చిలకలూరిపేట - 48ఎకరాలు.. 615 షాపులు.. ఆటోనగర్ నిర్మాణానికి ఘనంగా పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భారత్, MLA ప్రత్తిపాటి శంకుస్థాపన!
పల్నాడు జిల్లా కేంద్రమైన చిలకలూరిపేట ఆటోమొబైల్, బాడీ బిల్డింగ్ రంగానికి ఒక గుండెకాయ లాంటిది. ఇక్కడి మెకానిక్ల నైపుణ్యం రాష్ట్రవ్యాప్తంగా ప్రసిద్ధి. ఏళ్ల తరబడి సరైన వసతులు లేక, స్థలం చాలక ఇబ్బంది పడుతున్న ఆటో వర్కర్ల జీవితాల్లో నేడు సరికొత్త వెలుగులు నిండాయి. పోతావరం శివారులో సుమారు 53 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో, 615 షాపులతో సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్న 'ఆటోనగర్' కు అంగరంగ వైభవంగా శంకుస్థాపన మరియు లబ్ధిదారులకు ప్లాట్ల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది!
🏗️ లక్షల కోట్ల పెట్టుబడులు.. శరవేగంగా పారిశ్రామికీకరణ: మంత్రి టీజీ భరత్
ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దార్శనికత, సమర్థవంతమైన నాయకత్వంలో రాష్ట్రంలో పారిశ్రామికీకరణ జెట్ స్పీడ్ తో పరుగులు పెడుతోందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వ సులభతర వాణిజ్య విధానాల వల్లే రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు క్యూ కడుతున్నాయన్నారు. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు గారి ప్రత్యేక విజ్ఞప్తి మేరకు.. ఆటోనగర్ తదుపరి అభివృద్ధికి అవసరమైన రూ. 2.80 కోట్లను వెంటనే మంజూరు చేసేలా సభాముఖంగానే అధికారులను ఆదేశించి కార్మికుల మనసులు గెలుచుకున్నారు. గత ప్రభుత్వం పరిశ్రమలను తరిమేసి యువతను రోడ్డున పడేసిందని, కానీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం త్వరలోనే 20 లక్షల ఉద్యోగాల హామీని నెరవేరుస్తుందని భరోసా ఇచ్చారు.
🏭 రాష్ట్రానికే ఆదర్శం.. ఇకపై 'ప్రత్తిపాటి ఆటోనగర్' గా నామకరణం!
చిలకలూరిపేట ఆటోనగర్ ఉత్తమ పనితీరుతో రాష్ట్రానికే ప్రామాణికంగా నిలవాలని స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఆకాంక్షించారు. ప్లాట్లు పొందిన వర్కర్లు వీలైనంత త్వరగా కార్యకలాపాలు ప్రారంభించాలని, ఇది ఒక ఎంఎస్ఎంఈ (MSME) పార్కు స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. అవసరమైతే అదనపు భూసేకరణ చేసి, మిగిలిన అర్హులందరికీ ప్లాట్లు ఇస్తామని మాటిచ్చారు. కాగా, ఈ ఆటోనగర్ ఏర్పాటులో ప్రత్తిపాటి చేసిన అలుపెరగని కృషికి కృతజ్ఞతగా.. ఆటోనగర్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఈ ఆటోనగర్ పేరును "ప్రత్తిపాటి పుల్లారావు ఆటోనగర్" గా మారుస్తూ సభాముఖంగా ఏకగ్రీవ తీర్మానం చేయడం విశేషం!
🔋 మారిన కాలం.. పెరగాల్సిన నైపుణ్యం: ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు
ఎలక్ట్రిక్ (EV), బ్యాటరీ వాహనాలొస్తున్న ప్రస్తుత ఆధునిక తరుణంలో ఆటో కార్మికులు తమ పనితీరును, నైపుణ్యాలను (Skills) కాలానుగుణంగా అప్డేట్ చేసుకోవాలని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు దిశానిర్దేశం చేశారు. చేతి వృత్తులపై ఆధారపడే కార్మికులు గ్రూపులుగా ఏర్పడితే కేంద్ర ప్రభుత్వం నుంచి 90% సబ్సిడీతో రుణాలు లభిస్తాయని, వాటితో అధునాతన యంత్రాలు, పరికరాలు కొనుగోలు చేసి శారీరక శ్రమ తగ్గించుకోవచ్చని అద్భుతమైన సలహా ఇచ్చారు. అలాగే, చిలకలూరిపేటలో త్వరలో "కార్పెంటర్ క్లస్టర్" కూడా ఏర్పాటు చేయనున్నట్లు మరో గుడ్ న్యూస్ చెప్పారు.
🤝 పాల్గొన్న ప్రముఖులు:
ఈ బృహత్తర కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యే, ఎంపీలతో పాటు జిల్లా కో-ఆర్డినేటర్ మరియు ఎమ్మెల్సీ బి.టి. నాయుడు, టీటీడీ బోర్డు సభ్యులు జంగా కృష్ణమూర్తి, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరిముల్లా, ఏపీఐఐసీ & ఎంఎస్ఎంఈ అధికారులు, ఆటోనగర్ వర్కర్స్ యూనియన్ నాయకులు, టీడీపీ, కూటమి ముఖ్య నాయకులు మరియు భారీ సంఖ్యలో కార్మికులు, ప్రజలు పాల్గొన్నారు.
🚀 చిలకలూరిపేట అభివృద్ధి ప్రస్థానంలో ఇదొక సువర్ణాధ్యాయం. ప్లాట్లు పొందిన ప్రతి ఒక్కరూ ఆర్థికంగా ఎదగాలని, ఎవరి స్కిల్స్ కు తగ్గట్లు వారు రాణించి మన చిలకలూరిపేట ఖ్యాతిని మరింత విశ్వవ్యాప్తం చేయాలని మనసారా కోరుకుందాం!
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులుకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు " 0 "చేసుకోవచ్చు మరిన్ని వివరాలు కోసం కింది నెంబర్ కి కాల్ చేయండి - +91 70135 89826 - ఆదిత్య సోలార్
మరిన్ని చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి. వాట్సప్ ఛానల్ ని ఫాలో అవ్వండి.





No comments:
Post a Comment