మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

Advertisement - 2

Image3

........

Advertisement - 3

Image3

........

ప్రకటనల కోసం 90358 80349 నెంబర్ కు సంప్రదించండి.
|

⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!

చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.

💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి

శ్రీ జ్వాలాముఖి పోలేరమ్మ తల్లి దేవస్థానం తృతీయ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న మల్లెల రాజేష్

శ్రీ జ్వాలాముఖి పోలేరమ్మ తల్లి దేవస్థానం తృతీయ వార్షికోత్సవ  వేడుకల్లో పాల్గొన్న మల్లెల రాజేష్

♦️🕉️🕉️♦️ *శ్రీ జ్వాలాముఖి పోలేరమ్మ తల్లి దేవస్థానం తృతీయ వార్షికోత్సవ  వేడుకల్లో పాల్గొన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు గారు*  చిలకలూరిపేట పట్టణంలోని పెదనందిపాడు రోడ్డు పక్కన శ్రీనివాసానగర్ కొత్త వాటర్ ట్యాంకు వద్ద వేంచేసియన్న శ్రీ జ్వాలాముఖి పోలేరమ్మ తల్లి దేవస్థానం తృతీయ వార్షికోత్సవ  వేడుకలుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు గారు ఆదివారం హాజరయ్యారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రాజేష్ నాయుడు గారు అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామి వారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ కొలిశెట్టి శ్రీనివాసరావు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టణ క్లస్టర్ 1 అధ్యక్షులు పఠాన్ తలహాఖాన్, వైయస్సార్సీపీ నాయకులు చల్లా విఘ్నేశ్వరరెడ్డి, పంగులూరి వెంగళ రాయుడు, బేరింగ్ మౌలాలి, గుంజి వీరాంజనేయులు,  దేవాలయ కమిటీ సభ్యులు తోకల నాగరాజు దాసరి శివకోటయ్య, పాలపర్తి అంజమ్మ, పాలపర్తి విమలమ్మ, దేవరకొండ ఏడుకొండలు, దేవరకొండ నరేష్ తదితరులు పాల్గొన్నారు.

చిలకలూరిపేట:-  పట్టణంలోని పెదనందిపాడు మారుతీ నగర్ నందు వేంచేసి ఉన్న జ్వాలాముఖి పోలేరమ్మ తల్లి దేవస్థానం తృతీయ వార్షికోత్సవ వేడుకలుకు వైయస్సార్సీపి నియోజకవర్గ సమన్వయకర్త మల్లెల రాజేష్ హాజరయ్యారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామి వారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వారితోపాటు, మున్సిపల్ వైస్ చైర్మన్ కొలిశెట్టి శ్రీనివాసరావు, వైఎస్ఆర్సిపి పట్టణ క్లస్టర్ 1 అధ్యక్షులు పఠాన్ తలహాఖాన్, వైయస్సార్సీపీ నాయకులు చల్లా విఘ్నేశ్వరరెడ్డి, పంగులూరి వెంగళ రాయుడు, బేరింగ్ మౌలాలి, గుంజి వీరాంజనేయులు,  దేవాలయ కమిటీ సభ్యులు తోకల నాగరాజు దాసరి శివకోటయ్య, పాలపర్తి అంజమ్మ, పాలపర్తి విమలమ్మ, దేవరకొండ ఏడుకొండలు, దేవరకొండ నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Share:

34వ ప్రత్తిపాటి మెగా ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన.

34వ ప్రత్తిపాటి మెగా ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన

34వ ప్రత్తిపాటి మెగా ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన.

చిలకలూరిపేట:-  నేడు చిలకలూరిపేట పట్టణంలో ప్రత్తిపాటి గార్డెన్స్ నందు ప్రత్తిపాటి మెగా ఉచిత కంటి వైద్య శిబిరానికి ప్రజలు భారీగా చేరుకున్నారు. గుంటూరు - శంకర్ కంటి ఆసుపత్రి వారి జిల్లా అంగత్వ నివారణ సంస్థ వారి సౌజన్యంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 2000 మందికి పైగా కంటి పరీక్షలు నిర్వహించారు. కంటి పరీక్షల అనంతరం కంటి ఆపరేషన్ కూడా ఉచితంగా నిర్వహించారు. వైద్య శిబిరానికి వచ్చిన ప్రజలకు ఉచిత బీపీ మరియు షుగర్ టెస్టులను చేసి ఆరోగ్య పరిస్థితి మరియు స్థితిగతులను పరిగణలోకి తీసుకొని ఆపరేషన్ చేసే రోజును వారికి ఇస్తారు. అనంతరం ఆయా రోజులలో చిలకలూరిపేట నుండి గుంటూరు శంకర ఆసుపత్రికి ఉచిత బస్సు సౌకర్యంతో ఆపరేషన్ కూడా ఉచితంగా నిర్వహిస్తారని టిడిపి నాయకుడు తెలిపారు. వైద్య శిబిరానికి విచ్చేసిన వారికి ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజనం సదుపాయం ఏర్పాటు చేశారు.

Share:

CR క్లబ్ నందు ఘంటసాల వర్ధంతి మహోత్సవం - పాల్గొన్న వివిధ పార్టీ నాయకులు

CR క్లబ్ నందు ఘంటసాల వర్ధంతి మహోత్సవం - పాల్గొన్న వివిధ పార్టీ నాయకులు

CR క్లబ్ నందు ఘంటసాల వర్ధంతి మహోత్సవం - పాల్గొన్న వివిధ పార్టీ నాయకులు

చిలకలూరిపేట పట్టణం :- సి ఆర్ క్లబ్ నందు గోరంట్ల నారాయణరావు గారి ఆధ్వర్యంలో ఘంటసాల వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో వివిధ పార్టీ నాయకులు కళాకారులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ తెలుగు సినీ పరిశ్రమ ఎదుగుదలకు మరియు ఎంతోమంది కళాకారులకు ఆదర్శంగా నిలిచిన వ్యక్తి అని ఘంటసాలను కొనియాడారు. అలాగే చరిత్రను మనం ఎప్పుడు మర్చిపోకూడదని ఇలాంటి మహోన్నతమైన వ్యక్తుల జీవితాలను ఎప్పుడు మనస్మరించుకుంటా ఉండాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ లీడర్ నాయుడు శివకుమార్, సి ఆర్ క్లబ్ అధ్యక్షులు చెరుకూరి కాంతయ్య, లోక్సత్తా పార్టీ మాదాసు భాను ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ రాధాకృష్ణ, రోటరీ క్లబ్ వెంకట్రావు, కళాకారులు గొట్టిపాటి రామారావు, భక్తవత్సలం, రవీంద్ర బాబు, బంగారు బాబు, చించు పున్నయ్య, పావులూరి కృష్ణారావు పాల్గొన్నారు.

Share:

చిలకలూరిపేట - నృత్యం చేస్తూ కళాకారుడు గుండెపోటుతో మృతి

చిలకలూరిపేట - నృత్యం చేస్తూ  కళాకారుడు గుండెపోటుతో మృతి

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట పట్టణంలోని సుబ్బయ్య తోటకు చెందిన పూల చిన్న( వేణుగోపాల్) 37 గుండెపోటుతో మృతి చెందారు వివరాల్లోకి వెళితే సుబ్బయ్య తోటకు చెందిన పూల చిన్న అనే నృత్య కళాకారుడు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలలో అమ్మవారి వేషధారణలో కనిపిస్తూ భక్తి రసాన్ని రక్తి కట్టించేవాడు. జిల్లాలోనే కాకుండా రాష్ట్రస్థాయిలో మరియు పలు టీవీ కార్యక్రమాలలో కూడా తన నాట్యంతో మెప్పించేవాడు. అయితే గత రాత్రి పెదనందిపాడు రోడ్డు, మారుతి నగర్ లోని జ్వాలాముఖి పోలేరమ్మ మూడవ వార్షికోత్సవ మహోత్సవంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న అతను డాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. విషయం తెలుసుకున్న స్థానికులు హుటాహుటిన ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్లు సిపిఆర్ చేసినట్లయితే బ్రతికి అవకాశం ఉందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో సుబ్బయ్య తోటలోని సొంత గృహం నందు విషాదఛాయలు అలముకున్నాయి.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

మరిన్ని వార్తల కోసం క్రింది లింకుపై క్లిక్ చేయండి.


https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

Share:

నేడు, రేపు కొండవీడు ఫెస్ట్ - 2024 కొండవీడు ఫెస్ట్ ను విజయవంతం చేయండి : జిల్లా కలెక్టర్ శివ శంకర్

నేడు, రేపు కొండవీడు  ఫెస్ట్ - 2024 కొండవీడు ఫెస్ట్ ను విజయవంతం చేయండి : జిల్లా కలెక్టర్ శివ శంకర్

https://chilakaluripetspeednews.blogspot.com/search?updated-max=2021-11-24T23:49:00-05:00&max-results=14&start=28&by-date=false&m=1

 పల్నాడు జిల్లాలో చారిత్రక,సాంస్కృతిక పరంగా, పర్యాటక ప్రాంతాలు ఎంతో విశిష్టత కలిగిన ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయని, అమరావతి మొదలుకొని నాగార్జున సాగర్ వరకు చాలావరకు పర్యాటక పరంగా అభివృద్ధి చెంది ఉన్నాయని, మరికొన్నిటిని అభివృద్ధి చేయాల్సి ఉందని జిల్లా కలెక్టర్ శివ శంకర్ లోతేటి అన్నారు. పర్యాటక పరంగా అమరావతి, కొండవీడు కోట, కోటప్పకొండ, నాగార్జున సాగర్, ఎత్తిపోతల, పులిచింతల, దైద, గుత్తికొండ బిలం, చేజర్ల, దుర్గి శిల్పకళ, మాచర్ల చెన్నకేశవ స్వామి ఆలయం, వెన్న ముద్ద వేణుగోపాల స్వామి టెంపుల్ (చంఘిజ్ ఖాన్ పేట) ఇలా ఎన్నో పర్యాటక ప్రాంతాలకు నిలయం పల్నాడు జిల్లాగా అవతరించిందని ఆయన పేర్కొన్నారు. కొండవీడు కోటను పర్యాటకపరంగా అభివృద్ధి చేస్తే జిల్లాకు చుట్టుపక్కల జిల్లాల నుంచి, పర్యాటకులు వచ్చే అవకాశం ఉందన్ని ఆ లక్ష్యంతో కొండవీటి కోటను అభివృద్ధి చేశామని, కొండవీటి కోటలో ఉత్సవాల నిర్వహిస్తే, ఆ తరహా పర్యాటక అభివృద్ధికి, బాటలు వేసినట్లు అవుతుందని ఆలోచన చేసామన్నారు, ఆ ప్రాంతమంతా (రిజర్వ్ ఫారెస్ట్) అటవీ ప్రాంతం కావడంతో వారి సహకారంతో సుమారు రూ 4 కోట్లు ఖర్చు చేసి అక్కడ కొన్ని పర్యాటకులకు వసతి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కొండవీటి ప్రాంతాన్ని పరిపాలించిన రెడ్డి రాజులు 12,13 శతాబ్దంలో కొండవీడును పరిపాలించారని గుర్తు చేసుకుంటూ "కొండవీటి ఫెస్ట్ - 2024" ఉత్సవాల సందర్భంగా కొండవీడు కోటను సందర్శిస్తే బాగుంటుందని, అక్కడికి వచ్చే సందర్శకుల కోసం యువత, చిన్న పిల్లలు, పెద్దల కోసం ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం లో అడ్వెంచర్ లాగా చేస్తే ఆ జ్ఞాపకాలతో కొండవీడు ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా వారు వెళ్లి ఇంకొంత మంది పర్యాటకులతో చెప్పి తీసుకువచ్చే విధంగా దీనిని తీర్చిదిద్దామన్నారు. కొండవీడు కోటలో ప్రధానంగా ట్రిక్కింగ్, రాక్ లైనింగ్, షూటింగ్, ఆర్చరీ, విధుల చెరువును చాలా క్లిష్టతరమైన పని పూర్తి చేసి బోటింగ్, కయా కింగ్, ఫిషింగ్, హార్సింగ్ ఏర్పాటు చేశాం, ఇది ఎప్పుడు అలానే ఉండేలా తీర్చిదిద్దడం జరిగింది, అక్కడకు వచ్చే పర్యాటకులు రాత్రి విడిది చేసేందుకు ఒక టైం లో "నైట్ క్యాంప్" అక్కడే ఒక టెంట్ ను మరియు భోజన వసతులను ఏర్పాటు చేయటం జరిగింది. ఇది రిజర్వ్ ఫారెస్ట్ ( జంతు రక్షిత  ప్రాంతం) కనుక ఎటువంటి ప్రాణహాని లేకుండా జాగ్రత్తగా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కొండవీటి ప్రాంతాన్ని ఒక జాతరలా (ఫెస్టివల్ తరహాలో) జరిగేలా ప్రీ ప్లాన్ గా తీర్చిదిద్దినట్లు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి ప్రకటించారు, పల్నాడు జిల్లాతో పాటు పక్క జిల్లాలైన గుంటూరు జిల్లా, బాపట్ల జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, కృష్ణాజిల్లా, ప్రకాశం జిల్లాల నుంచి పర్యాటకులు అధికంగా వచ్చే అవకాశం ఉండడంతో ఫిబ్రవరి 10,11 తేదీల్లో సెలవులు ఉండడంతో ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించినట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించారు. పిబ్రవరి 10,11 తేదీల్లో కొండవీడు కోట-2024 ఫెస్ట్ ను చేయ బోతున్నట్లు పైన చెప్పినవన్నీ పర్మినెంట్ యాక్టివిస్ అని, ఇవి కాక  హెలీ రైడ్, పారా రైడ్, హార్స్ రైడ్ లు జిల్లా కలెక్టర్ ప్రకటించారు, ఇందులో హెలీ రైడ్ కు 4 వేలు ఏడు నుంచి ఎనిమిది నిమిషాలు, పారా రైడ్ కు 2వేలు, హార్స్ రైడుకు రూ.500 చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఉత్సవాల తరహాలో చిన్నపిల్లల కోసం ప్లే ఏరియా ను ఏర్పాటు చేస్తున్నామన్నారు, ప్రత్యేకంగా పిల్లల కోసం తెప్పిస్తున్నామన్నారు. పూల తోటలతో పాటు ఇసుకను ఏర్పాటు చేయించి అందులో సైతక శిల్పం తరహాలో ఆర్ట్ గీసేలా ఏర్పాటు చేస్తామాన్నారు. వీటితోపాటు చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా డాన్స్ ప్రోగ్రాములు ప్రత్యేకంగా డయాస్ ఏర్పాటు చేసి అందులో క్లాసికల్, వెస్ట్రన్ పోటీలను పెట్టడం జరుగుతుందన్నారు, ఇందులో ఎంపిక కమిటీ (జడ్జెస్)ఉంటుందన్నారు.వీటిలో ప్రధమ రూ. 10,116, ద్వితీయ రూ. 5,116,తృతీయ  బహుమతులు రూ.2.500లు ఇవ్వనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. కొండవీడు కోట-2024 లో ఉత్సాహంగా పాల్గొనే వారికి అన్ని వసతులను కల్పిస్తున్నట్లు, క్రీడలతోపాటు, ఆహ్లాదకరమైన, సహస కృత్యాలు, ఆటలు, ఫుడ్డు ఏర్పాట్లు చేస్తున్నా మన్నారు, ఎవరు ఇక్కడికి వచ్చినా, వారి మదిలో గుర్తుండి పోయేలా "కొండవీడు “ఫెస్ట్-2024" తీర్చిదిద్దుతామని జిల్లా కలెక్టర్ ప్రకటించారు.

మరిన్ని వార్తలు కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి.

https://chilakaluripetspeednews.blogspot.com

Share:

చిలకలూరిపేట - సుబ్బయ్యతోట - ఆర్థిక, మానసిక ఇబ్బందులను తట్టుకోలేక మహిళ ఆత్మహత్య

చిలకలూరిపేట - సుబ్బయ్యతోట - ఆర్థిక, మానసిక ఇబ్బందులను తట్టుకోలేక మహిళ ఆత్మహత్య

చిలకలూరిపేట - సుబ్బయ్యతోట - ఆర్థిక, మానసిక ఇబ్బందులను తట్టుకోలేక మహిళ ఆత్మహత్య

చిలకలూరిపేట:- పట్టణంలోని సుబ్బయ్యతోటకు చెందిన L పద్మ అనే మహిళ శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే సుబ్బయ్య తోటకి చెందిన పద్మ అనే మహిళ ఆర్థిక పరిస్థితులు బాగోలేక గత కొన్ని రోజుల క్రితం 52 ఎకరాల్లోని ప్రభుత్వం వారు నిర్మించిన అపార్ట్మెంట్లో నివాసం ఉంటుంది. ఆమెకి ఇద్దరు కుమారులు పెద్ద కుమారుడు పండ్ల వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. చిన్న కుమారుడు మతిస్థిమితం సరిగ్గా ఉండేది కాదు. చలాకీగా ఉండే కుమారుడు మతిస్థిమితం కోల్పోవడంతో మానసికంగా చాలా కృంగిపోయి బాధపడుతూ ఉండేదని చుట్టుపక్కల వారు తెలిపారు. కొన్ని సంవత్సరాల క్రితం భర్త కూడా చనిపోవడంతో, పనిచేయడానికి ఆరోగ్య పరిస్థితులు సహకరించక ప్రభుత్వం ఇచ్చే వితంతువు పెన్షన్తో జీవనం సాగించేది. శుక్రవారం రాత్రి ఆర్థిక మానసిక ఇబ్బందులను తట్టుకోలేక గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న సదరు బంధువులు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు హాస్పటల్ సిబ్బంది తెలిపారు.

మరిన్ని వార్తల కోసం క్రింది లింకు పై క్లిక్ చేయండి.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

Share:

చిలకలూరిపేట - జాతీయ నులిపురుగుల నిర్మూలనా దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అల్బెండజోల్ టాబ్లెట్స్ పంపిణీ

చిలకలూరిపేట - జాతీయ నులిపురుగుల నిర్మూలనా దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అల్బెండజోల్ టాబ్లెట్స్ పంపిణీ 

జాతీయ నులిపురుగుల నిర్మూలనా దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అల్బెండజోల్ టాబ్లెట్స్ పంపిణీ

చిలకలూరిపేట :- పట్టణంలో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మునిసిపల్ ప్రాధమిక పాఠశాల యందు ఈరొజు శుక్రవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వారి ఆదేశాల మేరకు పాఠశాల యందు విద్యార్ధిని, విద్యార్థులకు నేషనల్ డీ వార్మింగ్ డే సందర్భంగా  (నులిపురుగుల నివారణ) ఆల్ బెండజోల్ టాబ్లెట్స్ వేయించడం జరిగింది . పాఠశాల ప్రధానోపాధ్యాయులు కే సుధ మాట్లాడుతు విద్యార్థి దశలోనే వ్యక్తి గత పరిశుభ్రత అలవర్చుకోవాలని అన్నారు. తద్వారా వ్యాధి నిరోధకత పెంపొందించుకోవచ్చు అని అన్నారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం లో అన్ని రకాల పోషక విలువలు కలిగిన ఆహారం అందిస్తున్నారని. వారంలో ఐదు రోజుల పాటు ఉడక బెట్టిన కొడిగ్రుడ్డు అందిస్తున్నారని అన్నారు. ANM ధన లక్ష్మీ మాట్లాడుతూ ఈ  టాబ్లెట్స్ వినియోగం వల్ల కలిగే ఉపయోగాల గురించి వివరించారు. చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడంలో మెళకువలు తెలియజేశారు. విద్యార్ధినీ విద్యార్ధులు అందరూ ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసే వాటినీ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి కే సుధ, ఉపాధ్యాయులు పోటు శ్రీనివాసరావు ఏ.నీలిమ. టి.కుమారీ. ఆశ వర్కర్ యన్ రాజేశ్వరి విద్యార్ధిని విద్యార్ధులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తల కొరకు క్రింది లింకు పై క్లిక్ చేయండి.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.
📸
మీ వార్తలను మాతో పంచుకోవడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి