మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

Advertisement - 2

Image3

........

Advertisement - 3

Image3

........

ప్రకటనల కోసం 90358 80349 నెంబర్ కు సంప్రదించండి.
|

⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!

చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.

💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి

చిలకలూరిపేటలో గత వారం రోజులగా మున్సిపాలిటీ నీరు రంగు మార్పు

చిలకలూరిపేటలో గత వారం రోజులగా మున్సిపాలిటీ నీరు రంగు మార్పు

https://chilakaluripetspeednews.blogspot.com/


పట్టణంలో కొన్ని రోజులగా  మునిసిపాలిటీ ద్వారా అందించే మంచి నీరు రంగు మారుతూ వస్తున్నాయి. దీనిపైనా ఇప్పటికే మునిసిపల్ కమీషనర్ రవీంధ్ర గారు వివరణ ఇచ్చారు. అధికంగా ఫ్లోరిన్ , బ్లీచింగ్ కలపటం వలన రంగు మారుతోంది అని చెప్పారు. కానీ వివరణ ఇచ్చి నాలుగురోజులు అయినా ఇప్పటికి నీరు అలాగే వస్తున్నాయి. దీనికి త్వరగా పరిష్కారం ఆలోచించాలి అని పట్టణ ప్రజలు కోరుతున్నారు. అసలే ఒక వైపు కరోనా భయం మరొకపక్క ఈ నీరు తాగితే కలరా లాంటి వ్యాధుల బారిన పడతామేమో అని భయపడుతున్నారు పుర ప్రజలు.  








Share:

జిల్లాలో భారీగా పెరిగిన కేసులు--- అత్యధికంగా గుంటూరు జిల్లాలో అత్యల్పంగా పశ్చిమ గోదావరి

జిల్లాలో  భారీగా పెరిగిన కేసులు--- అత్యధికంగా గుంటూరు జిల్లాలో అత్యల్పంగా పశ్చిమ గోదావరి


https://chilakaluripetspeednews.blogspot.com/

గడిచిన 24గంటలలో రాష్ట్రంలో 31,268 మందిని పరీక్షించగా వారిలో 2558 కేసులు నమోదు అయ్యాయి, అతధికంగా గుంటూరు జిల్లాలో 465, అత్యల్పముగా పశ్చిమ గోదావరి జిల్లా 37 కేసులు నమోదు అయ్యాయి. ఆరుగురు మృతి చెందారు. 








Share:

చిలకలూరిపేట పట్టణంలోని ప్రముఖ రెస్టారెంట్లు, బేకరీలో ఆకస్మిక తనిఖీలు --- మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్

 చిలకలూరిపేట పట్టణంలోని ప్రముఖ రెస్టారెంట్లు, బేకరీలో ఆకస్మిక తనిఖీలు --- మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్

https://chilakaluripetspeednews.blogspot.com/

గుంటూరు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పట్టణంలోని పలు బేకరీలు,రెస్టారెంట్లు,ఆయిల్ మిల్లు, సూపర్ మార్కెట్లలో తనిఖీలు నిర్వహించారు. తహశీల్ధార్ సుజాత, మున్సిపల్ కమిషనర్ రవీంద్ర, అధికారులు పట్టణంలోని రత్నబేకరీ,సురక్ష స్టోర్స్, బిర్యానీ హౌస్, హోటల్స్,రైస్ మిల్లులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకి ఆహార నాణ్యత పరిమాణాలు, తయారీ రూమ్ లో శుభ్రత లో ఏ మాత్రం లోపించిన కఠిన చర్యలు తీసుకుంటాం అన్నారు. 







Share:

గుంటూరు జిల్లాలో రోజురోజుకి పెరుగుతున్న కరోనా కేసులు-- ఈ రోజు 368 కొత్త కేసులు

గుంటూరు జిల్లాలో రోజురోజుకి పెరుగుతున్న కరోనా కేసులు-- ఈ రోజు 368 కొత్త కేసులు 


https://chilakaluripetspeednews.blogspot.com/

రాష్ట్రంలో కరొన కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. బుధవారం నాడు రాష్ట్రంలో 2331 కొత్త కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో ఎక్కువగా గుంటూరు జిల్లాలో 368 కేసులు నమోదు అయ్యాయి. 11 మంది చనిపోయారు. కరోనా నియంత్రం చర్యలు ప్రతిఒక్కరు పాటించాలి. మళ్ళి లాక్ డౌన్ అమలు చేస్తే, రెక్కాడితే డొక్కాడని వారి పరిస్థితి ఆలోచించండి. 














Share:

తెలంగాణలో టీడీపీకి భారీ షాక్

 తెలంగాణలో టీడీపీకి భారీ షాక్ 

https://chilakaluripetspeednews.blogspot.com/

తెలంగాణ 2018 అసెంబ్లీ ఎన్నికలలో 2 అసెంబ్లీ స్థానాలు దక్కిన్చుకున్న తెలంగాణ టీడీపీ ఆ ఎన్నికలలో భారీ పరాభవాన్ని చవిచూసింది. సండ్ర వెంకటవీరయ్య సత్తుపల్లి నుండి, మచ్చ నాగేశ్వరరావు అశ్వరావుపేట నుండి గెలిచారు. ఇప్పటికే సండ్ర తెరాస పార్టీ జండా కప్పుకోగా. ఈ రోజు మచ్చ  నాగేశ్వరావు TRS లో చేరుతున్నట్లు స్పీకర్ పోచారంకు లేఖ రాసారు. ఈ దెబ్బతో తెలంగాణ తెలుగు తమ్ముళ్లు ఒకింత షాక్ కి గురి అయ్యారు. 





Share:

పరిషత్ ఎన్నికలు షురూ కానీ తదుపరి విచారణ జరిగే వరకు కౌంటింగ్ డ్రాప్

పరిషత్ ఎన్నికలు షురూ కానీ తదుపరి విచారణ జరిగే వరకు కౌంటింగ్ డ్రాప్ 


https://chilakaluripetspeednews.blogspot.com/


మంగళవారం హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన స్టే ఎత్తివేస్తు డివిజన్ బెంచ్ ఉత్తరువులు ఇచ్చింది. అయితే రేపు జరగబోయే ఎన్నికలకు అంతా రంగం సిద్ధం చేసారు అధికారులు. తదుపరి విచారణ  కౌంటింగ్ లెక్కింపు  ఉండదు అని స్పష్టం చేసింది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా 516 జడ్పిటిసి , 7258 ఎమ్పిటిసి స్థానాలకు గాను 2092 మంది జడ్పిటిసి, 19002 ఎంపిటిసి అభ్యర్థులు పోటీ చేయనున్నారు, 

   
Share:

చిలకలూరిపేట మానుకొండవారిపాలెం,దండమూడి జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం --- హోమ్ గార్డ్ మృతి

చిలకలూరిపేట మానుకొండవారిపాలెం,దండమూడి జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం --- హోమ్ గార్డ్ మృతి 

https://chilakaluripetspeednews.blogspot.com/


చిలకలూరిపేట నుండి పెదనందిపాడు వెళ్లే మార్గంలోని మానుకొండవారిపాలెం , దండమూడి జంక్షన్ వద్ద చిలకలూరిపేట వస్తున్నహోమ్ గార్డ్ నిరీక్షణరావు ని నందిపాడు వైపు గా వెళ్తున్న మహేంద్ర మినీ వ్యాను ఢీ కొని మరణించారు. వివరాల్లోకి వెళ్తే పట్టణంలోని ఎంవి నారాయణపురం లో నివాసం ఉంటున్న వేముల నిరీక్షణరావు (46) గతం లో చిలకలూరిపేట పోలీస్ స్టేషన్ నందు హోమ్ గార్డ్గా  విధులు నిర్వహించారు. అయితే ప్రస్తుతానికి డిప్యుటేషన్ పైన గుంటూరు ఎన్ఫోర్స్మెంట్ నందు పని చేసున్నారు. అయితే ఈస్టర్ పండుగ సందర్భంగా స్వగ్రామం అయిన గరికపాడు లోని పెద్దల సమాధులకు రంగులు వేపించటానికి వెళ్లి వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినది. ప్రమాద సమయములో నిరీక్షణరావు హెల్మెట్ పెట్టుకున్నారు. కానీ అది పగిలిపోవటం వలన తలకు బలమైన గాయం తో అక్కడికి అక్కడే చనిపోయారు. పట్టణ రూరల్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతుదేహాన్ని పట్టణ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న తోటి హోమ్ గార్డులు, కుటుంబ సభ్యులు హాస్పిటల్ కి చేరుకున్నారు. ఉదయమే తమతో పాటుగా కరోనా వ్యాక్సిన్ వేపించుకున్నాడు ఇంతలో ఇలా జరగటం ధిక్బ్రాంతి లోనయ్యారు. మృతుడికి ఒక పాప,ఒక బాబు, వారి భార్య సన్నిధి గారు ఆర్టీసీ నందు కండక్టర్ గా పనిచేస్తున్నారు. 

















Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.
📸
మీ వార్తలను మాతో పంచుకోవడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి