మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

Advertisement - 2

Image3

........

Advertisement - 3

Image3

........

ప్రకటనల కోసం 90358 80349 నెంబర్ కు సంప్రదించండి.
|

⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!

చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.

💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి

చిలకలూరిపేట నాలుగు దిక్కులా టోల్ బాదుడు - కార్లో వెళ్తున్నారా మీ జేబుకు చిల్లులు పెట్టే టోల్ గేట్లు! టోల్ గేట్ అష్టదిగ్బంధనలో చిలకలూరిపేట

చిలకలూరిపేట నాలుగు దిక్కులా టోల్ బాదుడు - కార్లో వెళ్తున్నారా మీ జేబుకు చిల్లులు పెట్టే టోల్ గేట్లు! టోల్ గేట్ అష్టదిగ్బంధనలో చిలకలూరిపేట


 చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్, టోల్ గేట్ అష్టదిగ్బంధనలో  చిలకలూరిపేట

ఒకప్పుడు మన పట్టణం మీదుగా కొత్త బైపాస్ రోడ్లు, అద్దం లాంటి అందమైన రహదారులు వేస్తున్నారంటే చిలకలూరిపేట ప్రజలు ఎంతో ఆనందపడ్డారు. ట్రాఫిక్ కష్టాలు తీరుతాయని, ప్రయాణం సుఖంగా సాగుతుందని సంబరపడ్డారు. కానీ నేడు అదే రహదారులపై ప్రయాణించాలంటే టోల్ కష్టాలతో బేజారు చెందుతున్నారు. పల్నాడు జిల్లాకు ముఖద్వారం, ప్రధాన వాణిజ్య కేంద్రమైన మన చిలకలూరిపేట పట్టణ వాసులకు ఇప్పుడు ఊరు దాటాలంటేనే భయమేస్తోంది.

​కారు ఉండగానే సరిపోదు, అందులో పెట్రోల్ పోయిస్తేనే సరిపోదు.. దారిలో మనం కట్టే టోల్ టాక్స్ డబ్బులతో అదే దారిలో ఏకంగా బస్సులో వెళ్లిరావచ్చు! ఈ భారీ టోల్ భారం కేవలం సొంత వాహనదారుల మీదే కాదు, ఆర్టీసీ ప్రయాణికులపైనా పడుతోంది. టోల్ గేట్ల ఏర్పాటు వల్ల చిలకలూరిపేట నుండి చీరాలకు వెళ్లే ఆర్టీసీ టికెట్ రేట్లలోనూ స్వల్ప మార్పులను గమనిస్తున్నాం. సొంత కారు ఉంటే టోల్ మరియు పెట్రోల్ ఖర్చు, అదే కారు లేకపోతే అద్దె (రెంటు) ఖర్చులతో కలుపుకుంటే.. మన ఊరి నుంచి ఏ ప్రధాన పట్టణానికి వెళ్లాలన్నా అది జేబులు గుల్ల చేసే, అత్యంత ఖర్చుతో కూడుకున్న పనే. ఆ వడ్డనల లెక్కలు ఎలా ఉన్నాయో చూస్తే ఎవరికైనా కళ్లు బైర్లు కమ్మాల్సిందే.

  • దక్షిణం వైపు (ఒంగోలు, నెల్లూరు, చెన్నై, తిరుపతి మార్గం): మన ఊరి నుంచి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న బొల్లపల్లి టోల్ ప్లాజా వద్ద కారుకు ఒకవైపు ప్రయాణానికి ₹110, అదే 24 గంటల్లో తిరిగి వస్తే (రెండు వైపులా) ₹165 చెల్లించుకోవాలి.
  • ఉత్తరం వైపు (విజయవాడ, వైజాగ్ మార్గం): రాజధాని ప్రాంతం వైపు వెళ్లాలంటే గుంటూరు దాటాక వచ్చే కాజా టోల్ గేట్ (సుమారు 45 కి.మీ) వద్ద భారీగా సమర్పించుకోవాలి. రాష్ట్రంలోనే అత్యధికంగా డబ్బులు వసూలు చేసేది ఇక్కడే. కారుకు ఒకవైపుకు ఏకంగా ₹175, రెండు వైపులా అయితే ₹260 వడ్డిస్తున్నారు.
  • సముద్ర తీరానికి (చీరాల మార్గం): సముద్రాన్ని పలకరిద్దామని బయలుదేరితే.. సుమారు 30 కిలోమీటర్ల దూరంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఉప్పుటూరు టోల్ ప్లాజా వద్ద కారుకు సింగిల్ జర్నీకి ₹65, అప్ అండ్ డౌన్ కి ₹100 కట్టాల్సిందే.
  • హైదరాబాద్ మార్గం: పిడుగురాళ్ల మీదుగా నల్గొండ, హైదరాబాద్ వెళ్దామనుకునే వారికి సుమారు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న పిడుగురాళ్ల టోల్ ప్లాజా వద్ద కారుకు ఒకవైపు ప్రయాణానికి ₹95, అదే రోజు తిరిగి వస్తే ₹145 కట్టక తప్పని పరిస్థితి.

​ఈ టోల్ వలయంలో ప్రయాణికులకు మరో పెద్ద షాక్ ఏమిటంటే.. పొరపాటున మీ కారుకు ఫాస్టాగ్ (FASTag) లేకపోయినా, అందులో బ్యాలెన్స్ లేకపోయినా పైన చెప్పిన రేట్లకు ఏకంగా రెట్టింపు (Double) ఫీజు కట్టాల్సిందే. ఉదాహరణకు ఉప్పుటూరు వద్ద ₹65 కట్టాల్సిన చోట అక్షరాలా ₹130 నిలబెట్టి మరీ వసూలు చేస్తారు. అయితే, ఊరు దాటాలంటేనే టోల్ మీటరు భయపెడుతున్న ఈ రోజుల్లో.. ఈ భారీ వడ్డనల మధ్య చిలకలూరిపేట వాసులకు ఊరటనిచ్చే ఒకే ఒక చిన్న అవకాశం 'స్థానిక పాస్'. టోల్ ప్లాజాకు 20 కిలోమీటర్ల పరిధిలో నివసించే స్థానికులు, తమ కమర్షియల్ కాని సొంత వాహనాలకు నెలకు సుమారు ₹340 చెల్లించి అపరిమితంగా ప్రయాణించే లోకల్ పాస్ పొందవచ్చు. దీనికోసం టోల్ ప్లాజా వద్ద వాహన ఆర్సీ (RC), ఆధార్ కార్డు సమర్పిస్తే సరిపోతుంది.

​పచ్చని పొలాల మధ్య అందంగా పరుచుకున్న హైవేలు చూసి మురిసిపోవడమే కానీ, ప్రయాణం మాత్రం జేబులకు భారీ చిల్లులు పెడుతోంది. కాబట్టి చుట్టుపక్కల తరచుగా ప్రయాణించే సగటు జీవులు తప్పనిసరిగా ఈ లోకల్ పాస్ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోండి.

- మీ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్

Share:

చిలకలూరిపేట బ్రేకింగ్: రోడ్డు ప్రమాదం.. క్షతగాత్రులను తన కాన్వాయ్‌లో ఆసుపత్రికి పంపిన ప్రత్తిపాటి.

చిలకలూరిపేట బ్రేకింగ్: రోడ్డు ప్రమాదం.. క్షతగాత్రులను తన కాన్వాయ్‌లో ఆసుపత్రికి పంపిన ప్రత్తిపాటి.


చిలకలూరిపేట/ఎడ్లపాడు: ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో తనకెవరూ సాటిలేరని చిలకలూరిపేట శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు మరోసారి నిరూపించుకున్నారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, రక్తపు మడుగులో అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తికి సకాలంలో వైద్యం అందేలా చేసి ప్రాణదాతగా నిలిచారు.

ప్రమాదం జరిగిందిలా..

ఎడ్లపాడు మండలం చంగిస్ ఖాన్ పేట గ్రామ మాజీ అధ్యక్షులు ఆంజనేయులు తన భార్యతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. చెంగిస్ ఖాన్ పేట - సంక్రాంతిపాడు గ్రామాల మధ్య బైక్ అదుపుతప్పి పక్కనే ఉన్న పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో బైక్ నడుపుతున్న ఆంజనేయులు తల బలంగా రోడ్డు మార్జిన్‌కు తగలడంతో కంటిపై తీవ్ర గాయమైంది. రక్తస్రావం ఎక్కువగా జరగడంతో ఆయన అక్కడికక్కడే అపస్మారక స్థితిలోకి (కోమాలోకి) వెళ్లిపోయారు.

వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి..

సరిగ్గా అదే సమయంలో అటుగా ప్రయాణిస్తున్న ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు గారు రోడ్డు పక్కన పడి ఉన్న క్షతగాత్రులను గమనించారు. వెంటనే తన కాన్వాయ్‌ని ఆపి కిందకు దిగి వారి వద్దకు చేరుకున్నారు. గాయపడిన వ్యక్తి చంగిస్ ఖాన్ పేట మాజీ అధ్యక్షులు ఆంజనేయులుగా గుర్తించిన ఆయన.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన సొంత వాహనంలోనే మెరుగైన వైద్యం నిమిత్తం గుంటూరులోని శంకర కంటి ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు.

"నేనున్నాను".. అంటూ కుటుంబ సభ్యులకు భరోసా:

కేవలం ఆసుపత్రికి పంపించి ఊరుకోకుండా.. స్వయంగా ఆసుపత్రి వైద్యులతో ఫోన్‌లో మాట్లాడి ఆంజనేయులు గారిపై ప్రత్యేక శ్రద్ధ వహించి, త్వరితగతిన మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. అనంతరం ఆంజనేయులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించి.. "నేనున్నాను.. అధైర్యపడొద్దు" అంటూ వారికి కొండంత అండగా నిలిచారు.

​నాయకుడు అంటే కష్టకాలంలో ఆదుకునేవాడే అని ప్రత్తిపాటి పుల్లారావు గారు చేసిన ఈ సాయం పట్ల నియోజకవర్గ ప్రజలు, చంగిస్ ఖాన్ పేట గ్రామస్తులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

వీడియో కోసం క్రింది లింక్ క్లిక్ చెయ్యండి 

https://www.instagram.com/reel/DWYRrDRiVrC/?igsh=MnByZjZjMWw5aXY=

- మీ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్

చిలకలూరిపేట కరెంటు వినియోగదారులుకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు " 0 "చేసుకోవచ్చు మరిన్ని వివరాలు కోసం కింది నెంబర్ కి కాల్ చేయండి - +91 70135 89826 - ఆదిత్య సోలార్


 మరిన్ని చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి. వాట్సప్ ఛానల్ ని ఫాలో అవ్వండి.

https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g

Share:

చిలకలూరిపేట - లక్షల ఖర్చు.. కళ్లు చెదిరే సెట్టింగులు, చిలకలూరిపేటలో శ్రీ రామనవమి అంటే మామూలుగా ఉండదుగా! - రామనవమి మహా జాతర!

చిలకలూరిపేట - లక్షల ఖర్చు.. కళ్లు చెదిరే సెట్టింగులు, చిలకలూరిపేటలో శ్రీ రామనవమి అంటే మామూలుగా ఉండదుగా! - రామనవమి మహా జాతర!


సాధారణంగా దేశమంతటా శ్రీరామనవమి అనగానే గుడిలో కళ్యాణం, పానకం, వడపప్పుతో ఒక రోజులో ముగిసే పండుగ. కానీ, పల్నాడు జిల్లా కేంద్రబిందువైన మన చిలకలూరిపేటలో మాత్రం రామనవమి అంటే ఒక ఎమోషన్.. ఒక మహా జాతర! మండు వేసవిలో కూడా పట్టణమంతా తాటాకులతో భారీ ఎత్తున చలువ పందిళ్లు వేసి, ముచ్చటగా మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుపుకోవడం చిలకలూరిపేటకే చెల్లిన ప్రత్యేకత.

​పట్టణంలో అడుగుపెడితే చాలు.. ఊరంతా శ్రీరామ నామ స్మరణతో మార్మోగుతుంటుంది. లక్షల రూపాయలు వెచ్చించి, ఏమాత్రం వెనకాడకుండా యువత చూపే భక్తి ప్రపత్తులు చూపరులను మంత్రముగ్ధులను చేస్తాయి.

​✨ కళ్లు చెదిరే పందిళ్లు.. కరెంట్ ప్రభల జిలుగులు

పట్టణంలోని ప్రధాన కూడళ్లైన చలివేంద్రం బజారు, బంగారం కొట్ల బజారు, స్టీల్ కొట్ల బజారు, రత్నా బేకరీ సెంటర్, మార్కెట్ సమీపంలోని నూనె గానుగుల రోడ్డు.. ఇలా ఏ వీధి చూసినా భారీ చలువ పందిళ్లతో కళకళలాడుతుంటుంది. గౌడ యూత్, రామదండు లాంటి యువజన సంఘాల ఆధ్వర్యంలో వేసే ఈ పందిళ్లు అద్భుతంగా ఉంటాయి. లక్షల రూపాయలు ఖర్చు చేసి, రాత్రివేళ ఇరుముట్లు గొలిపే విద్యుత్ దీపాలంకరణ (లైటింగ్), భారీ కరెంటు ప్రభలతో ఆయా బజార్లన్నీ ముఖ్యంగా మార్కెట్ సెంటర్లలో దేదీప్యమానంగా వెలిగిపోతాయి.

​దేవకళ ఉట్టిపడేలా ఉండే అద్భుతమైన శ్రీరాముని విగ్రహాలు, హిందూ సాంప్రదాయాలు అణువణువునా ప్రతిబింబించేలా ఏర్పాటు చేసే భారీ సెట్టింగులు చూసి తీరాల్సిందే.

​🛕 చలివేంద్రం బజార్: సాక్షాత్కరిస్తున్న పుణ్యక్షేత్రాలు

ఈ వేడుకల్లో చలివేంద్రం బజార్ ప్రత్యేకతే వేరు! ఇక్కడి వ్యాపారాలు ఏటా దేశంలోని అత్యంత ప్రసిద్ధ, పుణ్య దేవాలయాల సెట్టింగులను అచ్చుగుద్దినట్లుగా అద్భుతంగా తీర్చిదిద్దుతారు. ఆ భారీ సెట్టింగుల మధ్య శ్రీ సీతారాములను చూస్తుంటే, ఆయా పుణ్యక్షేత్రాలకు నేరుగా వెళ్లి దర్శించుకున్నంత ఆధ్యాత్మిక భావన ప్రతి ఒక్కరిలో ఉట్టిపడుతుంది.

​🌿 వాడవాడలా తాటాకు చలువ పందిళ్లు

పెద్దలు, యువజన సంఘాలే కాదు.. గల్లీల్లోని చిన్న వయసు పిల్లలు కూడా ఎంతో ఉత్సాహంగా రామనవమి వేడుకల్లో పాలుపంచుకుంటారు. ఎండాకాలాన్ని సైతం లెక్కచేయకుండా, వాడవాడలా ఎక్కడికక్కడ తాటాకులతో చలువ పందిళ్లు వేస్తారు. చల్లని పందిళ్ల కింద, రామ భక్తి పారవశ్యంలో తేలిపోతూ, కులమతాలకు అతీతంగా ఊరంతా ఏకమై జరుపుకునే ఈ మూడు రోజుల పండుగ చిలకలూరిపేట ఐకమత్యానికి నిదర్శనం.

​ఒక్కమాటలో చెప్పాలంటే... చిలకలూరిపేటలో శ్రీరామనవమి అంటే కేవలం పండుగ కాదు, అది మా ఊరి ప్రజల గుండె చప్పుడు!

- మీ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్

చిలకలూరిపేట కరెంటు వినియోగదారులుకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు " 0 "చేసుకోవచ్చు మరిన్ని వివరాలు కోసం కింది నెంబర్ కి కాల్ చేయండి - +91 70135 89826 - ఆదిత్య సోలార్

 మరిన్ని చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి. వాట్సప్ ఛానల్ ని ఫాలో అవ్వండి.

https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g

Share:

చిలకలూరిపేట - పెట్రోల్ బంకుల్లో అధికారుల ఆకస్మిక తనిఖీలు.. నిబంధనలు మీరితే సీజే!

🚨 చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ ఎక్స్‌క్లూజివ్: పెట్రోల్ బంకుల్లో అధికారుల ఆకస్మిక తనిఖీలు.. నిబంధనలు మీరితే సీజే! 🚨


​గత కొద్ది రోజులుగా చిలకలూరిపేట పట్టణంలో పెట్రోల్ కొరత ఉందంటూ వస్తున్న వదంతులకు అధికారులు చెక్ పెట్టారు. ఇంధనం దొరకదేమోనన్న ప్రజల ఆందోళనల నేపథ్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్ కఠిన ఆదేశాలు జారీ చేశారు. దీంతో రెవెన్యూ, సివిల్ సప్లైస్ (పౌరసరఫరాల) శాఖ అధికారులు బుధవారం ఉదయం నుంచే రంగంలోకి దిగారు. సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్ వెంకటేశ్వర్లు తన ప్రత్యేక బృందంతో కలిసి పట్టణంలోని పలు పెట్రోల్ బంకుల్లో ఆకస్మిక దాడులు నిర్వహించి, అక్కడ ఉన్న స్టాక్ నిల్వలను, రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించారు.

​ఈ సందర్భంగా అధికారుల యాక్షన్ ప్లాన్ మరియు బంక్ యజమానులకు ఇచ్చిన కఠిన ఆదేశాలు ఇలా ఉన్నాయి:

  • ప్రజలకు భరోసా: పట్టణంలో ఎలాంటి ఇంధన కొరతా లేదు. ఇదంతా కేవలం ప్రచారం మాత్రమే. ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదు.
  • కృత్రిమ కొరత సృష్టిస్తే జైలుకే: డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని అక్రమ లాభాల కోసం పెట్రోల్ దాచిపెట్టి కృత్రిమ కొరత సృష్టించాలని చూస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని అధికారులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
  • బాటిల్స్, క్యాన్లకు 'నో పెట్రోల్': ఇకపై బంకుల్లో కేవలం వాహనాలకు మాత్రమే ఇంధనం నింపాలి. ఎవరైనా బాటిళ్లు లేదా క్యాన్లలో పెట్రోల్ పోస్తే ఆ బంకులపై తక్షణమే చర్యలు తీసుకుంటారు.
  • అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపు: ఆసుపత్రులు, అంబులెన్సులు, ఫైర్ స్టేషన్ మరియు పోలీసుల వంటి అత్యవసర విభాగాలకు మాత్రమే... అదీ తగిన అనుమతి పత్రాలు చూపిస్తేనే బయటకు ఇంధనం సరఫరా చేయాలని స్పష్టం చేశారు.

అధికారుల ఫైనల్ వార్నింగ్:

ఇంధనాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలించినా, గోప్యంగా నిల్వ చేసినా నిత్యావసర వస్తువుల చట్టం (ఈసీ యాక్ట్) కింద కేసులు నమోదు చేసి, బంకులను సీజ్ చేస్తామని యజమాన్యాలను డిప్యూటీ తహసీల్దార్ వెంకటేశ్వర్లు హెచ్చరించారు.

​ప్రజలారా, పెట్రోల్ కోసం పానిక్ అవ్వకండి. నిబంధనలు ఉల్లంఘిస్తూ ఎవరైనా బంక్ యజమానులు ఇబ్బంది పెడితే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురండి!

చిలకలూరిపేట కరెంటు వినియోగదారులుకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు " 0 "చేసుకోవచ్చు మరిన్ని వివరాలు కోసం కింది నెంబర్ కి కాల్ చేయండి - +91 70135 89826 - ఆదిత్య సోలార్


 మరిన్ని చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి. వాట్సప్ ఛానల్ ని ఫాలో అవ్వండి.

https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g

Share:

చిలకలూరిపేట - మతం మారినా దళిత హక్కులా..? నిజమైన దళితుల హక్కుల రక్షణ కోసం కఠిన చట్టాలు తేవాలి: బీజేవైఎం నేతలు మండాది ఫణి, తెల్లబాటి మనోహర్

చిలకలూరిపేట - మతం మారినా దళిత హక్కులా..? నిజమైన దళితుల హక్కుల రక్షణ కోసం కఠిన చట్టాలు తేవాలి: బీజేవైఎం నేతలు మండాది ఫణి, తెల్లబాటి మనోహర్

– పల్నాడు జిల్లా బీజేవైఎం ఉపాధ్యక్షులు మండాది ఫణి, చిలకలూరిపేట మండల అధ్యక్షులు తెల్లబాటి మనోహర్

​ఇటీవల సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు నేపథ్యంలో, మత మార్పిడులు మరియు ఎస్సీ హక్కుల దుర్వినియోగంపై పల్నాడు జిల్లా బీజేవైఎం (BJYM) ఉపాధ్యక్షులు శ్రీ మండాది ఫణి, చిలకలూరిపేట మండల బీజేవైఎం అధ్యక్షులు శ్రీ తెల్లబాటి మనోహర్ గారు తమ ప్రగాఢమైన అభిప్రాయాలను పంచుకున్నారు. సమాజంలో అట్టడుగున ఉన్న హిందూ దళితులు ఉన్నత స్థాయికి చేరాలన్న సత్సంకల్పంతో, పేదలకు, బడుగు బలహీన వర్గాలతో పాటు అన్ని వర్గాలకు మేలు జరిగేలా నాటి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారు అద్భుతమైన రాజ్యాంగాన్ని రచించారని వారు సగర్వంగా గుర్తుచేశారు.

​కానీ, ప్రస్తుత సమాజంలో కొందరు క్రైస్తవ మతంలోకి మారి, మిషనరీల నుండి ఆర్థిక సహాయం పొందుతూ సామాజికంగా, ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరుకొని దళితుల హక్కులను వారికి రావలసిన రిజర్వేషన్లను మతం మారి కూడా అనుభవిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనివలన నిజమైన దళితులకు అన్యాయం జరుగుతుందని దీనిపైన అవగాహన కార్యక్రమాలు త్వరలో చేపడుతామని వారు తెలిపారు. మతం మారినప్పటికీ కాగితాల్లో ఎస్సీలుగా కొనసాగుతూ, చిన్న చిన్న కక్షలు, కారణాలకే అమాయకులపై 'ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ' కేసులను నమోదు చేస్తూ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని వారు మండిపడ్డారు. దళితులు కాకపోయినా, క్రైస్తవం స్వీకరించి ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై అత్యంత కఠినమైన చర్యలు తీసుకునేలా రాజ్యాంగంలో మార్పులు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు.

​"క్రైస్తవంలోకి మారిన వారు ఎస్సీ హక్కులు పొందలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసినప్పటికీ, వారు మతం మారినట్లు నిరూపించడానికి బాప్టిజం సర్టిఫికెట్ లాంటి కచ్చితమైన డాక్యుమెంటేషన్ విధానం చట్టబద్ధంగా అమలులో లేదు. కేవలం చర్చికి వెళ్లడం లేదా పేర్లు మార్చుకోవడం ద్వారా మతం మారినట్లు న్యాయస్థానాల్లో నిరూపించడం సవాలుగా మారుతోంది. ఈ లొసుగులను ఆసరాగా చేసుకొని కొందరు చట్టాల నుంచి తప్పించుకుంటున్నారు" అని వారు పేర్కొన్నారు.

​ఈ పరిస్థితిని అరికట్టాలంటే మత మార్పిడుల నిర్ధారణపై పకడ్బందీ విధివిధానాలతో కఠినమైన చట్టాలను తీసుకురావాల్సిన ఆవశ్యకత దేశానికి ఎంతో ఉందని వారు నొక్కి చెప్పారు. ఇలాంటి చట్టబద్ధమైన ప్రక్షాళన జరిగినప్పుడే, రాజ్యాంగ ఫలాలు అన్యాక్రాంతం కాకుండా కాపాడబడతాయని తెలిపారు. అప్పుడే అంబేద్కర్ గారు కలలుగన్న విధంగా 'నిజమైన దళిత సోదరుల' ఆర్థిక అభివృద్ధికి, సమాజంలో వారికి దక్కాల్సిన అపారమైన గౌరవానికి బలమైన పునాదులు పడతాయని శ్రీ మండాది ఫణి, శ్రీ తెల్లబాటి మనోహర్ గారు స్పష్టం చేశారు.

ఇకపై కరెంట్ బిల్లు కట్టే అవసరం లేదు - పూర్తి వివరాల కోసం ఇప్పుడే కాల్ చేయండి - +91 70135 89826 - ఆదిత్య సోలార్ - సోలార్ గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకొని ఆ తర్వాతే బిగించుకోండి.

మరిన్ని చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి.

https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g

Share:

దళిత హక్కుల రక్షణలో చారిత్రాత్మక తీర్పు!​మతం మారితే ఎస్సీ హోదా రద్దు.. సుప్రీం తీర్పును స్వాగతించిన పల్నాడు జిల్లా బీజేవైఎం అధ్యక్షులు పులిగుజ్జు మహేష్

దళిత హక్కుల రక్షణలో చారిత్రాత్మక తీర్పు!​మతం మారితే ఎస్సీ హోదా రద్దు.. సుప్రీం తీర్పును స్వాగతించిన పల్నాడు జిల్లా బీజేవైఎం అధ్యక్షులు పులిగుజ్జు మహేష్


పల్నాడు జిల్లా: మతం మారిన వెంటనే ఎస్సీ (SC) హోదా రద్దవుతుందని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును భారతీయ జనతా యువమోర్చా (BJYM) పల్నాడు జిల్లా అధ్యక్షులు శ్రీ పులిగుజ్జు మహేష్ స్వాగతించారు. ఈ రోజు చిలకలూరిపేట పట్టణంలో జరిగిన ప్రెస్ మీట్‌లో ఆయన ఈ తీర్పుపై స్పందిస్తూ, ఇది రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడే చారిత్రాత్మక తీర్పు అని కొనియాడారు.

​ఈ ప్రెస్ మీట్‌లో మహేష్ గారు మాట్లాడిన ప్రధాన అంశాలు:

  • తీర్పుకు పూర్తి మద్దతు: క్రైస్తవం స్వీకరించిన వెంటనే ఎస్సీ హోదా దానంతట అదే రద్దవుతుందని, కుల ధృవీకరణ పత్రం దగ్గర ఉన్నప్పటికీ చట్టపరమైన రక్షణ (ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం) వర్తించదని సుప్రీంకోర్టు స్పష్టం చేయడాన్ని బీజేవైఎం పూర్తిగా సమర్థిస్తోంది. చట్టాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఇది సరైన నిర్ణయం.
  • క్రైస్తవులకు ఎలాంటి ఇబ్బందీ లేదు: భారతదేశంలో ప్రతి ఒక్కరికీ తమకు నచ్చిన మతాన్ని ఆచరించే స్వేచ్ఛ ఉంది. క్రైస్తవ సోదరుల పట్ల మాకు పూర్తి గౌరవం ఉంది. ఈ తీర్పు వల్ల దళిత క్రైస్తవులకు సామాజికంగా ఎలాంటి ఇబ్బందీ ఉండదు. కేవలం రాజ్యాంగబద్ధంగా ఎస్సీలకు మాత్రమే చెందాల్సిన రిజర్వేషన్లు, చట్టపరమైన హక్కుల గురించి మాత్రమే న్యాయస్థానం స్పష్టత ఇచ్చింది.
  • నిజమైన ఎస్సీల హక్కుల పరిరక్షణ: హిందూ సమాజంలో అణచివేతకు గురైన దళితుల సామాజిక, ఆర్థిక అభ్యున్నతి కోసం డా. బి.ఆర్. అంబేద్కర్ గారు ఎస్సీ రిజర్వేషన్లు, అట్రాసిటీ చట్టాలను తీసుకువచ్చారు. కుల వివక్ష లేని ఇతర మతాల్లోకి మారినప్పుడు, ఆ చట్టాల అవసరం ఉండదు. కాబట్టి, ఆ ఫలాలు నిజమైన, మతం మారని ఎస్సీలకు మాత్రమే దక్కాలన్నదే సుప్రీంకోర్టు ఉద్దేశం.
  • సామరస్యంతో మెలగాలి: మతం మారిన వారు తిరిగి మాతృ ధర్మంలోకి (SC కమ్యూనిటీలోకి) వస్తేనే పాత హోదా పునరుద్ధరణ సాధ్యమని కోర్టు చెప్పడం పూర్తిగా న్యాయబద్ధం. ప్రజలందరూ సుప్రీంకోర్టు తీర్పును గౌరవించాలి. ఎస్సీ, ఎస్టీ సోదరులు మరియు క్రైస్తవులు ఒకరినొకరు అర్థం చేసుకుని, కులమతాలకు అతీతంగా, అన్నదమ్ముల్లా కలిసిమెలిసి సమాజ అభివృద్ధికి తోడ్పడాలి.

​అట్రాసిటీ కేసుల పేరుతో అమాయకులపై జరుగుతున్న తప్పుడు కేసులను అరికట్టేందుకు, అలాగే నిజమైన దళితుల హక్కులను కాపాడేందుకు సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు ఒక మార్గదర్శకంగా నిలుస్తుందని పులిగుజ్జు మహేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Share:

చిలకలూరిపేటలో వీధి కుక్కల మారణహోమం.. యువకుడి ముఖాన్ని పీక్కుతిన్న వైనం!

చిలకలూరిపేటలో వీధి కుక్కల మారణహోమం.. యువకుడి ముఖాన్ని పీక్కుతిన్న వైనం!


​చిలకలూరిపేట పట్టణ ప్రజలు ఇప్పుడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సిన దుస్థితి ఏర్పడింది. ఒకపక్క స్మార్ట్ సిటీ తరహాలో అభివృద్ధి అంటున్న మున్సిపల్ అధికారులు... కనీసం వీధి కుక్కల బారి నుండి ప్రజల ప్రాణాలను మాత్రం కాపాడలేకపోతున్నారు. తాజాగా మంగళవారం సుగాలి కాలనీలో ఒక వీధి కుక్క చేసిన బీభత్సం పట్టణ ప్రజల వెన్నులో వణుకు పుట్టిస్తోంది.

నెత్తురోడిన యువకుడు.. సుగాలి కాలనీలో ఉలిక్కిపడ్డ జనం:

సుగాలి కాలనీకి చెందిన ప్రవీణ్ అనే యువకుడు మంగళవారం ఉదయం తన ఇంటి సమీపంలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఏమరుపాటుగా ఉన్న ఆ యువకుడిపై ఎటునుండి వచ్చిందో కానీ ఓ వీధి కుక్క మృగంలా విరుచుకుపడింది. నేరుగా ప్రవీణ్ ముఖంపైకి దూకి, పళ్లు నూరింది. కుక్క విచక్షణారహితంగా దాడి చేయడంతో ప్రవీణ్ ముఖం, పెదవులు దారుణంగా తెగిపోయి తీవ్ర రక్తస్రావం జరిగింది. ఆ యువకుడి ఆర్తనాదాలు విన్న స్థానికులు, ప్రాణాలకు తెగించి పరిగెత్తుకుంటూ వచ్చి కుక్కను తరిమికొట్టారు. స్థానికులు ఏమాత్రం ఆలస్యం చేసినా ప్రవీణ్ ప్రాణాలు గాలిలో కలిసేవే అని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. నెత్తుటి మడుగులో ఉన్న ప్రవీణ్‌ను హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ యువకుడు నరకయాతన అనుభవిస్తున్నాడు.


అధికారుల మొద్దునిద్ర.. నిలదీసినా మారని తీరు:

వీధి కుక్కల బెడదపై ఇటీవల జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో అధికార, ప్రతిపక్ష నేతలు ముక్తకంఠంతో అధికారులను నిలదీశారు. ముఖ్యంగా కౌన్సిలర్ బేరింగ్ మౌలాలి తదితరులు 'జనాల ప్రాణాలు పోతుంటే ఏం చేస్తున్నారు?' అని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సభలో 'వెంటనే డాగ్ క్యాచ్ స్క్వాడ్‌ను రప్పిస్తాం, కుక్కలను కట్టడి చేస్తాం' అని మభ్యపెట్టిన అధికారులు... ఆచరణలో మాత్రం గురకపెట్టి నిద్రపోతున్నారని తాజా ఘటనే నిరూపిస్తోంది. ఏసీ గదుల్లో కూర్చునే అధికారులకు, రోడ్ల మీద కుక్కల బారిన పడి రక్తం చిందిస్తున్న సామాన్యుడి బాధ ఎలా తెలుస్తుందని పట్టణ వాసులు మండిపడుతున్నారు.

భయం గుప్పిట్లో పౌరులు:

"చిన్నపిల్లలను స్కూల్‌కు పంపాలన్నా, వృద్ధులు మందుల కోసం మెడికల్ షాపుకు వెళ్లాలన్నా ఒణికిపోతున్నాం. పది పదిహేను కుక్కలు గుంపులుగా చేరి కాలనీల మీద పడుతున్నాయి. చేతిలో కర్ర లేనిదే బయట అడుగుపెట్టలేకపోతున్నాం. ఇంకెంత మంది రక్తం చిందిస్తే మున్సిపల్ యంత్రాంగం కదులుతుంది?" అని సుగాలి కాలనీ వాసులు కన్నీరుమున్నీరవుతున్నారు.

స్పీడ్ న్యూస్ డిమాండ్:

ఇప్పటికైనా చిలకలూరిపేట మున్సిపల్ కమిషనర్ గారు, ఉన్నతాధికారులు స్పందించాలి. తక్షణమే నగరంలో ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి వీధి కుక్కలను పట్టుకోవాలి. యానిమల్ బర్త్ కంట్రోల్ (ABC) ఆపరేషన్లు యుద్ధప్రాతిపదికన చేపట్టాలి. లేనిపక్షంలో ప్రజల ఆగ్రహ జ్వాలలు మున్సిపల్ ఆఫీసును తాకకమానవు!

- మీ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్


చిలకలూరిపేట కరెంటు వినియోగదారులుకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు " 0 "చేసుకోవచ్చు మరిన్ని వివరాలు కోసం కింది నెంబర్ కి కాల్ చేయండి - +91 70135 89826 - ఆదిత్య సోలార్


 మరిన్ని చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి. వాట్సప్ ఛానల్ ని ఫాలో అవ్వండి.

https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g

Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.
📸
మీ వార్తలను మాతో పంచుకోవడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి