చిలకలూరిపేట - మతం మారినా దళిత హక్కులా..? నిజమైన దళితుల హక్కుల రక్షణ కోసం కఠిన చట్టాలు తేవాలి: బీజేవైఎం నేతలు మండాది ఫణి, తెల్లబాటి మనోహర్
– పల్నాడు జిల్లా బీజేవైఎం ఉపాధ్యక్షులు మండాది ఫణి, చిలకలూరిపేట మండల అధ్యక్షులు తెల్లబాటి మనోహర్
ఇటీవల సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు నేపథ్యంలో, మత మార్పిడులు మరియు ఎస్సీ హక్కుల దుర్వినియోగంపై పల్నాడు జిల్లా బీజేవైఎం (BJYM) ఉపాధ్యక్షులు శ్రీ మండాది ఫణి, చిలకలూరిపేట మండల బీజేవైఎం అధ్యక్షులు శ్రీ తెల్లబాటి మనోహర్ గారు తమ ప్రగాఢమైన అభిప్రాయాలను పంచుకున్నారు. సమాజంలో అట్టడుగున ఉన్న హిందూ దళితులు ఉన్నత స్థాయికి చేరాలన్న సత్సంకల్పంతో, పేదలకు, బడుగు బలహీన వర్గాలతో పాటు అన్ని వర్గాలకు మేలు జరిగేలా నాటి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారు అద్భుతమైన రాజ్యాంగాన్ని రచించారని వారు సగర్వంగా గుర్తుచేశారు.
కానీ, ప్రస్తుత సమాజంలో కొందరు క్రైస్తవ మతంలోకి మారి, మిషనరీల నుండి ఆర్థిక సహాయం పొందుతూ సామాజికంగా, ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరుకొని దళితుల హక్కులను వారికి రావలసిన రిజర్వేషన్లను మతం మారి కూడా అనుభవిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనివలన నిజమైన దళితులకు అన్యాయం జరుగుతుందని దీనిపైన అవగాహన కార్యక్రమాలు త్వరలో చేపడుతామని వారు తెలిపారు. మతం మారినప్పటికీ కాగితాల్లో ఎస్సీలుగా కొనసాగుతూ, చిన్న చిన్న కక్షలు, కారణాలకే అమాయకులపై 'ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ' కేసులను నమోదు చేస్తూ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని వారు మండిపడ్డారు. దళితులు కాకపోయినా, క్రైస్తవం స్వీకరించి ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై అత్యంత కఠినమైన చర్యలు తీసుకునేలా రాజ్యాంగంలో మార్పులు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు.
"క్రైస్తవంలోకి మారిన వారు ఎస్సీ హక్కులు పొందలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసినప్పటికీ, వారు మతం మారినట్లు నిరూపించడానికి బాప్టిజం సర్టిఫికెట్ లాంటి కచ్చితమైన డాక్యుమెంటేషన్ విధానం చట్టబద్ధంగా అమలులో లేదు. కేవలం చర్చికి వెళ్లడం లేదా పేర్లు మార్చుకోవడం ద్వారా మతం మారినట్లు న్యాయస్థానాల్లో నిరూపించడం సవాలుగా మారుతోంది. ఈ లొసుగులను ఆసరాగా చేసుకొని కొందరు చట్టాల నుంచి తప్పించుకుంటున్నారు" అని వారు పేర్కొన్నారు.
ఈ పరిస్థితిని అరికట్టాలంటే మత మార్పిడుల నిర్ధారణపై పకడ్బందీ విధివిధానాలతో కఠినమైన చట్టాలను తీసుకురావాల్సిన ఆవశ్యకత దేశానికి ఎంతో ఉందని వారు నొక్కి చెప్పారు. ఇలాంటి చట్టబద్ధమైన ప్రక్షాళన జరిగినప్పుడే, రాజ్యాంగ ఫలాలు అన్యాక్రాంతం కాకుండా కాపాడబడతాయని తెలిపారు. అప్పుడే అంబేద్కర్ గారు కలలుగన్న విధంగా 'నిజమైన దళిత సోదరుల' ఆర్థిక అభివృద్ధికి, సమాజంలో వారికి దక్కాల్సిన అపారమైన గౌరవానికి బలమైన పునాదులు పడతాయని శ్రీ మండాది ఫణి, శ్రీ తెల్లబాటి మనోహర్ గారు స్పష్టం చేశారు.
ఇకపై కరెంట్ బిల్లు కట్టే అవసరం లేదు - పూర్తి వివరాల కోసం ఇప్పుడే కాల్ చేయండి - +91 70135 89826 - ఆదిత్య సోలార్ - సోలార్ గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకొని ఆ తర్వాతే బిగించుకోండి.
మరిన్ని చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి.




