|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండిచిలకలూరిపేట మండల గ్రామాలో - నిషేదిత గుట్కా,ఖైనీ అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్
చిలకలూరిపేట మండల గ్రామాలో - నిషేదిత గుట్కా,ఖైనీ అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్
చిలకలూరిపేట పసుమర్రు గ్రామంలో నిషేదిత గుట్కా,ఖైనీ అమ్ముతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసారు.చిలకలూరిపేట రురల్ SI భాస్కర్ కి వచ్చిన సమాచారంతో గ్రామంలో తనిఖీ చెయ్యగా గ్రామా శివారులలో అక్రమంగా అమ్ముతూ పట్టుబడ్డాడు. గ్రామంలో వచ్చిన సమాచారం మేరకు ఈ షేక్ బాషా అనే వ్యక్తి చాలా కాలంగా ఈ వ్యాపారం చేస్తున్నట్లు తెలిపారు. పట్టుబడిన సరుకు విలువ సుమారు 8500 వరకు ఉంటుంది అని తెలిపారు.ఇలాంటి నిషేదిత గుట్కా అమ్మీనా , కొనిన వారి పైన కూడా కఠిన చర్యలు తప్పవు అని తెలిపారు.
చిలకలూరిపేటలో అక్రమ మద్యం గుట్టు రట్టు - ఇద్దరు అరెస్ట్
చిలకలూరిపేటలో అక్రమ మద్యం గుట్టు రట్టు - ఇద్దరు అరెస్ట్
చిలకలూరిపేట పట్టణంలో ఇతర రాష్ట్రాల మద్యం అమ్ముతున్న వ్యక్తులను అరెస్ట్ చేసారు. అర్బన్ సీఐ బిలాలుద్దీన్ కి వచ్చిన సమాచారం మేరకు SI అజయ్ బాబు నిర్వహించిన దాడిలో రామకృష్ణ, పవన్ సాయి అనే వ్యక్తుల నుండి 70 వేలరూపాయల విలువ గల తెలంగాణకు చెందిన మద్యాన్ని అక్రమంగా అమ్ముతున్నారు. అందులో 35 ఫుల్ బాటిల్స్, 141 క్వాటర్ బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇతర రాష్ట్రాల,లోకల్ మద్యం అయినా అక్రమంగా అమ్ముతూ పట్టుబడితే వారిపైన కఠిన చర్యలు తప్పవు అని తెలిపారు.
చిలకలూరిపేట నియోజకవర్గ యడ్లపాడు, నాదెండ్ల మండల గ్రామాలలో 12-06-2021, శనివారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు
చిలకలూరిపేట నియోజకవర్గ యడ్లపాడు, నాదెండ్ల మండల గ్రామాలలో 12-06-2021, శనివారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు
చిలకలూరిపేట నియోజకవర్గ యడ్లపాడు , నాదెండ్ల మండల గ్రామాలలో మొత్తం 17 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు
యడ్లపాడు మండలంలో 2 కరోనా కేసులు నమోదు అయ్యాయి
తిమ్మాపురం గ్రామంలో - 2
నాదెండ్ల మండలంలో 19 కరోనా కేసులు నమోదు అయ్యాయి.
నాదెండ్ల గ్రామంలో - 2
చంద్రవరం గ్రామంలో - 1
ఇర్లపాడు గ్రామంలో - 1
కనపర్రు గ్రామంలో - 2
గణపవరం గ్రామంలో - 6
సాతులూరు గ్రామంలో - 7 గా నమోదు అయ్యాయి
చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 12-06-2021,శనివారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు
చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 12-06-2021,శనివారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు
చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 12-06-2021,శనివారం నాడు మొత్తం 12 కేసులు నమోదు అయ్యాయి.
చిలకలూరిపేట పట్టణంలో 3 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు
పండరీపురం లో - 3 గా నమోదు అయ్యాయి.
చిలకలూరిపేట మండల గ్రామాలలో 9 కేసులు నమోదు అయ్యాయి వాటా వివరాలు
కట్టుబడివారిపాలెం గ్రామంలో - 1
గోవిందపురం గ్రామంలో - 1
లింగంగుంట్ల గ్రామంలో - 1
పసుమర్రు గ్రామంలో - 4
వేలూరు గ్రామంలో - 2 గా నమోదు అయ్యాయి
చిలకలూరిపేట - నిరుపేదల జేబులుకొడుతున్న ఆధార్ సెంటర్ - ఆందోళన వ్యక్తం చేస్తున్న బాధితులు
చిలకలూరిపేట - నిరుపేదల జేబులుకొడుతున్న ఆధార్ సెంటర్ - ఆందోళన వ్యక్తం చేస్తున్న బాధితులు
చిలకలూరిపేట - కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల పధకాలు అందాలి అంటే మొబైల్ నెంబర్ కి ఆధార్ లింక్ చేసి ఉండాలి అని పేద ప్రజలు ఆధార్ వెరిఫికేషన్ సెంటర్లకు వెళ్తే అక్కడ సిబ్బంది తీరుపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.చిలకలూరిపేట పట్టణంలోని RVSCVS హైస్కూల్ ముందు ఉన్న ఏపీ ఆన్లైన్ సెంటర్ నందు సిబ్బంది ఆధార్ రీవెరిఫికేషన్ కోసం వచ్చిన నిరుపేదల వద్ద నుండి ఎక్కువ డబ్బులు వసూళ్లు చేస్తున్నట్లు బయటపడింది. ఆధార్ కార్డులోని మార్పుల కోసం 50 రూపాయలు చెలించవలసి ఉంది. కానీ సదరు సిబ్బంది పేద ప్రజల నుండి 200 రూపాయలు వసూళ్లు పాల్పడుతున్నారు అని అక్కడికి వచ్చిన బాధితులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. 200 ఇవ్వకపోతే రెండు రోజులు ఆగాక రావాలి అని చెపుతున్నారు అని బాధితులు వాపోయ్యరు. అదేంటి అని గట్టిగ ప్రశ్నించినందుకు సర్వర్ పని చెయ్యటం లేదు అని చెప్పి మధ్యాహ్నం 1:30 నిమిషాలకల్లా షాప్ మూసి వెళ్లిపోయారు. పొద్దున్నే 7 గంటలకు వచ్చాము అని తమది చుట్టుపక్కగా గ్రామాలు అని పొద్దున నుండి తిండి తిప్పలు లేకుండా లైన్లో వేచి ఉంటే ఇప్పుడు ఆన్లైన్ పని చెయ్యటం లేదు అని చెప్పి షాపు మూసివేశారు అని తెలిపారు.
చిలకలూరిపేట - తవ్వే కొద్దీ పుట్టలు పుట్టలుగా బయటపడుతున్న గుట్కా నిల్వలు - మరో 3 లక్షల నిషేదిత గుట్కా సీజ్
చిలకలూరిపేట - తవ్వే కొద్దీ పుట్టలు పుట్టలుగా బయటపడుతున్న గుట్కా నిల్వలు - మరో 3 లక్షల నిషేదిత గుట్కా సీజ్
చిలకలూరిపేట పట్టణంలో మద్ది మల్లయ్య వీధిలో 11 లక్షల సరుకు పట్టుకున్న పోలీసు వారు గంట వ్యవధిలోనే మరో గోడోన్లో మరో 3 లక్షల సరుకు సీజ్ చేసారు. పట్టణంలోని MRO ఆఫీస్ వెనుక బజార్లోని యూనియన్ బ్యాంకు బిల్డింగ్ నందు ఈ సరుకుని గుర్తించటం జరిగింది. సీఐ బిలాలుద్దీ, SI అజయ్ బాబు మరియు పోలిస్ర్ సిబ్బంది ఈ సోదాలలో పాల్గొన్నారు. యూనియన్ బ్యాంకు బిల్డింగ్ ఓనరే ఈ నిల్వలను ధాచినట్లు DSP విజయ్ భాస్కర్ తెలిపారు. ఇంకా సోదాలు కొనసాగుతాయి అని ఎవ్వరిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని తెలియజేసారు.
చిలకలూరిపేటలో గుట్కా అమ్మే వారిపైన వరుస దాడులు - తాజాగా 11 లక్షల సరుకు సీజ్
చిలకలూరిపేటలో గుట్కా అమ్మే వారిపైన వరుస దాడులు - తాజాగా 11 లక్షల సరుకు సీజ్
చిలకలూరిపేట పట్టణంలో గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న దాడులతో గుట్కా అమ్మే వారికీ గుండెలో రైళ్లు పరిగెట్టిస్తున్నారు పట్టణ పోలీసులు. తాజాగా మద్ది మల్లయ్య వీధిలోని ఒక గోడోన్లో నిర్వహించిన సోదాలలో 11 లక్షల నిషేదిత గుట్కా స్వాధీనం చేసుకున్నారు. అలాగే కోటి రాజు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. జిల్లా SP విశాల్ గున్ని ఆదేశాలతో సీఐ బిలాలుద్దీన్ గారి ఆధ్వర్యంలో ఈ సోదాలు నిర్వహించారు. డీఎస్పీ విజయభాస్కర్ గారు సీజ్ చేసిన సరుకుని పరిశీలించి ఇంకా పట్టణంలో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు చేసే వారిని వదిలేది లేదు అని వారి పైన ఖఠినమైన చర్యలు తీసుకొంటాం అని తెలిపారు.











