|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండిఏపీలో ఇక పైన పెస్టిసైడ్స్ & వ్యవసాయాధారిత దుకాణాల పని వేళలలో మార్పు
ఏపీలో ఇక పైన పెస్టిసైడ్స్ & వ్యవసాయాధారిత దుకాణాల పని వేళలలో మార్పు
కరోనా వలన రాష్ట్రం మొత్తం రెండు వారాలపాటు కర్ఫ్యూని విధించిన ప్రభుత్వం తాజాగా వ్యవసాయానికి అనుసంధానంగా ఉండే దుకాణాలకు మినహాయింపు ఇచ్చారు పూర్తి మినహాయింపు ఇవ్వకుండా సమయంలో మార్పులు చేసింది. రేపు అనగా సోమవారం నుండి ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు దుకాణాలను తెరిచి ఉంచుకోవచ్చు, అమ్మకాలు కొనసాగించవచ్చు అని తెలిపినది. కనుక రేపటి నుండి ఎరువులు మందుల దుకాణాలు, పురుగుల మందుల దుకాణాలు , వ్యవసాయ పనిముట్లు అమ్మే షాపులు, వాటిని రిపేరులు చేసే షాపులు 7 to 6 వరకు తెరుచుకోనున్నాయి.
కరోనా నియమాలు పాటిస్తూ అమ్మకాలు కొనసాగించాలి అని తెలియచేసారు.
చిలకలూరిపేటలో ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా అందజేసిన గోవెల్ బ్యాటరీస్ నిమ్మకాయల ( బొబిళ్ళ ) ప్రసాదు గారు
చిలకలూరిపేటలో ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా అందజేసిన గోవెల్ బ్యాటరీస్ నిమ్మకాయల ( బొబిళ్ళ ) ప్రసాదు గారు
ముస్లిం సోదరుల ఎంతో పవిత్రంగా భావించే రంజాన్ మాసము సంధర్బముగా పట్టణములోని గోవెల్ బ్యాటరీస్ చిలకలూరిపేట యాజమాన్యం అయిన బొబ్బిళ్ళ ( నిమ్మకాయల ) ప్రసాదు గారి ఆధ్వర్యంలో 150 మంది ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా అందజేశారు. 150 మందికి వారానికి సరిపడా కూరగాయలు, ఉల్లిపాయలు, 2 కేజీల బాసుమతి రైస్, నూనె పాకెట్స్, ఇతర పదార్ధాలు అందజేశారు. ఈ సంధర్భంగా ప్రసాదు గారు మాట్లాడుతూ కరోనా కారణముగా ఈ సంవత్సరం ముస్లిం సోదరులు రంజాన్ పండుగను ఎవరి ఇళ్లలో వాళ్ళు జరుపుకోవాలి. సాయంత్రం ప్రార్థన సమయాలలో మాస్క్ ధరించాలి అని కరోనా నియమాలు పాటిస్తూ పండుగని జరుపుకుందాం అని తెలిపారు. పట్టంలోని రామకృష్ణ థియేటర్స్ పక్కనే ఉన్న గోవెల్ బ్యాటరీస్ నందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రసాదు గారు, నాయుడు హనుమంతురావు గారు మరియు ప్రసాదు గారి మిత్రులు, పట్టణంలోని బైక్ మెకానిక్స్ ,కారు మెకానిక్స్ పాల్గొన్నారు.
ఇక పైన రాష్ట్రంలో ప్రతి నెల ప్రతి ఇంటి నుండి నగరాలలో 120, మునిసిపాలిటీలలో 90, పంచాయితీలలో 60 రూపాయల వసూళ్లు - త్వరలో ఆమోదం
ఇక పైన రాష్ట్రంలో ప్రతి నెల ప్రతి ఇంటి నుండి నగరాలలో 120, మునిసిపాలిటీలలో 90, పంచాయితీలలో 60 రూపాయల వసూళ్లు - త్వరలో ఆమోదం
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మునిసిపాలిటీలలో, నగరపాలక సంస్థలలో సాలిడ్ వెస్ట్ మేనేజ్మెంట్ కోసం చార్జీలు వసూళ్లు చెయ్యనున్నారు. నగరపాలక సంస్థలలో, పురపాలక సంస్థలలో వేరు వేరుగా చార్జీలు వసూళు చెయ్యనున్నారు.
నగరపాలక సంస్థలలో, మునిసిపల్ కార్పొరేషన్ లలో అయితే ఇంటి ఇంటికి ప్రతి నెల 120 రూపాయల చొప్పున చార్జీలు వసూళ్లు చెయ్యనున్నారు. ఆలస్యం అయితే 15 రూపాయల పెనాలిటీ వసూళ్లు చేస్తారు. 500-1000 చదరపు అడుగుల హోటళ్లకు, రెస్టారెంట్లకు 1000 రూపాయలు, 1500 చదరపు అడుగులలో ఉన్న హోటళ్లకు, రెస్టారెంట్లకు 1500 రూపాయలు, చిన్న హోటళ్లకు 500 రూపాయలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు 300 రూపాయలు, 7 స్టార్ నుండి 5 స్టార్ హోటళ్లకు 15000, 3 స్టార్ హోటళ్లకు 10000, 50 గదులు ఉన్న హోటళ్లకు 5 వేలు, 20 నుండి 50 గదులు ఉన్న హోటళ్లకు 3 వేలు, హాస్టళ్లకు, మాల్స్, ఫంక్షన్ హాళ్లకు వేరువేరుగా, ఆలస్యం అయితే 100పెనాలిటీ చార్జీలు నిర్ణయించారు.
మునిసిపాలిటీలలో స్పెషల్, సెలక్షన్ గ్రేడులలో ఉన్న మునిసిపాలిటీలలో ఒకొక్క ఇంటికి ప్రతి నెలా 90 రూపాయలు, 1000 చదరపు అడుగుల కన్నా ఎక్కువ ఉన్న హోటళ్లకు 1000 రూపాయలు, బార్ అండ్ రెస్టారెంట్ లకు 2000 రూపాయలు, ప్రైవేట్ కమర్షియల్ కంప్లెక్సలకు 2500 రూపాయలు, ఫంక్షన్ హాళ్లకు 7500 రూపాయలు,కోల్డ్ స్టోరేజీలకు 1000 రూపాయలు, 40 పడకల నర్సింగ్ హోమ్ లకు 7500 రూపాయలు, చికెన్ మటన్ షాపులకు నెలకు 200 చొప్పున నిర్ణయించారు.
గ్రేడ్ 2, నగర పంచాయితీలకు నెలకు ఇంటికి నెలకు 60 రూపాయలు , లేటు పెనాలిటీ 5 రూపాయలుగా నిర్ణయించారు.
చిలకలూరిపేట - నిత్యం రోడ్డు ప్రమాదాలతో బెంబేలెత్తిపోతున్న తిమ్మాపురం ప్రాంతః ప్రజలు - తాజాగా మరొకరు మృతి
చిలకలూరిపేట - నిత్యం రోడ్డు ప్రమాదాలతో బెంబేలెత్తిపోతున్న తిమ్మాపురం ప్రాంతః ప్రజలు - తాజాగా మరొకరు మృతి
చిలకలూరిపేట నుండి గుంటూరు జాతీయ రహదారి పైనా తిమ్మాపురం వద్ద రోజూ ఏదో ఒక రోడ్డు ప్రమాదం వలన ఎవరో ఒకరు మృతి చెందుతున్నారు. తాజాగా ఆదివారం ( ఈ రోజు ) విజయవాడ నుండి ఒంగోలు వెళ్తున్న ట్రాలీ ఆటో తిమ్మాపురం వద్ద డివైడర్ ను ఢీ కొని బోల్తా పడింది. ఆ సమయంలో ఆటోలో ఆరుగురు ప్రయాణిస్తున్నారు. ఈ ఘటనలో పొదిలికు చెందిన నరసయ్య (80) అక్కడే మృతి చెందారు. మిగిలిన వారికీ గాయాలవ్వగా వారిని హాస్పిటల్కు తరలించారు.
నిత్యం ఏదో ఒక ప్రమాదంతో ఆయా ప్రాంతః వాసులు భయాందోళనకు గురి అవుతున్నారు. చిలకలూరిపేట నుండి గుంటూరు మధ్యలో తిమ్మాపురం జంక్షన్ వద్ద మాత్రమే రోడ్డు వెడల్పు తక్కువగా, ప్రమాదాలకు అనుకూలంగా ఉంటుంది. అధికారులు దీని పైనా ద్రుష్టి పెట్టి తగుచర్యలు తీసుకోవాలి అని ఆ ప్రాంతః వాసులు తెలిపారు.
చిలకలూరిపేట - మందుబాబుల వికృత చేష్టలు
చిలకలూరిపేట - మందుబాబుల వికృత చేష్టలు
చిలకలూరిపేట పట్టణంలోని CR కాలనీ సమీపంలో మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గారి మిల్లుకు కూతవేటు దూరంలో ప్రతి రోజు రాత్రివేళలో మందు బాబులు ఫుల్ గా తాగేసి ఖాళీ మద్యం సీసాలను పగలకొట్టి వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. దీని వలన పట్టణములోని CR కాలనీ, RTC కాలనీ వాళ్ళు పొద్దునే వాకింగ్ కు వెళ్తూ గురిఅవుతున్నారు . చిన్నపిల్లలతో మార్నింగ్ వాకింగ్ వెళ్లేవారికి వీటివలన గాయపడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే ఇలాంటి వికృత చర్యలకు పాల్పడేవాళ్ళ పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు, మార్నింగ్ వాకింగ్ కి వెళ్లే వారు కోరుకుంటున్నారు. ఇప్పటికి అయినా పోలీస్ వారు రాత్రి గస్తీ సమయంలో ఇటుగా వచ్చి ఇలాంటి సాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపైన చర్యలు చేపట్టాలని స్థానికులు కోరారు.
రైతు పొలం పని చేసుకునే సమయంలో కాళ్లకు చెప్పులు లేకుండా పొలం సాగు చేస్తారు. ఇలాంటి చర్యలకు పాల్పడి వారిని గాయాలపాలు చెయ్యకండి.
చిలకలూరిపేటలో కరొనతో మహిళా ANM మృతి
చిలకలూరిపేటలో కరొనతో మహిళా ANM మృతి
చిలకలూరిపేట రాగన్నపాలెం లో నివాసం ఉంటున్న మహిళా ANM కరోతో మృతి చెందారు. ఆమె మండల పరిధిలోని మురికిపూడి గ్రామము నందు ANM (Auxiliary Nursing Midwifery) గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే కొంత కాలముగా కరొనతో ఒక ప్రైవేట్ హాస్పిటల్ నందు చికిత్సపొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందారు. ఆమె మృతికి పట్టణములోని ANM లు ధిక్బ్రాంతి వ్యక్తం చేసారు.
చిలకలూరిపేటలో ఫుల్ లాక్ డౌన్ దిశగా వర్తక సంఘాలు !!!
చిలకలూరిపేటలో ఫుల్ లాక్ డౌన్ దిశగా వర్తక సంఘాలు !!!
చిలకలూరిపేటలో కరోనా కేసులు,మరణాలు పెరుగుతున్న క్రమంలో వర్తక,వాణిజ్య సంఘాలు ఫుల్ లాక్ డౌన్ స్వచ్చంధంగా ప్రకటించనున్నాయి. పట్టణంలో లాక్ డౌన్ విధించిన నిర్ణిత సమయంలో ప్రజలు మార్కెట్ పరిసర ప్రాంతాలలో ఎక్కువ రద్దీ ఏర్పడి కేసులు పెరుగుదలకు కారణం అవుతున్నారు. ఇప్పటికే చాలా మంది వ్యాపారులను పోగొట్టుకున్నారు. ఇక పైన ఎవరు కరొన వల్ల ఇబ్బందులకు గురి కాకూడదు అని స్వచ్చంధంగా గోల్డ్ షాపులు, స్టీల్ కొట్లు ఈ నెల 10 వ తారీకు నుండి 20 వరకు పూర్తిగా మూసి ఉంచాలి అని ఆలోచిస్తున్నారు. వీరితో పటు వాణిజ్య , వర్తక సంఘాలు కూడా మూసివేయాలి అని ఆలోచిస్తున్నారు.ఇప్పటికే మార్కెట్ సెంటర్ లలో వాహనాలకు అనుమతి లేకుండా బారికేడ్లు ఏర్పాటు చేసారు. ఈ ఫుల్ లాక్ డౌన్ అమలు చేస్తే పరిస్థితి కొంచమైనా అదుపులోకి వస్తుందేమో చూదాం.













