్!

చిలకలూరిపేటలో 20 ఏళ్ల నిస్వార్థ సేవ.. ఉచిత యోగాతో 10 వేల మందికి ఆరోగ్య సిరి! త్వరలో కొత్త బ్యాచ్!

చిలకలూరిపేటలో 20 వసంతాల ఉచిత యోగా సేవలు.. నేడు ఘనంగా 82వ శిబిరం ముగింపు!

​ఆధునిక జీవనశైలిలో ఒత్తిడి, అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న ప్రజలకు 'శ్రీ వెంకటేశ్వర యోగా సేవా సంస్థ' ఒక సంజీవనిలా నిలుస్తోంది. చిలకలూరిపేట పట్టణంలో గత రెండు దశాబ్దాలుగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఉచితంగా యోగా శిక్షణ అందిస్తూ ఎంతో మందికి ఆరోగ్య ప్రదాతగా ఈ సంస్థ సేవలందిస్తోంది.

10 వేల మందికి పైగా యోగా విద్య..

స్థానిక శ్రీ సాదినేని చౌదరియ్య గారి స్కూల్ ప్రాంగణంలో 2005వ సంవత్సరం నుండి ఈ ఉచిత యోగా సేవా సంస్థను విజయవంతంగా నడుపుతున్నారు. ప్రతి శిబిరం 28 రోజుల పాటు కొనసాగుతుంది. గత 20 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఇప్పటివరకు 82 శిబిరాలను దిగ్విజయంగా నిర్వహించారు. ఈ శిబిరాల ద్వారా చిలకలూరిపేట మరియు పరిసర ప్రాంతాలకు చెందిన సుమారు పదివేల మంది సాధకులు యోగ విద్యను అభ్యసించి శారీరక, మానసిక దృఢత్వాన్ని పొందారు.

వ్యాధులకు అనుగుణంగా ప్రత్యేక ఆసనాలు..

ఈ సంస్థ యొక్క ప్రత్యేకత ఏమిటంటే.. సాధకుల వ్యక్తిగత ఆరోగ్య సమస్యలను బట్టి వారికి అనువైన ఆసనాలు నేర్పించడం. సాధారణ యోగాభ్యాసంతో పాటు ముద్రలు, ధ్యానం (Meditation) లో శిక్షణ ఇస్తారు. ముఖ్యంగా నేటి సమాజాన్ని వేధిస్తున్న నడుము నొప్పి, థైరాయిడ్, గ్యాస్ట్రిక్ సమస్యలు, బీపీ (BP), షుగర్ (మధుమేహం), గుండె సంబంధిత రుగ్మతలు, హెర్నియా వంటి సుమారు 60 రకాల దీర్ఘకాలిక సమస్యలకు ఇక్కడ ప్రత్యేక ఆసన ప్రయోగాలు నేర్పుతారు. ఎలాంటి మందులు అవసరం లేకుండా యోగా ద్వారానే ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విధానాలను ఇక్కడ నేర్పుతారు.

నేడు 82వ శిబిరం ముగింపు.. త్వరలో కొత్త శిబిరం..

ఈరోజు (గురువారం) 82వ యోగా శిబిరం ముగింపు కార్యక్రమం జరుగుతోంది. కాగా, సరిగ్గా ఒక నెల రోజుల తర్వాత '83వ ఉచిత యోగా శిబిరం' ప్రారంభించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

​చిలకలూరిపేట పట్టణ ప్రముఖులు, ప్రజలు అందరూ ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, యోగా ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని తమ సొంతం చేసుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు.

మరిన్ని వివరాలకు సంప్రదించండి

:శిఖాకొల్లి రాంబాబు,యోగా గురువు, చిలకలూరిపేట.ఫోన్ నెంబర్: 9959373880

ఇకపై కరెంట్ బిల్లు కట్టే అవసరం లేదు - పూర్తి వివరాల కోసం ఇప్పుడే కాల్ చేయండి - +91 70135 89826 - ఆదిత్య సోలార్ - సోలార్ గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకొని ఆ తర్వాతే బిగించుకోండి.


