చిలకలూరిపేటలో కన్నుల పండుగగా మకర జ్యోతి దర్శనం... పోటెత్తిన వేలాది భక్తులు
చిలకలూరిపేట పట్టణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. స్థానిక సుభాన్ నగర్ లో కొలువైన శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానం, ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి పర్వదినాన శబరిమలను తలపించేలా మారుతోంది. శబరిమల క్షేత్రంలో మకర జ్యోతి దర్శనం జరిగిన శుభఘడియల్లోనే, ఇక్కడ కూడా స్వామివారి జ్యోతిని వెలిగించడం ఒక ఆనవాయితీగా వస్తోంది. శ్రీ అయ్యప్ప స్వామి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అంబటిపూడి వెంకటేష్ శాస్త్రి, గౌరవాధ్యక్షులు చల్లా విజయకుమార్ ఆధ్వర్యంలో ఏటా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ కమనీయ దృశ్యాన్ని వీక్షించేందుకు చిలకలూరిపేట నుంచే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుండి వేలాదిగా భక్తులు తరలివస్తారు. స్వామివారి నామస్మరణతో, వేలాది భక్తుల శరణుఘోషతో ఆలయ ప్రాంగణం మారుమోగిపోతుంది. ప్రతీ ఏటా భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో, ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ట్రస్ట్ సభ్యులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తూ, వచ్చిన ప్రతి భక్తుడికి స్వామివారి తీర్థప్రసాదాలు అందేలా చూస్తున్నారు. ఈ ఏడాది కూడా అదే భక్తిప్రపత్తులతో జ్యోతి దర్శనం వైభవంగా జరిగింది.
⚡ కరెంట్ బిల్లుల మోతతో బెంబేలెత్తుతున్నారా? ⚡
ఇక ఆ చింత మానుకోండి! ☀️ ఆదిత్య సోలార్తో మీ ఇంటిని వెలిగించుకోండి.
✅ మీ కరెంట్ బిల్లును పూర్తిగా 0 (జీరో) చేసుకోండి.
✅ కేంద్ర ప్రభుత్వం నుండి రూ. 78,000/- వరకు భారీ సబ్సిడీని పొందండి. 🇮🇳
సౌరశక్తిని వాడండి - డబ్బులు ఆదా చేయండి! 💰
మరిన్ని వివరాల కోసం సంప్రదించండి:
☀️ ఆదిత్య సోలార్ ప్రైవేట్ లిమిటెడ్, చిలకలూరిపేట
📞 +91 8074300423
మరిన్ని వార్తల కోసం క్రింది లింకు పై క్లిక్ చేయండి. https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g





No comments:
Post a Comment