చిలకలూరిపేట ఆర్టీసీకి కొత్త బాస్.. ఎమ్మెల్యే ప్రత్తిపాటితో మర్యాదపూర్వక భేటీ
డిపో అభివృద్ధి, ప్రయాణికుల సౌకర్యాలపై ఎమ్మెల్యే దిశానిర్దేశం
చిలకలూరిపేట స్పీడ్ న్యూస్:
చిలకలూరిపేట ఆర్టీసీ డిపో నూతన మేనేజర్గా (DM) యద్దనపూడి వేణు గారు నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన డిపో కార్యాలయంలో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన స్థానిక మాజీ మంత్రివర్యులు, చిలకలూరిపేట శాసనసభ్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారిని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఎమ్మెల్యే అభినందనలు - కీలక సూచనలు:
నూతన డిపో మేనేజర్గా బాధ్యతలు చేపట్టిన వేణు గారికి ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా డిపో పరిధిలో రవాణా వ్యవస్థ మెరుగుదలపై కాసేపు చర్చించారు. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన సేవలందించాలని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు బస్సు సర్వీసులు సక్రమంగా నడిచేలా చూడాలని ఎమ్మెల్యే సూచించారు. ఆర్టీసీ అభివృద్ధికి, కార్మికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం, తాను ఎల్లప్పుడూ సహకరిస్తామని హామీ ఇచ్చారు.
పాల్గొన్న ప్రముఖులు:
ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మరియు ఆర్టీసీ వర్గాల వారు పాల్గొన్నారు. ముఖ్యంగా కంచర్ల శ్రీనివాసరావు, అద్దంకి వరప్రసాద్, పావులూరి వెంకటేశ్వర్లు, మువ్వా సుబ్బారావు, థామస్, నక్కా శ్రీను, రమేష్, శ్రీను నాయక్, సాంబిరెడ్డి తదితరులతో పాటు పలువురు ఆర్టీసీ సిబ్బంది ఈ భేటీలో పాల్గొన్నారు.
☀️ కరెంట్ బిల్లుల మోతకు చెక్! "పీఎం సూర్య ఘర్" పథకం ద్వారా నెలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్తో పాటు బిల్లును 'జీరో' చేసుకోండి.
💰 కేంద్ర ప్రభుత్వం అందించే ₹78,000/- భారీ సబ్సిడీని సద్వినియోగం చేసుకోండి; మిగిలిన కరెంట్ అమ్మి ఆదాయం కూడా పొందండి!
🏡 నాణ్యమైన సోలార్ సిస్టమ్స్ కోసం మన చిలకలూరిపేటలోని *"ఆదిత్య సోలార్ ప్రైవేట్ లిమిటెడ్"* వారిని నేడే సంప్రదించండి.
📞 మరిన్ని వివరాలకు కాల్ చేయండి: +91 8074300423
చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి




