|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండిచిలకలూరిపేట - కోటప్పకొండ శివరాత్రికి ఆర్టీసీ భారీ ఏర్పాట్లు! - మహిళలకు కొండపైకి కూడా ఉచిత ప్రయాణం!
CHILAKALURI PET SPEED NEWSMonday, February 09, 2026ఉచిత ప్రయాణం, కోటప్పకొండ, చిలకలూరిపేట, చిలకలూరిపేట స్పీడ్ న్యూస్, శివరాత్రి
No comments
చిలకలూరిపేట - కోటప్పకొండ శివరాత్రికి ఆర్టీసీ భారీ ఏర్పాట్లు! - మహిళలకు కొండపైకి కూడా ఉచిత ప్రయాణం!
🚩 మహిళలకు శుభవార్త: కొండపైకి కూడా ఉచిత ప్రయాణం!
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మన కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకునే భక్తుల కోసం ఆర్టీసీ వారు భారీ ఏర్పాట్లు చేశారు. పల్నాడు, గుంటూరు, ప్రకాశం జిల్లాల నుండి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మొత్తం 618 ప్రత్యేక బస్సులను సిద్ధం చేసినట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి టి. అజిత కుమారి తెలిపారు.
మన చిలకలూరిపేట వాసులకు ప్రత్యేక సమాచారం:
🚌 చిలకలూరిపేట నుండి: మన చిలకలూరిపేట బస్టాండ్ నుండి కోటప్పకొండకు నిరంతరాయంగా 121 బస్సులు నడపనున్నారు.
👮 భారీ బందోబస్తు: చిలకలూరిపేట డిపో పరిధిలో భక్తుల సేవ కోసం సుమారు 750 మంది ఆర్టీసీ సిబ్బంది విధుల్లో ఉంటారు.
ముఖ్యమైన హైలైట్స్:
మహిళలకు ఫ్రీ బస్సు: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకంలో భాగంగా, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉంటుంది. విశేషమేమిటంటే... కొండ దిగువ నుండి పైకి (ఘాట్ రోడ్) వెళ్లే బస్సుల్లో కూడా మహిళలకు టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు.
ఘాట్ రోడ్ బస్సులు: కొండ కింద నుండి పైకి భక్తులను చేరవేసేందుకు ప్రత్యేకంగా 95 మినీ బస్సులు అందుబాటులో ఉంటాయి.
ఛార్జీల వివరాలు:
నరసరావుపేట నుండి కొండకు: రూ. 30/-
కొండ దిగువ నుండి పైకి (ఘాట్ రోడ్): రూ. 25/-
తిరుగు ప్రయాణంలో మార్పు (గమనించగలరు): రద్దీని దృష్టిలో ఉంచుకుని, ఈ ఏడాది కోటప్పకొండ నుండి నరసరావుపేట/చిలకలూరిపేట వైపు వచ్చే బస్సుల కోసం బస్టేషన్ ను పెట్లూరివారిపాలెం రోడ్డు మార్గంలో ఏర్పాటు చేశారు. భక్తులు ఈ మార్పును గమనించాలి.
ఇతర ప్రాంతాల బస్సుల వివరాలు:
నరసరావుపేట: 213 బస్సులు
వినుకొండ: 50 బస్సులు
అద్దంకి: 39 బస్సులు
చీరాల & ఒంగోలు: చెరో 50 బస్సులు
మొత్తం 2550 మంది ఆర్టీసీ సిబ్బంది అహర్నిశలూ శ్రమించి భక్తులకు సేవలు అందించనున్నారు. కావున భక్తులందరూ ఆర్టీసీ సేవలను వినియోగించుకుని, సురక్షితంగా స్వామివారిని దర్శించుకోవాలని కోరుతున్నాం.
🙏 ఓం నమః శివాయ! హర హర మహాదేవ! 🙏
☀️ కరెంట్ బిల్లుల మోతకు చెక్! "పీఎం సూర్య ఘర్" పథకం ద్వారా నెలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్తో పాటు బిల్లును 'జీరో' చేసుకోండి.
💰 కేంద్ర ప్రభుత్వం అందించే ₹78,000/- భారీ సబ్సిడీని సద్వినియోగం చేసుకోండి; మిగిలిన కరెంట్ అమ్మి ఆదాయం కూడా పొందండి!
🏡 నాణ్యమైన సోలార్ సిస్టమ్స్ కోసం మన చిలకలూరిపేటలోని *"ఆదిత్య సోలార్ ప్రైవేట్ లిమిటెడ్"* వారిని నేడే సంప్రదించండి.
📞 మరిన్ని వివరాలకు కాల్ చేయండి: +91 8074300423
చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి
https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g
చిలకలూరిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం: టిడ్కో గృహాల వద్ద విషాదం! - మహిళ మృతి
CHILAKALURI PET SPEED NEWSMonday, February 09, 2026ఘోర రోడ్డు ప్రమాదం:, చిలకలూరిపేటలో, టిడ్కో గృహాల, మహిళ మృతి
No comments
చిలకలూరిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం: టిడ్కో గృహాల వద్ద విషాదం! - మహిళ మృతి
చిలకలూరిపేట: పట్టణ శివార్లలోని టిడ్కో గృహాల సమీపంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని స్థానికులు చర్చించుకుంటున్నారు.
ఘటన వివరాలు:
పట్టణంలోని 52 ఎకరాల ప్రాంతానికి ఎదురుగా, పొలానికి గడ్డి కోసం వెళ్తున్న షేక్ మహబూబ్ (50) అనే మహిళను, ద్విచక్ర వాహనంపై వస్తున్న కామినేని బాలకృష్ణ (24) అత్యంత వేగంగా ఢీకొట్టారు. ఈ ప్రమాద ధాటికి మహిళ గాల్లోకి ఎగిరి పడటంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు.
రంగంలోకి 108 సిబ్బంది:
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు 108 అంబులెన్స్కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది మహబూబ్ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. బైక్ నడుపుతున్న బాలకృష్ణకు కూడా తల పగిలి తీవ్ర రక్తస్రావం కావడంతో, సిబ్బంది అతనికి ప్రాథమిక చికిత్స అందించి తక్షణమే చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రమాద స్థలంలో విషాద ఛాయలు:
నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గంలో వాహనాలు మితిమీరిన వేగంతో వెళ్తుండటం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మృతురాలి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ముఖ్య గమనిక: వాహనదారులు జనసంచారం ఉన్న ప్రాంతాల్లో వేగాన్ని నియంత్రించాలని, హెల్మెట్ ధరించాలని పోలీసులు కోరుతున్నారు.
☀️ కరెంట్ బిల్లుల మోతకు చెక్! "పీఎం సూర్య ఘర్" పథకం ద్వారా నెలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్తో పాటు బిల్లును 'జీరో' చేసుకోండి.
💰 కేంద్ర ప్రభుత్వం అందించే ₹78,000/- భారీ సబ్సిడీని సద్వినియోగం చేసుకోండి; మిగిలిన కరెంట్ అమ్మి ఆదాయం కూడా పొందండి!
🏡 నాణ్యమైన సోలార్ సిస్టమ్స్ కోసం మన చిలకలూరిపేటలోని *"ఆదిత్య సోలార్ ప్రైవేట్ లిమిటెడ్"* వారిని నేడే సంప్రదించండి.
📞 మరిన్ని వివరాలకు కాల్ చేయండి: +91 8074300423
చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి
https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g
చిలకలూరిపేటలో "ఏసీబీ" హైటెన్షన్.. ఆఫీసుల్లో కుర్చీలు ఖాళీ! కలం వదిలేసి.. కాళ్లకి పనిచెప్పిన ఉద్యోగులు?
CHILAKALURI PET SPEED NEWSMonday, February 09, 2026ACB, Chilakaluripet speed news, ఏసీబీ, చిలకలూరిపేట అధికారులు
No comments
చిలకలూరిపేటలో "ఏసీబీ" హైటెన్షన్.. ఆఫీసుల్లో కుర్చీలు ఖాళీ!
కలం వదిలేసి.. కాళ్లకి పనిచెప్పిన ఉద్యోగులు?
రెడ్ హ్యాండెడ్గా దొరికిన ఏఈ.. మిగతా ఆఫీసుల్లో "నో అటెండెన్స్"!
చిలకలూరిపేట ప్రభుత్వ కార్యాలయాల్లో ఈరోజు అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. అవినీతికి పాల్పడుతున్న వారి భరతం పట్టేందుకు ఏసీబీ (ACB) రంగంలోకి దిగడంతో అవినీతి తిమింగలాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
అసలేం జరిగింది?
స్థానిక పంచాయతీరాజ్ కార్యాలయంలో ఓ అధికారి (AE) లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిపోవడంతో ఈ డ్రామా మొదలైంది. బాధితుడి ఫిర్యాదు మేరకు పక్కా ప్లాన్తో వచ్చిన ఏసీబీ అధికారులు, డబ్బులు మారుతుండగా పట్టుకుని షాక్ ఇచ్చారు.
చిలకలూరిపేటలో ఏసీబీ దాడుల కలకలం
రూ. 24 వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయిన ఏఈ
చిలకలూరిపేటలో అవినీతి నిరోధక శాఖ ACB అధికారులు జరిపిన దాడులు ప్రభుత్వ కార్యాలయాల్లో తీవ్ర కలకలం రేపాయి. పంచాయతీ రాజ్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్ AEగా విధులు నిర్వహిస్తున్న సత్యనారాయణ చార్యులు, ఒక కాంట్రాక్టర్ నుండి రూ. 24,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు.గతంలో పూర్తి చేసిన కొన్ని కాంట్రాక్టు పనులకు సంబంధించిన బిల్లులను మంజూరు చేయాలని సదరు కాంట్రాక్టర్ ఏఈని కోరారు. అయితే, ఆ బిల్లులు పాస్ చేయడానికి ఏఈ సత్యనారాయణ చార్యులు లంచం డిమాండ్ చేశారు. దీనితో విసిగిపోయిన బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. సోమవారం పంచాయతీ రాజ్ శాఖ కార్యాలయంలో బాధితుడి నుంచి నగదు తీసుకుంటుండగా, ముందస్తు ప్రణాళికతో దాడులు చేసిన ఏసీబీ బృందం ఆయనను అదుపులోకి తీసుకుంది.
వణికిపోతున్న ఇతర శాఖలు:
ఈ వార్త దావానలంలా వ్యాపించడంతో చిలకలూరిపేటలోని మిగతా ప్రభుత్వ ఆఫీసుల్లో సీన్ రివర్స్ అయ్యింది. ముఖ్యంగా ప్రజలతో నిత్యం రద్దీగా ఉండే కార్యాలయాల్లో ఉద్యోగులు మాయమయ్యారు.
కొందరు అధికారులు మధ్యాహ్న భోజనానికే ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ రాలేదు.
ముఖ్యమైన ఫైళ్లు ఎక్కడ బయటపడతాయో అని సిబ్బంది కంగారు పడ్డారు.
నిన్నటి దాకా దర్జాగా లంచాలు అడిగిన వారు, ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు.
ప్రజల హర్షం:
ఏళ్ల తరబడి ఫైళ్లను కదిలించడానికి లంచాలు అడుగుతూ వేధిస్తున్న అధికారులకు ఏసీబీ సరైన బుద్ధి చెప్పిందని చిలకలూరిపేట ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ దాడులు కేవలం ఆరంభం మాత్రమేనని, అవినీతి అధికారుల చిట్టా మొత్తం బయటకు తీస్తామని ఏసీబీ వర్గాల సమాచారం.
ఇది కేవలం ట్రైలర్ మాత్రమే.. సినిమా ముందుంది! అని సామాన్యులు సెటైర్లు వేస్తున్నారు.




