మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

Advertisement - 2

Image3

........

Advertisement - 3

Image3

........

ప్రకటనల కోసం 90358 80349 నెంబర్ కు సంప్రదించండి.
|

⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!

చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.

💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి

చిలకలూరిపేట టౌన్ - ఈత సరదా.. ప్రాణం తీసింది! వాగులో పడి సుభాని నగర్ కు చెందిన విద్యార్థి దుర్మరణం.

చిలకలూరిపేట టౌన్ - ఈత సరదా.. ప్రాణం తీసింది! వాగులో పడి సుభాని నగర్ కు చెందిన విద్యార్థి దుర్మరణం.


పూర్తి వివరాలు:

చిలకలూరిపేట: వేసవి సెలవుల్లో తోటి స్నేహితులతో కలిసి ఆడుకుంటూ సరదాగా గడపాల్సిన ఓ చిన్నారి.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఈత కోసం వెళ్లి వాగులో మునిగి ఓ ఐదో తరగతి విద్యార్థి మృత్యువాత పడిన ఘటన చిలకలూరిపేట పట్టణంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

​స్థానిక వివరాల ప్రకారం.. పట్టణంలోని సుభాని నగర్‌కు చెందిన చందు (10) అనే బాలుడు స్థానిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. బుధవారం సరదాగా ఈత కొట్టేందుకు సుభాని నగర్‌కు ఆనుకుని ఉన్న వాగు వద్దకు వెళ్లాడు. అయితే, నీటి ప్రవాహం మరియు లోతును అంచనా వేయలేకపోయిన చందు.. ప్రమాదవశాత్తు లోతైన గుంతలో చిక్కుకుని నీట మునిగిపోయాడు. తోటి వారు కేకలు వేసినా, ఎవరూ రక్షించే లోపే నీట మునిగిపోయాడు.

రంగంలోకి పోలీసులు - కన్నీరుమున్నీరుగా తల్లిదండ్రులు:

సమాచారం అందుకున్న వెంటనే చిలకలూరిపేట అర్బన్ ఎస్ఐ హజరత్తయ్య హుటాహుటిన తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులు, గజ ఈతగాళ్ల సాయంతో వాగులో గాలింపు చర్యలు చేపట్టారు. కాసేపటి తర్వాత నీటిలో మునిగి ఉన్న చందు దేహాన్ని బయటకు తీశారు. దురదృష్టవశాత్తు అప్పటికే బాలుడు మృతి చెందాడు.

​ఆడుకోవడానికి వెళ్లిన కొడుకు విగతజీవిగా తిరిగి రావడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు అక్కడున్న వారిని సైతం కంటతడి పెట్టించాయి. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

తల్లిదండ్రులకు పోలీసుల సూచన: పిల్లలు సెలవుల్లో చెరువులు, వాగులు, కుంటల వద్దకు వెళ్లకుండా తల్లిదండ్రులు ఓ కంట కనిపెట్టుకుని ఉండాలని, ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ఇలాంటి ప్రాణసంకటాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

రిపోర్టింగ్: చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ డెస్క్.

ఇకపై కరెంట్ బిల్లు కట్టే అవసరం లేదు - పూర్తి వివరాల కోసం ఇప్పుడే కాల్ చేయండి - +91 70135 89826 - ఆదిత్య సోలార్ - సోలార్ గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకొని ఆ తర్వాతే బిగించుకోండి.


 మరిన్ని చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి.

https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g

Share:

చిలకలూరిపేట నియోజకవర్గం - బతుకుతెరువుకి చిలకలూరిపేట వచ్చి వచ్చిన రోజే అనంత లోకాలకు! అసలేం జరిగింది ?

చిలకలూరిపేట నియోజకవర్గం - బతుకుతెరువుకి చిలకలూరిపేట వచ్చి వచ్చిన రోజే అనంత లోకాలకు!

చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ (ఎడ్లపాడు):

బతుకుదెరువు కోసం వందల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన ఓ వలస కార్మికుడిని మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో బలితీసుకుంది. పనిలో చేరిన తొలి రోజే ఆ కార్మికుడు విగతజీవిగా మారడంతో తోటి కార్మికుల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఎడ్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

వివరాల్లోకి వెళితే...

బీహార్ రాష్ట్రానికి చెందిన బాగీ బింద్ (తండ్రి పేరు: నాగ బింద్) అనే వ్యక్తి ఉపాధి నిమిత్తం నిన్ననే ఎడ్లపాడు మండలంలోని వంకాయలపాడులో ఉన్న BSR సిమెంట్ స్తంభాల ఫ్యాక్టరీకి పని కోసం వచ్చాడు. రాత్రి సమయంలో మద్యం సేవించేందుకు సమీపంలోని బోయపాలెం వెళ్లాడు. తిరిగి తన గదికి వస్తుండగా వంకాయలపాడు జైన్ మందిరం సమీపంలో, జాతీయ రహదారి-16 (NH-16) సర్వీస్ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న బాగీ బింద్‌ను ఓ గుర్తుతెలియని వాహనం అతివేగంగా వచ్చి ఢీకొట్టింది.

చికిత్స పొందుతూ మృతి..

ఈ ప్రమాదంలో బాగీ బింద్ తల, శరీర భాగాలకు తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు, తోటి కార్మికులు అతడిని హుటాహుటిన మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి (GGH) తరలించారు. అక్కడ ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో బాగీ బింద్ కన్నుమూశాడు. కొద్ది గంటల క్రితమే తమతో కలిసి మాట్లాడిన వ్యక్తి విగతజీవిగా మారడంతో తోటి కార్మికులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

పోలీసుల దర్యాప్తు ముమ్మరం..

ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఎడ్లపాడు ఎస్ఐ తన సిబ్బందితో కలిసి ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, యాక్సిడెంట్ చేసి పరారీలో ఉన్న ఆ గుర్తుతెలియని వాహనాన్ని పట్టుకునేందుకు జాతీయ రహదారిపై ఉన్న సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. రాత్రి వేళల్లో సర్వీస్ రోడ్లపై నడిచి వెళ్లే పాదచారులు మరింత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ఈ సందర్భంగా సూచిస్తున్నారు.

మరిన్ని స్థానిక తాజా వార్తలు, ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి... మీ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్.ఇకపై కరెంట్ బిల్లు కట్టే అవసరం లేదు - పూర్తి వివరాల కోసం ఇప్పుడే కాల్ చేయండి - +91 70135 89826 - ఆదిత్య సోలార్ - సోలార్ గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకొని ఆ తర్వాతే బిగించుకోండి.

 మరిన్ని చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి.

https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g

Share:

చిలకలూరిపేట - పట్టుదలతో న్యాయపీఠానికి.. చిలకలూరిపేట ముద్దు బిడ్డ యమున స్ఫూర్తిదాయక విజయం! సామాన్య కుటుంబం నుంచి జడ్జి స్థాయికి.. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన యమున స్టోరీ!

చిలకలూరిపేట - పట్టుదలతో న్యాయపీఠానికి.. చిలకలూరిపేట యువతి యమున స్ఫూర్తిదాయక విజయం! సామాన్య కుటుంబం నుంచి జడ్జి స్థాయికి.. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన యమున స్టోరీ!

చిలకలూరిపేట: పట్టుదల ఉంటే ఆకాశమే హద్దు అని నిరూపించింది ఆ యువతి. తండ్రి నడిచిన బాటలోనే నడుస్తూ, ఆయన ఆశయాలనే తన లక్ష్యంగా మార్చుకుని విజయతీరాలను చేరుకుంది. చిలకలూరిపేట పట్టణానికి చెందిన యువ న్యాయవాది సాతులూరి యమున సివిల్ జడ్జిగా ఎంపికై, పట్టణ ఖ్యాతిని రాష్ట్రస్థాయిలో రెపరెపలాడించారు.

న్యాయవాద వృత్తిపై మక్కువ.. తండ్రే స్ఫూర్తి

చిలకలూరిపేటలో ప్రముఖ న్యాయవాదిగా సేవలందిస్తున్న సాతులూరి భాగ్య రావు కుమార్తె యమునా. చిన్నప్పటి నుండి తండ్రి వాదనా పటిమను చూస్తూ పెరిగిన ఆమె, ఆయననే తన రోల్ మోడల్‌గా ఎంచుకున్నారు. కేఎల్ యూనివర్సిటీలో ఎల్.ఎల్.బి (LLB) పూర్తి చేసిన తర్వాత, బయట ఎక్కడో కాకుండా తన తండ్రి వద్దే జూనియర్ న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. గత రెండేళ్లుగా కోర్టు పరిసరాల్లోనే ఉంటూ న్యాయశాస్త్రంలోని మెళకువలను క్షుణ్ణంగా అభ్యసించారు.

ఓటమిని సవాలు చేసి.. పట్టుదలతో న్యాయమూర్తిగా..

లక్ష్యం పెద్దదైనప్పుడు ఆటంకాలు ఎదురవ్వడం సహజం. మొదటి ప్రయత్నంలో తృటిలో అవకాశం చేజారినా యమునా ఏమాత్రం అధైర్యపడలేదు. తన లోపాలను సరిదిద్దుకుని, రెట్టింపు ఉత్సాహంతో రెండో ప్రయత్నం (Second Attempt) కోసం సిద్ధమయ్యారు. రోజుకు 9 గంటల నుంచి 15 గంటల వరకు కఠోర శ్రమ చేశారు. ఆ శ్రమే నేడు ఆమెను న్యాయమూర్తిగా ఉన్నత పీఠంపై నిలబెట్టింది. ఒక న్యాయవాదిగా తన కుమార్తెను జడ్జిగా చూడటమే తనకు నిజమైన గర్వకారణమని, ఆమె కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని తండ్రి భాగ్య రావు ఆనందబాష్పాలు రాల్చారు.

చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ (CSN) ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ విశేషాలు:

సాధారణ మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చి సివిల్ జడ్జిగా ఎంపికైన యమునను స్ఫూర్తిగా నిలపాలని చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ బృందం ప్రత్యేకంగా ఆమె నివాసానికి వెళ్లి సత్కరించి, ముఖాముఖి నిర్వహించింది. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు పంచుకున్న భావోద్వేగాలు వారి మాటల్లోనే..

  • కన్నీటి పర్యంతమైన తల్లి: "ఒక తండ్రి ఇద్దరు ఆడపిల్లలను చదివించడానికి ఒంటరిగా పడిన కష్టాన్ని చూసి నా కూతురు ఈ స్థాయికి చేరుకుంది. తండ్రి కష్టానికి తగిన న్యాయం చేసింది. పగలనక, రాత్రనక రోజుకు 15 గంటలు శ్రమించి తన కలను నిజం చేసుకుంది" అంటూ ఆమె తల్లి కన్నీరు పెట్టుకున్నారు.
  • మురిసిపోతున్న బామ్మగారు: "మా సొంత గ్రామం అనంతవరం. మా ఊరి నుంచి ఎంతోమంది ఎన్నో ఉన్నత ఉద్యోగాలు సాధించారు కానీ, ఒకరు జడ్జి అవ్వడం ఇదే తొలిసారి. మా మనవరాలి విజయం తెలుసుకుని ఊరంతా సంబరాలు చేసుకుంటున్నారు. నాకు చెప్పలేనంత సంతోషంగా ఉంది."

న్యాయం గెలిపించడమే నా లక్ష్యం: సాతులూరి యమున

"న్యాయమూర్తి హోదా అనేది ఒక అలంకారం కాదు, అదొక గొప్ప బాధ్యత. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను తూచాతప్పకుండా పాటిస్తూ, కచ్చితంగా న్యాయం గెలిచేలా నా వంతు కృషి చేస్తాను. నా తండ్రి కష్టాన్ని చూస్తూ పెరిగాను కాబట్టే, ఆయనకు చేదోడు వాదోడుగా ఉండాలని ఈ లక్ష్యాన్ని సాధించాను. ప్రిపరేషన్ సమయంలో నేను నిరుత్సాహానికి, డిప్రెషన్‌కు గురైనప్పుడు నా చెల్లెలు నాకు వెన్నంటే నిలిచింది. నాతో సమయం గడుపుతూ నన్ను ఆ ఒత్తిడి నుంచి బయటకు తీసుకొచ్చింది.

​ప్రస్తుత సమాజంలో చట్టాలపై సరైన అవగాహన లేక చాలామంది యువత అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. నేను విధుల్లోకి చేరాక ప్రజలకు, ముఖ్యంగా యువతకు చట్టాలపై అవగాహన (Awareness) కల్పించే కార్యక్రమాలు నిర్వహిస్తాను. పక్కా ప్లానింగ్, కఠోర శ్రమ ఉంటే ఎలాంటి లక్ష్యాన్నైనా సాధించవచ్చని చెప్పడానికి నా విజయమే ఒక ఉదాహరణ."

అక్కే నా స్ఫూర్తి అంటున్న సోదరి..

"అక్క మొదటి నుంచి బాగా చదువుతుంది. అక్క జడ్జి కావడం చూశాక, నాకు కూడా ఆ స్థానానికి చేరుకోవాలన్న బలమైన కోరిక పుట్టింది. నేను కూడా ఎల్.ఎల్.బి పూర్తి చేశాను. కచ్చితంగా కష్టపడి జడ్జి పరీక్షలకు సన్నద్ధమవుతాను" అని యమున సోదరి తెలిపారు.

​ఈ తరం యువతకు, ముఖ్యంగా న్యాయశాస్త్రం అభ్యసించే విద్యార్థులకు యమునా విజయం ఒక గొప్ప స్ఫూర్తిదాయకం.

CSN బృందం ఘన సత్కారం:

యమున సాధించిన ఈ ఘనవిజయాన్ని అభినందిస్తూ.. చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ టీమ్ ఆమెను ప్రత్యేకంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ ఫౌండర్ జనగం శివ, కో-ఫౌండర్ మండాది ఫణి, చీఫ్ ఎడిటర్ గుడిపల్లి లక్ష్మీనారాయణ పాల్గొని యమునకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.
📸
మీ వార్తలను మాతో పంచుకోవడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి