మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

Advertisement - 2

Image3

........

Advertisement - 3

Image3

........

ప్రకటనల కోసం 90358 80349 నెంబర్ కు సంప్రదించండి.
|

⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!

చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.

💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి

ఈర్షతో ఓర్వలేక పెయిడ్ ఆర్టిస్టులతో అనుచిత వ్యాఖ్యలు చేయిస్తున్నారు - నోరు ఉంది కదా అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి - MLA రజిని

ఈర్షతో ఓర్వలేక పెయిడ్ ఆర్టిస్టులతో అనుచిత వ్యాఖ్యలు చేయిస్తున్నారు - నోరు ఉంది కదా అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి - MLA రజిని

https://chilakaluripetspeednews.blogspot.com/2021/10/ysrcp-ysrcp.html?m=1

చిలకలూరిపేట పట్టణంలో  YSRCP ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ నిరసన ర్యాలీకి కార్యకర్తలు నాయకులు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రజిని మాట్లాడుతూ CM జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రవేశపెడుతున్న సంక్షేమ కార్యక్రమాలను చూస్తూ ఓర్వలేక ఈర్ష్యతో పట్టాభి లాంటి పెయిడ్ ఆర్టిస్టులకు స్క్రిప్టుని అందించి CM జగన్మోహన్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేయిస్తున్నారని ఆమె మండిపడ్డారు. అలాగే నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయని ఆమె తెలిపారు. టిడిపి పార్టీ రాష్ట్రంలో తమ ఉనికిని కోల్పోతున్న భయంతో ఇలాంటి చర్యలు పాల్పడుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. అలాగే నియోజకవర్గ పరిధిలోని YSRCP నాయకులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, వార్డు కౌన్సిలర్లు YSRCP యూత్ భారీగా పాల్గొన్నారు.



Share:

చిలకలూరిపేట:-YSRCP భారీ ర్యాలీ - పట్టాభి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన చేపట్టిన చిలకలూరిపేట YSRCP శ్రేణులు

చిలకలూరిపేట:-YSRCP భారీ ర్యాలీ - పట్టాభి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన చేపట్టిన చిలకలూరిపేట YSRCP శ్రేణులు

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట పట్టణంలోని MLA రజిని & YSRCP నాయకులు ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు సీఎం జగన్మోహన్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టిడిపి నాయకుడు పట్టాభి బహిరంగంగా సీఎం జగన్మోహన్ రెడ్డికి క్షమాపణ చెప్పాలని YSRCP కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన వ్యక్తం చేశారు.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1


Share:

రాష్ట్రంలో దుర్మార్గాలు, అరాచకాలు అడ్డుకట్ట వేయాలి అంటే రాష్ట్రపతి పాలన విధించాలి - ప్రత్తిపాటి పుల్లారావు

రాష్ట్రంలో దుర్మార్గాలు, అరాచకాలు అడ్డుకట్ట వేయాలి అంటే రాష్ట్రపతి పాలన విధించాలి - ప్రత్తిపాటి పుల్లారావు

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట మంగళగిరి టిడిపి కేంద్ర కార్యాలయం పై జరిగిన దాడులకు నిరసన తెలుపుతూ ఈరోజు టిడిపి రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ప్రకటించింది. అయితే ఉదయం నుండి రాష్ట్రంలోని టిడిపి ముఖ్య నాయకులను హౌస్ అరెస్ట్ మరియు టిడిపి కార్యకర్తల అరెస్టులను నిరసిస్తూ మాజీ మంత్రివర్యులు పత్తిపాటి పుల్లారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇలాంటి దుర్మార్గాలు అరాచకాలు అడ్డుకట్ట వేయాలంటే వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన డిమాండ్ చేశారు.



Share:

చిలకలూరిపేట - గృహనిర్బంధం - టిడిపి కార్యకర్తల అరెస్ట్

చిలకలూరిపేట - గృహనిర్బంధం - టిడిపి కార్యకర్తల అరెస్ట్

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట నిన్న జరిగిన మంగళగిరి టిడిపి కేంద్ర కార్యాలయం పై దాడులకు నిరసనగా పట్టణంలోని టిడిపి నాయకులు బందుకు పిలుపునిచ్చారు. అయితే పోలీస్ శాఖ అప్రమత్తమై టిడిపి ముఖ్య కార్యకర్తలను హౌస్ అరెస్టు చేశారు. అలాగే పెద్ద ఎత్తున కార్యకర్తలు రోడ్డు మీదకు వచ్చి జాతీయ రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీస్ వారు టిడిపి కార్యకర్తల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.



Share:

నేటి బంద్ కు మేము సహకరించము - చాంబర్ ఆఫ్ కామర్స్ చిలకలూరిపేట

నేటి బంద్ కు మేము సహకరించము - చాంబర్ ఆఫ్ కామర్స్ చిలకలూరిపేట

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట:- నేడు జరగబోయే బంద్ కు తాము సహకరించమని చాంబర్ ఆఫ్ కామర్స్ చిలకలూరిపేట అధ్యక్షులు కూనాల వెంకట సుబ్రహ్మణ్యం తెలిపారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ వారు ప్రకటించిన బంద్ అది వారి వ్యక్తిగత దూషణలతో అప్రయోజనాత్మకంగా ఉన్న కారణంగా మరియు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై.యస్.జగన్ మోహన్ రెడ్డి గారిని విమర్శించుట సహేతుకంగా లేనందున మేము  బంద్ కు మద్దతు తెలియపర్చుటలేదు. ఈ కరోనా కష్టకాలంలో వ్యాపారస్తులు అనేక వ్యాపార మరియు ఆర్థిక ఇబ్బందులకు గురి అవుతున్నందువలన, ఈ బంద్ వలన సమాజానికి సరైన ఉపయోగం లేనందున చాంబర్ ఆఫ్ కామర్స్ చిలకలూరిపేట వారు ఈ బంద్ కు సహకరించుట లేదు అని చిలకలూరిపేట చాంబర్‌ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం తెలిపారు.





Share:

చిలకలూరిపేట:- నియోజకవర్గంలో నిరసన చేపట్టిన టిడిపి కార్యకర్తలు

చిలకలూరిపేట:- నియోజకవర్గంలో నిరసన చేపట్టిన టిడిపి కార్యకర్తలు

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని టిడిపి కార్యకర్తలు మంగళగిరి కేంద్ర టిడిపి కార్యాలయం పై జరిగిన దాడుల కారణంగా నిరసన వ్యక్తం చేశారు. పట్టణంలోని టిడిపి కార్యాలయం నుండి నరసరావుపేట సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు అలాగే నియోజకవర్గ పరిధిలోని నాదెండ్ల మండల టిడిపి అధ్యక్షుడు బండారు సత్యనారాయణ పార్టీ కార్యకర్తలతో కలిసి ఆందోళన వ్యక్తం చేశారు అనంతరం పట్టణంలో టిడిపి కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి రేపు జరగబోయే బంద్ ను విజయవంతం చేయాలని తెలిపారు.



Share:

రేపు చిలకలూరిపేట బంద్ కు అందరూ సహకరించాలి - ముద్దన నాగేశ్వరరావు

రేపు చిలకలూరిపేట బంద్ కు అందరూ సహకరించాలి - ముద్దన నాగేశ్వరరావు

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం పై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని యడ్లపాడు మండల అధ్యక్షులు ముద్దన నాగేశ్వర రావు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్త బందులో భాగంగా బుధవారం తలపెట్టిన చిలకలూరిపేట బందుకు అందరూ సహకరించాలన్నారు. ఈ సందర్భంగా ముద్దన నాగేశ్వర రావు  మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం అదే విధంగా విశాఖ, కడప, హిందూపురం, విజయవాడ తదితర కార్యాలయాలు, నాయకుల ఇళ్ల పై భౌతిక దాడులు చేయడమే కాకుండా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం ఇంటి పై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రజాస్వామ్యంలో  ప్రశ్నించడం తప్పా? అని ప్రశ్నించారు. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఊరు,ఊరు తిరుగుతూ ఇచ్చిన హామీలను అమలు పరచకపోవడమే కాకుండా ప్రజల పై అనేక రకాలుగా మోపుతున్న పన్నుల భారాన్ని ప్రశ్నించడాన్ని జీర్ణించుకోలేని అధికారపక్షం భౌతిక దాడులు చేయడం నీచమైన చర్య అన్నారు. ప్రశ్నించిన వారి పై భౌతిక దాడులు చేయడం అదే విధంగా కార్యాలయాలు ధ్వంసం చేయడం అంటే వాక్ స్వాతంత్ర్యాన్ని హరించడమే అని, ప్రతిపక్ష పార్టీలుగా తాము చేస్తున్న ఆరోపణలకు సరైన సమాధానం చెప్పాల్సింది పోయి ఇటువంటి దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రజల పక్షాన పోరాడుతున్న నేతలపై దాడి చేయడం,తెలుగు ప్రజల ఆత్మ గౌరవం పై చేసిన దాడి అని అన్నారు. ప్రభుత్వం పై పెరుగుతున్న వ్యతిరేకతను రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టించి ప్రజల దృష్టి మార్చాలనే వైసీపీ లక్ష్యమని,ఇది ఒక ప్లాన్ ప్రకారం పక్కా వ్యూహంతో జరిగిన దాడిగా భావిస్తున్నామని ప్రభుత్వము తన విధానాలను మార్చుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల పై కేంద్రం ప్రభుత్వం దృష్టి సారించి రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి రాష్టప్రతి పాలన విధించాలని డిమాండ్ చేశారు.



Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.
📸
మీ వార్తలను మాతో పంచుకోవడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి