చిలకలూరిపేట - సీజ్ చేసిన గోడౌన్లలో మాయమైన బాణాసంచా.. అధికారుల రియాక్షన్ ఏంటి ?
ఫైర్ సేఫ్టీ లేదు.. అనుమతులు లేవు.. ఇక్కడ ఏ చిన్న ప్రమాదం జరిగినా ప్రాణాలకు గ్యారెంటీ లేదు!
చిలకలూరిపేట ప్రజలారా అప్రమత్తం! మన పక్కనే ప్రాణాలను బలితీసుకునే డెత్ ట్రాప్లు ఉన్నాయా? అంటే తాజా పరిణామాలు అవుననే అంటున్నాయి. కాకినాడలో జరిగిన అగ్నిప్రమాదంలో 28 మంది అమాయకులు సజీవ దహనమైన ఘటనతో రాష్ట్రం ఉలిక్కిపడింది. ఈ క్రమంలో నిద్రలేచిన అధికారులు చిలకలూరిపేటలో తనిఖీలు చేపట్టగా... కళ్లు బైర్లు కమ్మే నిజాలు వెలుగులోకి వచ్చాయి. అసలు మన ఊళ్లో ఏం జరుగుతుందో తెలుసుకోండి.
అసలేం జరిగింది?
కాకినాడ ఘటన నేపథ్యంలో చిలకలూరిపేట రూరల్ పరిధిలోని బొప్పూడి, పసుమర్రు గ్రామాల పరిధిలో ఉన్న బాణాసంచా గోడౌన్లు, దుకాణాలపై జాయింట్ యాక్షన్ కమిటీ (రెవెన్యూ, పోలీస్, ఫైర్ విభాగాలు) కొరడా ఝుళిపించింది. రెండు రోజుల క్రితం ఒకసారి, ఈరోజు (గురువారం) మరోసారి క్షేత్రస్థాయిలో విస్తృత తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో వెలుగుచూసిన విస్తుపోయే నిజాలు ఇవే:
- నిబంధనలు గాలికి: వ్యాపారం ప్రారంభించడానికి ముందు తీసుకోవాల్సిన కనీస 'ఫైర్ సేఫ్టీ' సర్టిఫికెట్లు ఇక్కడి దుకాణదారుల వద్ద లేవు.
- అధికారుల నిర్ధారణ: చిలకలూరిపేట పరిసర ప్రాంతాల్లోని ఈ గోడౌన్లకు అసలు ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు, అనుమతులే లేవని స్వయంగా జిల్లా అధికారే స్పష్టం చేయడం గమనార్హం.
అతిపెద్ద ట్విస్ట్: తాళాలు అధికారుల దగ్గరే... సరుకు మాత్రం మాయం!
ఈ మొత్తం వ్యవహారంలో ప్రజలను, అధికారులను విస్మయానికి గురిచేసిన అసలు పాయింట్ మరొకటి ఉంది.
నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని మొన్నటి తనిఖీల్లో అడిషనల్ ఎస్పీ, డీఎస్పీలు బొప్పూడి పరిధిలోని బాణాసంచా గోడౌన్లను పరిశీలించి, వాటికి తాళాలు వేసి కీస్ తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కానీ, ఈరోజు (గురువారం) ట్రైనీ డీఎస్పీ, రూరల్ ఎస్సై అనిల్, మండల తహశీల్దార్ షేక్ హుస్సేన్ మరియు ఇతర శాఖల అధికారులు ఆ గోడౌన్లను అధికారికంగా తనిఖీ చేయడానికి వెళ్లి తాళాలు తెరిచారు. లోపల చూస్తే సరుకు (బాణాసంచా) లేదు! అధికారుల చేతిలో తాళాలు ఉండగానే... సీజ్ చేసిన గోడౌన్లలోంచి లక్షలాది రూపాయల బాణాసంచా ఎలా మాయమైంది? ఎటు వెళ్లింది? ఈ వ్యవహారం వెనుక ఉన్నదెవరు? అనేది ఇప్పుడు చిలకలూరిపేటలో హాట్ టాపిక్గా మారింది.
చిలకలూరిపేట ప్రజల పక్షాన స్పీడ్ న్యూస్ అడుగుతున్న ప్రశ్నలు:
- ఎలాంటి అనుమతులు లేని ఈ మృత్యుకూపాలకు ఇన్నాళ్లూ కరెంట్ ఎలా ఇచ్చారు? వ్యాపారం ఎలా చేసుకోనిచ్చారు?
- సీజ్ చేసిన గోడౌన్ల నుంచి సరుకు రాత్రికి రాత్రే జనావాసాల్లోకి మారిందా? అయితే ప్రజల ప్రాణాలకు రక్షణ ఏది?
- అధికారుల కన్నుగప్పి సరుకును మాయం చేసిన వారిపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోబోతున్నారు?
కాకినాడ తరహా విషాదం మన చిలకలూరిపేటలో జరగకముందే అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని, బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
ఇకపై కరెంట్ బిల్లు కట్టే అవసరం లేదు - పూర్తి వివరాల కోసం ఇప్పుడే కాల్ చేయండి - +91 70135 89826 - ఆదిత్య సోలార్ - సోలార్ గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకొని ఆ తర్వాతే బిగించుకోండి.
మరిన్ని చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి.




