|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి
Showing posts with label బలిగొన్న ప్రాణం. Show all posts
Showing posts with label బలిగొన్న ప్రాణం. Show all posts
చిలకలూరిపేట రూరల్ - భర్త అనుమానం.. బలిగొన్న ప్రాణం
CHILAKALURI PET SPEED NEWSFriday, March 06, 2026చిలకలూరిపేట రూరల్, చిలకలూరిపేటస్పీడ్ న్యూస్, బలిగొన్న ప్రాణం, భర్త అనుమానం
No comments
చిలకలూరిపేట రూరల్ - భర్త అనుమానం.. బలిగొన్న ప్రాణం
కట్టుబడివారిపాలెంలో విషాదం.. వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య
అనాథలైన ముగ్గురు పసిపిల్లలు.. కేసు నమోదు చేసిన రూరల్ పోలీసులు
చిలకలూరిపేట (స్పీడ్ న్యూస్): భర్త అనుమానం ఆ సంసారంలో చిచ్చురేపింది. కట్టుకున్న వాడే కక్ష కట్టడంతో ఆ వివాహిత తల్లడిల్లిపోయింది. రోజురోజుకూ వేధింపులు శృతిమించడంతో.. ఆ నరకం భరించలేక తన ప్రాణాలనే తీసుకుంది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం కట్టుబడివారిపాలెం గ్రామంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మక్కే తిరుమల (28) అనే మహిళను ఆమె భర్త వీరాంజనేయులు గత కొంతకాలంగా అనుమానంతో తీవ్రంగా వేధిస్తున్నాడు. భర్త పెట్టే శారీరక, మానసిక హింసను భరించలేక తీవ్ర మనస్తాపానికి గురైన తిరుమల జీవితంపై విరక్తి పెంచుకుంది. ఈ క్రమంలోనే గత నెల 28వ తేదీ (శుక్రవారం) సాయంత్రం 5 గంటల సమయంలో ఇంట్లో ఎవరూ లేనిది చూసి, ఓ శీతల పానీయంలో ఎలుకల మందు (పేస్టు) కలుపుకుని తాగేసింది.
అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను గమనించిన కుటుంబ సభ్యులు, ప్రాణాపాయ స్థితిలో ఉన్న తిరుమలను హుటాహుటిన మెరుగైన వైద్యం నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి (GGH)కి తరలించారు. దాదాపు వారం రోజుల పాటు అక్కడ మృత్యువుతో పోరాడిన తిరుమల.. పరిస్థితి విషమించడంతో ఈరోజు చికిత్స పొందుతూ కన్నుమూసింది.
అనాథలైన ముగ్గురు పిల్లలు..
తిరుమల మృతితో కట్టుబడివారిపాలెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. పసిప్రాయంలోనే తల్లి దూరం కావడంతో ఆ ముగ్గురు పిల్లలు దిక్కుతోచని స్థితిలో అనాథలుగా మారారు. తల్లి లేని లోటును తలచుకుని వారు రోదిస్తున్న తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది.
తన కుమార్తె మరణానికి అల్లుడు వీరాంజనేయులు పెట్టిన వేధింపులే కారణమని, నిష్కారణంగా తన బిడ్డను పొట్టనబెట్టుకున్న అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతురాలి తల్లి తాటికొండ శివపార్వతి పోలీసులకు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ ఫిర్యాదు చేశారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిలకలూరిపేట రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఇకపై కరెంట్ బిల్లు కట్టే అవసరం లేదు - పూర్తి వివరాల కోసం ఇప్పుడే కాల్ చేయండి - +91 70135 89826 - ఆదిత్య సోలార్ - సోలార్ గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకొని ఆ తర్వాతే బిగించుకోండి.
మరిన్ని చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి.




