|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండిచిలకలూరిపేట- మానుకొండవారిపాలెం,ఏలూరు గ్రామ ప్రజల ధర్నా- కొంత సేపు ట్రఫిక్ అంతరాయం, MLA రజని చొరవతో అంతా సర్దుబాటు
CHILAKALURI PET SPEED NEWSWednesday, March 31, 2021చిలకలూరిపేట న్యూస్, చిలకలూరిపేట మండలం
No comments
చిలకలూరిపేట- మానుకొండవారిపాలెం,ఏలూరు గ్రామ ప్రజల ధర్నా- కొంత సేపు ట్రఫిక్ అంతరాయం, MLA రజని చొరవతో అంతా సర్దుబాటు
ఏలూరు- మానుకొండవారిపాలెం గ్రామస్థులు ధర్నా - వివరాలలోకి వెళ్తే గణపవరం లోని ప్రముఖ కంపెనీ,స్పిన్నింగ్ మిల్లుల నుండి వచ్చే వ్యర్ధాలను గణపవరం గ్రామం మీదుగా వచ్చే కుప్పగంజి వాగు లోకి కలుపుతున్నారు. అందువలన వాగులో నీరు కాలుష్యం ఎర్పడి రంగు మరి , అందులో ఉండే జలచరాలు చేపలు,కప్పలు భారీగా చనిపోతున్నాయి, అంతేకాకుండా ఆ వాగు నుండి వచ్చే నీరును మానుకొండవారిపాలెం , ఏలూరు ప్రజలు పంటల సేద్యానికి వాడుతుంటారు, కొందరు త్రాగునీరుగా వాడుతుంటారు. అయితే అక్కడి గ్రామ ప్రజలు ఈ కాలుష్యానికి అడ్డుకట్ట వేయటానికి నిరసనగా ధర్నా చేపట్టారు. దాని వలన రోడ్లు పైన ట్రాఫిక్ అంతరాయం ఎర్పడింది. విషయం తెలుసుకున్న MLA రజని గారు హుటా హుటిన అక్కడికి చేరుకొని వాగుని పరిశీలించారు.
దీనిపైనా స్పందించిన రజని ఈ కాలుష్యానికి కారణం అయిన కంపెనీల పైన తగు చర్యలు తీసుకుంటాని హామీ ఇచ్చారు. అలాగే ఆయా నీటిని శాంపిల్ తెలుసుకొని ల్యాబ్ కి పంపాలి అని ఆదేశించారు, రైతులకి అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు అని , ఏ కంపెనీ నుండి వ్యర్ధాలు నీటిలో కలవకూడదు అని , నీటిని కాపాడుకోవలసిన బాధ్యత మన అందరిపైనా ఉన్నది అని, MLA రజని తో పాటుగా పోలీస్,పొల్యూషన్ అధికారులని, తహశీల్ధార్ సుజాత గారు,అక్కడికి చేరుకున్నారు.
పొల్యూషన్ అధికారి AE శ్రీనివాసరావు మాట్లాడుతూ శాంపిళ్లను విజయవాడ ల్యాబ్ లకు పంపారు అని, ఒక వారం రోజులలో రిపోర్ట్స్ వస్తాయి అని, అప్పుడు ఆయా కంపెనీలపైనా చర్యలు తీసుకుంటాం అని అవసరం అయితే మూసివేస్తాం అని హామీ ఇచ్చారు. అప్పటికిగాని గ్రామ ప్రజలు శాంతించారు. ఈ ధర్నాలో గ్రామా పెద్దలు , గ్రామ సర్పంచ్ లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు .
చిలకలూరిపేట అర్బన్, రూరల్ ప్రాంతాలకు కొత్త SI లు
చిలకలూరిపేట అర్బన్, రూరల్ ప్రాంతాలకు కొత్త SI లు
చిలకలూరిపేట రూరల్, అర్బన్ ప్రాంతాలకు కు కొత్త SI లు. పట్టణంలో అర్బన్ SI గా బాధ్యతలు నిర్వహిస్తున్న SI రాంబాబు గారిని యడ్లపాడు పోలీస్టేషన్ SI గా , పెదకూరపాడు SI గా విధులు నిర్వహిస్తున్న వేజండ్ల అజయ్ బాబు గారిని చిలకలూరిపేట టౌన్ SI గా, అలాగే గుంటూరు రూరల్ డి ఎస్ బి గా విధులు నిర్వహిస్తున్న ఆళ్ళ మోహన్ రెడ్డి గారిని చిలకలూరిపేట రూరల్ SI గా బాధ్యతలు స్వీకరించనున్నారు.
యడ్లపాడు SI గా నియమితులు అయిన SI పైడి రాంబాబు గారికి శుభాకాంక్షలు -- CHILAKALURIPET SPEED NEWS
యడ్లపాడు SI గా నియమితులు అయిన SI పైడి రాంబాబు గారికి శుభాకాంక్షలు -- CHILAKALURIPET SPEED NEWS
గత కొంతకాలంగా చిలకలూరిపేట లో SI గా తన కర్తవ్యాన్ని, బాధ్యతను నిర్వహిస్తూ. పట్టణ ప్రజల రక్షణకై శ్రమిస్తూ ముఖ్యంగా కరోనా లాక్ డౌన్ సమయంలో చిలకలూరిపేటకు విశిష్టమైన సేవలు అందించిన SI పైడి రాంబాబు గారికి పట్టణ ప్రజల తరుపున ప్రత్యేక ధన్యవాదాలు. లాక్ డౌన్ సమయంలో అక్రమ మద్యం పైన ఉక్కు పాదం, పేకాట శిబిరాల పైనా దాడులు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్టలు వేసి, విధి నిర్వహణలో తనకి తానే సాటి అనీ విధంగా బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు మన యంగ్ డైనమిక్ పోలీస్ SI రాంబాబు గారు యడ్లపాడు SI గా బదిలీ అయ్యారు. ఎక్కడ ఉన్న మీరు ఉన్నత స్థాయికి ఎదగాలి అని కోరుకుంటు -- చిలకలూరిపేట ప్రజల తరుపున CHILAKALURIPETA SPEED NEWS తరుపున శుభాకాంక్షలు.
చిలకలూరిపేటలో అక్రమ రేషన్ బియ్యం పట్టివేత
చిలకలూరిపేటలో అక్రమ రేషన్ బియ్యం పట్టివేత
పట్టణంలో అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తూ పట్టుబడ్డారు. వివరాలలోకి వెళ్తే బుధవారం పట్టణంలోని శాంతినగర్ లో ఓ మిని లారీ లో అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారు అనే సమాచారం తెలుసుకున్న పోలీసులు . హుటాహుటిన అక్కడికి చేసుకొని వాహనాన్ని అర్బన్ పోలీసుస్టేషన్ కి తరలించారు. ఆయా వాహనంలో సుమారు 150 క్వింటా బియ్యం ఉన్నట్లు సమాచారం.












