మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

Advertisement - 2

Image3

........

Advertisement - 3

Image3

........

ప్రకటనల కోసం 90358 80349 నెంబర్ కు సంప్రదించండి.
|

⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!

చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.

💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి

చిలకలూరిపేట రూరల్ - పొట్టకూటి కోసం వెళ్తే.. కులం పేరుతో వివక్షత...​గంటా హరికృష్ణ, శ్రీనివాస్ రెడ్డిలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు... అధికార పార్టీ నాయకులు,ఎస్పీ, డీఎస్పీ నా గుప్పిట్లోనే ఉన్నారు అంటూ దందాలు... పూర్తి వివరాల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి...

చిలకలూరిపేట రూరల్ - పొట్టకూటి కోసం వెళ్తే.. కులం పేరుతో వివక్షత...​గంటా హరికృష్ణ, శ్రీనివాస్ రెడ్డిలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు... అధికార పార్టీ నాయకులు,ఎస్పీ, డీఎస్పీ నా గుప్పిట్లోనే ఉన్నారు అంటూ దందాలు... పూర్తి వివరాల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి...


పల్నాడు జిల్లా/చిలకలూరిపేట: సమాజం ఎంత ఆధునిక వైపు అడుగులేస్తున్నా, కొందరిలో ఇంకా ఆధిపత్య అహంకారం, కుల పిచ్చి పోలేదనడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటనే సజీవ సాక్ష్యం. దళిత యువకుడిని కులం పేరుతో అత్యంత నీచంగా దూషించడమే కాకుండా, బతుకుదెరువు కోసం తమ కాళ్లు పట్టుకునేలా చేసిన కొందరు దుర్మార్గుల బాగోతం నాదెండ్ల మండలం చిరుమామిళ్ల గ్రామంలో వెలుగుచూసింది.

​💔 బతుకుదెరువుపై దెబ్బ.. కాళ్లు పట్టుకుంటేనే బతికిస్తామంటూ బెదిరింపులు!

​గ్రామానికి చెందిన కట్టా నవీన్ అనే దళిత యువకుడు పంచాయతీలో చెత్త బండి నడుపుకుంటూ జీవనం సాగించేవాడు. అయితే, గ్రామంలోని కొందరితో వచ్చిన చిన్నపాటి మనస్పర్ధల కారణంగా అతన్ని ఆ పనిలోంచి అకారణంగా తీసేశారు. పొట్టకూటి కోసం వేరే దారి లేక అదే గ్రామంలోని వాటర్ ప్లాంట్ వద్ద పనికి కుదిరాడు. కానీ, అక్కడ కూడా నిందితులు శ్రీనివాస్ రెడ్డి, గంటా హరికృష్ణ తమ పైశాచికత్వాన్ని ప్రదర్శించారు.

​"నువ్వు ఇక్కడ పని చేయాలన్నా, బతకాలన్నా మా కాళ్లు పట్టుకోవాల్సిందే.. లేకపోతే ఇక్కడినుంచి కూడా గెంటేస్తాం" అంటూ బెదిరింపులకు దిగారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆ పేద దళితుడు వంగి వారిద్దరి కాళ్లు పట్టుకున్నాడు. అయినా వారిలో కనికరం పుట్టలేదు. "నువ్వు పట్టుకున్న వాటర్ ప్లాంట్ నీళ్ళు మేము తాగాలా? మాల నా కొడకా.. చెత్త నా కొడకా.." అంటూ అత్యంత హేయంగా కులం పేరుతో దూషించారని బాధితుడు కన్నీరుమున్నీరుగా విలపించాడు.

​🦎 రంగులు మార్చే ఊసరవెల్లి.. కల్లబొల్లి కబుర్లతో 'గంటా' దందా!

