|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండిచిలకలూరిపేట విద్యుత్ వినియోగదారులకు తెలియజేయునది ఏమి అనగా !!!
చిలకలూరిపేట విద్యుత్ వినియోగదారులకు తెలియజేయునది ఏమి అనగా !!!
చిలకలూరిపేట పట్టాన పుర ప్రజలకు కరోనా వీర విజృంభణ కారణంగా మధ్యాహ్నం 12 గంటల తరువాత కర్ఫ్యూ కారణంగా విద్యుత్ బిల్లు చెల్లింపునకు ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకు మాత్రమే రావలెను అని డి ఈ ఈ సి. హెచ్ రాంభొట్ల గారు తెలిపారు. అందువలన బిల్లు చెలింపునకు వచ్చేవారు తప్పనిసరిగా మాస్క్ వాడాలి అని , క్యూ లైన్లో ఉన్నప్పుడు భౌతిక దూరం పాటించాలి. కరోనా నియమాలు పాటించాలి అని తెలిపారు
తమిళనాడు లో MK స్టాలిన్ సంచలన నిర్ణయం - అమ్మ కాంటిన్లు జయలలిత ఫొటోతోనే కొనసాగుతాయి.
తమిళనాడు లో MK స్టాలిన్ సంచలన నిర్ణయం - అమ్మ కాంటిన్లు జయలలిత ఫొటోతోనే కొనసాగుతాయి.
తమిళనాడు గడిచిన 2021 అసెంబ్లీ ఎన్నికలలో DMK (స్టాలిన్) 234 స్థానాలకు గాను 159 స్థానాలు గెలిచి విజయకేతనం ఎగురవేశారు. అయితే గెలిచిన ఆనందంలో పార్టీ కార్యకర్తలు చెన్నై లోని AIDMK పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎర్పాటు చేసిన అమ్మ కాంటీన్ల పైన దాడి చేసి జయలలిత ఫోటోలను చించివేశారు. విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి MK స్టాలిన్ అలాంటి చర్యలకు పాల్పడిన సొంత పార్టీవాళ్ల పైనే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలి అని ఆదేశాలు జారీచేశారు. అలాగే ఇక పైన కూడా అమ్మ కాంటీనులు కొనసాగుతాయి అని తెలిపారు. కొనసాగటమేకాదు అందులో జయలలిత ఫొటోలు కూడా ఉంటాయి అని తెలిపారు. అలాగే కార్యకర్తలు చించివేసిన జయలలిత ఫోటోల స్థానంలో జయలలిత కొత్త ఫొటోలను ఎర్పాటు చెయ్యాలి అని ఆదేశాలు జారీ చేసారు. MK స్టాలిన్ కు తమిళనాడు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు
ఎంపీ చొరవతో చిలకలూరిపేట గవర్నమెంట్ హాస్పిటల్ నందు కరోనా బెడ్లు పెంపు
ఎంపీ చొరవతో చిలకలూరిపేట గవర్నమెంట్ హాస్పిటల్ నందు కరోనా బెడ్లు పెంపు
చిలకలూరిపేట గవర్నమెంట్ హాస్పిటల్ నందు ఇప్పటి వరకు 20 కొవిడ్ బెడ్లు మాత్రమే ఉండేవి. 20 మందికి మాత్రమే చికిత్స అందిస్తున్నారు. అయితే కొన్ని రోజుల క్రితం ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు ఆకస్మిక పర్యటన చేసి హాస్పిటల్ వసతుల పైన దృష్టి పెట్టాలి అని తెలియజేశారు. అయితే ఎంపీ గారి చొరవతో 20 బెడ్లను 30 కి పెంచాలి అని అధికారులకు లేఖ రాయటం జరిగింది. అయితే ఆయా లేఖ పైన స్పందిస్తూ జిల్లా అధికారులు 10 బెడ్లు అదనంగా ఎర్పాటు చేసారు. దీనితో పట్టణములోని గవర్నమెంట్ హాస్పిటల్ నందు మొత్తం 30 బెడ్లు ఉన్నవి. ఇక పైన 30 మంది కరోనా రోగులకు ఉచిత వైద్యం నిర్వహిస్తారు
నరసరావుపేటలో రెమిడీసివిర్ ఇంజక్షన్ తయారీకి అనుమతులు కోరుతూ కేంద్రానికి లేఖ - MP శ్రీ కృష్ణ దేవరాయలు
నరసరావుపేటలో రెమిడీసివిర్ ఇంజక్షన్ తయారీకి అనుమతులు కోరుతూ కేంద్రానికి లేఖ - MP శ్రీ కృష్ణ దేవరాయలు
రెమిడీసివిర్ ఈ పేరు ఈ మధ్య కాలంగా బాగా అందరి నోళ్ళలో నానుతున్న పేరు. ఇక కరోనా వలన హాస్పిటల్ కి వెళ్లి అక్కడి నుండి నుండి కోలుకున్న వాళ్లకు అయితే ఇది ఒక అమృతం లాగా ఫీల్ అవుతారు. ఎందుకు అంటే కరోనా వలన ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికీ కూడా ఈ ఇంజక్షన్ ఇచ్చిన తరువాత త్వరగా కోలుకున్న రోజులు కూడా ఉన్నాయి. అందువలన దీని రేటు కూడా 2500 అమ్మవలసిన ఒక్క ఇంజక్షన్ ను బ్లాక్ మార్కెట్లో 40,000 కొనుకున్న వారు కూడా ఉన్నారు.
అయితే నరసరావుపేటలో రెమిడీసివిర్ ఇంజక్షన్ తయారీకి అనుమతులు కోరుతూ కేంద్రానికి లేఖ రాసారు MP శ్రీ కృష్ణ దేవరాయలు గారు. నరసరావుపేటలో గుంటూరు రోడ్డులో ఉన్న సేఫ్ ఫార్మాసిటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే మందులు తయారీ కంపెనీకు రెమిడీసీవర్ తయారు చేయటానికి కావలిసిన సదుపాయాలు ఉన్నవి. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రికి అత్యవసర అనుమతులు కోరుతూ లేఖ రాసారు. రెమిడీసీవర్ అనుమతులు ఇస్తే ప్రతి రోజు 60,000 ఇంజక్షన్ తాయారు చేయగలమని. దాని వలన కొంచం అయినా కొరత తగ్గించవచ్చు అని లేఖ లో పేర్కొన్నారు నరసరావుపేట MP లావు శ్రీ కృష్ణ దేవరాయలు .
చిలకలూరిపేట - మా పరిస్థితి ఏంటి !!!
చిలకలూరిపేట - మా పరిస్థితి ఏంటి !!!
చిలకలూరిపేటలో 1858 మందికి వ్యాక్సిన్ రెండవ డోసు వెయ్యాలి, ఈ రెండు రోజులు వారికీ మాత్రమే వ్యాక్సినేషన్ అన్నారు. రెండవ డోసు సమయానికి వెయ్యకపోతే వృధా అవుతుంది కాబట్టి వారికీ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఇది అంతా బాగుంది. కానీ ఇప్పటి వరకు గవెర్నమెంట్ ప్రజా వైద్యశాలలలో 1858 మంది మొదటి డోసు వేపించుకున్నారు. వారి వివరాలు సిద్ధం చేసి రెండవ డోసు రెడీ అవుతున్నారు. మరి ప్రైవేట్ హాస్పిటలలో మొదటి డోసు వ్యాక్సిన్ వేపించుకున్న వారి పరిస్థితి ఏంటి అని వాపోతున్నారు. ఇప్పటికే పట్టంలో కోవిడ్ ఆసుపత్రులకు అనుమతి పొందిన వాటిలలో చాలా మంది మొదటి డోసు తీసుకున్నారు. అయితే ప్రజా వైద్యశాలలో మాత్రమే మొదటి డోసు తీసుకున్న వారికీ మాత్రమే రెండవ డోసు వేస్తున్నారు. మేము కూడా వ్యాక్సిన్ తీసుకొని 4 వారలు అవుతుంది. ప్రైవేట్ హాస్పిటల్ దగిరకు వెళ్లి సెకండ్ డోసు అని అడిగేతే ప్రభుత్వం మాకు వ్యాక్సిన్ ఇవ్వటం లేదు అని సమాధానం వస్తుంది. సెకండ్ డోసు లేట్ అయితే మళ్లీ మొదటి డోసు తీసుకోవలసి వస్తుంది అని మా పరిస్థితి ఏంటి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు వీరి పైన కూడా ద్రుష్టి పెట్టి రెండవ డోసు కి అవకాశం కలిపించాలి అని కోరుకుంటున్నారు.
చిలకలూరిపేట ఈ రోజు రేపు వ్యాక్సిన్ - రెండో డోసు వారికే అనుమతి - ఈ ప్రాంతాలలో వ్యాక్సిన్ ప్రక్రియ జరుగుతుంది
చిలకలూరిపేట ఈ రోజు రేపు వ్యాక్సిన్ - రెండో డోసు వారికే అనుమతి - ఈ ప్రాంతాలలో వ్యాక్సిన్ ప్రక్రియ జరుగుతుంది
చిలకలూరిపేట - మొదటిలో వ్యాక్సిన్ వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి అని రూమర్స్ నమ్మిన ప్రజలు ఇప్పుడు ప్రాణ భయంతో ఆ రూమర్స్ కి చెక్ పెట్టి హాస్పిటల్స్ బాట పట్టారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సిన్ కొరత ఉన్నపటికీ. మొదటి డోసు వేపించుకున్న వారికీ రెండో డోసు వేపించుకునే సమయం దగిర పడిన సందర్భంలో చిలకలూరిపేట నోడల్ డాక్టర్ గోపి నాయక్ గారు పట్టంలో రెండవ డోసు అర్హుల జాబితా రెడీ చేసారు. 1858 మందికి రెండవ డోసు వెయ్యాలి అని నిర్ణయించుకున్నారు. ఈ రోజు రేపు అనగా మంగళవారం & బుధవారం నాడు రెండవ డోసు వారికీ వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తి చెయ్యాలి అని తరువాత నుండి మొదటి డోసులు ప్రక్రియ మొదలిపెట్టాలి అని సూచించారు.
అయితే చిలకలూరిపేట B R I G ( భారత రత్న ఇందిరా గాంధీ ) మున్సిపల్ హైస్కూల్ నందు శాశ్వత వ్యాక్సిన్ ప్రక్రియ మొదలుపెట్టనున్నారు. చిలకలూరిపేట రురల్ ప్రజలకు కావూరు, యడ్లపాడు మండలాలలో లూధరన్ హైస్కూల్ నందు, నాదెండ్ల జిల్లా పరిషత్ హైస్కూల్ నందు శాశ్వత వ్యాక్సిన్ ప్రక్రియ మొదలుకానున్నది.
వ్యాక్సిన్కి గాను ప్రభుత్వం టోకెన్ విధానాన్ని అనుసరించనున్నది. గ్రీన్ కలర్ టోకెన్ 60 సంవత్సరాల వారికీ. రెడ్ కలర్ టోకెన్ ఫ్రంట్ లైన్ వర్కర్స్, బ్లూ కలర్ టోకెన్ 45 సంవత్సరాల వారికీ అందజేస్తాం అని తెలిపారు.
వ్యాక్సిన్లు మంగళవారం మధ్యానానికి రావచ్చు అంచనా. సచివాలయ సిబ్బంది వ్యాక్సిన్ టోకెన్లను అందజేసి ఆయా టైం లో వ్యాక్సిన్ ఉంటుంది అని తెలియజేస్తారు. వార్డు వాలంటరీల ద్వారా వ్యాక్సిన్ వేయించుకోవాలి అని తెలిపారు
చిలకలూరిపేట - ఆక్సిజెన్ సీలిండర్లు తెచ్చుకోండి ట్రీట్మెంట్ చేస్తాం - అయోమయంలో కరోనా రోగుల కుటుంబ సభ్యులు
చిలకలూరిపేట - ఆక్సిజెన్ సీలిండర్లు తెచ్చుకోండి ట్రీట్మెంట్ చేస్తాం - అయోమయంలో కరోనా రోగుల కుటుంబ సభ్యులు
పట్టంలో ఆక్సిజన్ సిలిండర్ ఇచ్చే సదరు ఏజెన్సీ దగిర ఆక్సిజన్ నిల్వలు ఐపోయ్యాయి అని. ఇప్పుడు ఉన్న ఆక్సిజన్ సీలిండర్లు అయిపోతే పరిస్థితి ఏంటి అని రోగుల కుటుంబ సభ్యులు అయోమయంలో పడ్డారు.













