చిలకలూరిపేట రూరల్ - గుర్తుతెలియని వ్యక్తి సూసైడ్
చిలకలూరిపేట/నాదెండ్ల: నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గ్రామంలోని పాత బెల్జియం కంపెనీ ఆవరణలో ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా సంచలనం సృష్టించింది.
ఘటన వివరాలు ఇలా ఉన్నాయి:
గణపవరం శివారులో మూసివేసి ఉన్న పాత బెల్జియం కంపెనీ ఆవరణలో, ఓ వ్యక్తి ఇనుప కడ్డీకి కేబుల్ వైరుతో ఉరివేసుకొని వేలాడుతుండడాన్ని స్థానికులు గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు ఎవరు? ఏ ప్రాంతానికి చెందినవాడు? అనే వివరాలు ఇంకా తెలియరాలేదు. ఆత్మహత్యకు గల కారణాలు మిస్టరీగా మారాయి.
పోలీసుల దర్యాప్తు:
సమాచారం అందుకున్న వెంటనే నాదెండ్ల పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, మృతుడి ఆచూకీ కోసం పరిసర ప్రాంతాల్లో ఆరా తీస్తున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతుడి వివరాలు గుర్తించే పనిలో పడ్డారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
☀️ కరెంట్ బిల్లుల మోతకు చెక్! "పీఎం సూర్య ఘర్" పథకం ద్వారా నెలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్తో పాటు బిల్లును 'జీరో' చేసుకోండి.
💰 కేంద్ర ప్రభుత్వం అందించే ₹78,000/- భారీ సబ్సిడీని సద్వినియోగం చేసుకోండి; మిగిలిన కరెంట్ అమ్మి ఆదాయం కూడా పొందండి!
🏡 నాణ్యమైన సోలార్ సిస్టమ్స్ కోసం మన చిలకలూరిపేటలోని *"ఆదిత్య సోలార్ ప్రైవేట్ లిమిటెడ్"* వారిని నేడే సంప్రదించండి.
📞 మరిన్ని వివరాలకు కాల్ చేయండి: +91 8074300423
చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి




