|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండితెలంగాణ పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఖరారు - ఆంధ్రాలో తెలుగు తమ్ముళ్ల ఆనందోత్సహం
తెలంగాణ పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఖరారు - ఆంధ్రాలో తెలుగు తమ్ముళ్ల ఆనందోత్సహం
తెలంగాణ పీపీసీ చీఫ్ నాటకానికి తెరపడింది. సీనియర్ నేతలను కాదని కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డిని టీపీసీసీ చీఫ్ గా నియమించింది. పార్టీలో సీనియర్ నాయకుల మందకూడి చర్యల వలన తెలంగాణాలో కాంగ్రెస్ చాల వెన్నకి వెళ్ళిపోయింది. పార్టీలో యువరక్తం కోసం అని రాహుల్, సోనియా ఈ నిర్ణయం తీసుకునట్లు తెలుస్తుంది.కొత్త రాష్ట్రము ఏర్పాటు కల్పించిన పార్టీ ఈ రోజు కనుమరుగు అవుతున్న క్రమంలో మళ్లీ తెలంగాణాలో కాంగ్రెస్ అంచెలంచెలుగా ఎదిగి ముందుకు సాగుతుందో లేదో చూదాం.
తెలంగాణాలో రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ ఖరారు అవ్వగానే తెలంగాణాలో కన్న ఆంధ్రాలో తెలుగు తమ్ములు ఆనందంతో సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి పైన ఉన్న అభిమానాన్ని హల్చల్ చేస్తున్నారు. 2017 వరకు తెలంగాణాలో టీడీపీ కి వెన్నుముకగా ఉంటూ కొన్ని పరిస్థితుల దృష్ఠ్య కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ఆనాడు సీఎంగా ఉన్న చంద్ర బాబు ని కలిసి పార్టీ నుండి బయటికి వచ్చారు. కానీ పార్టీ పైన కానీ నాయకులను కానీ ఈ రోజు తప్పుగా మాట్లాడకపోవటం, ఆ పార్టీలో ఉన్న జీవితం ఇచ్చిన పార్టీ ప్రేమను మర్చిపోవకపోవటం తెలుగు తమ్ముళ్లు ఆనందం వ్యక్తం చేస్తూ రేవంత్ రెడ్డిని అభిమానిస్తూ ఉంటారు.
రేవంత్ రెడ్డి ప్రస్థానం :-
1969 నవంబర్ 8 న అప్పటి ఉమ్మడి ఆంధ్ర, ఇప్పటి తెలంగాణ లోని పలమర్రు జిల్లా కొండారెడ్డి పల్లిలో జన్మించారు. 2006లో జడ్పీటీసీ గా , 2007-09 వరకు MLC గా, 2009లో టీడీపీ నుండి MLA గా, 2014లో టీడీపీ నుండి కొడంగల్ లో మళ్లీ MLA గా, 2017 లో టీడీపీ నుండి కాంగ్రెస్ లో చేరి 2018 ఎన్నికలలో కొడంగల్ లో ఓడిపోయారు, 2018 లో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. వెంటనే 2019 మల్కాజ్గిరి ఎంపీ గా గెలిచి 2021 లో TPPC చీఫ్ అయ్యారు.
చిలకలూరిపేట మార్కెట్ సెంటర్లో పూల వ్యాపారం చేసుకునే వ్యక్తి శానిటైజర్ తాగి మృతి
చిలకలూరిపేట మార్కెట్ సెంటర్లో పూల వ్యాపారం చేసుకునే వ్యక్తి శానిటైజర్ తాగి మృతి
చిలకలూరిపేట - శానిటైజర్ తాగి మృతి చెందిన ఘటన పట్టణంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే పట్టణంలో బెల్లంకొండ వాసు అనే యువకుడు మార్కెట్ సెంటర్లోని మైదానంలో పూలు అమ్ముకుంటూ బాబుగారి తోటలో నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. సదరు యువకుడు దీర్ఘకాళికా వ్యాధితో బాధపడుతున్నాడు. మద్యానికి బానిసైన ఆ యువకుడి భార్య అతనిని వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోయింది. ఎవరు పట్టించుకునే వారు లేక సరిగ్గా ఇంటికి రాకుండా పూర్తిగా మద్యానికి బానిసై 21వ తారీఖున సాయంత్రం సమయంలో మద్యం కొనుక్కోవడానికి డబ్బులు లేక శానిటైజర్ కొనుక్కొని తాగాడు. సదరు యువకుడు తీవ్ర అస్వస్తతకు గురి అవ్వటంతో అతనిని గుంటూరు GGH కి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందాడు.
చిలకలూరిపేటలో గత వారం రోజులలో 9.2 % పాజిటివిటీ రేటు - చిలకలూరిపేటను రెడ్ జోన్ గా ప్రకటిస్తున్నాం - కమిష్నర్
చిలకలూరిపేటలో గత వారం రోజులలో 9.2 % పాజిటివిటీ రేటు - చిలకలూరిపేటను రెడ్ జోన్ గా ప్రకటిస్తున్నాం - కమిష్నర్
చిలకలూరిపేట పట్టణంలో శనివారం రోజున మునిసిపల్ కౌన్సిల్ హాలు నందు శానిటరీ మేస్త్రులు, సేకరేటరీలతో ఏర్పాటు చేసిన సమావేశంలో మునిసిపల్ కమిష్నర్ రవీంద్ర గారు మాట్లాడుతూ పట్టణంలో గత వారం రోజుల కరోనా రిపోట్స్ చూసుకునట్లు అయితే పోజిటివిటీ రేట్ 9.2 % మించి ఉండటంతో పట్టణాన్ని రెడ్ జోన్ గా ప్రకటిస్తున్నాము అని అయన తెలిపారు. అలాగే పట్టణంలోని వర్తక వ్యాపారాలు, చిల్లరకొట్టు వ్యాపారాలు కరోనా టెస్టులు చేపించుకునేలా చర్యలు తీసుకోవాలి అని. అలాగే సాయంత్రం 6 గంటల తరవాత వ్యాపారాలు పూర్తిగా ఆపివెయ్యాలి అని,లేనిచో అపరాధ రుసుము వసూళ్లు చెయ్యాలి అని అయన తెలిపారు. అలాగే ప్రతి ఒక్కరు మాస్క్ లు తప్పని సరిగా వాడాలి అని అయన తెలిపారు.
చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 26-06-2021,శనివారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు
చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 26-06-2021,శనివారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు
చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో మొత్తం 9 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు
చిలకలూరిపేట పట్టణంలో 4 కేసులు నమవుదు అయ్యాయి.
సుబ్బయ్యతోట లో - 1
మార్కండేయ నగర్ లో - 2
కుమ్మరి కాలనీ లో - 1 గా నమోదు అయ్యాయి
చిలకలూరిపేట మండల గ్రామాలలో 5 కేసులు నమోదు అయ్యాయి.
మనుకొండవారిపాలెం గ్రామంలో - 1
వేలూరు గ్రామంలో - 4 గా నమోదు అయ్యాయి








