మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

Advertisement - 2

Image3

........

Advertisement - 3

Image3

........

ప్రకటనల కోసం 90358 80349 నెంబర్ కు సంప్రదించండి.
|

⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!

చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.

💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి

చిలకలూరిపేట - పెట్రోల్ బంకుల్లో అధికారుల ఆకస్మిక తనిఖీలు.. నిబంధనలు మీరితే సీజే!

🚨 చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ ఎక్స్‌క్లూజివ్: పెట్రోల్ బంకుల్లో అధికారుల ఆకస్మిక తనిఖీలు.. నిబంధనలు మీరితే సీజే! 🚨


​గత కొద్ది రోజులుగా చిలకలూరిపేట పట్టణంలో పెట్రోల్ కొరత ఉందంటూ వస్తున్న వదంతులకు అధికారులు చెక్ పెట్టారు. ఇంధనం దొరకదేమోనన్న ప్రజల ఆందోళనల నేపథ్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్ కఠిన ఆదేశాలు జారీ చేశారు. దీంతో రెవెన్యూ, సివిల్ సప్లైస్ (పౌరసరఫరాల) శాఖ అధికారులు బుధవారం ఉదయం నుంచే రంగంలోకి దిగారు. సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్ వెంకటేశ్వర్లు తన ప్రత్యేక బృందంతో కలిసి పట్టణంలోని పలు పెట్రోల్ బంకుల్లో ఆకస్మిక దాడులు నిర్వహించి, అక్కడ ఉన్న స్టాక్ నిల్వలను, రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించారు.

​ఈ సందర్భంగా అధికారుల యాక్షన్ ప్లాన్ మరియు బంక్ యజమానులకు ఇచ్చిన కఠిన ఆదేశాలు ఇలా ఉన్నాయి:

  • ప్రజలకు భరోసా: పట్టణంలో ఎలాంటి ఇంధన కొరతా లేదు. ఇదంతా కేవలం ప్రచారం మాత్రమే. ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదు.
  • కృత్రిమ కొరత సృష్టిస్తే జైలుకే: డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని అక్రమ లాభాల కోసం పెట్రోల్ దాచిపెట్టి కృత్రిమ కొరత సృష్టించాలని చూస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని అధికారులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
  • బాటిల్స్, క్యాన్లకు 'నో పెట్రోల్': ఇకపై బంకుల్లో కేవలం వాహనాలకు మాత్రమే ఇంధనం నింపాలి. ఎవరైనా బాటిళ్లు లేదా క్యాన్లలో పెట్రోల్ పోస్తే ఆ బంకులపై తక్షణమే చర్యలు తీసుకుంటారు.
  • అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపు: ఆసుపత్రులు, అంబులెన్సులు, ఫైర్ స్టేషన్ మరియు పోలీసుల వంటి అత్యవసర విభాగాలకు మాత్రమే... అదీ తగిన అనుమతి పత్రాలు చూపిస్తేనే బయటకు ఇంధనం సరఫరా చేయాలని స్పష్టం చేశారు.

అధికారుల ఫైనల్ వార్నింగ్:

ఇంధనాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలించినా, గోప్యంగా నిల్వ చేసినా నిత్యావసర వస్తువుల చట్టం (ఈసీ యాక్ట్) కింద కేసులు నమోదు చేసి, బంకులను సీజ్ చేస్తామని యజమాన్యాలను డిప్యూటీ తహసీల్దార్ వెంకటేశ్వర్లు హెచ్చరించారు.

​ప్రజలారా, పెట్రోల్ కోసం పానిక్ అవ్వకండి. నిబంధనలు ఉల్లంఘిస్తూ ఎవరైనా బంక్ యజమానులు ఇబ్బంది పెడితే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురండి!

చిలకలూరిపేట కరెంటు వినియోగదారులుకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు " 0 "చేసుకోవచ్చు మరిన్ని వివరాలు కోసం కింది నెంబర్ కి కాల్ చేయండి - +91 70135 89826 - ఆదిత్య సోలార్


 మరిన్ని చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి. వాట్సప్ ఛానల్ ని ఫాలో అవ్వండి.

https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g

Share:

చిలకలూరిపేట - మతం మారినా దళిత హక్కులా..? నిజమైన దళితుల హక్కుల రక్షణ కోసం కఠిన చట్టాలు తేవాలి: బీజేవైఎం నేతలు మండాది ఫణి, తెల్లబాటి మనోహర్

చిలకలూరిపేట - మతం మారినా దళిత హక్కులా..? నిజమైన దళితుల హక్కుల రక్షణ కోసం కఠిన చట్టాలు తేవాలి: బీజేవైఎం నేతలు మండాది ఫణి, తెల్లబాటి మనోహర్

– పల్నాడు జిల్లా బీజేవైఎం ఉపాధ్యక్షులు మండాది ఫణి, చిలకలూరిపేట మండల అధ్యక్షులు తెల్లబాటి మనోహర్

​ఇటీవల సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు నేపథ్యంలో, మత మార్పిడులు మరియు ఎస్సీ హక్కుల దుర్వినియోగంపై పల్నాడు జిల్లా బీజేవైఎం (BJYM) ఉపాధ్యక్షులు శ్రీ మండాది ఫణి, చిలకలూరిపేట మండల బీజేవైఎం అధ్యక్షులు శ్రీ తెల్లబాటి మనోహర్ గారు తమ ప్రగాఢమైన అభిప్రాయాలను పంచుకున్నారు. సమాజంలో అట్టడుగున ఉన్న హిందూ దళితులు ఉన్నత స్థాయికి చేరాలన్న సత్సంకల్పంతో, పేదలకు, బడుగు బలహీన వర్గాలతో పాటు అన్ని వర్గాలకు మేలు జరిగేలా నాటి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారు అద్భుతమైన రాజ్యాంగాన్ని రచించారని వారు సగర్వంగా గుర్తుచేశారు.

​కానీ, ప్రస్తుత సమాజంలో కొందరు క్రైస్తవ మతంలోకి మారి, మిషనరీల నుండి ఆర్థిక సహాయం పొందుతూ సామాజికంగా, ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరుకొని దళితుల హక్కులను వారికి రావలసిన రిజర్వేషన్లను మతం మారి కూడా అనుభవిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనివలన నిజమైన దళితులకు అన్యాయం జరుగుతుందని దీనిపైన అవగాహన కార్యక్రమాలు త్వరలో చేపడుతామని వారు తెలిపారు. మతం మారినప్పటికీ కాగితాల్లో ఎస్సీలుగా కొనసాగుతూ, చిన్న చిన్న కక్షలు, కారణాలకే అమాయకులపై 'ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ' కేసులను నమోదు చేస్తూ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని వారు మండిపడ్డారు. దళితులు కాకపోయినా, క్రైస్తవం స్వీకరించి ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై అత్యంత కఠినమైన చర్యలు తీసుకునేలా రాజ్యాంగంలో మార్పులు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు.

​"క్రైస్తవంలోకి మారిన వారు ఎస్సీ హక్కులు పొందలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసినప్పటికీ, వారు మతం మారినట్లు నిరూపించడానికి బాప్టిజం సర్టిఫికెట్ లాంటి కచ్చితమైన డాక్యుమెంటేషన్ విధానం చట్టబద్ధంగా అమలులో లేదు. కేవలం చర్చికి వెళ్లడం లేదా పేర్లు మార్చుకోవడం ద్వారా మతం మారినట్లు న్యాయస్థానాల్లో నిరూపించడం సవాలుగా మారుతోంది. ఈ లొసుగులను ఆసరాగా చేసుకొని కొందరు చట్టాల నుంచి తప్పించుకుంటున్నారు" అని వారు పేర్కొన్నారు.

​ఈ పరిస్థితిని అరికట్టాలంటే మత మార్పిడుల నిర్ధారణపై పకడ్బందీ విధివిధానాలతో కఠినమైన చట్టాలను తీసుకురావాల్సిన ఆవశ్యకత దేశానికి ఎంతో ఉందని వారు నొక్కి చెప్పారు. ఇలాంటి చట్టబద్ధమైన ప్రక్షాళన జరిగినప్పుడే, రాజ్యాంగ ఫలాలు అన్యాక్రాంతం కాకుండా కాపాడబడతాయని తెలిపారు. అప్పుడే అంబేద్కర్ గారు కలలుగన్న విధంగా 'నిజమైన దళిత సోదరుల' ఆర్థిక అభివృద్ధికి, సమాజంలో వారికి దక్కాల్సిన అపారమైన గౌరవానికి బలమైన పునాదులు పడతాయని శ్రీ మండాది ఫణి, శ్రీ తెల్లబాటి మనోహర్ గారు స్పష్టం చేశారు.

ఇకపై కరెంట్ బిల్లు కట్టే అవసరం లేదు - పూర్తి వివరాల కోసం ఇప్పుడే కాల్ చేయండి - +91 70135 89826 - ఆదిత్య సోలార్ - సోలార్ గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకొని ఆ తర్వాతే బిగించుకోండి.

మరిన్ని చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి.

https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g

Share:

దళిత హక్కుల రక్షణలో చారిత్రాత్మక తీర్పు!​మతం మారితే ఎస్సీ హోదా రద్దు.. సుప్రీం తీర్పును స్వాగతించిన పల్నాడు జిల్లా బీజేవైఎం అధ్యక్షులు పులిగుజ్జు మహేష్

దళిత హక్కుల రక్షణలో చారిత్రాత్మక తీర్పు!​మతం మారితే ఎస్సీ హోదా రద్దు.. సుప్రీం తీర్పును స్వాగతించిన పల్నాడు జిల్లా బీజేవైఎం అధ్యక్షులు పులిగుజ్జు మహేష్


పల్నాడు జిల్లా: మతం మారిన వెంటనే ఎస్సీ (SC) హోదా రద్దవుతుందని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును భారతీయ జనతా యువమోర్చా (BJYM) పల్నాడు జిల్లా అధ్యక్షులు శ్రీ పులిగుజ్జు మహేష్ స్వాగతించారు. ఈ రోజు చిలకలూరిపేట పట్టణంలో జరిగిన ప్రెస్ మీట్‌లో ఆయన ఈ తీర్పుపై స్పందిస్తూ, ఇది రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడే చారిత్రాత్మక తీర్పు అని కొనియాడారు.

​ఈ ప్రెస్ మీట్‌లో మహేష్ గారు మాట్లాడిన ప్రధాన అంశాలు:

  • తీర్పుకు పూర్తి మద్దతు: క్రైస్తవం స్వీకరించిన వెంటనే ఎస్సీ హోదా దానంతట అదే రద్దవుతుందని, కుల ధృవీకరణ పత్రం దగ్గర ఉన్నప్పటికీ చట్టపరమైన రక్షణ (ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం) వర్తించదని సుప్రీంకోర్టు స్పష్టం చేయడాన్ని బీజేవైఎం పూర్తిగా సమర్థిస్తోంది. చట్టాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఇది సరైన నిర్ణయం.
  • క్రైస్తవులకు ఎలాంటి ఇబ్బందీ లేదు: భారతదేశంలో ప్రతి ఒక్కరికీ తమకు నచ్చిన మతాన్ని ఆచరించే స్వేచ్ఛ ఉంది. క్రైస్తవ సోదరుల పట్ల మాకు పూర్తి గౌరవం ఉంది. ఈ తీర్పు వల్ల దళిత క్రైస్తవులకు సామాజికంగా ఎలాంటి ఇబ్బందీ ఉండదు. కేవలం రాజ్యాంగబద్ధంగా ఎస్సీలకు మాత్రమే చెందాల్సిన రిజర్వేషన్లు, చట్టపరమైన హక్కుల గురించి మాత్రమే న్యాయస్థానం స్పష్టత ఇచ్చింది.
  • నిజమైన ఎస్సీల హక్కుల పరిరక్షణ: హిందూ సమాజంలో అణచివేతకు గురైన దళితుల సామాజిక, ఆర్థిక అభ్యున్నతి కోసం డా. బి.ఆర్. అంబేద్కర్ గారు ఎస్సీ రిజర్వేషన్లు, అట్రాసిటీ చట్టాలను తీసుకువచ్చారు. కుల వివక్ష లేని ఇతర మతాల్లోకి మారినప్పుడు, ఆ చట్టాల అవసరం ఉండదు. కాబట్టి, ఆ ఫలాలు నిజమైన, మతం మారని ఎస్సీలకు మాత్రమే దక్కాలన్నదే సుప్రీంకోర్టు ఉద్దేశం.
  • సామరస్యంతో మెలగాలి: మతం మారిన వారు తిరిగి మాతృ ధర్మంలోకి (SC కమ్యూనిటీలోకి) వస్తేనే పాత హోదా పునరుద్ధరణ సాధ్యమని కోర్టు చెప్పడం పూర్తిగా న్యాయబద్ధం. ప్రజలందరూ సుప్రీంకోర్టు తీర్పును గౌరవించాలి. ఎస్సీ, ఎస్టీ సోదరులు మరియు క్రైస్తవులు ఒకరినొకరు అర్థం చేసుకుని, కులమతాలకు అతీతంగా, అన్నదమ్ముల్లా కలిసిమెలిసి సమాజ అభివృద్ధికి తోడ్పడాలి.

​అట్రాసిటీ కేసుల పేరుతో అమాయకులపై జరుగుతున్న తప్పుడు కేసులను అరికట్టేందుకు, అలాగే నిజమైన దళితుల హక్కులను కాపాడేందుకు సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు ఒక మార్గదర్శకంగా నిలుస్తుందని పులిగుజ్జు మహేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Share:

చిలకలూరిపేటలో వీధి కుక్కల మారణహోమం.. యువకుడి ముఖాన్ని పీక్కుతిన్న వైనం!

చిలకలూరిపేటలో వీధి కుక్కల మారణహోమం.. యువకుడి ముఖాన్ని పీక్కుతిన్న వైనం!


​చిలకలూరిపేట పట్టణ ప్రజలు ఇప్పుడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సిన దుస్థితి ఏర్పడింది. ఒకపక్క స్మార్ట్ సిటీ తరహాలో అభివృద్ధి అంటున్న మున్సిపల్ అధికారులు... కనీసం వీధి కుక్కల బారి నుండి ప్రజల ప్రాణాలను మాత్రం కాపాడలేకపోతున్నారు. తాజాగా మంగళవారం సుగాలి కాలనీలో ఒక వీధి కుక్క చేసిన బీభత్సం పట్టణ ప్రజల వెన్నులో వణుకు పుట్టిస్తోంది.

నెత్తురోడిన యువకుడు.. సుగాలి కాలనీలో ఉలిక్కిపడ్డ జనం:

సుగాలి కాలనీకి చెందిన ప్రవీణ్ అనే యువకుడు మంగళవారం ఉదయం తన ఇంటి సమీపంలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఏమరుపాటుగా ఉన్న ఆ యువకుడిపై ఎటునుండి వచ్చిందో కానీ ఓ వీధి కుక్క మృగంలా విరుచుకుపడింది. నేరుగా ప్రవీణ్ ముఖంపైకి దూకి, పళ్లు నూరింది. కుక్క విచక్షణారహితంగా దాడి చేయడంతో ప్రవీణ్ ముఖం, పెదవులు దారుణంగా తెగిపోయి తీవ్ర రక్తస్రావం జరిగింది. ఆ యువకుడి ఆర్తనాదాలు విన్న స్థానికులు, ప్రాణాలకు తెగించి పరిగెత్తుకుంటూ వచ్చి కుక్కను తరిమికొట్టారు. స్థానికులు ఏమాత్రం ఆలస్యం చేసినా ప్రవీణ్ ప్రాణాలు గాలిలో కలిసేవే అని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. నెత్తుటి మడుగులో ఉన్న ప్రవీణ్‌ను హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ యువకుడు నరకయాతన అనుభవిస్తున్నాడు.


అధికారుల మొద్దునిద్ర.. నిలదీసినా మారని తీరు:

వీధి కుక్కల బెడదపై ఇటీవల జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో అధికార, ప్రతిపక్ష నేతలు ముక్తకంఠంతో అధికారులను నిలదీశారు. ముఖ్యంగా కౌన్సిలర్ బేరింగ్ మౌలాలి తదితరులు 'జనాల ప్రాణాలు పోతుంటే ఏం చేస్తున్నారు?' అని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సభలో 'వెంటనే డాగ్ క్యాచ్ స్క్వాడ్‌ను రప్పిస్తాం, కుక్కలను కట్టడి చేస్తాం' అని మభ్యపెట్టిన అధికారులు... ఆచరణలో మాత్రం గురకపెట్టి నిద్రపోతున్నారని తాజా ఘటనే నిరూపిస్తోంది. ఏసీ గదుల్లో కూర్చునే అధికారులకు, రోడ్ల మీద కుక్కల బారిన పడి రక్తం చిందిస్తున్న సామాన్యుడి బాధ ఎలా తెలుస్తుందని పట్టణ వాసులు మండిపడుతున్నారు.

భయం గుప్పిట్లో పౌరులు:

"చిన్నపిల్లలను స్కూల్‌కు పంపాలన్నా, వృద్ధులు మందుల కోసం మెడికల్ షాపుకు వెళ్లాలన్నా ఒణికిపోతున్నాం. పది పదిహేను కుక్కలు గుంపులుగా చేరి కాలనీల మీద పడుతున్నాయి. చేతిలో కర్ర లేనిదే బయట అడుగుపెట్టలేకపోతున్నాం. ఇంకెంత మంది రక్తం చిందిస్తే మున్సిపల్ యంత్రాంగం కదులుతుంది?" అని సుగాలి కాలనీ వాసులు కన్నీరుమున్నీరవుతున్నారు.

స్పీడ్ న్యూస్ డిమాండ్:

ఇప్పటికైనా చిలకలూరిపేట మున్సిపల్ కమిషనర్ గారు, ఉన్నతాధికారులు స్పందించాలి. తక్షణమే నగరంలో ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి వీధి కుక్కలను పట్టుకోవాలి. యానిమల్ బర్త్ కంట్రోల్ (ABC) ఆపరేషన్లు యుద్ధప్రాతిపదికన చేపట్టాలి. లేనిపక్షంలో ప్రజల ఆగ్రహ జ్వాలలు మున్సిపల్ ఆఫీసును తాకకమానవు!

- మీ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్


చిలకలూరిపేట కరెంటు వినియోగదారులుకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు " 0 "చేసుకోవచ్చు మరిన్ని వివరాలు కోసం కింది నెంబర్ కి కాల్ చేయండి - +91 70135 89826 - ఆదిత్య సోలార్


 మరిన్ని చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి. వాట్సప్ ఛానల్ ని ఫాలో అవ్వండి.

https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g

Share:

చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల నరకయాతన - సిబ్బంది నిర్లక్ష్యానికి బలి అవుతున్న పేదలు! - ఎమ్మెల్యే పుల్లారావు శ్రమకు సిబ్బంది తూట్లు

చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల నరకయాతన - సిబ్బంది నిర్లక్ష్యానికి బలి అవుతున్న పేదలు! - ఎమ్మెల్యే పుల్లారావు శ్రమకు సిబ్బంది తూట్లు


చిలకలూరిపేట (స్పీడ్ న్యూస్): పేదవాడికి ప్రాణదాతగా నిలవాల్సిన ప్రభుత్వ ఆసుపత్రి.. ఇప్పుడు సిబ్బంది నిర్లక్ష్యానికి, చిరాకులకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. స్థానిక మద్దినగర్‌లోని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యం కోసం వస్తున్న రోగులు.. రోగం కన్నా సిబ్బంది పెడుతున్న నరకంతోనే ఎక్కువగా విలవిలలాడుతున్నారు.

"మాకు టైమ్ లేదు.. పక్కకు పోండి..!"

ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి వేలు, లక్షలు ఖర్చుపెట్టుకోలేని నిరుపేదలు ఎంతో నమ్మకంతో ప్రభుత్వ ఆసుపత్రికి వస్తుంటారు. కానీ, ఇక్కడి సిబ్బంది తీరు చూస్తే పేదలకు కన్నీళ్లు ఆగడం లేదు. రోగులకు ధైర్యం చెప్పాల్సిన సిబ్బందే.. వారిపై కసురుకుంటున్నారు. కనీసం తమ బాధ చెప్పుకుందామన్నా.. "మాకు టైమ్ లేదు", "పక్కన కూర్చోండి", "ఎక్కువ మాట్లాడకండి" అంటూ ఈసడించుకుంటున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇన్-పేషెంట్ వార్డుల్లో పరిస్థితి దారుణంగా ఉంది. ఏదైనా అత్యవసరమై పిలిచినా, ప్రాణం పోయే పరిస్థితి ఉన్నా సిబ్బంది కుర్చీలు వదిలి రావడం లేదనే తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

సిస్టమ్స్ డౌన్.. ఓపీల కోసం నరకం..

ఒకవైపు సిబ్బంది కొరత, మరోవైపు ఉన్న సిబ్బంది నిర్లక్ష్యం వెరసి రోగులకు ఓపీ (OP) చిట్టీ దొరకడమే గగనంగా మారింది. రిసెప్షన్‌లో ఉన్న కంప్యూటర్లు తరచూ పనిచేయకపోవడంతో వైద్య సేవలు పూర్తిగా స్తంభించిపోతున్నాయి. ఉదయం 8 గంటలకు వస్తే, మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఓపీ రాయకపోవడంతో మారుమూల పల్లెల నుంచి పసిపిల్లలతో వచ్చే తల్లులు, వృద్ధులు ఆసుపత్రి వరండాల్లోనే పడిగాపులు కాస్తున్నారు. సిస్టమ్స్ పనిచేయనప్పుడు ప్రత్యామ్నాయంగా మాన్యువల్ పద్ధతిలో ఓపీ రాసి పంపాలనే కనీస ఇంగితం కూడా అధికారులు ప్రదర్శించడం లేదు.

ఎమ్మెల్యే కృషి బూడిదలో పోసిన పన్నీరేనా?

ప్రజలకు మెరుగైన వైద్యం అందాలన్న సదుద్దేశంతో స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు మంజూరు చేయించి, దీనిని 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేశారు. ఆధునిక వైద్య సదుపాయాలు, మౌలిక వసతులు కల్పించారు. కానీ "ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్" అన్నట్లుగా.. కోట్లు ఖర్చుపెట్టి భవనాలు, సదుపాయాలు తెచ్చినా ఇక్కడి సిబ్బంది వ్యవహారశైలితో ఆ ఫలాలు ఏమాత్రం పేదలకు అందడం లేదు.

 వీడియో కోసం కింది లింక్ పై క్లిక్ చేయండి.

https://www.instagram.com/reel/DWON_nxCcxi/?igsh=MW5yN2ZjaTdxM2NjOA==

అధికారులు స్పందించేదెన్నడు?

ఈ ఆసుపత్రిలో జరుగుతున్న నిర్వాకంపై జిల్లా ఉన్నతాధికారులు (DMHO), కలెక్టర్ తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉంది. ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటే తప్ప చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రి బాగుపడేలా లేదని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

ఇకపై కరెంట్ బిల్లు కట్టే అవసరం లేదు - పూర్తి వివరాల కోసం ఇప్పుడే కాల్ చేయండి - +91 70135 89826 - ఆదిత్య సోలార్ - సోలార్ గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకొని ఆ తర్వాతే బిగించుకోండి.

 మరిన్ని చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి.

https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g

Share:

చిలకలూరిపేటలో పోలీసుల ఆకస్మిక దాడులు.. 26 ద్విచక్ర వాహనాలు, భారీగా మారణాయుధాలు సీజ్! 90 మంది పోలీసులతో రంగంలోకి డీఎస్పీ

చిలకలూరిపేటలో పోలీసుల ఆకస్మిక దాడులు.. 26 ద్విచక్ర వాహనాలు, భారీగా మారణాయుధాలు సీజ్! 90 మంది పోలీసులతో రంగంలోకి డీఎస్పీ

చిలకలూరిపేట: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు చిలకలూరిపేట పోలీసులు ఉక్కుపాదం మోపారు. పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, అల్లర్లు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా మంగళవారం భారీ ఎత్తున 'కార్డెన్ అండ్ సెర్చ్' ఆపరేషన్ నిర్వహించారు.

పోలీసుల తనిఖీల్లో కీలక అంశాలు:

  • భారీ బలగాలు: సంజీవ్ నగర్, ఆది ఆంధ్ర కాలనీల్లో ఏకంగా 90 మంది పోలీసులతో అణువణువూ జల్లెడ పట్టారు.
  • ఆయుధాలు, వాహనాల సీజ్: సరైన పత్రాలు లేని 26 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే అల్లర్లకు వినియోగించే అవకాశం ఉన్న గడ్డపారలు, గొడ్డళ్లు వంటి 12 మారణాయుధాలను సీజ్ చేశారు.
  • సస్పెక్ట్స్ గుర్తింపు: ఏరియాలో నివాసం ఉంటున్న 7 మంది అనుమానితులను (దొంగతనాలు చేసే వారిని), నలుగురు రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

గంజాయి మహమ్మారిపై డీఎస్పీ హనుమంతరావు సీరియస్ వార్నింగ్:

ఈ సందర్భంగా డీఎస్పీ హనుమంతరావు మాట్లాడుతూ.. నేటి యువత, చదువుకునే విద్యార్థులు గంజాయికి బానిసలై భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో అసాంఘిక శక్తులుగా మారకుండా ముందుగానే వారిని అరికట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

"తల్లిదండ్రులకే నా విజ్ఞప్తి.. మీ పిల్లలు బయటకు వెళ్తున్నప్పుడు ఎవరితో తిరుగుతున్నారు? ఎలాంటి సావాసాలు చేస్తున్నారు? అనేది ప్రతిరోజూ కనీసం ఒక గంట పాటు గమనించండి. అప్పుడే వారి భవిష్యత్తుకు మంచి బాటలు వేయగలం" అని డీఎస్పీ సూచించారు.

హెల్మెట్ మస్ట్.. లేకపోతే యాక్షనే!

చిలకలూరిపేట పట్టణంలో రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరూ కచ్చితంగా హెల్మెట్ ధరించాల్సిందేనని డీఎస్పీ స్పష్టం చేశారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి పట్టణానికి పనుల నిమిత్తం వచ్చే వారు తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారని, ప్రాణాపాయం నుంచి బయటపడాలంటే హెల్మెట్ ఒక్కటే రక్ష అని తెలిపారు. ఈ నిబంధనను పట్టణంలో ఇకపై కఠినంగా అమలు చేయనున్నట్లు వెల్లడించారు.

పాల్గొన్న అధికారులు:

ఈ భారీ ఆపరేషన్‌లో డీఎస్పీ హనుమంతరావుతో పాటు ట్రైనీ ఐపీఎస్ నిరంజన్, ట్రైనీ డీఎస్పీ జయకృష్ణ, అర్బన్ సీఐ రమేష్, ఎస్ఐ చెన్నకేశవులు మరియు 90 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

వీడియో కోసం క్రింది లింక్ పైన క్లిక్ చెయ్యండి.

https://www.instagram.com/reel/DWNvlJ1CR8P/?igsh=dzk3N3p4c2prdmRj

చిలకలూరిపేట కరెంటు వినియోగదారులుకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు " 0 "చేసుకోవచ్చు మరిన్ని వివరాలు కోసం కింది నెంబర్ కి కాల్ చేయండి - +91 70135 89826 - ఆదిత్య సోలార్

 మరిన్ని చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి. వాట్సప్ ఛానల్ ని ఫాలో అవ్వండి.

https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g

Share:

చిలకలూరిపేట రూరల్ - ఎడ్లపాడు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం: నిద్రమత్తే ప్రాణం తీసిందా? లారీని ఢీకొట్టిన టాటా వాహనం, డ్రైవర్ అక్కడికక్కడే దుర్మరణం

చిలకలూరిపేట రూరల్ - ఎడ్లపాడు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం: నిద్రమత్తే ప్రాణం తీసిందా? లారీని ఢీకొట్టిన టాటా వాహనం, డ్రైవర్ అక్కడికక్కడే దుర్మరణం


చిలకలూరిపేట రూరల్, ఎడ్లపాడు మండల కేంద్రం శివారులో జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున పెను విషాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ఒక టాటా మ్యాజిక్ (ఇంట్రో) వాహనం అదుపుతప్పి ముందున్న లారీని వెనుక భాగం నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో టాటా వాహనం డ్రైవర్ తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

​🛣️ ప్రమాదం ఎలా జరిగిందంటే..

స్థానికులు మరియు పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఒంగోలు నుండి విజయవాడ వైపు వెన్నపూస లోడుతో టాటా వాహనం ప్రయాణిస్తోంది. సోమవారం తెల్లవారుజామున ఎడ్లపాడు సమీపంలోకి రాగానే డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకున్నట్లు తెలుస్తోంది. వాహనం అతివేగంగా ఉండటం మరియు డ్రైవర్ అప్రమత్తంగా లేకపోవడంతో జాతీయ రహదారిపై ఆగి ఉన్న (లేదా నెమ్మదిగా వెళ్తున్న) లారీని గమనించకుండా వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.

​💥 నుజ్జునుజ్జయిన క్యాబిన్:

ప్రమాద తీవ్రతకు టాటా వాహనం ముందు భాగం (క్యాబిన్) పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. డ్రైవర్ అందులోనే ఇరుక్కుపోయి, తీవ్ర రక్తస్రావంతో ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. తెల్లవారుజామున ఈ దారుణాన్ని చూసిన స్థానికులు మరియు ఇతర వాహనదారులు చలించిపోయారు.

​🚓 రంగంలోకి దిగిన పోలీసులు:

ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే ఎడ్లపాడు పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్రేన్ సహాయంతో నుజ్జునుజ్జయిన వాహనాన్ని పక్కకు తొలగించి, జాతీయ రహదారిపై ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని వాహనం నుండి అతికష్టం మీద వెలికితీసి, పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

 యాక్సిడెంట్ వీడియో కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి                 https://www.instagram.com/reel/DWNn_XpiUTQ/?igsh=amlqY2ZjYWI4eHZw

చిలకలూరిపేట కరెంటు వినియోగదారులుకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు " 0 "చేసుకోవచ్చు మరిన్ని వివరాలు కోసం కింది నెంబర్ కి కాల్ చేయండి - +91 70135 89826 - ఆదిత్య సోలార్


 మరిన్ని చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి. వాట్సప్ ఛానల్ ని ఫాలో అవ్వండి.

https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g

Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.
📸
మీ వార్తలను మాతో పంచుకోవడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి