|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండిచిలకలూరిపేట విద్యుత్ వినియోగదారులకు తెలియజేయునది ఏమి అనగా !!!
చిలకలూరిపేట విద్యుత్ వినియోగదారులకు తెలియజేయునది ఏమి అనగా !!!
చిలకలూరిపేట పట్టాన పుర ప్రజలకు కరోనా వీర విజృంభణ కారణంగా మధ్యాహ్నం 12 గంటల తరువాత కర్ఫ్యూ కారణంగా విద్యుత్ బిల్లు చెల్లింపునకు ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకు మాత్రమే రావలెను అని డి ఈ ఈ సి. హెచ్ రాంభొట్ల గారు తెలిపారు. అందువలన బిల్లు చెలింపునకు వచ్చేవారు తప్పనిసరిగా మాస్క్ వాడాలి అని , క్యూ లైన్లో ఉన్నప్పుడు భౌతిక దూరం పాటించాలి. కరోనా నియమాలు పాటించాలి అని తెలిపారు
తమిళనాడు లో MK స్టాలిన్ సంచలన నిర్ణయం - అమ్మ కాంటిన్లు జయలలిత ఫొటోతోనే కొనసాగుతాయి.
తమిళనాడు లో MK స్టాలిన్ సంచలన నిర్ణయం - అమ్మ కాంటిన్లు జయలలిత ఫొటోతోనే కొనసాగుతాయి.
తమిళనాడు గడిచిన 2021 అసెంబ్లీ ఎన్నికలలో DMK (స్టాలిన్) 234 స్థానాలకు గాను 159 స్థానాలు గెలిచి విజయకేతనం ఎగురవేశారు. అయితే గెలిచిన ఆనందంలో పార్టీ కార్యకర్తలు చెన్నై లోని AIDMK పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎర్పాటు చేసిన అమ్మ కాంటీన్ల పైన దాడి చేసి జయలలిత ఫోటోలను చించివేశారు. విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి MK స్టాలిన్ అలాంటి చర్యలకు పాల్పడిన సొంత పార్టీవాళ్ల పైనే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలి అని ఆదేశాలు జారీచేశారు. అలాగే ఇక పైన కూడా అమ్మ కాంటీనులు కొనసాగుతాయి అని తెలిపారు. కొనసాగటమేకాదు అందులో జయలలిత ఫొటోలు కూడా ఉంటాయి అని తెలిపారు. అలాగే కార్యకర్తలు చించివేసిన జయలలిత ఫోటోల స్థానంలో జయలలిత కొత్త ఫొటోలను ఎర్పాటు చెయ్యాలి అని ఆదేశాలు జారీ చేసారు. MK స్టాలిన్ కు తమిళనాడు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు
ఎంపీ చొరవతో చిలకలూరిపేట గవర్నమెంట్ హాస్పిటల్ నందు కరోనా బెడ్లు పెంపు
ఎంపీ చొరవతో చిలకలూరిపేట గవర్నమెంట్ హాస్పిటల్ నందు కరోనా బెడ్లు పెంపు
చిలకలూరిపేట గవర్నమెంట్ హాస్పిటల్ నందు ఇప్పటి వరకు 20 కొవిడ్ బెడ్లు మాత్రమే ఉండేవి. 20 మందికి మాత్రమే చికిత్స అందిస్తున్నారు. అయితే కొన్ని రోజుల క్రితం ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు ఆకస్మిక పర్యటన చేసి హాస్పిటల్ వసతుల పైన దృష్టి పెట్టాలి అని తెలియజేశారు. అయితే ఎంపీ గారి చొరవతో 20 బెడ్లను 30 కి పెంచాలి అని అధికారులకు లేఖ రాయటం జరిగింది. అయితే ఆయా లేఖ పైన స్పందిస్తూ జిల్లా అధికారులు 10 బెడ్లు అదనంగా ఎర్పాటు చేసారు. దీనితో పట్టణములోని గవర్నమెంట్ హాస్పిటల్ నందు మొత్తం 30 బెడ్లు ఉన్నవి. ఇక పైన 30 మంది కరోనా రోగులకు ఉచిత వైద్యం నిర్వహిస్తారు







