మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

Advertisement - 2

Image3

........

Advertisement - 3

Image3

........

ప్రకటనల కోసం 90358 80349 నెంబర్ కు సంప్రదించండి.
|

⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!

చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.

💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి

చిలకలూరిపేట: జాతీయ రహదారిపై కారును ఢీకొన్న లారీ - తృటిలో తప్పిన ప్రమాదం

చిలకలూరిపేట: జాతీయ రహదారిపై కారును ఢీకొన్న లారీ -  తృటిలో తప్పిన ప్రమాదం

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట మండల పరిధిలోని బొప్పూడి ఆంజనేయ స్వామి గుడి వద్ద జాతీయ రహదారిపై కారును ఢీకొన్న లారీ.. వివరాల్లోకి వెళ్తే  తెలంగాణ రాష్ట్రం ఖమ్మం నుండి తిరుపతి బయలుదేరిన కుటుంబం బొప్పూడి ఆంజనేయ స్వామి గుడి వద్ద జాతీయ రహదారి పైన ఉన్న స్పీడ్ రిసిస్టర్స్ వద్ద కారును స్లో చేయగా, వెనక నుండి వచ్చిన లారీ కారును ఢీ కొనడంతో కారు డివైడర్ పై ఉన్న కరెంటు స్తంభాన్ని ఢీకొన్నది. ఈ ఘటనలో కారు వెనుక భాగంతో పాటు ముందు భాగం కూడా ధ్వంసం అవ్వగా లోపలున్న ప్రయాణికులకు ప్రాణాలతో బయటపడ్డారు. కారు వేగం తగ్గడంతో ప్రమాద స్థాయి తక్కువగా ఉన్నదని స్థానికులు చెబుతున్నారు.



Share:

కుప్పంలో కుప్పకూలిన టిడిపి - చంద్రబాబు కంచుకోటపై వైసీపీ జెండా

కుప్పంలో కుప్పకూలిన టిడిపి - చంద్రబాబు కంచుకోటపై వైసీపీ జెండా

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చంద్రబాబు నాయుడు కంచుకోట అయిన కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో వైసిపి తన హవా కొనసాగించింది. ఎలక్షన్ మొదలైనప్పటి నుండి చివరి వరకు అందరి దృష్టి కుప్పం మున్సిపాలిటీ పై ఉన్నది. అందరి అంచనాలను తారుమారు చేస్తూ కుప్పం కోటపై వైసీపీ జెండా ఎగరవేశాయి అక్కడి వైసీపీ శ్రేణులు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పం ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకున్నారు. అందుకు తగ్గట్టుగానే ఇప్పటివరకు మొత్తం 24 వార్డుల గాను ఒక వార్డు ఏకగ్రీవం అవగా 12 వార్డులలో వైసిపి అభ్యర్థులు గెలిచారు. దీంతో ఇప్పటివరకు వైసిపి 13 అభ్యర్థులను గెలిచి మున్సిపాలిటీని కైవసం చేసుకున్నది. 2 టిడిపి అభ్యర్థులు గెలిచి ఉన్నారు. మిగిలిన వార్డుల్లో టిడిపి ఆదిక్యత చూపిస్తుంది.



Share:

ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలపడానికి కూడా వీలులేదా? - TNSF విద్యార్థి సంఘాలు.

ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలపడానికి కూడా వీలులేదా? - TNSF విద్యార్థి సంఘాలు.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలలను రాష్ట్రంలో శాశ్వతంగా లేకుండా చేయడానికి జారీ చేసిన జీవో నెం.50,51 నిరసిస్తూ గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు రోడ్డెక్కి ఉద్యమిస్తున్నప్పటికీ,రాష్ట్ర ప్రభుత్వం మొండిగా ఏకపక్ష ధోరణితో  ఎయిడెడ్ పాఠశాలల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రంలో అన్ని జిల్లాల కలెక్టరేట్ ల వద్ద శాంతియుతంగా నిరసన తెలియజేయు కార్యక్రమాన్ని తలపెడితే, అప్రజాస్వామికంగా విద్యార్థి సంఘాల నేతలను కనీసం శాంతియుతంగా నిరసన తెలపడానికి కూడా అనుమతించకుండా నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని,  ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాల భూములను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. రాష్ట్రాని నడపడానికి అప్పులు  దొరకని తరుణంలో ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాల భూముల్ని స్వాధీనం చేసుకుని వాటితో అప్పులు తెచ్చుకోవాలని చూడండం దారుణం అన్నారు. నాడు అమ్మఒడి ఇస్తామని అధికారంలోకి వచ్చి  నేడు అమ్మకానికి బడిని పెట్టడం సిగ్గుచేటు అన్నారు. ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాల భూములు స్వాధీనం చేసుకోవాలని తీసుకువచ్చిన జీవో నెం.50, 51లను రద్దు చేయకపోతే  విద్యార్థులుతో మరియు యువజన సంఘలుతో  కలిసి ఈ నెల 18న అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చెప్పడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో  రాష్ట్ర TNSF కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ జాకీర్ హుస్సేన్, గుంటూరు పార్లమెంట్ TNSF అధ్యక్షులు మన్నవ వంశీకృష్ణ, నరసరావుపేట పార్లమెంట్ TNSF అధ్యక్షులు కూరపాటి హనుమంతరావు మరియు పలు TNSF విద్యార్థి సంఘాలు పాల్గొనడం తదితరులు జరిగింది.



Share:

చిలకలూరిపేట టౌన్:- ప్లాస్టిక్ వ్యర్థాలను తిని మూడున్నర లక్షల విలువైన 35 గొర్రెల మృతి

చిలకలూరిపేట టౌన్:- ప్లాస్టిక్ వ్యర్థాలను తిని మూడున్నర లక్షల విలువైన 35 గొర్రెల మృతి

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట పట్టణంలోని స్థానిక జాలయ్య కాలనీకి చెందిన ఐదు కుటుంబాలు గొర్రెలను కాస్తూ జీవనం సాగిస్తుంటారు. ఉన్నట్టుండి ఈరోజు ఉదయాన్నే 35 గొర్రెలు ఎక్కడికక్కడ విగత జీవులై పడి ఉండటంతో వారు ఒక్కసారిగా ఖంగు తిన్నారు. మరో 10 గొర్రెలు అస్వస్థతతో ఉండటంతో గమనించిన యజమానులు హుటా హుటిన వెటర్నరీ హాస్పటల్ కు తరలించారు. సమాచారం అందుకున్న మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని వైద్యశాలకు చేరుకొని పరిస్థితిని తెలుసుకున్నారు. డాక్టర్ చెప్పిన సమాచారం మేరకు గొర్రెలు ప్లాస్టిక్ కవర్లను, ఇతర కలుషిత పదార్థాలను తినడం వల్ల మరణించాయని ఆయన తెలిపారు. చనిపోయిన 35 గొర్రెలు విలువ సుమారు మూడున్నర లక్షలు ఉంటుందని అంచనా ! అస్వస్థతతో ఉన్న 10 గొర్రెలను ప్రాణాలతో కాపాడాలని షేక్ రఫాని వెటర్నరీ వైద్యులకు తెలిపారు.



Share:

మర్రికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదని మనస్థాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం - పరామర్శించిన మర్రి

మర్రికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదని మనస్థాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం - పరామర్శించిన మర్రి

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట: పార్టీ అధికారములో లేకపోయినా అహర్నిశలు కష్టపడి పార్టీ అభ్యున్నతికి కృషిచేసి పదవి కాంక్ష లేకుండా ఎమ్మెల్యే టికెట్టు వదులుకున్న మర్రి రాజశేఖర్ కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదని అభిమాని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం. వివరాల్లోకి వెళ్తే చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని వేలూరు గ్రామానికి చెందిన దేవరకొండ గోపి(30) అనే యువకుడు మర్రి రాజశేఖర్ కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదని తీవ్ర మనస్తాపంతో శనివారం నాడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న బంధువులు హుటాహుటిన యువకుడిని చిలకలూరిపేట లోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న మర్రి రాజశేఖర్ హాస్పటల్ కు చేరుకొని ఘటనకు పాల్పడిన వ్యక్తిని పరామర్శించారు.



Share:

మర్రి రాజశేఖర్ విషయంలో ముఖ్యమంత్రి జగన్ మాట తప్పారు!మడమ తిప్పారు! - రావు సుబ్రహ్మణ్యం,నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు.

మర్రి రాజశేఖర్ విషయంలో ముఖ్యమంత్రి జగన్ మాట తప్పారు!మడమ తిప్పారు! - రావు సుబ్రహ్మణ్యం,నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలకు బహిరంగ సభలో మర్రి రాజశేఖర్ కు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తానని జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటను తప్పారని, జగన్మోహన్ రెడ్డి మాట తప్పడు మడమ తిప్పడు అనే ప్రచారంలో ఎంతమాత్రం వాస్తవం లేదని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం అన్నారు.అమరావతి రాజధానిగా ఉండాల్సిందే అని మాట తప్పడంతో పాటు అనేక అంశాల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవగానే మాటతప్పారని,ఉద్యోగుల సీపీఎస్ రద్దు వారం రోజుల్లో చేస్తానని నమ్మబలికి ఉద్యోగులకు మొండి చెయ్యి ఇచ్చిన ఘనత సాధించారని రావు సుబ్రహ్మణ్యం తెలిపారు. చిలకలూరిపేట నియోజకవర్గ వైస్సార్సీపీ సీటు వదులుకుంటే ఎమ్మెల్సీ ఇచ్చి మర్రి రాజశేఖర్ ను మంత్రిగా చేస్తానని చిలకలూరిపేట నడిబొడ్డున నిలబడి హామీ ఇచ్చిన జగన్ మర్రి రాజశేఖర్ కమ్మ కులస్తుడు కావడంతో కమ్మకులాన్ని అనగదొక్కాలనే ఆయనకు చివరిరోజు వరకూ వేచి చూసేలా చేసి ఎమ్మెల్సీ ఇవ్వకుండా ప్రక్కన పెట్టారని,ఇది చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో ప్రజలను, ఆయన అభిమానులను మోసం చేయడమే అని రావు సుబ్రహ్మణ్యం అన్నారు.వైస్సార్సీపీలో పదవులకు సంబంధించిన విషయంగా ఈ అంశాన్ని చూడలేమని ఎమ్మెల్సీ,మంత్రి పదవి రాజ్యాంగ బద్ధమైన వి కనుక చిలకలూరిపేట కు రావాలనే ప్రజల ఆకాంక్ష ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నీరుగార్చడం వైస్సార్సీపీ పార్టీకి నష్టం కలిగించే విషయం అని మర్రి రాజశేఖర్ అభిమానులు మరోసారి మోసపోయిన విషయాన్ని గ్రహించి చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో,గుంటూరు జిల్లాలో వైస్సార్సీపీ ని పునాదులు పెకళించి వేస్తారని రావు సుబ్రహ్మణ్యం తెలిపారు.నియోజకవర్గ పరిధిలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వైస్సార్ కాంగ్రెస్ పాలన ఈ సంఘటనతో  అంతిమ క్షణాలు లెక్కించడం మొదలు అయిందని అన్నారు.పొన్నూరు నియోజకవర్గ పరిధిలో రావి వెంకటరమణ నుఇదే తరహాలో ఎమ్మెల్సీ ఇస్తామని జగన్మోహన్ రెడ్డి మోసం చేసిన విషయం ఈసందర్భంగా గుర్తు చేశారు.



Share:

ఎయిడెడ్ విద్యాసంస్థల నిర్వహణపై ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం - చిలకలూరిపేట విద్యార్థి జేఏసీ

ఎయిడెడ్ విద్యాసంస్థల నిర్వహణపై ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం - చిలకలూరిపేట విద్యార్థి జేఏసీ

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట: రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన ఎయిడెడ్ విద్యాసంస్థల నిర్వహణపై శుక్రవారం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నాలుగు ఆప్షన్ల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చిలకలూరిపేట విద్యార్థి జేఏసీ అధ్యక్ష , ఉపాధ్యక్షులు ఉప్పుతెల్ల. సిద్దు , మేకపోతుల నాగేశ్వరరావు లు తెలిపారు. అదేవిధంగా నవంబర్ 15వ తేదీన స్థానిక తాసిల్దార్ కార్యాలయం వద్ద నిర్వహించనున్న నిరసన కార్యక్రమాన్ని ఎన్నికల కోడ్ డిసెంబర్ 10 వరకు అమలులో ఉన్నందున విరమించుకోవడం జరుగుతుందని తెలిపారు. భవిష్యత్తులో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఐక్య కార్యాచరణ, అవగాహన సదస్సులు నిర్వహిస్తామని నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి జేఏసీ నాయకులు బొంతా భగత్ సింగ్ ,బి.సాయి నాయక్ , మాదాసు పృథ్వీరాజ్, ఎమ్.ఫణి, పి.మహేష్ ,జగదీష్ తదితరులు ఉన్నారు.



Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.
📸
మీ వార్తలను మాతో పంచుకోవడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి