మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

Advertisement - 2

Image3

........

Advertisement - 3

Image3

........

ప్రకటనల కోసం 90358 80349 నెంబర్ కు సంప్రదించండి.
|

⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!

చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.

💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి
Showing posts with label మున్సిపాలిటీ. Show all posts
Showing posts with label మున్సిపాలిటీ. Show all posts

చిలకలూరిపేటలో ఆందోళన - మున్సిపల్ డీఈ అబ్దుల్ రహీంపై భగ్గుమన్న సచివాలయ సిబ్బంది! - అసలేం జరిగింది ?

చిలకలూరిపేటలో ఆందోళన - మున్సిపల్ డీఈ అబ్దుల్ రహీంపై భగ్గుమన్న సచివాలయ సిబ్బంది! - అసలేం జరిగింది ?

- ఫోన్‌లో దుర్భాషలాడటంపై భగ్గుమన్న ఉద్యోగులు

- అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నిరసన ర్యాలీ

- తక్షణమే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కమిషనర్‌కు వినతి

చిలకలూరిపేట (స్పీడ్ న్యూస్): చిలకలూరిపేట పట్టణ మున్సిపాలిటీ పరిధిలో సచివాలయ సిబ్బంది ఆందోళన బాట పట్టారు. విధి నిర్వహణలో ఉన్న తమ పట్ల మున్సిపల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (D.E) అబ్దుల్ రహీం అనుచితంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ సిబ్బంది మూకుమ్మడిగా నిరసనకు దిగారు. కింది స్థాయి ఉద్యోగుల పట్ల దురుసుగా ప్రవర్తించిన ఆయనపై తక్షణమే కఠినమైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని వారు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు.

​అసలేం జరిగిందంటే.. పట్టణంలోని పోలిరెడ్డి పాలెం ప్రాంతంలో మంచినీటి పైపులైన్ మరమ్మతుల పనులు జరుగుతున్నాయి. ఈ విషయమై సచివాలయ సిబ్బంది శ్రీనివాసరావు, రమేష్‌లతో డి.ఈ అబ్దుల్ రహీం చరవాణి (ఫోన్) ద్వారా మాట్లాడారు. ఈ క్రమంలో ఆయన తీవ్రమైన పదజాలంతో, ఇష్టమొచ్చినట్లు దుర్భాషలాడినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమిస్తున్న తమను.. ఒక ఉన్నతాధికారి స్థాయిలో ఉండి ఇలా అవమానించడం పట్ల పల్నాడు జిల్లా సచివాలయ యూనియన్ నాయకులు, సిబ్బంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

​డి.ఈ తీరును నిరసిస్తూ మున్సిపాలిటీ కార్యాలయం వద్ద సచివాలయ సిబ్బంది పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదంటూ అక్కడినుంచి నినాదాలు చేసుకుంటూ ప్రధాన వీధుల గుండా ర్యాలీగా బయలుదేరారు. ఎన్.ఆర్.టి (N.R.T) సెంటర్‌కు చేరుకున్న అనంతరం.. అక్కడ ఉన్న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి తమ నిరసనను తెలియజేశారు.

​ఆ తర్వాత మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరిబాబును కలసి సచివాలయ సిబ్బంది సంఘం నాయకులు ఒక వినతిపత్రం అందజేశారు. విధుల్లో ఉన్న సిబ్బందిని మానసిక క్షోభకు గురిచేసిన డి.ఈ అబ్దుల్ రహీంపై ఉన్నతాధికారులు విచారణ జరిపి, తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆ వినతిపత్రంలో కోరారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని యూనియన్ నాయకులు హెచ్చరించారు.

​ఈ నిరసన కార్యక్రమంలో గ్రామ వార్డు సచివాలయ అసోసియేషన్ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ మహమ్మద్ అలీ, పల్నాడు జిల్లా కార్యదర్శి ప్రతాప్, తదితర చిలకలూరిపేట సచివాలయ సిబ్బంది భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


ఇకపై కరెంట్ బిల్లు కట్టే అవసరం లేదు - పూర్తి వివరాల కోసం ఇప్పుడే కాల్ చేయండి - +91 70135 89826 - ఆదిత్య సోలార్ - సోలార్ గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకొని ఆ తర్వాతే బిగించుకోండి.


 మరిన్ని చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి.

https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g

Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.
📸
మీ వార్తలను మాతో పంచుకోవడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి