బొప్పూడిలో పేకాట రాయుళ్ల భరతం పట్టిన పోలీసులు - భారీగా నగదు, కార్లు స్వాధీనం
చిలకలూరిపేట: మండలంలోని బొప్పూడి గ్రామంలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న పేకాట శిబిరం గుట్టును రూరల్ పోలీసులు రట్టు చేశారు. గ్రామంలోని కళ్యాణ మండపం పక్కన ఉన్న ఓ డాబా ఇంట్లో కొందరు వ్యక్తులు 'కోత ముక్క' ఆడుతున్నారన్న పక్కా సమాచారంతో రూరల్ ఎస్ఐ జి. అనిల్ కుమార్ తన సిబ్బందితో కలిసి ఆకస్మికంగా మెరుపు దాడి నిర్వహించారు.
ఈ దాడిలో పేకాట ఆడుతున్న 11 మందిని పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలంలో వారి వద్ద నుండి రూ. 1,25,700/- నగదును, అలాగే పేకాట ఆడేందుకు ఉపయోగించిన రెండు కార్లు మరియు ఆరు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు.
మరిన్ని వార్తల కోసం క్రింది లింకు పై క్లిక్ చేయండి. https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g
అధిక విద్యుత్ ఛార్జీలతో భయపడుతున్నారా ఇప్పుడే ఈ నెంబర్ కి కాల్ చేసి ఆదిత్య సోలార్ బిగించుకొని కరెంటు బిల్లుని 0 చేసుకోండి . మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గరిష్టంగా 78,000 సబ్సిడీని పొందండి. మరిన్ని వివరాల కోసం ఆదిత్య సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ +91 8074300423




