|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండిచిలకలూరిపేటలో NRT సెంటర్లో మద్యం మత్తులో లారీతో కారు ఢీ - తృటిలో తప్పిన ఘోర ప్రమాదం.
చిలకలూరిపేటలో NRT సెంటర్లో మద్యం మత్తులో లారీతో కారు ఢీ - తృటిలో తప్పిన ఘోర ప్రమాదం.
చిలకలూరిపేట పట్టణంలో తృటిలో ఘోర ప్రమాదం తప్పింది.ఒంగోలు నుండి విజయవాడ వైపు వెళ్తున్న చక్క దుంగల లోడుతో వెళ్తున్న లారీ కారుని NRT సెంటర్లో ఢీ కొన్నది. ఈ సమయంలో కారులో వారికీ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.లారీ డ్రైవర్ మద్యం సేవించి డ్రైవింగ్ చెయ్యటం వలనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కారులోని వ్యక్తులు నరసరావుపేట వైపు నుండి రోడ్డు దాటిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.సమాచారం అందుకున్న టౌన్ పోలీసులు కేసు నమోదు చేసారు.
చిలకలూరిపేట - ప్రభుత్వం గ్యారెంటీ ఉంటూ లోను చెల్లిస్తుంది - పురప్రజల పై ఎటువంటి భారం పడదు - టీడీపీ కౌన్సిలర్లు అనవసరపు రాదంతం చేస్తున్నారు - ఛైర్మెన్ రఫాని
చిలకలూరిపేట - ప్రభుత్వం గ్యారెంటీ ఉంటూ లోను చెల్లిస్తుంది - పురప్రజల పై ఎటువంటి భారం పడదు - టీడీపీ కౌన్సిలర్లు అనవసరపు రాదంతం చేస్తున్నారు - ఛైర్మెన్ రఫాని
చిలకలూరిపేట - గత ప్రభుత్వంలో చేసిన అప్పులు వలన మునిసిపాలిటీ రెవిన్యూ పూర్తిగా లోటు బడ్జెట్ లోకి వెళ్ళింది అని.గత ప్రభుత్వం హయాంలో పట్టణ ప్రజల కోసం ఏర్పాటు చేసిన అమృత్ పధకంలో మునిసిపాలిటీ వాటా 82 కోట్లుగా ఉంది.ఏడాది మునిసిపాలిటీ ఆదాయం మాత్రం 8 కోట్లు మాత్రమే. అయితే MLA రజిని అమృత్ పధకం లోటు బడ్జెట్ను ముఖ్యమంత్రికి విన్నవించగా మునిసిపాలిటీలో ఉన్న ఆదాయ వనరులను చూపించి బ్యాంకులో ఋణం పొందండి. ఆయా నిధులకు సంబంధించిన లోనును మునిసిపాలిటీ ప్రజలపైన ఈ భారం పడకుండా ప్రభుత్వమే చెలిస్తుంది అని తెలిపారు. ప్రజలకు త్రాగునీరు సమస్య లేకుండా పరిష్కరించాలి అని చూస్తుంటే టీడీపీ కౌన్సిలర్లు మాత్రం మా పైన బురద చల్లుతూ ప్రజలను ప్రక్కదోవ పాటిస్తున్నారు అని మునిసిపల్ ఛైర్మెన్ రఫాని తెలిపారు.
మార్కెట్ యార్డు ఛైర్మెన్ బొల్లెద్దు చిన్న మాట్లాడుతూ అవినీతికి తావు లేకుండా పరిపాలన చేస్తుంటే ఓర్వలేక టీడీపీ కౌన్సిలర్లు తమ పైనే దుష్ప్రభావం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఎంత అభివృద్ధి జరిగింది - ఎంత అభివృద్ధి జరిగింది అనే దాని పైన బహిరంగ చర్చకు రావాలి అని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఛైర్మెన్ రఫాని, యార్డు ఛైర్మెన్ బొల్లెద్దు చిన్న,వైస్ ఛైర్మెన్ కొలిశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
06-07-2021,మంగళవారం నుండి చిలకలూరిపేటలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 వరకే దుకాణాలు,బ్యాంకు కార్యకలాపాలు జరుగుతాయి - ఇన్సిడెంట్ కమాండర్
06-07-2021,మంగళవారం నుండి చిలకలూరిపేటలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 వరకే దుకాణాలు,బ్యాంకు కార్యకలాపాలు జరుగుతాయి - ఇన్సిడెంట్ కమాండర్
చిలకలూరిపేట పట్టణంల,మండల గ్రామాలలో కరోనా కేసులు పెరుగుతున్న వేళ 06-07-2021 మంగళవారం నుండి కర్ఫ్యూ కఠినంగా అమలు చేస్తూ వ్యాపారాలు, దుకాణాలు ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే తెరచి ఉంటాయి అని కరోనా నియమాలు పాటించనివారి పైనా కఠిన చర్యలు తప్పవు అని ఇన్సిడెంట్ కమాండర్ మల్లిఖార్జునరావు తెలిపారు.సోమవారం జరిగిన టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసిన సమావేశంలో కరోనా తీవ్రత తగ్గించటానికి కర్ఫ్యూ సమయాన్ని పెంచుతున్నట్లు తెలిపారు. కరోనా నియమాలు కఠినంగా అమలు చేయాలి అని కమిటీ సభ్యులకు తెలిపారు.ఈ సమావేశంలో కమిషనర్ రవీంద్ర,నోడల్ డాక్టర్ గోపీనాయక్, SI నరసాదాసు,ఎంపీడీఓ హేమలతా దేవి, శివ నాగేశ్వరరావు గారు పాల్గొన్నారు.
చిలకలూరిపేట నియోజకవర్గంలో 05-07-2021,సోమవారం నాడు నమోదు ఐన కరోనా కేసుల వివరాలు.
చిలకలూరిపేట నియోజకవర్గంలో 05-07-2021,సోమవారం నాడు నమోదు ఐన కరోనా కేసుల వివరాలు.
చిలకలూరిపేట నియోజకవర్గంలో 05-07-2021,సోమవారం నాడు మొత్తం 11 కేసులు నమోదు అయ్యాయి.
పట్టణంలో 2 కేసులు నమోదు అయ్యాయి.
సుబ్బయ్యతోట లో - 1
బొందిలిపాలెం గ్రామంలో - 1 గా నమోదు అయ్యాయి.
నాదెండ్ల మండల గ్రామాలలో మొత్తం 9 కేసులు నమోదు అయ్యాయి.
గణపవరం గ్రామంలో - 4
సంక్రాంతిపాడు గ్రామంలో - 2
నాదెండ్ల గ్రామంలో - 1
గిరిజవోలు గ్రామంలో - 2 గా నమోదు అయ్యాయి.
ఈ రోజు చిలకలూరిపేట మండల గ్రామాలలో గాని, యడ్లపాడు మండలంలో కానీ ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.










