మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

Advertisement - 2

Image3

........

Advertisement - 3

Image3

........

ప్రకటనల కోసం 90358 80349 నెంబర్ కు సంప్రదించండి.
|

⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!

చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.

💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి

చిలకలూరిపేట - అటు పంచాయతీ లేదు.. ఇటు మున్సిపాలిటీ కాదు.. ఈ ఊరి పాపం ఏంటి? గ్రామమా? వార్డా? తేలని సందిగ్ధత.. వ్యవస్థల మధ్య నలిగిపోతున్న ఆ ఊరి ప్రజలు! పూర్తి వివరాల కోసం క్రింది లింక్ పైకి ఇచ్చేయండి.

చిలకలూరిపేట - అటు పంచాయతీ లేదు.. ఇటు మున్సిపాలిటీ కాదు.. ఈ ఊరి పాపం ఏంటి? గ్రామమా? వార్డా? తేలని సందిగ్ధత.. వ్యవస్థల మధ్య నలిగిపోతున్న ఆ ఊరి ప్రజలు!


అటు పంచాయతీ కాక.. ఇటు మున్సిపాలిటీలో కలవక.. రెంటికీ చెడ్డ రేవడిలా 'మానుకొండవారిపాలెం'..! 💔

అభివృద్ధికి ఆమడదూరంలో విలీన గ్రామాలు.. నెత్తురోడుతున్న రహదారులు!

​చిలకలూరిపేట రూరల్ పరిధిలోని మానుకొండవారిపాలెం గ్రామం పరిస్థితి ఇప్పుడు వర్ణనాతీతంగా మారింది. పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్నా.. అభివృద్ధిలో మాత్రం దశాబ్దాల వెనకబడిపోయింది. అటు పంచాయతీ పాలన లేక, ఇటు మున్సిపాలిటీలో కలవక.. ఐదేళ్లుగా స్పెషల్ ఆఫీసర్ల పాలనలో ఈ గ్రామ ప్రజలు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు. అసలు ఈ ఊరి పరిస్థితి చూస్తే.. వ్యవస్థల మధ్య నలిగిపోతున్న సామాన్యుడి కష్టం కళ్లకు కడుతుంది!

​🛑 మురిసిన ఆనందం.. మూన్నాళ్ల ముచ్చటే!

2020 జనవరిలో చిలకలూరిపేట మున్సిపాలిటీలో గణపవరం, మానుకొండవారిపాలెం, పసుమర్రు, దండమూడి గ్రామాలను విలీనం చేస్తూ ప్రభుత్వం జీవోలు (G.O 83, 260) జారీ చేసింది. మున్సిపాలిటీలో కలిస్తే తమ గ్రామం కూడా సిటీలా డెవలప్ అవుతుందని, మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయని మానుకొండవారిపాలెం వాసులు ఎంతో సంబరపడ్డారు. కానీ ఉపాధి హామీ, ఆర్థిక సంఘం నిధులు ఆగిపోతాయని కొందరు కోర్టును ఆశ్రయించి స్టే తేవడంతో.. ఆ గ్రామాల ఆనందం ఆవిరైపోయింది.

​⚖️ నాథుడు లేని ఊరు.. ఐదేళ్లుగా అదే తీరు!

కోర్టు స్టే కారణంగా.. అటు మున్సిపల్ ఎన్నికలు జరగలేదు, ఇటు పంచాయతీ ఎన్నికలూ నిర్వహించలేదు. ఫలితంగా ఈ నాలుగు గ్రామాలకు సర్పంచులు, వార్డు మెంబర్లు లాంటి ప్రజాప్రతినిధులు లేకుండా పోయారు. స్పెషల్ ఆఫీసర్ల పాలనలో నిధుల రాక నిలిచిపోయింది. కనీసం వీధిలైట్లు, డ్రైనేజీలు, రోడ్లు పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. "మా గోడు ఎవరికి చెప్పుకోవాలి?" అంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

​⚠️ ప్రాణాలు తీస్తున్న 'దండమూడి - మానుకొండవారిపాలెం' రహదారి! 🚑

అభివృద్ధి లేకపోవడం ఒక ఎత్తు అయితే.. ఊరికి వెళ్లే దారి ప్రాణసంకటంగా మారడం మరో ఎత్తు. దండమూడి నుండి మానుకొండవారిపాలెం వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా ధ్వంసమైంది. ఎక్కడ గుంత ఉందో, ఎక్కడ రోడ్డు ఉందో తెలియని భయానక పరిస్థితి.

  • రాత్రి వేళ నరకం: చీకటి పడిందంటే చాలు.. ఈ దారిలో ప్రయాణించాలంటేనే ప్రజలు వణికిపోతున్నారు.
  • ఆసుపత్రి పాలవుతున్న యువకులు: ద్విచక్ర వాహనాలపై వెళ్లే యువకులు ఈ గుంతల రోడ్డులో స్కిడ్ అయ్యి, కాళ్లు చేతులు విరగ్గొట్టుకుని ఆసుపత్రుల పాలైన ఘటనలు కోకొల్లలు. అత్యవసర పరిస్థితి వస్తే అంబులెన్స్ కూడా రాలేని దుస్థితిలో ఈ రోడ్డు ఉందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

​📉 నిధులు నిల్.. కన్నీళ్లే మిగిలాయి!

చుట్టుపక్కల గ్రామాలు అభివృద్ధి పాయలో దూసుకుపోతుంటే, మానుకొండవారిపాలెం మాత్రం అనాథలా మిగిలిపోయింది. "మా గ్రామ అభివృద్ధి పట్ల మేం అందరికన్నా వెనుకబడిపోయాం. కనీస సదుపాయాలు లేక నరకం అనుభవిస్తున్నాం" అని గ్రామస్తులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఏళ్ల తరబడి నెలకొన్న ఈ సందిగ్ధతకు ముగింపు పలకాలని వారు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు.

​🗣️ అధికారులూ.. ఇకనైనా స్పందించండి!

ఈ రోజు ఆ ఊరిలోకి అడుగుపెడితేనే వారి దీనస్థితి మనకు అర్థమవుతుంది. ఇంకెంత కాలం ఈ చట్టపరమైన చిక్కుల పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతారు? తక్షణమే అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి విలీన జీవోల సమస్యను కొలిక్కి తేవాలి. లేదంటే కనీసం ఆ దండమూడి-మానుకొండవారిపాలెం రోడ్డుకైనా మరమ్మతులు చేపట్టి ప్రాణాలు నిలపాలని 'చిలకలూరిపేట స్పీడ్ న్యూస్' డిమాండ్ చేస్తోంది! 🎤 దృశ్యాలు మారుతున్నా.. వీరి తలరాతలు మారేది ఎప్పుడో?!

Share:

బెంగళూరు టూ పేట 'డ్రగ్స్' ప్రయాణం... చిలకలూరిపేటలో గుట్టురట్టు!...పోలీసుల వలలో బడా నేత కుమారుడు!పలుకుబడి ఎంత ఉన్నా వదిలేది లేదంటున్న చిలకలూరిపేట పోలీసులు!.. పూర్తి సమాచారం కోసం క్రింది లింక్ పెట్టి చేయండి..

బెంగళూరు టూ పేట 'డ్రగ్స్' ప్రయాణం... చిలకలూరిపేటలో గుట్టురట్టు!...పోలీసుల వలలో బడా నేత కుమారుడు!పలుకుబడి ఎంత ఉన్నా వదిలేది లేదంటున్న చిలకలూరిపేట పోలీసులు!..


పల్నాడులో మత్తు మహమ్మారి కలకలం... పోలీసుల వలలో డ్రగ్స్ ముఠా!

​పల్నాడు జిల్లాలో యువతను పట్టి పీడిస్తున్న మత్తు మహమ్మారి పడగవిప్పింది. గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న డ్రగ్స్ దందాను చిలకలూరిపేట టౌన్ పోలీసులు అత్యంత చాకచక్యంగా రట్టు చేశారు. పక్కా సమాచారంతో వలపన్ని, బెంగళూరు నుంచి మత్తును మోసుకొస్తున్న ముఠాను కటకటాల్లోకి నెట్టారు.

​🚨 బెంగళూరు టూ పేట... డ్రగ్స్ రవాణా!

​నరసరావుపేట మరియు చిలకలూరిపేటకు చెందిన నలుగురు యువకులు మత్తు పదార్థాలకు తీవ్రంగా బానిసలయ్యారు. సొంత వినియోగానికే కాకుండా దందా చేసేందుకు ఏకంగా బెంగళూరు వెళ్లి నిషేధిత డ్రగ్స్ ను కొనుగోలు చేశారు. అక్కడి నుంచి చిలకలూరిపేటకు తరలిస్తుండగా, పక్కా స్కెచ్ తో కాపు కాసిన చిలకలూరిపేట టౌన్ పోలీసులు వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ ముఠాలో ప్రధాన నిందితుడైన నరసరావుపేటకు చెందిన బొందిలి సాయి సింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

​💊 8 గ్రాముల MDMA, గంజాయి సీజ్...

​పోలీసుల తనిఖీల్లో యువత ప్రాణాలతో చెలగాటమాడే అత్యంత ప్రమాదకరమైన MDMA డ్రగ్ బయటపడింది. నిందితుల వద్ద నుంచి సుమారు 8 గ్రాముల MDMAను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు నరసరావుపేటలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న బొందిలి సాయి సింగ్ అనే యువకుడిని కూడా పోలీసులు తమ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరు కేవలం మత్తుకు బానిసలవ్వడమే కాకుండా, స్థానికంగా ఉన్న యువతకు కూడా వీటిని సరఫరా చేస్తున్నట్లు విచారణలో తేలింది.

​👔 ప్రముఖ నేత కుమారుడి హస్తం..?

​ఈ డ్రగ్స్ వ్యవహారంలో ఒక సంచలన విషయం తెరమీదకు వచ్చింది. అరెస్టయిన వారిలో నరసరావుపేటకు చెందిన ఒక ప్రముఖ రాజకీయ నాయకుడి (తెలుగు యువత అధ్యక్షుడు) కుమారుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే నిందితుల నేపథ్యం ఏదైనా, వారి రాజకీయ పలుకుబడి ఎంతున్నప్పటికీ ఉపేక్షించేది లేదని పోలీసులు తేల్చి చెప్పారు. నిష్పక్షపాతంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు.

​⚖️ కోర్టులో హాజరు... రిమాండ్‌కు తరలింపు

​పట్టుబడిన నలుగురు నిందితులపై కేసులు నమోదు చేసిన చిలకలూరిపేట పోలీసులు, వారిని స్థానిక కోర్టులో హాజరుపరిచారు. ఇందులో ఇద్దరిని నిన్ననే రిమాండ్‌కు తరలించగా, మిగిలిన వారిని కూడా ఈరోజు రిమాండ్‌కు పంపారు. డ్రగ్స్ సరఫరాలో ఇంకెవరి పాత్ర ఉందనే కోణంలో లోతైన దర్యాప్తు కొనసాగుతోంది.

Share:

చిలకలూరిపేట...ఎన్.ఆర్.టి సెంటర్లో స్ఫూర్తిదాయక ఘటన: ఆటోలో మర్చిపోయిన ఫోన్ తిరిగిచ్చిన ప్రెసిడెంట్ రాజు.పూర్తి వివరాల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి....

చిలకలూరిపేట...ఎన్.ఆర్.టి సెంటర్లో స్ఫూర్తిదాయక ఘటన: ఆటోలో మర్చిపోయిన ఫోన్ తిరిగిచ్చిన ప్రెసిడెంట్ రాజు..


నిజాయితీకి నిలువెత్తు రూపం: ప్రయాణికుడికి సెల్ ఫోన్ తిరిగిచ్చిన ఆటో యూనియన్ ప్రెసిడెంట్! 🚨

​ప్రస్తుత రోజుల్లో ఒక చిన్న వస్తువు దొరికితేనే జేబులో వేసుకునే సమాజంలో, ఒక ఆటో యూనియన్ ప్రెసిడెంట్ తన గొప్ప మనసును చాటుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు. చిలకలూరిపేటలో జరిగిన ఈ స్ఫూర్తిదాయక ఘటన వివరాలు ఇలా ఉన్నాయి...

📱 ఆటోలో మర్చిపోయిన మొబైల్

సాంకేతికత పెరిగిన ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ పోతే ప్రాణం పోయినంత పనవుతుంది, అందులో ఎంతో ముఖ్యమైన సమాచారం ఉంటుంది. బుధవారం నాడు నాదెండ్ల మండలానికి చెందిన కంభంపాటి సురేష్ అనే వ్యక్తి చిలకలూరిపేట పట్టణంలోని ఎన్.ఆర్.టి సెంటర్ గుండా ఆటోలో ప్రయాణిస్తూ పొరపాటున తన విలువైన సెల్ ఫోన్‌ను అందులోనే మర్చిపోయాడు. ఫోన్ పోయిందని గమనించిన సురేష్ తీవ్ర ఆందోళనకు గురై, ఎక్కడ వెతకాలో తెలియక సతమతమయ్యాడు.

🤝 ఆదర్శంగా నిలిచిన రాజు గారి నిజాయితీ

అదే ఆటోలో ఉన్న సెల్ ఫోన్‌ను స్థానిక ఆటో యూనియన్ ప్రెసిడెంట్ రాజు గమనించారు. ఏమాత్రం దురాశకు పోకుండా, తక్షణమే ఆ ఫోన్‌ను తీసుకువెళ్లి చిలకలూరిపేట పోలీస్ స్టేషన్‌లో అప్పగించి తన నిజాయితీని, ఆటో కార్మికుల నిబద్ధతను నిరూపించుకున్నారు.

👮‍♂️ పోలీసుల చొరవ - అభినందనల వెల్లువ

ఈ విషయం తెలుసుకున్న సి.ఐ రమేష్ గారి ఆదేశాల మేరకు, ఎస్.ఐ సోమేశ్వరరావు గారు బాధితుడు సురేష్‌ను పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. ఎవరైతే నిజాయితీగా ఫోన్ తెచ్చి ఇచ్చారో వారితోనే ఇప్పించడం సరైన పద్ధతి అని భావించిన ఎస్.ఐ గారు, ప్రెసిడెంట్ రాజు చేతుల మీదుగానే ఆ సెల్ ఫోన్‌ను బాధితుడు సురేష్‌కు సంతోషంగా తిరిగి అప్పగించారు.

​పోయిందనుకున్న ఫోన్ తిరిగి దొరకడంతో సురేష్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. బాధ్యతాయుతంగా వ్యవహరించిన రాజును పోలీసు అధికారులు, స్థానికులు ప్రత్యేకంగా అభినందించారు. సమాజంలో ఇలాంటి వ్యక్తులు ఉన్నంతకాలం మానవత్వం బ్రతికే ఉంటుందని పలువురు కొనియాడారు.

Share:

చిలకలూరిపేట రూరల్ - నెత్తురోడిన కల్లు గీత కార్మికుడు!సొంత బాబాయి కొడుకుల దారుణం... పరారీలో నిందితులు! మాటు వేసి పదిమంది దొండగలుతో దాడి....

చిలకలూరిపేట రూరల్ - నెత్తురోడిన కల్లు గీత కార్మికుడు!సొంత బాబాయి కొడుకుల దారుణం... పరారీలో నిందితులు! మాటు వేసి పదిమంది దొండగలుతో దాడి....


నెత్తురోడిన మానకొండూరు పాలెం... సొంత బంధువులే ప్రాణాలు తీయాలని చూశారు! 

చిలకలూరిపేట (మానకొండూరు పాలెం): కల్లు గీత కార్మికుల మధ్య రగిలిన ఆధిపత్య పోరు ఏరులై పారిన రక్తానికి దారితీసింది. పంచుకున్న కల్లు చెట్ల వద్ద మొదలైన చిన్నపాటి గొడవ, పక్కా పథకంతో జరిగిన భారీ మారణహోమంగా మారింది. కళ్లెదుటే సొంత బాబాయి, పెదనాన్నల కుటుంబాలు కత్తులు, గొడ్డళ్లతో విరుచుకుపడటంతో మానకొండూరు పాలెంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తీవ్ర గాయాలపాలైన బాధితుడి కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.

​👨‍👩‍👦 కష్టజీవి రవిబాబు... భయాందోళనలో కుటుంబం

​మానకొండూరు పాలెంలో వినాయకుడి గుడి సమీపంలో ఓ అద్దె ఇంట్లో నివసిస్తున్న పోతులూరి రవి బాబు (40) వృత్తిరీత్యా కల్లు గీత కార్మికుడు. ఎండనకా వాననకా కష్టపడి కల్లు దుకాణం నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇతనికి 14 ఏళ్లు, 12 ఏళ్ల వయసున్న ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే, కల్లు చెట్లు గీసుకునే విషయంలో హరిబాబుకు, అతని సొంత బాబాయి కొడుకులకు మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. నిందితులు సరిగ్గా కల్లు గీసుకోకుండా, హరిబాబు కష్టపడి పనిచేసుకోవడం చూసి ఓర్వలేక గొడవలకు దిగినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

​🗡️ పక్కా స్కెచ్... అర్ధరాత్రి వార్నింగ్, ఉదయాన్నే ఎటాక్!

​ఈ దాడి అకస్మాత్తుగా జరిగింది కాదు, దీని వెనుక ముందు రోజే పక్కా స్కెచ్ వేశారు. రాత్రి సమయంలో సుమారు 10 మంది దుండగులు హరిబాబు ఇంటికి వచ్చి బెదిరింపులకు దిగారు. ఆ సమయంలో గొడవ ఎందుకని సైలెంట్ గా ఉన్న హరిబాబుకు, మరుసటి రోజు ఉదయం 5 గంటలకే మృత్యువు కత్తుల రూపంలో ఎదురొచ్చింది. దాదాపు 20 మంది మూకుమ్మడిగా కత్తులు, గొడ్డళ్లు, కర్రలతో దాడికి తెగబడ్డారు. అత్యంత దారుణమైన విషయం ఏమిటంటే... ఈ దాడిలో చిన్నపిల్లలు సైతం కర్రలు పట్టుకుని రావడం అక్కడి వారిని విస్మయానికి గురిచేసింది.

​🏥 తల పగలగొట్టి... చేతులు నరికి... విచక్షణారహితంగా దాడి

​సొంత బాబాయి కొడుకు ఆంజనేయులు, గోవింద్ కొడుకులు, వెంకటేశ్వర్లు కొడుకులు కలిసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. హరిబాబుపై అత్యంత పాశవికంగా కత్తులతో దాడి చేశారు. తల మధ్యలో కత్తితో నరకడంతో తల పగిలిపోయింది. ఆ దెబ్బను అడ్డుకునే క్రమంలో చేతిపై, నడుముపై కూడా తీవ్రమైన కత్తి గాట్లు పడ్డాయి. కొడుకును రక్షించుకునేందుకు అడ్డువెళ్లిన రవిబాబు తండ్రి పోతులూరి కొండలు (నిందితులకు స్వయానా పెద్దనాన్న) పై కూడా దుండగులు దాడి చేశారు. అదృష్టవశాత్తూ ఆయన చిన్నపాటి గాయాలతో ప్రాణాపాయం నుండి బయటపడ్డారు.

​🚨 పరారీలో నిందితులు... ప్రాణాపాయ స్థితిలో బాధితుడు

​సీఐకి, పోలీసులకు ఫోన్ చేసి సహాయం కోరే లోపే కంటిరెప్ప పాటులో ఈ ఘోరం జరిగిపోయింది. రక్తపు మడుగులో కుప్పకూలిన హరిబాబును హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. విపరీతంగా రక్తస్రావం కావడంతో ప్రస్తుతం రవిబాబు పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. కత్తిపోట్లకు పాల్పడిన నిందితులు అందరూ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. సొంత నెత్తురే ఇలా పగబట్టి కత్తులతో దాడి చేయడంతో భార్య, ఇద్దరు పిల్లల రోదనలు అక్కడి వారిని కంటతడి పెట్టిస్తున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Share:

చిలకలూరిపేట సీఎం టూర్‌లో ఊహించని ట్విస్ట్: పైన హెలికాప్టర్ హోరు.. కింద దొంగల జోరు!రెప్పపాటులో జేబులకు చిల్లులు!... అసలేం జరిగిందో తెలుసుకోవడం కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి...

చిలకలూరిపేట సీఎం టూర్‌లో ఊహించని ట్విస్ట్: పైన హెలికాప్టర్ హోరు.. కింద దొంగల జోరు!రెప్పపాటులో జేబులకు చిల్లులు!...


సీఎం టూర్‌లో ఊహించని ట్విస్ట్.. హెలిపాడ్ వద్ద దొంగల చేతివాటం.. దేహశుద్ధి చేసిన స్థానికులు! 🚨

​రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిలకలూరిపేట పర్యటనలో ఒక ఆసక్తికరమైన, అనుకోని ఘటన చోటుచేసుకుంది. సీఎం వస్తున్నారని ఆనందంతో వెళ్లిన జనాల మధ్యకు కొందరు కేటుగాళ్లు దూరారు. ఇంతకీ అక్కడ ఏం జరిగిందంటే..?

​🚁 హెలికాప్టర్ చూసే కంగారులో జనాలు.. ఇదే ఛాన్స్ అనుకున్న దొంగలు! 👀

సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన ముగించుకుని తిరిగి హెలిపాడ్ వద్దకు చేరుకుంటున్న సమయం అది. ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికేందుకు, అలాగే హెలికాప్టర్‌ను దగ్గర్నుంచి చూసేందుకు సమీపంలోని లింగంగుంట్ల గ్రామానికి చెందిన ప్రజలు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఒకపక్క సీఎంను చూస్తున్నామన్న ఆనందం, మరోపక్క ఎగిరే హెలికాప్టర్ల హోరు.. సరిగ్గా ఈ హడావుడినే తమకు అనుకూలంగా మార్చుకున్నారు కొందరు జేబు దొంగలు!

​✂️ రెప్పపాటులో జేబుకు కత్తెర.. సినిమా సీన్‌ను తలపించిన దొంగతనం! 💸

జనాలంతా ఆకాశం వైపు చూస్తూ మురిసిపోతుండగా.. కింద దొంగలు తమ చేతివాటం ప్రదర్శించడం మొదలుపెట్టారు. పరిస్థితిని గమనించిన ఓ కేటుగాడు, లింగంగుంట్ల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వెనుక జేబులోంచి చాకచక్యంగా కొంత డబ్బును కాజేశాడు. ఎవరూ చూడట్లేదనుకుని, తాను దొంగిలించిన సొమ్మును క్షణాల్లో పక్కనే ఉన్న తన అనుచరుడికి పాస్ చేశాడు. అచ్చం సినిమాల్లో లాగే పక్కా స్కెచ్‌తో ఈ తతంగం నడిపించారు.

​👊 అడ్డంగా బుక్కైన కేటుగాళ్లు.. పరుగు తీయించిన లింగంగుంట్ల కుర్రాళ్లు! 💥

దొంగలు ఎంత తెలివిగా ప్రవర్తించినా, స్థానికుల కళ్లుగప్పలేకపోయారు. డబ్బులు చేతులు మారుతున్న విషయాన్ని పసిగట్టిన యువకులు వెంటనే అప్రమత్తమయ్యారు. క్షణాల్లో వలపన్ని ఇద్దరు దొంగలను పట్టుకున్నారు. దొరికిన దొంగల్లో ఒకడు అక్కడి నుంచి జారుకునేందుకు (పారిపోయేందుకు) విఫలయత్నం చేయగా.. ఊరి కుర్రాళ్లు అతన్ని వెంబడించి మరీ పట్టుకున్నారు.

​🔥 "మా ఊరి పరువు తీస్తారా?" అంటూ దేహశుద్ధి! 😡

"మా ఊరికి హెలికాప్టర్ వచ్చిందని, సీఎం గారిని చూడటానికి ఎంతో సంతోషంగా వస్తే.. ఇలా దొంగతనాలు చేసి మా ఊరి పరువు తీస్తారా? సీఎం సభలో దొంగతనం జరిగిందని బయట చెప్పుకుంటే అది మాకే చెడ్డపేరు!" అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు.. ఆ ఇద్దరు దొంగలకు దేహశుద్ధి చేసి (గట్టిగా బుద్ధి చెప్పి) అక్కడే కట్టడి చేశారు.

 దొంగతనం వీడియో కోసం కింది లింకుపై క్లిక్ చేయండి 

https://www.instagram.com/reel/DZ8wfuNy0wR/?igsh=MTZ4Y3N6NnRzNXBiZA==

​🚓 ఎంట్రీ ఇచ్చిన ఎస్సై అనిల్ కుమార్.. దొంగలు కటకటాల్లోకి! ⚖️

సమాచారం అందుకున్న వెంటనే స్థానిక ఎస్సై అనిల్ కుమార్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులు పట్టుకున్న నిందితులను అదుపులోకి తీసుకుని, వెంటనే వారిని చిలకలూరిపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసుల సకాల స్పందనతో, గ్రామస్తుల అప్రమత్తతతో దొంగలు ఊచలు లెక్కపెడుతున్నారు.

Share:

రేపు చిలకలూరిపేటలో విడదల రజిని పుట్టినరోజు వేడుకలు..! కేక్ కటింగ్‌లు, అన్నదానాలు, సేవా కార్యక్రమాలు... పూర్తి షెడ్యూల్... కోసం క్రింది లింక్ పైన క్లిక్ చెయ్యండి.

రేపు చిలకలూరిపేటలో విడదల రజిని పుట్టినరోజు వేడుకలు..! కేక్ కటింగ్‌లు, అన్నదానాలు, సేవా కార్యక్రమాలు... పూర్తి షెడ్యూల్...


రేపు వాడవాడలా మాజీ మంత్రి విడదల రజిని జన్మదిన వేడుకలు! 💥

​చిలకలూరిపేట ప్రజల ఆత్మీయురాలు, పేదల పక్షపాతి, వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి వర్యులు శ్రీమతి విడదల రజిని జన్మదినం (24-06-2026, బుధవారం) పురస్కరించుకుని చిలకలూరిపేట పట్టణం ముస్తాబవుతోంది. పదవిలో ఉన్నా లేకున్నా నిత్యం ప్రజల మధ్య ఉంటూ, నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్న నాయకురాలి పుట్టినరోజును ఒక పండుగలా జరుపుకోవడానికి వైసీపీ శ్రేణులు, అభిమానులు సన్నద్ధమయ్యారు. ఈ వేడుకల సన్నాహకాల్లో భాగంగా పట్టణ అధ్యక్షుడు షేక్ దరియా వలి, పల్నాడు జిల్లా వైస్సార్సీపీ యూత్ అధ్యక్షులు కందుల శ్రీకాంత్ ఆధ్వర్యంలో పలువురు సీనియర్ నాయకులతో జరిగిన ఆత్మీయ సమావేశం కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపింది. సేవా కార్యక్రమాలు, అన్నదానాలు, మహానేతకు నివాళులతో రేపు రోజంతా పట్టణంలో సందడి నెలకొననుంది.

​✨ రేపటి కార్యక్రమాల వివరాలు... మీకోసం షార్ట్ అండ్ స్వీట్ గా! 👇

​🕌 ఉదయం: సర్వమత ప్రార్థనలు - సేవా కార్యక్రమాలు 🕊️

  • ఉదయం 10:00 గంటలకు: నరసరావుపేట రోడ్డులోని మాజీ మంత్రి విడదల రజిని క్యాంపు కార్యాలయంలో అభిమానుల కోలాహలం మధ్య భారీ కేక్ కటింగ్ మరియు సర్వమత ప్రార్థనలు. 🎂
  • ఉదయం 11:00 గంటలకు: ప్రశాంతి వృద్ధాశ్రమంలో వృద్ధులకు కమ్మని భోజనం. (ఆధ్వర్యం: షేక్ బడేమియా, ఆసిఫ్, అహ్మద్ ఆలీ). 🍛
  • ఉదయం 11:45 గంటలకు: ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, పలహారాల పంపిణీ చేసి వారిలో భరోసా నింపే కార్యక్రమం. (ఆధ్వర్యం: తుపాకుల రామకృష్ణ). 🍎
  • మధ్యాహ్నం 12:00 గంటలకు: పెదనందిపాడు రోడ్డులోని ఎస్.సి, ఎస్.టి హాస్టల్ విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తును ఆకాంక్షిస్తూ పుస్తకాల పంపిణీ. (ఆధ్వర్యం: ఫరీద్ బాబు). 📚

​👑 మహానేత వైఎస్సార్ ఆశీస్సులతో... విగ్రహాల వద్ద నివాళులు & కేక్ కటింగ్స్ 🤝

  • ఉదయం 11:15 గంటలకు: రిజిస్ట్రార్ కార్యాలయం సమీపంలో వైఎస్సార్ విగ్రహం వద్ద (ఆధ్వర్యం: తాళ్ళ అంజిరెడ్డి).
  • ఉదయం 11:30 గంటలకు: 10వ వార్డు, బేరింగ్ బజార్ సెంటర్లో (ఆధ్వర్యం: సయ్యద్ జమీర్).

​🎇 సాయంత్రం: వాడవాడలా జాతరను తలపించేలా సంబరాలు! 🚀

  • సా. 7:00 గంటలకు: సుభానినగర్ వైఎస్సార్ విగ్రహం వద్ద ఘనంగా వేడుకలు (ఆధ్వర్యం: యూసుబ్ వలి, శివమణి). 🎉
  • సా. 7:15 గంటలకు: సుభానినగర్ జెండా చెట్టు సమీపంలో వైఎస్సార్ విగ్రహం వద్ద కేక్ కటింగ్ (ఆధ్వర్యం: బాజీ మున్నీ, షేక్ సుభాని). 🍰
  • సా. 7:30 గంటలకు: పురుషోత్తమపట్నం 30వ వార్డులో సంబరాలు (ఆధ్వర్యం: నూర్ అహ్మద్, వెల్డింగ్ ఆలి). ✨
  • సా. 7:45 గంటలకు: ఆది ఆంధ్ర కాలనీలో దళిత సోదరులతో కలిసి కేక్ కటింగ్ (ఆధ్వర్యం: బండారు వీరయ్య). 🎊
  • రా. 8:00 గంటలకు: 34, 35 వార్డులలో వైఎస్సార్ విగ్రహం వద్ద వేడుకల ముగింపు సంబరాలు (ఆధ్వర్యం: కోట నాయక్, రమణి బాయ్, నరసింహ నాయక్). 🎈

​👥 సమావేశంలో పాల్గొన్న ముఖ్య నాయకులు:

తాళ్ళ అంజిరెడ్డి, కొప్పురావూరి పటేల్, కొండవీటి ఆంజనేయులు, బక్షు మేస్త్రి, గోపతోటి జాన్, బండారు వీరయ్య, ఫరీద్, యూసుబ్ అలీ, శివమణి దరియా వలి, తియ్యగూర అంజిరెడ్డి, బండారు జయ, ఊసా రమేష్, శాపా సైదావలి, దోగిపర్తి సాయి, తుపాకుల రామకృష్ణ తదితరులు.

​📣 పార్టీ శ్రేణులకు పిలుపు:

మన నాయకురాలు శ్రీమతి విడదల రజిని జన్మదినాన్ని పురస్కరించుకుని జరుగుతున్న ఈ మహా సేవా కార్యక్రమాల్లో, సంబరాల్లో వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము.

Share:

చిలకలూరిపేట రూరల్ - యడ్లపాడులో తీవ్ర విషాదం..ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడి ప్రత్తిపాటి చిన్న యువకుడి మృతి... పూర్తి వివరాల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి..

చిలకలూరిపేట రూరల్ - యడ్లపాడులో తీవ్ర విషాదం..ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడి ప్రత్తిపాటి చిన్న యువకుడి మృతి... 


🚨 చిలకలూరిపేట స్పీడ్ న్యూస్: ఉన్నవ గ్రామంలో తీవ్ర విషాదం.. చెరువులో మునిగి యువకుడి మృతి! 🚨

​పల్నాడు జిల్లా, ఎడ్లపాడు (యడ్లపాడు) మండలం ఉన్నవ గ్రామంలో ఒక విషాదకర సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఆదివారం బయటకు వెళ్లిన యువకుడు విగతజీవిగా మారడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.

​🌊 ఈతకు వెళ్లి కానరాని లోకాలకు..

ఉన్నవ గ్రామంలోని సూర్యనగర్ కాలనీకి చెందిన ప్రత్తిపాటి చిన్న (22) అనే యువకుడు ఆదివారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. గ్రామ సమీపంలోని చెరువులో ఈతకు దిగిన చిన్న.. ఈత కొడుతూ ప్రమాదవశాత్తు చెరువులోని ఓ లోతైన గుంతలో పడిపోయి ప్రాణాలు కోల్పోయాడు.

​💔 తల్లికి ఆసరాగా ఉన్న కొడుకు..

గ్రామానికి చెందిన ప్రత్తిపాటి పాపారావు, ఏసమ్మ దంపతులకు మొత్తం ముగ్గురు కుమారులు. వీరిలో చిన్న రెండోవాడు. రాడ్ బెండింగ్ పనులు చేసుకుంటూ తన తల్లికి ఆసరాగా, కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. ఆదివారం రాత్రి అయినా చిన్న ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు అతని కోసం అంతటా వెతకడం ప్రారంభించారు.

​😭 చెరువులో తేలిన మృతదేహం..

కుటుంబ సభ్యులు వెతుకుతుండగానే.. సోమవారం మధ్యాహ్నం సుమారు 3 గంటల ప్రాంతంలో ఇంటి సమీపంలోని చెరువులో ఒక మృతదేహం తేలియాడుతుండటాన్ని స్థానికులు గమనించారు. వెంటనే గ్రామస్తులు చెరువులోకి దిగి మృతదేహాన్ని వెలుపలికి తీశారు. అప్పటికే ఆ యువకుడు మృతి చెంది ఉండగా, ఆ మృతదేహాన్ని చిన్నగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

​🕯️ మిన్నంటిన రోదనలు..

చేతికొచ్చిన కొడుకు విగతజీవిగా మారడంతో ప్రత్తిపాటి కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. ఈతకు వెళ్లి గుంతలో పడిపోవడం వల్లే చనిపోయాడని తెలుస్తుండగా.. ఈ మృతికి సంబంధించి ఇతర ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.
📸
మీ వార్తలను మాతో పంచుకోవడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి