మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

Advertisement - 2

Image3

........

Advertisement - 3

Image3

........

ప్రకటనల కోసం 90358 80349 నెంబర్ కు సంప్రదించండి.
|

⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!

చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.

💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి

రాప్తాడు సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్ట్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం - చిలకలూరిపేట ప్రెస్ క్లబ్ యూనియన్

రాప్తాడు సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్ట్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం - చిలకలూరిపేట ప్రెస్ క్లబ్ యూనియన్

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

ఆంధ్రప్రదేశ్ ఆదివారం అనంతపురం జిల్లా రాప్తాడు లో జరిగిన సిద్ధం సభలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. కొంతమంది యువకులు అత్యుత్సాహంతో ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్ట్ శ్రీకృష్ణపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో శ్రీకృష్ణకు తీవ్రమైన గాయాలయ్యాయి. సిద్ధం సభను న్యూస్ కవర్ చేయడానికి వచ్చిన జర్నలిస్ట్ పై ఇలాంటి దాడి చేయడంతో ప్రజా సంఘాలు, ఆంధ్ర జర్నలిస్టుల అసోసియేషన్ తీవ్ర సంతృప్తిని వ్యక్తం చేశాయి. 

 రాప్తాడు లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి కెమెరామెన్ పై జరిగిన దాడిని చిలకలూరిపేట ప్రెస్ క్లబ్ ఏపీయూడబ్ల్యూజే యూనియన్ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఎన్నార్టీ సెంటర్ నందు కలకత్తా, చెన్నై జాతీయ రహదారిపై మానవహారం నిర్వహించి కెమెరామెన్ పై దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం ఎమ్మార్వో ఆఫీస్ వరకు జర్నలిస్టులు అందరూ ర్యాలీగా వెళ్లి సీనియర్ అసిస్టెంట్ మస్తాన్ వలికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏపీయూడబ్ల్యూజే  ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ పుల్లగూర భక్తవత్సలరావు మాట్లాడుతూ రాప్తాడు లో సాక్షాత్తు ముఖ్యమంత్రి సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి కెమెరామెన్ పై దాడి చేయడం జగన్ ప్రభుత్వం యొక్క పిరికిపంద చర్య అన్నారు. ఇండియాలోనే ఫోర్త్ ఎస్టేట్ అని పిలవబడే మీడియాకి ఈ రోజున వైయస్ జగన్ పాలనలో మీడియాకు స్వేచ్ఛ లేకుండా పోయిందని దీనిపై వెంటనే ముఖ్యమంత్రి స్పందించి దాడి చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని భక్తవత్సలరావు తెలిపారు. స్టేట్ కౌన్సిల్ మెంబర్ మస్తాన్ వల్లి మాట్లాడుతూ ముఖ్యమంత్రి సభలో స్వయానా మీడియాపై దాడి జరిగితే దీనికి ముఖ్య మంత్రి బాధ్యత వహించి వారిపై కఠిన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అమరావతి ఈనాడు విలేఖరి పై దాడిని తీవ్రంగా ఖండిస్తూ దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని ఏపీడబ్ల్యూజే తరఫున మస్తాన్ వలీ డిమాండ్ చేశారు.  ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట ప్రెస్ క్లబ్ ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షుడు  అన్నలదాసుశేషగిరిరావు, సెక్రటరీ షేక్.అబ్దుల్ సత్తార్, ఏపీడబ్ల్యూజే జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ అల్లాబక్షు,ఎలక్ట్రాన్ మీడియా కార్యదర్శి మల్లాల కోటేశ్వరరావు, ఏపీయూడబ్ల్యూజే నాయకులు ఎన్.బాబ్జీరావ్, నారాయణస్వామి ఆంధ్రజ్యోతి,  పోపూరి వెంకట్రావు,  షేక్.ఫక్రుద్దీన్,ఆలపాటిఆంజనేయులు, కుప్పం.కళ్యాణ్ చక్రవర్తి చుక్కా. విజయ్ కుమార్, విజయ్, ఉప్పల.బాలు, బొందలపాటి.వాసు , మురళి , దాసు, జగదీష్, సిద్ధిక్, నారాయణస్వామి,సలాసం శ్రీనివాసరావు,వెంకట్రావు,జరుగుల శ్రీనివాసరావు, మనోజు, మరియు తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు.

Share:

చిలకలూరిపేట - మద్యం మత్తులో కత్తులతో దాడి ఒకరి పరిస్థితి విషమం

చిలకలూరిపేట - మద్యం మత్తులో కత్తులతో దాడి ఒకరి పరిస్థితి విషమం

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట టౌన్ మద్యం మత్తులో కత్తులతో దాడి చేసుకున్న ఘటన పట్టణంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే పట్టణంలోని సంజీవ్ నగర్ ప్రాంతానికి చెందిన సంగుల శివ బాల(26), తాటికొండ వంశీ(26) అనే యువకులు కొంతమంది స్నేహితులతో కలిసి మద్యం సేవించారు. గతంలో వంశీ సోదరుడిని పై శివ బాల దాడి చేసిన ఘటనను గుర్తుతెచ్చుకొని పాత కక్షల నేపథ్యంలో వంశీ మద్యం మత్తులో విచక్షణను కోల్పోయి దగ్గరలో ఉండే చికెన్ సెంటర్ దగ్గర నుండి కత్తిని తీసుకొని శివబాలపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో మద్యం మత్తులో ఉన్న శివబాల పై మెడపై, తలపై, చేతివేళ్లపై తీవ్రమైన గాయాలై రక్తస్రావంతో అపస్మార్క స్థితిలోకి వెళ్ళిపోయాడు. పక్కనే ఉన్న స్నేహితులు ఘటనను అడ్డుకొని శివబాలను చిలకలూరిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితిని సమీక్షించిన వైద్య సిబ్బంది బాధితుడిని గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించమని తెలిపారు. అపస్మార్క స్థితిలో ఉన్న శివబాలను మెరుగైన వైద్య చికిత్స కై పట్టణంలోని ఆర్కే ప్రైవేట్ హాస్పటల్ కు తరలించారు. శివ బాల పరిస్థితి విషమంగా ఉందని స్నేహితులు తెలిపారు. ఘటనకు కారకుడైన వంశీ పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. సమాచారం అందుకున్న టౌన్ సిఐ, ఎస్ఐ పోలీసు సిబ్బంది హుటాహుటిన ఆసుపత్రికి చేరుకొని కేసును నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.
📸
మీ వార్తలను మాతో పంచుకోవడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి