వ్యాపారంలో వచ్చిన నష్టాలను పూడ్చుకోవడానికి, ఈజీ మనీకి అలవాటుపడి సొంత భార్యనే ఎరగా వేసి అమాయకులను నిండా ముంచిన ఓ జంట బాగోతం కరీంనగర్లో బట్టబయలైంది. సోషల్ మీడియాలో పరిచయాలతో మొదలై, బెదిరింపులతో లక్షలు దండుకుంటున్న వీరి వ్యవహారం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.
అసలేం జరిగింది?
మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలం వెంకటాపురానికి చెందిన సందింటి శరత్ కుమార్ రెడ్డి, అతని భార్య లలిత గత పదేళ్లుగా కరీంనగర్లోని ఆరెపల్లిలో నివాసం ఉంటున్నారు.
- శరత్ కుమార్ రెడ్డి మార్బుల్ మరియు ఇంటీరియర్ వ్యాపారం చేసేవాడు. అందులో భారీగా నష్టాలు రావడం, చేసిన అప్పులు, ఫ్లాట్ ఈఎంఐలు కట్టలేక ఇబ్బందులు పడ్డారు.
- దీంతో కష్టపడి సంపాదించడం కన్నా, అడ్డదారిలో డబ్బు సంపాదించడమే మేలని భావించిన భర్త.. భార్యతో కలిసి 'హనీ ట్రాప్' ప్లాన్ రచించాడు.
వలపు వల.. సీక్రెట్ రికార్డింగ్:
ఈ మోసానికి సోషల్ మీడియానే ప్రధాన వేదికగా మార్చుకున్నారు.
- భార్య లలిత తన యూట్యూబ్ ఛానల్ (Karimnagar Pilla 123) మరియు ఇన్స్టాగ్రామ్లో ఆకర్షణీయమైన రీల్స్, అర్ధనగ్న ఫోటోలు పోస్ట్ చేస్తూ యువకులను, డబ్బున్న వారిని ఆకర్షించేది.
- వారితో ఛాటింగ్ చేసి, మాయమాటలతో నమ్మించి తన ఫ్లాట్కు పిలిపించుకునేది.
- వచ్చిన వారితో ఆమె ఏకాంతంగా, చనువుగా ఉన్న సమయంలో భర్త శరత్ కుమార్ రెడ్డి చాటుగా వీడియోలు చిత్రీకరించేవాడు.
- ఆ తర్వాత ఆ వీడియోలు బాధితులకు పంపి, డబ్బు ఇవ్వకపోతే సోషల్ మీడియాలో పెడతామని, కుటుంబ సభ్యులకు పంపిస్తామని బెదిరించి లక్షలకు లక్షలు వసూలు చేసేవారు.
లారీ ఓనర్ ఫిర్యాదుతో వెలుగులోకి:
గత మూడేళ్లుగా డాక్టర్లు, వ్యాపారులు, విద్యార్థులు ఇలా సుమారు 100 మందికి పైగా వీరి వలలో చిక్కుకున్నట్లు సమాచారం. వీరి నుంచి వసూలు చేసిన డబ్బుతో రూ.65 లక్షల విలువైన ప్లాట్, ఖరీదైన కారు, ఫర్నిచర్ కూడా కొనుగోలు చేశారు.
అయితే, ఇటీవల కరీంనగర్కు చెందిన ఓ 27 ఏళ్ల లారీ యజమానిని ఇదే రీతిలో ట్రాప్ చేసి విడతల వారీగా రూ.13 లక్షలు వసూలు చేశారు. చివరగా మరో 5 లక్షలు ఇవ్వాలని వేధించడంతో, బాధితుడు తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించి ఆధారాలు సమర్పించాడు. దీంతో రంగంలోకి దిగిన రూరల్ పోలీసులు ఈ కిలాడీ దంపతులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ హెచ్చరిక:
సోషల్ మీడియాలో వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్లు, అందమైన ఫోటోలు చూసి మోసపోకండి. తెలియని వ్యక్తులతో చనువుగా ఉంటూ, ఏకాంతంగా కలుస్తున్నారంటే అది మీ జీవితాన్ని నాశనం చేసే ఉచ్చు కావచ్చు. లైక్, కామెంట్ల వరకు ఓకే.. కానీ హద్దు దాడితే నిలువునా గుండు గీయించుకోవాల్సి వస్తుంది. జాగ్రత్త!
☀️ కరెంట్ బిల్లుల మోతకు చెక్! "పీఎం సూర్య ఘర్" పథకం ద్వారా నెలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్తో పాటు బిల్లును 'జీరో' చేసుకోండి.
💰 కేంద్ర ప్రభుత్వం అందించే ₹78,000/- భారీ సబ్సిడీని సద్వినియోగం చేసుకోండి; మిగిలిన కరెంట్ అమ్మి ఆదాయం కూడా పొందండి!
🏡 నాణ్యమైన సోలార్ సిస్టమ్స్ కోసం మన చిలకలూరిపేటలోని *"ఆదిత్య సోలార్ ప్రైవేట్ లిమిటెడ్"* వారిని నేడే సంప్రదించండి.
📞 మరిన్ని వివరాలకు కాల్ చేయండి: +91 8074300423
చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి




