మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

Advertisement - 2

Image3

........

Advertisement - 3

Image3

........

ప్రకటనల కోసం 90358 80349 నెంబర్ కు సంప్రదించండి.
|

⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!

చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.

💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి

నేడు, రేపు కొండవీడు ఫెస్ట్ - 2024 కొండవీడు ఫెస్ట్ ను విజయవంతం చేయండి : జిల్లా కలెక్టర్ శివ శంకర్

నేడు, రేపు కొండవీడు  ఫెస్ట్ - 2024 కొండవీడు ఫెస్ట్ ను విజయవంతం చేయండి : జిల్లా కలెక్టర్ శివ శంకర్

https://chilakaluripetspeednews.blogspot.com/search?updated-max=2021-11-24T23:49:00-05:00&max-results=14&start=28&by-date=false&m=1

 పల్నాడు జిల్లాలో చారిత్రక,సాంస్కృతిక పరంగా, పర్యాటక ప్రాంతాలు ఎంతో విశిష్టత కలిగిన ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయని, అమరావతి మొదలుకొని నాగార్జున సాగర్ వరకు చాలావరకు పర్యాటక పరంగా అభివృద్ధి చెంది ఉన్నాయని, మరికొన్నిటిని అభివృద్ధి చేయాల్సి ఉందని జిల్లా కలెక్టర్ శివ శంకర్ లోతేటి అన్నారు. పర్యాటక పరంగా అమరావతి, కొండవీడు కోట, కోటప్పకొండ, నాగార్జున సాగర్, ఎత్తిపోతల, పులిచింతల, దైద, గుత్తికొండ బిలం, చేజర్ల, దుర్గి శిల్పకళ, మాచర్ల చెన్నకేశవ స్వామి ఆలయం, వెన్న ముద్ద వేణుగోపాల స్వామి టెంపుల్ (చంఘిజ్ ఖాన్ పేట) ఇలా ఎన్నో పర్యాటక ప్రాంతాలకు నిలయం పల్నాడు జిల్లాగా అవతరించిందని ఆయన పేర్కొన్నారు. కొండవీడు కోటను పర్యాటకపరంగా అభివృద్ధి చేస్తే జిల్లాకు చుట్టుపక్కల జిల్లాల నుంచి, పర్యాటకులు వచ్చే అవకాశం ఉందన్ని ఆ లక్ష్యంతో కొండవీటి కోటను అభివృద్ధి చేశామని, కొండవీటి కోటలో ఉత్సవాల నిర్వహిస్తే, ఆ తరహా పర్యాటక అభివృద్ధికి, బాటలు వేసినట్లు అవుతుందని ఆలోచన చేసామన్నారు, ఆ ప్రాంతమంతా (రిజర్వ్ ఫారెస్ట్) అటవీ ప్రాంతం కావడంతో వారి సహకారంతో సుమారు రూ 4 కోట్లు ఖర్చు చేసి అక్కడ కొన్ని పర్యాటకులకు వసతి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కొండవీటి ప్రాంతాన్ని పరిపాలించిన రెడ్డి రాజులు 12,13 శతాబ్దంలో కొండవీడును పరిపాలించారని గుర్తు చేసుకుంటూ "కొండవీటి ఫెస్ట్ - 2024" ఉత్సవాల సందర్భంగా కొండవీడు కోటను సందర్శిస్తే బాగుంటుందని, అక్కడికి వచ్చే సందర్శకుల కోసం యువత, చిన్న పిల్లలు, పెద్దల కోసం ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం లో అడ్వెంచర్ లాగా చేస్తే ఆ జ్ఞాపకాలతో కొండవీడు ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా వారు వెళ్లి ఇంకొంత మంది పర్యాటకులతో చెప్పి తీసుకువచ్చే విధంగా దీనిని తీర్చిదిద్దామన్నారు. కొండవీడు కోటలో ప్రధానంగా ట్రిక్కింగ్, రాక్ లైనింగ్, షూటింగ్, ఆర్చరీ, విధుల చెరువును చాలా క్లిష్టతరమైన పని పూర్తి చేసి బోటింగ్, కయా కింగ్, ఫిషింగ్, హార్సింగ్ ఏర్పాటు చేశాం, ఇది ఎప్పుడు అలానే ఉండేలా తీర్చిదిద్దడం జరిగింది, అక్కడకు వచ్చే పర్యాటకులు రాత్రి విడిది చేసేందుకు ఒక టైం లో "నైట్ క్యాంప్" అక్కడే ఒక టెంట్ ను మరియు భోజన వసతులను ఏర్పాటు చేయటం జరిగింది. ఇది రిజర్వ్ ఫారెస్ట్ ( జంతు రక్షిత  ప్రాంతం) కనుక ఎటువంటి ప్రాణహాని లేకుండా జాగ్రత్తగా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కొండవీటి ప్రాంతాన్ని ఒక జాతరలా (ఫెస్టివల్ తరహాలో) జరిగేలా ప్రీ ప్లాన్ గా తీర్చిదిద్దినట్లు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి ప్రకటించారు, పల్నాడు జిల్లాతో పాటు పక్క జిల్లాలైన గుంటూరు జిల్లా, బాపట్ల జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, కృష్ణాజిల్లా, ప్రకాశం జిల్లాల నుంచి పర్యాటకులు అధికంగా వచ్చే అవకాశం ఉండడంతో ఫిబ్రవరి 10,11 తేదీల్లో సెలవులు ఉండడంతో ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించినట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించారు. పిబ్రవరి 10,11 తేదీల్లో కొండవీడు కోట-2024 ఫెస్ట్ ను చేయ బోతున్నట్లు పైన చెప్పినవన్నీ పర్మినెంట్ యాక్టివిస్ అని, ఇవి కాక  హెలీ రైడ్, పారా రైడ్, హార్స్ రైడ్ లు జిల్లా కలెక్టర్ ప్రకటించారు, ఇందులో హెలీ రైడ్ కు 4 వేలు ఏడు నుంచి ఎనిమిది నిమిషాలు, పారా రైడ్ కు 2వేలు, హార్స్ రైడుకు రూ.500 చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఉత్సవాల తరహాలో చిన్నపిల్లల కోసం ప్లే ఏరియా ను ఏర్పాటు చేస్తున్నామన్నారు, ప్రత్యేకంగా పిల్లల కోసం తెప్పిస్తున్నామన్నారు. పూల తోటలతో పాటు ఇసుకను ఏర్పాటు చేయించి అందులో సైతక శిల్పం తరహాలో ఆర్ట్ గీసేలా ఏర్పాటు చేస్తామాన్నారు. వీటితోపాటు చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా డాన్స్ ప్రోగ్రాములు ప్రత్యేకంగా డయాస్ ఏర్పాటు చేసి అందులో క్లాసికల్, వెస్ట్రన్ పోటీలను పెట్టడం జరుగుతుందన్నారు, ఇందులో ఎంపిక కమిటీ (జడ్జెస్)ఉంటుందన్నారు.వీటిలో ప్రధమ రూ. 10,116, ద్వితీయ రూ. 5,116,తృతీయ  బహుమతులు రూ.2.500లు ఇవ్వనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. కొండవీడు కోట-2024 లో ఉత్సాహంగా పాల్గొనే వారికి అన్ని వసతులను కల్పిస్తున్నట్లు, క్రీడలతోపాటు, ఆహ్లాదకరమైన, సహస కృత్యాలు, ఆటలు, ఫుడ్డు ఏర్పాట్లు చేస్తున్నా మన్నారు, ఎవరు ఇక్కడికి వచ్చినా, వారి మదిలో గుర్తుండి పోయేలా "కొండవీడు “ఫెస్ట్-2024" తీర్చిదిద్దుతామని జిల్లా కలెక్టర్ ప్రకటించారు.

మరిన్ని వార్తలు కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి.

https://chilakaluripetspeednews.blogspot.com

Share:

చిలకలూరిపేట - సుబ్బయ్యతోట - ఆర్థిక, మానసిక ఇబ్బందులను తట్టుకోలేక మహిళ ఆత్మహత్య

చిలకలూరిపేట - సుబ్బయ్యతోట - ఆర్థిక, మానసిక ఇబ్బందులను తట్టుకోలేక మహిళ ఆత్మహత్య

చిలకలూరిపేట - సుబ్బయ్యతోట - ఆర్థిక, మానసిక ఇబ్బందులను తట్టుకోలేక మహిళ ఆత్మహత్య

చిలకలూరిపేట:- పట్టణంలోని సుబ్బయ్యతోటకు చెందిన L పద్మ అనే మహిళ శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే సుబ్బయ్య తోటకి చెందిన పద్మ అనే మహిళ ఆర్థిక పరిస్థితులు బాగోలేక గత కొన్ని రోజుల క్రితం 52 ఎకరాల్లోని ప్రభుత్వం వారు నిర్మించిన అపార్ట్మెంట్లో నివాసం ఉంటుంది. ఆమెకి ఇద్దరు కుమారులు పెద్ద కుమారుడు పండ్ల వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. చిన్న కుమారుడు మతిస్థిమితం సరిగ్గా ఉండేది కాదు. చలాకీగా ఉండే కుమారుడు మతిస్థిమితం కోల్పోవడంతో మానసికంగా చాలా కృంగిపోయి బాధపడుతూ ఉండేదని చుట్టుపక్కల వారు తెలిపారు. కొన్ని సంవత్సరాల క్రితం భర్త కూడా చనిపోవడంతో, పనిచేయడానికి ఆరోగ్య పరిస్థితులు సహకరించక ప్రభుత్వం ఇచ్చే వితంతువు పెన్షన్తో జీవనం సాగించేది. శుక్రవారం రాత్రి ఆర్థిక మానసిక ఇబ్బందులను తట్టుకోలేక గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న సదరు బంధువులు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు హాస్పటల్ సిబ్బంది తెలిపారు.

మరిన్ని వార్తల కోసం క్రింది లింకు పై క్లిక్ చేయండి.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

Share:

చిలకలూరిపేట - జాతీయ నులిపురుగుల నిర్మూలనా దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అల్బెండజోల్ టాబ్లెట్స్ పంపిణీ

చిలకలూరిపేట - జాతీయ నులిపురుగుల నిర్మూలనా దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అల్బెండజోల్ టాబ్లెట్స్ పంపిణీ 

జాతీయ నులిపురుగుల నిర్మూలనా దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అల్బెండజోల్ టాబ్లెట్స్ పంపిణీ

చిలకలూరిపేట :- పట్టణంలో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మునిసిపల్ ప్రాధమిక పాఠశాల యందు ఈరొజు శుక్రవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వారి ఆదేశాల మేరకు పాఠశాల యందు విద్యార్ధిని, విద్యార్థులకు నేషనల్ డీ వార్మింగ్ డే సందర్భంగా  (నులిపురుగుల నివారణ) ఆల్ బెండజోల్ టాబ్లెట్స్ వేయించడం జరిగింది . పాఠశాల ప్రధానోపాధ్యాయులు కే సుధ మాట్లాడుతు విద్యార్థి దశలోనే వ్యక్తి గత పరిశుభ్రత అలవర్చుకోవాలని అన్నారు. తద్వారా వ్యాధి నిరోధకత పెంపొందించుకోవచ్చు అని అన్నారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం లో అన్ని రకాల పోషక విలువలు కలిగిన ఆహారం అందిస్తున్నారని. వారంలో ఐదు రోజుల పాటు ఉడక బెట్టిన కొడిగ్రుడ్డు అందిస్తున్నారని అన్నారు. ANM ధన లక్ష్మీ మాట్లాడుతూ ఈ  టాబ్లెట్స్ వినియోగం వల్ల కలిగే ఉపయోగాల గురించి వివరించారు. చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడంలో మెళకువలు తెలియజేశారు. విద్యార్ధినీ విద్యార్ధులు అందరూ ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసే వాటినీ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి కే సుధ, ఉపాధ్యాయులు పోటు శ్రీనివాసరావు ఏ.నీలిమ. టి.కుమారీ. ఆశ వర్కర్ యన్ రాజేశ్వరి విద్యార్ధిని విద్యార్ధులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తల కొరకు క్రింది లింకు పై క్లిక్ చేయండి.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.
📸
మీ వార్తలను మాతో పంచుకోవడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి