చిలకలూరిపేట: 7,000 దాటిన జనసేన 'ఉద్యమి' సభ్యత్వాలు
చిలకలూరిపేట (స్పీడ్ న్యూస్):
చిలకలూరిపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన 'ఉద్యమి' సభ్యత్వ నమోదు కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటివరకు 7,000 కు పైగా నూతన సభ్యత్వాలు నమోదైనట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
గ్రామ, పట్టణ స్థాయిలో పార్టీని క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లే లక్ష్యంతో జనసేన నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి గడపకూ వెళ్లి పార్టీ ఆశయాలను వివరిస్తూ ప్రజలను భాగస్వాములను చేస్తున్నారు. ముఖ్యంగా యువత మరియు మహిళల నుంచి సానుకూల స్పందన లభిస్తోందని నాయకులు తెలిపారు.
ఈ సందర్భంగా, రికార్డు స్థాయిలో 7,000 పైచిలుకు సభ్యత్వాలు నమోదు చేయడంలో కీలక పాత్ర పోషించిన చిలకలూరిపేట నియోజకవర్గ జనసేన సాధకులు, క్రియాశీలక సభ్యులు మరియు కార్యకర్తలను పార్టీ నాయకత్వం ప్రత్యేకంగా అభినందించింది.
రానున్న రోజుల్లో ఈ కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేసి, నియోజకవర్గంలో పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయనున్నట్లు స్థానిక నాయకులు పేర్కొన్నారు.
ఇకపై కరెంట్ బిల్లు కట్టే అవసరం లేదు - పూర్తి వివరాల కోసం ఇప్పుడే కాల్ చేయండి - +91 70135 89826 - ఆదిత్య సోలార్ - సోలార్ గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకొని ఆ తర్వాతే బిగించుకోండి.
మరిన్ని చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి.
https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g
#JanasenaUdyami #ChilakaluripetNews





No comments:
Post a Comment