​ఈ దారుణానికి ఒడిగట్టిన వారిలో ప్రధాన నిందితుడు గంటా హరికృష్ణ చరిత్ర అంతా చీకటి దందాలేనని గ్రామస్తులు మండిపడుతున్నారు. అధికార పార్టీలో ఎవరు ఉంటే వారికి తాను అత్యంత సన్నిహితంగా ఉంటానని, జిల్లా ఎస్పీ, డీఎస్పీ స్థాయి పోలీసులు తనకు ఎప్పుడూ టచ్‌లో ఉంటారని అమాయక ప్రజలను నమ్మించి బెదిరిస్తూ అందినకాడికి డబ్బులు దోచేస్తున్నాడని సమాచారం. అయితే వాస్తవానికి అతనికి ఆ స్థాయి పోలీసు అధికారులతో కనీస పరిచయం కూడా లేదని, కేవలం వాళ్ల పేర్లు వాడుకుంటూ, లేని పలుకుబడిని ఉన్నట్లుగా భ్రమింపజేసి సామాన్యులను భయపెడుతున్నాడని స్థానికులు చెబుతున్నారు. ఇలా పచ్చి అబద్ధాలతో దళితులపై, సామాన్యులపై దాడులకు, సెటిల్మెంట్లకు తెగబడటం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.

​🚔 పోలీసుల చుట్టూ బాధితుడి ప్రదక్షిణలు.. కేసు నమోదు!

​ప్రాణభయంతో వణికిపోతున్న బాధితుడు కట్టా నవీన్ తనకు న్యాయం చేయాలంటూ నాదెండ్ల పోలీస్ స్టేషన్ తో పాటు డీఎస్పీ ఆఫీస్ చుట్టూ తిరిగాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎట్టకేలకు స్పందించిన పోలీసులు.. నిందితులు శ్రీనివాస్ రెడ్డి, గంటా హరికృష్ణలపై ఎస్సీ, ఎస్టీ (అట్రాసిటీస్) చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే, బాధితుడికి ఇప్పటివరకు కనీసం ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇవ్వకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

​🔥 భగ్గుమంటున్న దళిత సంఘాలు.. గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత!

​ఈ దారుణ ఘటన వెలుగులోకి రావడంతో చిరుమామిళ్ల గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దళిత సంఘాలు, ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. నిందితులు ఎంతటి పలుకుబడి ఉన్న వారైనా, ఏ పార్టీలో ఉన్నా సరే వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో చిలకలూరిపేట, నాదెండ్ల వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు.

Share:

చిలకలూరిపేట వడ్డెరపాలెంలో దారుణం.. నెత్తుటి మడుగులో బాలుడు!... తోటి స్నేహితులే రాళ్లతో దాడి చేసిన వైనం... బాలుడు పరిస్థితి విషమం... పూర్తి వివరాల కోసం క్రింది లింకుపై క్లిక్ చేయండి...

చిలకలూరిపేట వడ్డెరపాలెంలో దారుణం.. నెత్తుటి మడుగులో బాలుడు!... తోటి స్నేహితులే రాళ్లతో దాడి చేసిన వైనం... బాలుడు పరిస్థితి విషమం... పూర్తి వివరాల కోసం క్రింది లింకుపై క్లిక్ చేయండి...


బాలుడిపై మరో బాలుడి రాక్షస దాడి.. ఆటస్థలంలో నెత్తురోడిన చిన్నారి! 🩸

ప్రాణాలు తీయబోయిన పెద్దల వాగ్వాదం.. గుంటూరు జీజీహెచ్‌కి బాలుడు తరలింపు! 🚑

చిలకలూరిపేట (స్పీడ్ న్యూస్):

తోటి వయసు పిల్లలతో కలిసి ఆనందంగా ఆడుకోవాల్సిన సమయం.. క్షణికావేశంలో నెత్తుటి మడుగుగా మారింది. పసి మనసుల్లో రేగిన కోపం ఒకరి ప్రాణాల మీదకు తెచ్చింది. గాయపడిన బిడ్డను ఆసుపత్రికి తీసుకువెళ్లాల్సిన తల్లిదండ్రులు రోడ్డుపై గొడవకు దిగడంతో బాలుడు చావుబతుకుల మధ్య పోరాడుతున్నాడు. చిలకలూరిపేట పట్టణంలో తీవ్ర కలకలం రేపిన ఈ విషాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి... 👇

​🛑 ఆటలో మొదలైన వివాదం.. రాళ్ల దాడితో ముగింపు!

పట్టణంలోని వడ్డెరపాలెం ప్రాంతానికి చెందిన తమ్మిశెట్టి గోపి (10) స్థానికంగా 4వ తరగతి చదువుతున్నాడు. అదే ప్రాంతంలో ఉండే మేకపోతుల నాగలక్ష్మి అనే మహిళ వద్దకు ఆమె చెల్లెలి కుమారుడు అద్దంకి హర్ష (13) నెల రోజుల క్రితం చదువుకోవడానికి వచ్చాడు (హర్ష తల్లిదండ్రులు ఐదేళ్ల క్రితమే ఉపాధి కోసం హైదరాబాద్ వెళ్లారు). హర్షను ఇటీవల RVC స్కూల్‌లో 8వ తరగతిలో చేర్చారు. గురువారం బొడ్డుపాలెం సమీపంలోని ఆవుల దొడ్డి వద్ద ఆడుకుందామని గోపి.. హర్షను పిలుచుకుని వెళ్లాడు. ఆడుకుంటున్న సమయంలో ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవ రేగింది. అది కాస్తా తీవ్రరూపం దాల్చడంతో ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఆవేశంతో ఊగిపోయిన హర్ష.. పక్కనే ఉన్న పెద్ద రాయిని తీసుకొని గోపి తల వెనుక భాగంలో బలంగా కొట్టాడు. దీంతో గోపి తల పగిలి తీవ్ర రక్తస్రావం అయింది. 🪨🩸

​🤦‍♂️ పెద్దల నిర్లక్ష్యం.. కోమాలోకి చిన్నారి!

ఈ ఘటనలో పదేళ్ల గోపి రక్తపు మడుగులో కిందపడిపోయాడు. గమనించిన ఇరు వర్గాల తల్లిదండ్రులు/పెద్దలు అక్కడికి చేరుకున్నారు. బిడ్డను వెంటనే ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడాల్సిన పెద్దలు.. తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారు. హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లడం మానేసి, దాడి చేసిన బాలుడి తరఫు వారితో గోపి తల్లిదండ్రులు తీవ్ర వాగ్వాదానికి దిగారు. కళ్లెదుటే బిడ్డ నెత్తురోడుతున్నా సకాలంలో స్పందించకపోవడంతో, విపరీతంగా రక్తం పోయి గోపికి బీపీ (BP) పూర్తిగా పడిపోయింది. చూస్తుండగానే చిన్నారి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. పరిస్థితి విషమిస్తుండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. 🚑

​🏥 హుటాహుటిన గుంటూరు జీజీహెచ్‌కు తరలింపు..

స్థానికుల సాయంతో 108 అంబులెన్స్‌లో గోపిని చిలకలూరిపేట ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వెంటనే స్పందించి ప్రాథమిక చికిత్స అందించారు. అయితే, తల వెనుక భాగాన నరాలపై బలమైన గాయం అవ్వడం, బాలుడు పదేపదే వాంతులు (Vomiting) చేసుకుంటుండటంతో పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు నిర్ధారించారు. వెంటనే గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రికి (GGH) రిఫర్ చేశారు. ప్రస్తుతం చిన్నారి గోపి గుంటూరు జీజీహెచ్ లో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. 🩺

​⚠️ స్పీడ్ న్యూస్ అలెర్ట్:

పిల్లల మధ్య గొడవలు సహజం.. కానీ అవి హద్దులు దాటితే ఎంత ప్రమాదమో ఈ ఘటనే నిదర్శనం. ఉపాధి కోసం తల్లిదండ్రులు దూరంగా ఉంటూ, పిల్లలను బంధువుల వద్ద వదిలేసినప్పుడు వారి మానసిక స్థితిని, ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనించాలి. అలాగే, ప్రమాదం జరిగినప్పుడు గొడవలకు దిగకుండా సమయస్ఫూర్తితో ముందుగా ప్రాణాలు కాపాడటంపై దృష్టి పెట్టాలని స్థానికులు కోరుతున్నారు! 🗣️

Share:

చిలకలూరిపేట రూరల్ - ఎడ్లపాడులో త్వరలో జిల్లా కారాగారం(జైలు).... అనువైన స్థలాల కోసం కలెక్టర్ వేట!...జిందాల్ ప్లాంట్‌లో కలెక్టర్ ఆకస్మిక పర్యటన!.. పూర్తి వివరాల కోసం క్రింది లింకు పై క్లిక్ చేయండి....

చిలకలూరిపేట రూరల్ - ఎడ్లపాడులో త్వరలో జిల్లా కారాగారం(జైలు).... అనువైన స్థలాల కోసం కలెక్టర్ వేట!...జిందాల్ ప్లాంట్‌లో కలెక్టర్ ఆకస్మిక పర్యటన!....


ఎడ్లపాడు మండలంలో అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా జిల్లా కలెక్టర్ శ్రీమతి కృతికా శుక్లా గారు విస్తృత పర్యటన చేపట్టారు. జిల్లా కారాగారం ఏర్పాటుతో పాటు, చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే జిందాల్ ప్లాంట్‌ను ఆమె స్వయంగా పరిశీలించారు. ఈ పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..!

​🚨 కొత్త జిల్లా కారాగారం ఏర్పాటుకు స్థల పరిశీలన

​ఎడ్లపాడు మండలంలో నూతనంగా 'జిల్లా కారాగారం' (జైలు) ఏర్పాటు చేసే దిశగా అధికార యంత్రాంగం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భవిష్యత్తు అవసరాలను, భద్రతా ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా గారు అనువైన స్థలాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ గారితో పాటు నరసరావుపేట రెవెన్యూ డివిజన్ అధికారి (RDO) బాలకృష్ణ, ఎడ్లపాడు తహసీల్దార్ విజయ శ్రీ తదితర రెవెన్యూ అధికారులు చురుగ్గా పాల్గొన్నారు.

​♻️ పర్యావరణ పరిరక్షణలో జిందాల్ ప్లాంట్ దే కీలకపాత్ర!

​అనంతరం యడ్లపాడు మండలం నాయుడుపేట సమీపంలోని ప్రతిష్టాత్మక 'జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్' ను కలెక్టర్ సందర్శించారు. పర్యావరణ పరిరక్షణలో ఈ ప్లాంట్ అత్యంత కీలకపాత్ర పోషించాలని ఆమె ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్లాంట్‌లో జరుగుతున్న పలు శాస్త్రీయ ప్రక్రియలను ఆమె స్వయంగా పరిశీలించారు:

  • వ్యర్థాల సేకరణ & వర్గీకరణ: మున్సిపల్ వ్యర్థాలను సేకరించి, వాటిలో తడి-పొడి చెత్తను ఎలా వేరు చేస్తున్నారో అడిగి తెలుసుకున్నారు.
  • విద్యుత్ ఉత్పత్తి: బాయిలర్ల ద్వారా చెత్తను విద్యుత్‌గా మార్చే విధానాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు.
  • బూడిదతో ఇటుకలు: విద్యుత్ ఉత్పత్తి అనంతరం మిగిలిపోయే వ్యర్థ బూడిదను వృథా చేయకుండా, పర్యావరణ హితమైన ఇటుకల తయారీకి వినియోగిస్తున్న తీరును ప్రశంసించారు.

​💡 చెత్త నుంచి విద్యుత్.. గ్రీన్ ఎనర్జీతో సరికొత్త వెలుగులు!

​ఈ సందర్భంగా అధికారులకు, ప్లాంట్ యాజమాన్యానికి కలెక్టర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా నదీ పరీవాహక ప్రాంతాల్లో పేరుకుపోతున్న వ్యర్థాలను ముందే సేకరించి, విద్యుత్ తయారీకి ఎలా ఉపయోగించవచ్చో పక్కా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. గ్రామాల్లో, పట్టణాల్లో డంపింగ్ యార్డుల వల్ల వస్తున్న కాలుష్యానికి చెక్ పెట్టాలంటే.. వ్యర్థాల ఆధారిత 'గ్రీన్ ఎనర్జీ'ని మరింతగా పెంచాలని, ఇటువంటి 'వేస్ట్ టు ఎనర్జీ' ప్లాంట్లు భవిష్యత్తుకు ఎంతో అవసరమని ఆమె స్పష్టం చేశారు.

​🚛 నిత్యం 1600 టన్నుల చెత్త రీసైక్లింగ్: జిందాల్ ప్రతినిధుల వివరణ

​ఈ ప్లాంట్ పనితీరు గురించి జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ప్రాజెక్ట్ ప్రెసిడెంట్ ఎం.వి.చారీ కలెక్టర్‌కు వివరించారు.

"కేవలం ఒక్క ప్రాంతం నుంచే కాకుండా చుట్టుపక్కల ఉన్న అనేక మున్సిపాలిటీలు, నగరాల నుండి ప్రతిరోజూ ప్రత్యేక వాహనాల ద్వారా దాదాపు 1,400 నుండి 1,650 టన్నుల మునిసిపల్ ఘన వ్యర్థాలను (పొడి చెత్త) ఇక్కడికి తరలిస్తున్నాం. ఈ చెత్తను శాస్త్రీయ పద్ధతిలో రీసైకిల్ చేసి ఉత్పత్తి చేస్తున్న 'గ్రీన్ ఎనర్జీ'ని నేరుగా రాష్ట్ర విద్యుత్ గ్రిడ్‌కు అనుసంధానం చేస్తున్నాం. తద్వారా మన ప్రాంత విద్యుత్ అవసరాలకు నిరంతరాయంగా సరఫరా జరుగుతోంది" అని ఆయన తెలిపారు.

Share:

చిలకలూరిపేటలో కారు బీభత్సం: మద్యం మత్తులో 20 మందికి పైగా గుద్ది పరారయ్యే యత్నం!..కారు అద్దాలు పగలగొట్టి మరీ పట్టుకున్నారు... పూర్తి వివరాల కోసం కింది లింక్ పై క్లిక్ చేయండి....

చిలకలూరిపేటలో కారు బీభత్సం: మద్యం మత్తులో 20 మందికి పైగా గుద్ది పరారయ్యే యత్నం!..కారు అద్దాలు పగలగొట్టి మరీ పట్టుకున్నారు...


చిలకలూరిపేటలో కారు బీభత్సం: 20 మందికి పైగా గాయాలు

​చిలకలూరిపేట పట్టణంలో గురువారం ఉదయం భయానక సంఘటన జరిగింది. పట్టణంలోని కళామందిర్ సెంటర్లో ఒక కారు తీవ్ర బీభత్సం సృష్టించింది.

ప్రమాదం జరిగిన తీరు:

మద్యం మత్తులో ఉన్న యువకులు నడుపుతున్న కారు కళామందిర్ సెంటర్ మీద గుండా వేగంగా వస్తూ, సుమారు 10 మందిని గుద్దుకుంటూ ముందుకు దూసుకెళ్లింది. ఆ తర్వాత భాస్కర్ స్టూడియో మీదుగా వెళ్లి, సూర్య టీ స్టాల్ దగ్గర ఆగి ఉన్న ఒక బుల్లెట్ బండిని సైతం ఢీకొట్టింది. ప్రమాదం చేసిన తర్వాత బండి ఆపకుండా పారిపోవడానికి ప్రయత్నించారు.

స్థానికుల వెంబడింపు - పట్టివేత:

వాళ్ళు పారిపోతుండగా కళామందిర్ సెంటర్ వద్ద కారులో నుంచి ఇద్దరు దిగిపోగా, కారు నడుపుతున్న మరో యువకుడు మేదర బజారు కార్నర్ 'వై' (Y) జంక్షన్ వరకు వెళ్లి కారును ఆపాడు. స్థానికులు వెంటనే కారును వెంబడించి, కారు ముందుభాగానికి వెళ్లి రాయితో అద్దాలు పగలగొట్టారు. దీంతో భయపడిన ఆ యువకుడు కారు ఆపేసి అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించగా, స్థానికులు వెంబడించి అతన్ని పట్టుకున్నారు. కారులో మొత్తం ముగ్గురు ఉన్నారని, వారు పీకల దాకా మద్యం సేవించి ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. పట్టుబడిన యువకుడు మిగతా ఇద్దరి పేర్లను కూడా వెల్లడించాడు.

క్షతగాత్రులు మరియు ఆస్తి నష్టం:

కారు ఆపకుండా గుద్దుకుంటూ వెళ్లిన ఈ ఘటనలో కొన్ని ద్విచక్ర వాహనాలు ధ్వంసం అయ్యాయి. సుమారు 20 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి, వారిలో చాలామందికి కాళ్లు విరిగినట్లు సమాచారం.

ఆసుపత్రికి తరలింపు:

వెంటనే స్పందించిన స్థానికులు, క్షతగాత్రులను హుటాహుటిన చిలకలూరిపేట ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. గురువారం ఉదయం జరిగిన ఈ ఘటనతో పట్టణ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.
📸
మీ వార్తలను మాతో పంచుకోవడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి