మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

Advertisement - 2

Image3

........

Advertisement - 3

Image3

........

ప్రకటనల కోసం 90358 80349 నెంబర్ కు సంప్రదించండి.
|

⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!

చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.

💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి

చిలకలూరిపేట D R N S C V S డిగ్రీ కాలేజీ రిటైర్డ్ ప్రిన్సిపాల్ వెంకటరాయలు గారు మృతి చెందారు

చిలకలూరిపేట  D  R N S C V S  డిగ్రీ కాలేజీ  రిటైర్డ్  ప్రిన్సిపాల్ వెంకటరాయలు గారు మృతి చెందారు 

https://chilakaluripetspeednews.blogspot.com/

పట్టణంలోని డి ఆర్  ఎన్ ఎస్  సి వి ఎస్ డిగ్రీ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ అయిన శ్రీ తోటకూర వెంకటరాయులుగారు బెంగళూర్ లోని ఒక ప్రముఖ వైద్యశాలలో ఈరోజు మృతి చెందారు. వెంకటరాయులుగారి మృతికి DNRNSCVS పూర్వ విద్యార్థులు సంతాపం తెలిపారు. ఆయన పార్థివ దేహాన్ని మంగళవారం సాయంత్రానికి పండరీపురం 5వ లైన్ లోని నివాసానికి తీసుకువస్తారు అని సమాచారం. 
Share:

జల శక్తీ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న MLA రజని గారు , విశ్వంలో ప్రతి జీవి మనుగడకు నీరు అవసరం -- MLA రజని

 విశ్వంలో ప్రతి జీవి మనుగడకు నీరు అవసరం -- MLA రజని 

జల శక్తీ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న MLA రజని గారు 


https://chilakaluripetspeednews.blogspot.com/2021/03/blog-post_22.html

సోమవారం ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా యడ్లపాడు గ్రామములో ఎర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వ జల శక్తీ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు MLA రజని గారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జల రక్షణ మన అందరి బాధ్యత అని , నీటి నిల్వలు పెంచాలి అని , ఇది అందరి బాధ్యత అని తెలిపారు. నీరు అనేది విశ్వ0 లో ప్రతి జీవికి అవసరం అందువలన నీటి నిల్వలను పెంచి భూగర్భ జలాలను కాపాడాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో MLA రజని గారితో పాటు జిల్లా పంచాయితీ అధికారి కేశవరెడ్డి,పీడీ శ్రీనివాసరావుగారు,జేసీ ప్రశాంతి గారు మరియు ముఖ్య నాయకులూ పాల్గొన్నారు

Share:

చిలకలూరిపేట తహశీల్ధార్ శ్రీమతి జి సుజాత పైన కోర్టు ధిక్కరణ కేసు నమోదు

చిలకలూరిపేట తహశీల్ధార్ శ్రీమతి జి సుజాత పైన కోర్టు ధిక్కరణ కేసు నమోదు :--

https://chilakaluripetspeednews.blogspot.com/

బొప్పూడి రైతులకు సంబంధించిన భూముల విషయం లో హైకోర్టు చిలకలూరిపేట తహసీల్దార్ గారు న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను పాటించాలి అని మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. అయినప్పటికీ వాటిని ఉల్లంగిస్తూ రైతులపైన తహసీల్దారు గారు పోలీసులకి ఫిర్యాదు చేసారు. .చిలకలూరిపేట రురల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయినది. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ రైతులపైనా కేసు నమోదు అయినందువలన , సి సుబ్బాయమ్మ అనే మహిళా రైతు హైకోర్టు నందు తహశీల్ధార్ సుజాత గారి  పైన కోర్టు ధిక్కరణ కేసు వేశారు. 
ఈ సందర్భంగా నవతరం పార్టీ జాతీయ అధినేత రావు సుబ్రహ్మణ్యం గారు మాట్లాడుతు బొప్పూడి, రాజాపేట, మురికిపూడి, రైతులకు మద్దతుగా ఉంటాను  అని, ధిక్కరణ కేసు కాపీ ని ముఖ్యమంత్రికి, గవర్నర్, మైనింగ్ శాఖ మంత్రులకి రైతులతో కలిసి అందచేస్తాం అని పేదలకి  అండగా వుంటాను అని తెలిపారు. 


Share:

చిలకలూరిపేట మున్సిపల్ ఛైర్మెన్ , వైస్ ఛైర్మెన్ కు అభినందనలు తెలిపిన నాయి బ్రాహ్మణ నాయకులు :--

 చిలకలూరిపేట మున్సిపల్ ఛైర్మెన్ ,   వైస్ ఛైర్మెన్  కు అభినందనలు తెలిపిన నాయి బ్రాహ్మణ నాయకులు :--







చిలకలూరిపేటలో నాయి బ్రాహ్మణ నాయకులూ  నూతనముగా మున్సిపల్ ఛైర్మెన్ , వైస్ చైర్మన్ గా  ఎన్నిక అయిన రఫాని గారిని , కొలిశెట్టి శ్రీనివాసరావు గారిని మర్యాదపూర్వకంగా కలిసి వారికీ అభినందనలు తెలిపారు. ఈ సందర్భముగా నాయి బ్రాహ్మణ నాయకులు రఫాని గారిని , కొలిశెట్టి శ్రీనివాసరావు గారిని సత్కరించారు. నాయి బ్రాహ్మణ సేవా సంఘ నాయకులు పాల్గొన్నారు.   


Share:

గుంటూరు జిల్లాలో మెగా జాబ్ మేళా

గుంటూరు జిల్లాలో  మెగా జాబ్ మేళా 



రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి షేక్ బాజీబాబు ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా లోని వినుకొండ పట్టణంలో శ్రీ సాయి డిగ్రీ కాలేజీ నందు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నటు తెలిపారు. 
ఈ నెల 23వ తేదీన ఉదయం 9:30 గంటలకు మొదలు మధ్యాన్నం వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు . ఇతర వివరాలకు 1800-425-2422 టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసి సమాచారం పొందాలి అని తెలిపారు. వయసు 18 నుండి 25 సంవత్సరాలు కలిగి ఉండాలి అని అన్నారు. 


Share:

చిలకలూరిపేట లో పేకాట స్థావరాల పైనా దాడులు పలువురి అరెస్ట్

 చిలకలూరిపేట లో పేకాట స్థావరాల పైనా దాడులు :--



చిలకలూరిపేట రురల్ ఎస్ ఐ  భాస్కర్ గారి ఆధ్వరంలో  స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఈ దాడులలో భాగంగా కావూరు గ్రామము నందు 11 మంది పేకాటరాయుళ్లని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 17,900 రూపాయల నగదుని సీజ్ చేయటం జరిగింది. ఇలా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం అని SI భాస్కర్ గారు  తెలిపారు.
Share:

T20 సిరీస్ ని కైవసం చేసుకున్న భారత్ - కురాళ్ళు కుమ్మేసారు

 T20 సిరీస్ ని కైవసం చేసుకున్న భారత్ - కురాళ్ళు కుమ్మేసారు 



36 రన్స్ తో సిరీస్ ని కైవసం చేసుకున్న భారత్ . 5వ T20 లో మన భారత జట్టు చెలరేగిపోయారు . తొలుత బాటింగ్ కి దిగిన భారత్ 20 ఓవర్లకి  224 పరుగులకి 2 వికెట్స్ కోల్పోయినది . రన్స్ మిషన్ (80*) , రోహిత్ 64, పాండ్య 39*, సూర్య 32 తో చెలరేగిపోయారు . లక్షచేధనలో భాగంగా ఇంగ్లీష్ జట్టు లో బట్లర్ 52, మలన్ 68 తో  రెచ్చిపోయారు . కానీ భువి , శార్దూల్ పరుగుల ప్రవాహానికి అడ్డుకట్ట వేశారు . చివరకు 20 ఓవర్లకు 188 రన్స్ 8 వికెట్స్ కొలిపోయి భారత్ విజయానికి చేరువ అయినది 


Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.
📸
మీ వార్తలను మాతో పంచుకోవడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి