శరవేగంగా సంజీవనగర్ పైపులైన్ మరమ్మతులు... సోమవారం మధ్యాహ్నానికి నీటి సరఫరా పునరుద్ధరణ!
చిలకలూరిపేట: స్థానిక సంజీవనగర్ ప్రాంతంలో కలుషిత నీటి సమస్యను పరిష్కరించే దిశగా మున్సిపల్ యంత్రాంగం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. పైపులైన్ లీకేజీల మరమ్మతు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.
తాజా పరిస్థితి (గ్రౌండ్ రిపోర్ట్): నేడు (ఆదివారం) క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని సమీక్షించగా.. అధికారులు రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆదివారం సాయంత్రం కల్లా ఈ పైపులైన్ మరమ్మతులను పూర్తి చేసి, సోమవారం మధ్యాహ్నం నాటికి సంజీవనగర్ వాసులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా త్రాగునీటిని సరఫరా చేయాలని అధికారులు దృఢ నిశ్చయంతో ఉన్నారు.
అధికారుల పర్యవేక్షణ: ఈ పనులను మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని శుక్రవారం నాడు స్వయంగా పరిశీలించారు. ప్రజలకు ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా స్వచ్ఛమైన నీటిని అందించడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరిబాబు, డీఈ అబ్దుల్ రహీం ఈ నీటి సరఫరా వ్యవస్థను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
ప్రజలకు విజ్ఞప్తి: నీటి సరఫరాలో ఎక్కడైనా అంతరాయాలు లేదా ఇబ్బందులు తలెత్తితే వెంటనే మున్సిపల్ కార్యాలయానికి సమాచారం ఇవ్వాలని పుర ప్రజలను అధికారులు కోరారు. ఈ పనుల పర్యవేక్షణలో 10వ వార్డు కౌన్సిలర్ మౌలాలి, ఇంజనీరింగ్ సెక్షన్ ఏఈలు, సచివాలయ సిబ్బంది చురుగ్గా పాల్గొంటున్నారు.
ఇకపై కరెంట్ బిల్లు కట్టే అవసరం లేదు - పూర్తి వివరాల కోసం ఇప్పుడే కాల్ చేయండి - +91 70135 89826 - ఆదిత్య సోలార్ - సోలార్ గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకొని ఆ తర్వాతే బిగించుకోండి.
మరిన్ని చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి.