 మరిన్ని చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి.

https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g

Share:

చిలకలూరిపేట గర్వించదగ్గ ముద్దుబిడ్డ, పద్మశ్రీ పురస్కార గ్రహీత.. నాదస్వర మాంత్రికుడు షేక్ మహబూబ్ సుభాని కన్నుమూత

చిలకలూరిపేట గర్వించదగ్గ ముద్దుబిడ్డ, పద్మశ్రీ పురస్కార గ్రహీత.. నాదస్వర మాంత్రికుడు షేక్ మహబూబ్ సుభాని కన్నుమూత


​నాదమే ప్రాణంగా, సంగీతమే లోకంగా బతికిన మన చిలకలూరిపేట ముద్దుబిడ్డ, ప్రముఖ నాదస్వర విద్వాంసుడు షేక్ మహబూబ్ సుభాని (71) ఇకలేరు. మార్చి 4, 2026 న ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం చిలకలూరిపేటకే కాకుండా యావత్ కర్ణాటక సంగీత లోకానికి తీరని లోటు. సంగీతానికి మతం లేదని నిరూపించిన ఈ అరుదైన కళాకారుడు, తన నాదస్వరంతో మన పట్టణ కీర్తిని ఖండాంతరాలు దాటించారు.

కష్టాలను జయించి.. శిఖరాలను అధిరోహించి:

  • బాల్యం, పోరాటం: 1954-55 ప్రాంతంలో మన చిలకలూరిపేటలో జన్మించిన సుభాని గారు.. కేవలం ఏడేళ్ల చిరుప్రాయంలోనే నాదస్వర ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించారు. అయితే, పేదరికం, కుటుంబ పరిస్థితుల కారణంగా ఆయన కొంతకాలం పొగాకు కంపెనీలో గుమస్తాగా పని చేయాల్సి వచ్చింది. కష్టాలు ఎదురైనప్పటికీ, నాదస్వరంపై ఉన్న మక్కువతో ఆయన తన సాధనను ఎన్నడూ ఆపలేదు. మన చిలకలూరిపేట మట్టిలో పుట్టిన ఆ పట్టుదలే ఆయనను ఉన్నత శిఖరాలకు చేర్చింది.
  • అద్భుత జంట: కర్నాటక సంగీతంలోని ఎన్నో అరుదైన రాగాలు, కృతులను నాదస్వరంపై పలికించడంలో సుభాని గారు సిద్ధహస్తులు. తన భార్య కలీషాబీ మహాబూబ్‌తో కలిసి ఆయన చేసిన నాదస్వర గానం ఒక అద్భుతం. ఈ దంపతులు జంటగా నాదస్వరం వాయిస్తూ మన చిలకలూరిపేట పేరును దేశ విదేశాల్లో మార్మోగేలా చేశారు.
  • ఆధ్యాత్మిక పీఠాలకు ఆస్థాన విద్వాంసులుగా: దైవ సన్నిధిలో వీరి నాదస్వర గానం ఎంతో పవిత్రమైనది. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఆస్థాన విద్వాంసులుగా సుదీర్ఘకాలం సేవలందించిన ఈ దంపతులను, వారి సంగీత ప్రతిభకు మెచ్చి 2001లో ప్రతిష్ఠాత్మక శృంగేరి శారదా పీఠం ఆస్థాన విద్వాంసులుగా నియమించింది. ఏడుకొండల వాడికి, శారదామాతకు మన చిలకలూరిపేట నాదాన్ని వినిపించిన ఘనత వీరిదే.
  • పద్మశ్రీ పురస్కారం.. మన పేటకు గర్వకారణం: సుభాని గారి ప్రతిభకు ఎన్నో అవార్డులు దాసోహమన్నాయి. కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డుతో పాటు, 2020లో భారత రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఈ దంపతులు అత్యున్నత పౌర పురస్కారం 'పద్మశ్రీ' ని అందుకోవడం మన చిలకలూరిపేట చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఘట్టం.

​'నాదబ్రహ్మ' గా పేరొందిన సుభాని గారి భౌతిక కాయం దూరమైనా, ఆయన పలికించిన నాదం, ఆయన సాధించిన కీర్తి చిలకలూరిపేట గాలిలో ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి. నాదస్వర విద్వాంసుల లోకంలో ఒక శకం ముగిసింది.

Share:

చిలకలూరిపేటలో ఆందోళన - మున్సిపల్ డీఈ అబ్దుల్ రహీంపై భగ్గుమన్న సచివాలయ సిబ్బంది! - అసలేం జరిగింది ?

చిలకలూరిపేటలో ఆందోళన - మున్సిపల్ డీఈ అబ్దుల్ రహీంపై భగ్గుమన్న సచివాలయ సిబ్బంది! - అసలేం జరిగింది ?

- ఫోన్‌లో దుర్భాషలాడటంపై భగ్గుమన్న ఉద్యోగులు

- అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నిరసన ర్యాలీ

- తక్షణమే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కమిషనర్‌కు వినతి

చిలకలూరిపేట (స్పీడ్ న్యూస్): చిలకలూరిపేట పట్టణ మున్సిపాలిటీ పరిధిలో సచివాలయ సిబ్బంది ఆందోళన బాట పట్టారు. విధి నిర్వహణలో ఉన్న తమ పట్ల మున్సిపల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (D.E) అబ్దుల్ రహీం అనుచితంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ సిబ్బంది మూకుమ్మడిగా నిరసనకు దిగారు. కింది స్థాయి ఉద్యోగుల పట్ల దురుసుగా ప్రవర్తించిన ఆయనపై తక్షణమే కఠినమైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని వారు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు.

​అసలేం జరిగిందంటే.. పట్టణంలోని పోలిరెడ్డి పాలెం ప్రాంతంలో మంచినీటి పైపులైన్ మరమ్మతుల పనులు జరుగుతున్నాయి. ఈ విషయమై సచివాలయ సిబ్బంది శ్రీనివాసరావు, రమేష్‌లతో డి.ఈ అబ్దుల్ రహీం చరవాణి (ఫోన్) ద్వారా మాట్లాడారు. ఈ క్రమంలో ఆయన తీవ్రమైన పదజాలంతో, ఇష్టమొచ్చినట్లు దుర్భాషలాడినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమిస్తున్న తమను.. ఒక ఉన్నతాధికారి స్థాయిలో ఉండి ఇలా అవమానించడం పట్ల పల్నాడు జిల్లా సచివాలయ యూనియన్ నాయకులు, సిబ్బంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

​డి.ఈ తీరును నిరసిస్తూ మున్సిపాలిటీ కార్యాలయం వద్ద సచివాలయ సిబ్బంది పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదంటూ అక్కడినుంచి నినాదాలు చేసుకుంటూ ప్రధాన వీధుల గుండా ర్యాలీగా బయలుదేరారు. ఎన్.ఆర్.టి (N.R.T) సెంటర్‌కు చేరుకున్న అనంతరం.. అక్కడ ఉన్న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి తమ నిరసనను తెలియజేశారు.

​ఆ తర్వాత మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరిబాబును కలసి సచివాలయ సిబ్బంది సంఘం నాయకులు ఒక వినతిపత్రం అందజేశారు. విధుల్లో ఉన్న సిబ్బందిని మానసిక క్షోభకు గురిచేసిన డి.ఈ అబ్దుల్ రహీంపై ఉన్నతాధికారులు విచారణ జరిపి, తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆ వినతిపత్రంలో కోరారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని యూనియన్ నాయకులు హెచ్చరించారు.

​ఈ నిరసన కార్యక్రమంలో గ్రామ వార్డు సచివాలయ అసోసియేషన్ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ మహమ్మద్ అలీ, పల్నాడు జిల్లా కార్యదర్శి ప్రతాప్, తదితర చిలకలూరిపేట సచివాలయ సిబ్బంది భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


ఇకపై కరెంట్ బిల్లు కట్టే అవసరం లేదు - పూర్తి వివరాల కోసం ఇప్పుడే కాల్ చేయండి - +91 70135 89826 - ఆదిత్య సోలార్ - సోలార్ గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకొని ఆ తర్వాతే బిగించుకోండి.


 మరిన్ని చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి.

https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g

Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.
📸
మీ వార్తలను మాతో పంచుకోవడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి