మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

Advertisement - 2

Image3

........

Advertisement - 3

Image3

........

ప్రకటనల కోసం 90358 80349 నెంబర్ కు సంప్రదించండి.
|

⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!

చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.

💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి

నరసరావుపేటలో కీచక ప్రిన్సిపాల్.. కక్షగట్టి విద్యార్థినిపై అమానుష దాడి!

నరసరావుపేటలో కీచక ప్రిన్సిపాల్.. కక్షగట్టి విద్యార్థినిపై అమానుష దాడి!


​🔴 జుట్టుపట్టుకుని విచక్షణారహితంగా కొట్టిన వైనం

🔴 ఆందోళనకు దిగిన తల్లిదండ్రులు, రంగంలోకి దిగిన SFI

🔴 ఆక్స్‌ఫర్డ్ స్కూల్ వద్ద తీవ్ర ఉద్రిక్తత

నరసరావుపేట (స్పీడ్ న్యూస్): విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువే క్రూరుడిగా మారాడు. ప్రశ్నించిన పాపానికి పగబట్టి ఓ మైనర్ బాలికపై తన ప్రతాపం చూపించాడు. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ప్రకాష్ నగర్‌లో గల ఆక్స్‌ఫర్డ్ స్కూల్‌లో ప్రిన్సిపాల్ వ్యవహరించిన తీరు ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

అసలేం జరిగిందంటే..?

ప్రకాష్ నగర్ ఆక్స్‌ఫర్డ్ స్కూల్‌లో చదువుతున్న పదవ తరగతి విద్యార్థినిపై ప్రిన్సిపాల్ శివారెడ్డి దారుణంగా ప్రవర్తించాడు. చిన్న కారణానికే ఆ విద్యార్థిని జుట్టు పట్టుకుని విచక్షణారహితంగా కొట్టాడు. అయితే ఈ దాడి వెనుక ప్రిన్సిపాల్ పాత కక్ష ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో సదరు విద్యార్థిని స్కూల్‌కు షూస్ వేసుకుని రాలేదన్న కారణంతో యాజమాన్యం ₹100 ఫైన్ వేసింది. "ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా, అప్పులు చేసైనా పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని మీ స్కూల్లో చేర్పిస్తే.. ఇలా అడుగడుగునా ఫైన్ల పేరుతో వేలకు వేలు దోచుకోవడం ఏంటి?" అని బాలిక తల్లిదండ్రులు ఆ సమయంలో ప్రిన్సిపాల్‌ను గట్టిగా నిలదీశారు.

మనసులో పెట్టుకుని కక్ష సాధింపు..

తల్లిదండ్రులు ప్రశ్నించారనే అక్కసును ప్రిన్సిపాల్ శివారెడ్డి మనసులో పెట్టుకున్నాడు. అప్పటి నుంచి ఆ బాలికపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. బాలిక ఏ చిన్న తప్పు చేసినా వెంటనే టార్గెట్ చేసి దారుణంగా కొట్టడం పరిపాటిగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా బాలికపై జుట్టు పట్టుకుని దాడికి పాల్పడ్డాడు.


ఎస్ఎఫ్ఐ (SFI) ఎంట్రీతో ఉద్రిక్తత..

విద్యార్థినిపై జరిగిన అమానుష దాడికి నిరసనగా.. బాధిత తల్లిదండ్రులకు మద్దతుగా స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI) నాయకులు రంగంలోకి దిగారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు స్కూల్ ఎదుట భారీ ధర్నాకు దిగారు. విద్యార్థినిపై దాడి చేసిన ప్రిన్సిపాల్ శివారెడ్డిపై విద్యాశాఖ అధికారులు, పోలీసులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో ఆక్స్‌ఫర్డ్ స్కూల్ వద్ద భారీ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

ఇకపై కరెంట్ బిల్లు కట్టే అవసరం లేదు - పూర్తి వివరాల కోసం ఇప్పుడే కాల్ చేయండి - +91 70135 89826 - ఆదిత్య సోలార్ - సోలార్ గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకొని ఆ తర్వాతే బిగించుకోండి.

 మరిన్ని చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి.

https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g


Share:

స్వచ్ఛతకు పాతరేస్తున్న నిర్లక్ష్యం: కొత్త బైపాస్ రోడ్డుపై చెత్తాచెదారం... మసకబారుతున్న చిలకలూరిపేట ప్రతిష్ట!

స్వచ్ఛతకు పాతరేస్తున్న నిర్లక్ష్యం: కొత్త బైపాస్ రోడ్డుపై చెత్తాచెదారం... మసకబారుతున్న చిలకలూరిపేట ప్రతిష్ట!


​మన చిలకలూరిపేట అభివృద్ధికి చిరునామాగా, ప్రయాణికుల సౌకర్యార్థం నూతనంగా నిర్మించిన బైపాస్ రోడ్డు... ఇప్పుడు కొందరి బాధ్యతారాహిత్యానికి డస్ట్ బిన్ లా మారుతోంది. చిలకలూరిపేట నుంచి నరసరావుపేట కి వెళ్లే   దారిలో ఉన్న నూతన బైపాస్ రహదారి పక్కన ఏకంగా వెయ్యికి పైగా వాడి పారేసిన భోజనం పార్సిల్ కవర్లు, ప్లాస్టిక్ వ్యర్థాలు గుట్టలుగా దర్శనమివ్వడం నగర పౌరుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఎంతో అందంగా ఉండాల్సిన హైవే రోడ్డు కాస్తా, రాత్రికి రాత్రే ఇలా చెత్తకుప్పగా మారడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

​ప్రధానమంత్రి మొదలుకొని మన స్థానిక ఎమ్మెల్యే వరకు ప్రతి ఒక్కరూ "స్వచ్ఛ భారత్", "స్వచ్ఛ పల్నాడు", "స్వచ్ఛ చిలకలూరిపేట" అంటూ పారిశుధ్యంపై ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. మున్సిపాలిటీ కార్మికులు సైతం నిత్యం రోడ్లను శుభ్రం చేస్తూ తమ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు. కానీ, పాలకులను లేదా మున్సిపల్ సిబ్బందిని తప్పుబట్టే ముందు, ఈ ఊరిలో బతుకుతున్న ప్రజలుగా మనమెంత బాధ్యతగా వ్యవహరిస్తున్నాం అనేది ఇక్కడ అసలు ప్రశ్న. మనం చేసే చిన్న నిర్లక్ష్యం వల్ల సమాజానికి ఎంత చెడు జరుగుతుందో అర్థం చేసుకోలేని స్థాయిలో సామాజిక స్పృహ (Social Awareness) లోపించడం అత్యంత విచారకరం.

ప్రతి పౌరుడూ తనను తాను అడుక్కోవాల్సిన కొన్ని ప్రశ్నలు:

  • మన ఇల్లు అయితే ఇలాగే చేస్తామా?: మన ఇంట్లో భోజనం చేశాక, ఆ వ్యర్థాలను ఇంటి మధ్యలోనే పడేస్తున్నామా? డస్ట్ బిన్ లో వేసి ఇల్లు శుభ్రంగా ఉంచుకోవట్లేదా? మరి మన ఊరి రోడ్ల పరిస్థితి ఎందుకు ఇలా తయారు చేస్తున్నాం?
  • శుభ్రం చేయడానికి వారెవరో ఎందుకు రావాలి?: ఇష్టమొచ్చినట్టు తిని, వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ పారేసి వెళ్లిపోతే... వెనక ఎవరో ఒకరు వచ్చి కచ్చితంగా శుభ్రం చేస్తారు అనుకోవడం మన అజ్ఞానమే అవుతుంది తప్ప, గొప్పదనం అనిపించుకోదు.

​ఇది సాధారణ గల్లీ రోడ్డు కాదు, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రాన్ని కలిపే జాతీయ రహదారి (National Highway). ఈ మార్గం గుండా నిత్యం ఎంతో మంది వీఐపీలు, సినీ ప్రముఖులు, ఇతర రాష్ట్రాల వారు ప్రయాణిస్తుంటారు. రహదారి పక్కన ఉన్న ఈ చెత్త గుట్టలను చూస్తే, మన చిలకలూరిపేటపై వారికి ఎలాంటి అభిప్రాయం కలుగుతుంది? మన ఊరిపై ఒక నెగిటివ్ భావన ఏర్పడితే, భవిష్యత్తులో ఇక్కడ ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు లేదా ఈవెంట్స్ చేయడానికి ఎవరైనా వెనకడుగు వేసే పరిస్థితి వస్తుంది. ఊరి పరువును మన చేతులతో మనమే తీసుకుంటున్నామనే సత్యం గ్రహించాలి.

​ఇక మరో ప్రధాన సమస్య రాత్రివేళల్లో కొందరు యువకులు చేస్తున్న అసాంఘిక పనులు. పోలీసులు రాత్రి పూట ఎన్నిసార్లు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నా, వారి కళ్లుగప్పి ఈ బైపాస్ రోడ్డు పక్కన మద్యం సేవిస్తూ, ఫుడ్ తింటూ గడపడం ఏదో గొప్పగా, ట్రెండ్ గా ఫీల్ అవుతున్నారు. ఒక్కసారి ఆలోచించండి... అదే సమయంలో మీ కుటుంబ సభ్యులు, ఆడవారు ఆ దారి గుండా వెళ్లాల్సి వస్తే, అక్కడ పరిస్థితులు చూసి వారు ఎంత అసౌకర్యానికి (Uncomfortable) గురవుతారో ఊహించుకోండి. తోటి పౌరుల భద్రతకు, ప్రశాంతతకు భంగం కలిగించే హక్కు ఎవరికీ లేదు.


​పరిసరాల పరిశుభ్రత అనేది మున్సిపాలిటీకి మాత్రమే సంబంధించిన పని కాదు, అది ప్రతి పౌరుడి కనీస బాధ్యత. ఆ బాధ్యతను మరచి ఇలా వ్యవహరిస్తే, ఆ చెత్త నుంచి పుట్టే అనర్థాలు రేపు మనల్నే తిరిగి కొడతాయి. ఇప్పటికైనా పౌరుల్లో మార్పు రావాలి. మన ఇంటిని ఎలా శుభ్రంగా ఉంచుకుంటామో, మన చిలకలూరిపేటను కూడా అలాగే కాపాడుకుందాం.

- మీ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్.

ఇకపై కరెంట్ బిల్లు కట్టే అవసరం లేదు - పూర్తి వివరాల కోసం ఇప్పుడే కాల్ చేయండి - +91 70135 89826 - ఆదిత్య సోలార్ - సోలార్ గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకొని ఆ తర్వాతే బిగించుకోండి.

 మరిన్ని చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి.

https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g

Share:

ఢిల్లీ ఏఐ సమ్మిట్‌లో కాంగ్రెస్ తీరుపై భగ్గుమన్న పల్నాడు: పులిగుజ్జు మహేష్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం

ఢిల్లీ ఏఐ సమ్మిట్‌లో కాంగ్రెస్ తీరుపై భగ్గుమన్న పల్నాడు: పులిగుజ్జు మహేష్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ శవయాత్ర, దిష్టిబొమ్మ దహనం


​పలానాడు : దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన 'ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్'లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన కాంగ్రెస్ కార్యకర్తలు వ్యవహరించిన తీరును నిరసిస్తూ పల్నాడు జిల్లాలో భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) ఆధ్వర్యంలో భారీ ఆందోళన కార్యక్రమం జరిగింది.

​అంతర్జాతీయ వేదికపై భారతదేశ సాంకేతిక ప్రగతిని దిగజార్చేలా కాంగ్రెస్ నేతలు వ్యవహరించారని మండిపడుతూ, నరసరావుపేటలోని పల్నాడు రోడ్‌లో బీజేవైఎం పల్నాడు జిల్లా అధ్యక్షులు పులిగుజ్జు మహేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శవయాత్ర నిర్వహించారు. అనంతరం ఆయన దిష్టిబొమ్మను దహనం చేసి తమ తీవ్ర వ్యతిరేకతను తెలియజేశారు. ఏఐ సమ్మిట్‌లో యువజన కాంగ్రెస్ కార్యకర్తలు చొక్కాలు విప్పి నిరసన తెలపడం దేశానికి తీరని అవమానమని నాయకులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

​పాల్గొన్న ముఖ్య అతిథులు మరియు నాయకులు:

ఈ నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశికుమార్, 

బిజెపి జిల్లా ఇన్చార్జి కొక్కెర శ్రీనివాస్ హాజరయ్యారు.

​వీరితో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇతర ముఖ్య నాయకులు:

జన్నాభట్ల ఆదిత్య (బిజెపి ప్రధాన కార్యదర్శి )

​గంటా విజయ భాస్కర్ రెడ్డి (బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి)

​వంకాయలపాటి వంశీ ధర్ (బీజేవైఎం రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్)

​గట్టా హేమ కుమార్ (బిజెపి జిల్లా కార్యదర్శి)

​తులాబందుల సత్యనారాయణ (బిజెపి ఎడ్లపాడు మండల అధ్యక్షులు)

​తెల్లబాటి మనోహర్ (బీజేవైఎం చిలకలూరిపేట పట్టణ అధ్యక్షులు)

​ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున బిజెపి కార్యకర్తలు, బీజేవైఎం యువత మరియు అభిమానులు పాల్గొన్నారు.

​- చిలకలూరిపేట స్పీడ్ న్యూస్

ఇకపై కరెంట్ బిల్లు కట్టే అవసరం లేదు - పూర్తి వివరాల కోసం ఇప్పుడే కాల్ చేయండి - +91 70135 89826 - ఆదిత్య సోలార్ - సోలార్ గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకొని ఆ తర్వాతే బిగించుకోండి.

 మరిన్ని చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి.

https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g

Share:

చిలకలూరిపేట 'అసిస్ట్' సంస్థకు రాష్ట్రస్థాయి బెస్ట్ NGO అవార్డు.. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పురస్కారం!

చిలకలూరిపేట 'అసిస్ట్' సంస్థకు రాష్ట్రస్థాయి బెస్ట్ NGO అవార్డు.. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పురస్కారం!
​చిలకలూరిపేట స్పీడ్ న్యూస్:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర' కార్యక్రమంలో పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన ప్రముఖ స్వచ్ఛంద సంస్థ 'అసిస్ట్' సత్తా చాటింది. గ్రామీణ అభివృద్ధి, పారిశుధ్యం, పర్యావరణ పరిరక్షణలో సంస్థ ప్రదర్శించిన నిబద్ధతకు గాను రాష్ట్రస్థాయిలో 'బెస్ట్ NGO' అవార్డు వరించింది.
​రాజధానిలో జరిగిన అధికారిక కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అసిస్ట్ సంస్థ అస్సోసియేట్ డైరెక్టర్ కృష్ణ హరీష్ ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకున్నారు.

​వార్తలోని ముఖ్యాంశాలు (స్పీడ్ హైలైట్స్):
​సేవలకు గుర్తింపు: పల్నాడు జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛాంధ్ర పిలుపు మేరకు అనేక అవగాహన సదస్సులు, పారిశుధ్య పనులు, సామాజిక సేవా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించినందుకు ఈ అవార్డు దక్కింది.

​సీఎం ప్రశంసలు: అవార్డు ప్రదానం చేసిన అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం ఎంతో కీలకమని అసిస్ట్ సంస్థను కొనియాడారు.
​బాధ్యత మరింత పెరిగింది: తమ సేవలను గుర్తించిన ప్రభుత్వానికి, జిల్లా యంత్రాంగానికి అస్సోసియేట్ డైరెక్టర్ కృష్ణ హరీష్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డు తమపై బాధ్యతను మరింత పెంచిందని, భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలతో జిల్లా అభివృద్ధికి తోడ్పడతామని ఆయన స్పష్టం చేశారు.
​కృష్ణ హరీష్ గారి నాయకత్వంలో క్షేత్రస్థాయిలో అసిస్ట్ సంస్థ చేస్తున్న కృషికి ఈ రాష్ట్రస్థాయి అవార్డు దక్కడం పట్ల పల్నాడు జిల్లా వాసులు, తోటి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇకపై కరెంట్ బిల్లు కట్టే అవసరం లేదు - పూర్తి వివరాల కోసం ఇప్పుడే కాల్ చేయండి - +91 70135 89826 - ఆదిత్య సోలార్ - సోలార్ గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకొని ఆ తర్వాతే బిగించుకోండి.
 మరిన్ని చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి.
Share:

చిలకలూరిపేట - యడ్లపాడు హైవేపై ఘోర ప్రమాదం.. వంతెన పైనుంచి అమాంతం వాగులోకి దూసుకెళ్లిన కారు!

చిలకలూరిపేట - యడ్లపాడు హైవేపై ఘోర ప్రమాదం.. వంతెన పైనుంచి అమాంతం వాగులోకి దూసుకెళ్లిన కారు!


⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ - ఎక్స్ క్లూజివ్

​పల్నాడు జిల్లా యడ్లపాడు సమీపంలోని జాతీయ రహదారిపై గురువారం ఉదయం పెను ప్రమాదం చోటుచేసుకుంది. సినిమాలను తలపించేలా జరిగిన ఈ సంఘటన స్థానికులను, వాహనదారులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. అతివేగం, అదుపుతప్పిన వాహనం.. వెరసి క్షణాల్లోనే జాతీయ రహదారిపై బీభత్సం సృష్టించింది.

​🛑 అసలేం జరిగిందంటే?

బెంగళూరు నుండి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వైపు అత్యంత వేగంతో వెళ్తున్న ఓ కారు, యడ్లపాడు హైవే బ్రిడ్జి సమీపంలోకి రాగానే ఒక్కసారిగా అదుపు తప్పింది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఆ కారు అమాంతం ముందు వెళ్తున్న ఆటోను మరియు ఒక బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఆ వేగానికి కారు గాలిలోకి లేచినంత పనై.. హైవే వంతెన రక్షణ గోడను బద్దలుకొట్టుకుంటూ, నేరుగా కింద ఉన్న వాగులోకి దూసుకెళ్లింది.

​🚑 తండ్రీకొడుకులకు తీవ్ర గాయాలు:

ప్రమాద సమయంలో కారులో ప్రయాణిస్తున్న తండ్రి మరియు అతని పదేళ్ల కుమారుడు కారులోనే చిక్కుకుపోయారు. బ్రిడ్జి పైనుంచి కింద పడటంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. అదృష్టవశాత్తు ప్రాణాపాయం తప్పినట్లు తెలుస్తోంది. ఇక కారు ఢీకొన్న ధాటికి ఆటో మరియు బైక్‌పై ఉన్న మరో ఇద్దరు వ్యక్తులు కూడా రోడ్డుపై ఎగిరిపడి గాయాలపాలయ్యారు.

​🚓 క్షతగాత్రులు ఆసుపత్రికి తరలింపు:

భారి శబ్దంతో జరిగిన ఈ ప్రమాదాన్ని చూసిన స్థానికులు, తోటి వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న యడ్లపాడు పోలీసులు, స్థానికుల సహాయంతో క్షతగాత్రులను బయటకు తీసి 108 వాహనంలో గుంటూరు సమీపంలోని కాటూరి మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి అత్యవసర చికిత్స కొనసాగుతోంది.

​⚠️ పోలీసుల హెచ్చరిక:

హైవేపై మితిమీరిన వేగం ప్రమాదాలకు కారణమవుతోందని, వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాద ధాటికి హైవేపై కాసేపు ట్రాఫిక్ స్తంభించగా, పోలీసులు వెంటనే క్లియర్ చేశారు.

​📢 మరిన్ని తాజా వార్తల కోసం ఫాలో అవ్వండి - చిలకలూరిపేట


ఇకపై కరెంట్ బిల్లు కట్టే అవసరం లేదు - పూర్తి వివరాల కోసం ఇప్పుడే కాల్ చేయండి - +91 70135 89826 - ఆదిత్య సోలార్ - సోలార్ గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకొని ఆ తర్వాతే బిగించుకోండి.

 మరిన్ని చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి.

https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g

Share:

చిలకలూరిపేట ​అర్ధరాత్రి వేళ.. ఆకలి కేకల మధ్య అక్షయపాత్ర!

చిలకలూరిపేట ​అర్ధరాత్రి వేళ.. ఆకలి కేకల మధ్య అక్షయపాత్ర!

కోటప్పకొండ తిరునాళ్లలో మానవత్వం చాటుకున్న తోట భరత్ ని కాంప్లెక్స్ వ్యాపారస్తులు!

​చిలకలూరిపేట (స్పీడ్ న్యూస్): దక్షిణ కాశీగా పేరొందిన కోటప్పకొండ త్రికోటేశ్వరుడి సన్నిధి నిన్న జనసంద్రమైంది. సుమారు 20 లక్షల మంది భక్తులు, 200లకు పైగా విద్యుత్ ప్రభల కాంతుల నడుమ శివనామస్మరణతో కొండ కోనలు మారుమోగిపోయాయి. భక్తుల ఆకలి తీర్చేందుకు స్వచ్ఛంద సంస్థలు, బ్యాంకులు, కుల సంఘాలు భారీగా అన్నదానాలు నిర్వహించినప్పటికీ... అర్ధరాత్రి దాటాక తిరుగు ప్రయాణమయ్యే భక్తుల కష్టాలు మాత్రం వర్ణనాతీతం. ఆ సమయంలో ఆపన్నహస్తం అందించి తోట భరత్ ని కాంప్లెక్స్ వ్యాపారస్తులు నిజమైన 'శివ సేవ'ను చాటుకున్నారు.

​అర్ధరాత్రి వేళ.. ఆకలి కేకల మధ్య అక్షయపాత్ర!
​సాధారణంగా తిరునాళ్లలో పగలు మరియు సాయంత్రం వేళల్లో అన్నదానాలు పుష్కలంగా దొరుకుతాయి. కానీ, అసలైన పరీక్ష అర్ధరాత్రి తర్వాతే మొదలవుతుంది.

​స్తంభించిపోయిన ప్రయాణం: ప్రభల మధ్య లక్షలాది మంది భక్తులు ఒకరినొకరు నెట్టుకుంటూ, ప్రతి ప్రభ వద్ద ఆగుతూ ముందుకు కదలడమే గగనమైపోయింది.

​అలసిపోయిన భక్తులు: తెల్లవారుజామున 3 గంటల నుండి 6 గంటల మధ్య తిరుగు ప్రయాణమయ్యే భక్తులకు కనీసం మంచినీరు కూడా దొరకని పరిస్థితి.

​ముగిసిన అన్నదానాలు: పట్టణంలోని దాదాపు అన్ని అన్నదాన కేంద్రాలు అప్పటికే మూతపడటంతో, పసిపిల్లలు, వృద్ధులు ఆకలితో అలమటించారు.

​మహాప్రసాదంగా మారిన 'అన్నదానం'
​ఈ క్లిష్ట పరిస్థితిని గమనించిన చిలకలూరిపేట నరసరావుపేట సెంటర్‌లోని తోట భరత్ ని కాంప్లెక్స్ వ్యాపారస్తులు సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. తెల్లవారుజామున భక్తుల ఆకలిని తీర్చేందుకు భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు.

​"ముక్కంటిని దర్శించుకుని తిరుగు ప్రయాణమైన భక్తులకు, ఈ తెల్లవారుజామున దొరికిన భోజనం సాక్షాత్తూ ఆ పరమశివుడే పంపిన మహాప్రసాదంలా అనిపించింది." - అని పలువురు భక్తులు కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా కృతజ్ఞతలు తెలిపారు.

​భేదభావం లేని సేవ
​చిన్న-పెద్ద, ఉన్నవాడు-లేనివాడు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ గౌరవంగా భోజనం వడ్డించారు. తోట భరత్ ని కాంప్లెక్స్ షాపు యజమానులు, సిబ్బంది అంతా ఏకమై చేసిన ఈ కృషిపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. అటు ట్రాఫిక్ ఇబ్బందులు, ఇటు ఆకలితో సతమతమవుతున్న వారికి ఈ అన్నదానం ఒక గొప్ప ఊరటనిచ్చింది.

​ముగింపు:
వ్యాపారమే ధ్యేయం కాకుండా, సాటి మనిషి కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోవడమే నిజమైన భక్తి అని నిరూపించిన తోట భరత్ ని కాంప్లెక్స్ వ్యాపారస్తులకు 'చిలకలూరిపేట స్పీడ్ న్యూస్' తరపున అభినందనలు.

ఇకపై కరెంట్ బిల్లు కట్టే అవసరం లేదు - పూర్తి వివరాల కోసం ఇప్పుడే కాల్ చేయండి - +91 70135 89826 - ఆదిత్య సోలార్ - సోలార్ గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకొని ఆ తర్వాతే బిగించుకోండి.

 మరిన్ని చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి.



Share:

​కోటప్పకొండలో అపశ్రుతులు - విషాదం.. ఉద్రిక్తత.. ప్రమాదం: తిరునాళ్లలో కలకలం రేపిన మూడు ఘటనలు ఇవే!

​కోటప్పకొండలో అపశ్రుతులు - విషాదం.. ఉద్రిక్తత.. ప్రమాదం: తిరునాళ్లలో కలకలం రేపిన మూడు ఘటనలు ఇవే!


చిలకలూరిపేట స్పీడ్ న్యూస్:

మహాశివరాత్రి పర్వదినం నాడు 'హరహర మహాదేవ' శంభో శంకర నామస్మరణతో కోటప్పకొండ మార్మోగింది. అయితే, ఈ ఆధ్యాత్మిక శోభ నడుమ ఊహించని విషాద ఘటనలు భక్తులను కలచివేసాయి. ఆనందంగా మొక్కులు తీర్చుకుందామని వచ్చిన వారి ఇళ్లలో ఈ ఘటనలు తీరని విషాదాన్ని నింపాయి.

​ప్రధానంగా, స్నానమాచరించేందుకు వెళ్లిన ఓ యువకుడిని మృత్యువు నీటి రూపంలో కబళించింది. ప్రకాశం జిల్లా కందుకూరు మండలం, సింగమనేనిపల్లికి చెందిన ఐదుగురు యువకులు మొక్కులు తీర్చుకునేందుకు రాగా.. మార్గమధ్యంలో నరసరావుపేట మండలం, పెట్లూరివారిపాలెం వద్ద ఉన్న చిలకలూరిపేట మేజర్ కాలువలో స్నానానికి దిగారు. ఈ క్రమంలో రోహిత్ (21) అనే యువకుడు నీటి ప్రవాహ ఉధృతికి కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతుండగా, యువకుడి కుటుంబంలో విషాదం నెలకొంది.

​మరోవైపు, కొండపై భక్తుల రద్దీ అనూహ్యంగా పెరగడంతో మెట్ల మార్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గుడవల్లి గ్రామానికి చెందిన 10 ఏళ్ల చిన్నారి నందిని, 700వ మెట్టు వద్ద రద్దీ తాకిడికి ఊపిరాడక అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. మెట్ల మార్గం మధ్యలో ఉండటంతో పాపను వెంటనే తరలించడం కష్టసాధ్యంగా మారింది. పాప పరిస్థితి విషమంగా ఉందని తెలియడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. అయితే, పోలీసులు సమయస్ఫూర్తితో వ్యవహరించి ఎట్టకేలకు పాపను కిందకు చేర్చి 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు.

​ఇదిలా ఉండగా, తిరుగు ప్రయాణంలో మద్దిరాల విద్యుత్ ప్రభ ఒక్కసారిగా అదుపుతప్పి ఒరిగిపోవడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. అయితే అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి హాని జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నిర్వాహకులు వెంటనే స్పందించి ప్రభను సరిచేసే ప్రయత్నం చేశారు. ఈ వరుస ఘటనలు శివరాత్రి సంబరాల్లో కొంతమేర విషాదాన్ని నింపాయి.

  ఇకపై కరెంట్ బిల్లు కట్టే అవసరం లేదు - పూర్తి వివరాల కోసం ఇప్పుడే కాల్ చేయండి - +91 70135 89826 - ఆదిత్య సోలార్ - సోలార్ గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకొని ఆ తర్వాతే బిగించుకోండి.

 మరిన్ని చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి.

https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g

Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.
📸
మీ వార్తలను మాతో పంచుకోవడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి