చిలకలూరిపేట రూరల్ - తిమ్మాపురం శివాలయానికి మహర్దశ.. మంత్రి నారా లోకేష్ భారీ నజరానా!
🔥 చిలకలూరిపేట స్పీడ్ న్యూస్, యడ్లపాడు:
మాట ఇచ్చారు.. మడమ తిప్పని నైజంతో నిధులు మంజూరు చేశారు! యువగళం నేత, రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ప్రత్యేక చొరవతో యడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామంలోని పురాతన ఆలయానికి పూర్వ వైభవం రానుంది.
గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు, అక్కడి ప్రాచీన శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి ఏకంగా రూ. 56.25 లక్షల భారీ నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది.
✅ వివరాలు ఇవీ:
ఆలయంలో నూతన ముఖమండపం మరియు ఇతర అభివృద్ధి పనుల కోసం మొత్తం రూ. 62.50 లక్షల అంచనా వ్యయం కాగా..
- ప్రభుత్వ సి.జి.ఎఫ్ (CGF) గ్రాంట్: రూ. 56,25,000/-
- మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్: రూ. 6,25,000/-
🚩 మాట నిలబెట్టుకున్న లోకేష్:
గతంలో గ్రామస్తులు ఆలయ పరిస్థితిని మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. భక్తుల మనోభావాలను గౌరవిస్తూ, వెంటనే స్పందించిన ఆయన.. దేవాదాయ శాఖతో మాట్లాడి ఈ భారీ మొత్తాన్ని మంజూరు చేయించారు. అడిగిన వెంటనే నిధులు వరదలా పారించిన మంత్రి లోకేష్ గారికి తిమ్మాపురం గ్రామస్తులు జేజేలు పలుకుతున్నారు.
🙏 ధన్యవాదాల వెల్లువ:
ఈ అభివృద్ధికి సహకరించిన స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గారికి, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి గారికి, మరియు ముఖ్యంగా నారా లోకేష్ గారికి గ్రామ నాయకులు, ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిధులతో ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబు కానుందని, భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందుతాయని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
📢 - చిలకలూరిపేట స్పీడ్ న్యూస్.
☀️ కరెంట్ బిల్లుల మోతకు చెక్! "పీఎం సూర్య ఘర్" పథకం ద్వారా నెలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్తో పాటు బిల్లును 'జీరో' చేసుకోండి.
💰 కేంద్ర ప్రభుత్వం అందించే ₹78,000/- భారీ సబ్సిడీని సద్వినియోగం చేసుకోండి; మిగిలిన కరెంట్ అమ్మి ఆదాయం కూడా పొందండి!
🏡 నాణ్యమైన సోలార్ సిస్టమ్స్ కోసం మన చిలకలూరిపేటలోని *"ఆదిత్య సోలార్ ప్రైవేట్ లిమిటెడ్"* వారిని నేడే సంప్రదించండి.
📞 మరిన్ని వివరాలకు కాల్ చేయండి: +91 8074300423
చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి





No comments:
Post a Comment