మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

Advertisement - 2

Image3

........

Advertisement - 3

Image3

........

ప్రకటనల కోసం 90358 80349 నెంబర్ కు సంప్రదించండి.
|

⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!

చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.

💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి

చిలకలూరిపేట - సుబ్బయ్యతోట - ఆర్థిక, మానసిక ఇబ్బందులను తట్టుకోలేక మహిళ ఆత్మహత్య

చిలకలూరిపేట - సుబ్బయ్యతోట - ఆర్థిక, మానసిక ఇబ్బందులను తట్టుకోలేక మహిళ ఆత్మహత్య

చిలకలూరిపేట - సుబ్బయ్యతోట - ఆర్థిక, మానసిక ఇబ్బందులను తట్టుకోలేక మహిళ ఆత్మహత్య

చిలకలూరిపేట:- పట్టణంలోని సుబ్బయ్యతోటకు చెందిన L పద్మ అనే మహిళ శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే సుబ్బయ్య తోటకి చెందిన పద్మ అనే మహిళ ఆర్థిక పరిస్థితులు బాగోలేక గత కొన్ని రోజుల క్రితం 52 ఎకరాల్లోని ప్రభుత్వం వారు నిర్మించిన అపార్ట్మెంట్లో నివాసం ఉంటుంది. ఆమెకి ఇద్దరు కుమారులు పెద్ద కుమారుడు పండ్ల వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. చిన్న కుమారుడు మతిస్థిమితం సరిగ్గా ఉండేది కాదు. చలాకీగా ఉండే కుమారుడు మతిస్థిమితం కోల్పోవడంతో మానసికంగా చాలా కృంగిపోయి బాధపడుతూ ఉండేదని చుట్టుపక్కల వారు తెలిపారు. కొన్ని సంవత్సరాల క్రితం భర్త కూడా చనిపోవడంతో, పనిచేయడానికి ఆరోగ్య పరిస్థితులు సహకరించక ప్రభుత్వం ఇచ్చే వితంతువు పెన్షన్తో జీవనం సాగించేది. శుక్రవారం రాత్రి ఆర్థిక మానసిక ఇబ్బందులను తట్టుకోలేక గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న సదరు బంధువులు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు హాస్పటల్ సిబ్బంది తెలిపారు.

మరిన్ని వార్తల కోసం క్రింది లింకు పై క్లిక్ చేయండి.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

Share:

చిలకలూరిపేట - జాతీయ నులిపురుగుల నిర్మూలనా దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అల్బెండజోల్ టాబ్లెట్స్ పంపిణీ

చిలకలూరిపేట - జాతీయ నులిపురుగుల నిర్మూలనా దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అల్బెండజోల్ టాబ్లెట్స్ పంపిణీ 

జాతీయ నులిపురుగుల నిర్మూలనా దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అల్బెండజోల్ టాబ్లెట్స్ పంపిణీ

చిలకలూరిపేట :- పట్టణంలో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మునిసిపల్ ప్రాధమిక పాఠశాల యందు ఈరొజు శుక్రవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వారి ఆదేశాల మేరకు పాఠశాల యందు విద్యార్ధిని, విద్యార్థులకు నేషనల్ డీ వార్మింగ్ డే సందర్భంగా  (నులిపురుగుల నివారణ) ఆల్ బెండజోల్ టాబ్లెట్స్ వేయించడం జరిగింది . పాఠశాల ప్రధానోపాధ్యాయులు కే సుధ మాట్లాడుతు విద్యార్థి దశలోనే వ్యక్తి గత పరిశుభ్రత అలవర్చుకోవాలని అన్నారు. తద్వారా వ్యాధి నిరోధకత పెంపొందించుకోవచ్చు అని అన్నారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం లో అన్ని రకాల పోషక విలువలు కలిగిన ఆహారం అందిస్తున్నారని. వారంలో ఐదు రోజుల పాటు ఉడక బెట్టిన కొడిగ్రుడ్డు అందిస్తున్నారని అన్నారు. ANM ధన లక్ష్మీ మాట్లాడుతూ ఈ  టాబ్లెట్స్ వినియోగం వల్ల కలిగే ఉపయోగాల గురించి వివరించారు. చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడంలో మెళకువలు తెలియజేశారు. విద్యార్ధినీ విద్యార్ధులు అందరూ ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసే వాటినీ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి కే సుధ, ఉపాధ్యాయులు పోటు శ్రీనివాసరావు ఏ.నీలిమ. టి.కుమారీ. ఆశ వర్కర్ యన్ రాజేశ్వరి విద్యార్ధిని విద్యార్ధులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తల కొరకు క్రింది లింకు పై క్లిక్ చేయండి.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

Share:

చిలకలూరుపేట నియోజకవర్గంలోని బీసీలందరూ టిడిపి గెలుపుకై కృషి చేస్తాం - చిలకలూరిపేట బీసీ నాయకులు

చిలకలూరుపేట నియోజకవర్గంలోని బీసీలందరూ టిడిపి గెలుపుకై కృషి చేస్తాం - చిలకలూరిపేట బీసీ నాయకులు

చిలకలూరుపేట నియోజకవర్గంలోని బీసీలందరూ టిడిపి గెలుపుకై కృషి చేస్తాం - చిలకలూరిపేట బీసీ నాయకులు

చిలకలూరిపేట:- పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు జయహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గస్థాయిలోని బీసీ నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి బీసీలందరూ పార్టీకి వెన్నుదండుగా ఉన్నారని నాయకులు గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ ... వైకాపా అయిదేళ్ల పాలనలో బీసీలకు ఏం చేశారని ఆ వర్గాలు మళ్లీ జగన్‌కు ఓటేయాలని ప్రశ్నించారు మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు. బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాసెస్ కాదు, బ్యాక్ బోన్‌ వర్గాలంటే వారి వెన్ను విరిచినందుకా... 30కి పైగా బీసీ సంక్షేమ పథకాలు రద్దు చేసినందుకా... 74మంది బీసీలు నాయకుల్ని క్రూరంగా నరికి చంపినందుకా...  5వేల మందిబీసీలపై దాడులు, అక్రమ కేసులు పెట్టినందుకా... వాళ్లే వైకాపాకు ఎందుకు ఓటు వేయాలో ఒక్క కారణం చెప్పగలరా అని ప్రశ్నించారు ప్రత్తిపాటి. తెలుగుదేశం ప్రభుత్వ హయంతో ఆత్మగౌరవంతో, అన్నింటా అవకాశాలతో తలెత్తుకుని బతికిన వెనకబడిన వర్గాల వారిని అన్ని విధాలుగా మోసం చేసి రోడ్డున పడేసిన దుర్మార్గుడు జగన్ అని ఆయన దుయ్య బట్టారు. చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం జయహో బీసీ సదస్సు నిర్వహించారు. సదస్సులో మాజీమంత్రి ప్రత్తిపాటి మాట్లాడుతూ తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్, మాజీ సీఎం చంద్రబాబు బీసీలకు అధిక ప్రాధాన్యం కల్పించారని తెలిపారు. తెదేపా అధికారంలోకి వచ్చిన 1983 తర్వాతే బీసీలకు నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. అత్యధిక జనాభా కలిగిన బీసీలకు తెదేపా రాజకీయ ప్రాధాన్యం, ఆర్థిక వెసులుబాటు కల్పించిందన్నారు . అలాంటి పరిస్థితుల నుంచి గడిచిన అయిదేళ్లలో 56 బీసీ కార్పొరేషన్లు అంటూ ప్రచార ఆర్భాటం చేసిన వైకాపా వాటికి పైసా విదల్చక పోగా బీసీ సబ్‌ప్లాన్‌కు చెందిన దాదాపు రూ. 75 కోట్లు దారి మళ్లించడం వారి కుటిలనీతికి నిదర్శమన్నారు. ఇప్పుడు టిక్కెట్ల కేటాయింపుల్లో కూడా జగన్ అత్యధికంగా అన్యాయం చేస్తోంది బీసీలకే అని తెలిపారు ప్రత్తిపాటి. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా బీసీలంతా ఈసారి తమ రాజకీయ అవకాశాల పుట్టినిల్లు తెలుగుదేశంతో కలసి నడవాలని కృతనిశ్చయంతో ఉన్నారని ప్రత్తిపాటి స్పష్టం చేశారు. కార్యక్రమంలో చిలకలూరిపేట నియోజకవర్గ జనసేన సమన్వయకర్త తోట రాజా రమేష్, తెదేపా, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తల కోసం క్రింది లింకుపై క్లిక్ చేయండి.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

Share:

చిలకలూరిపేట - మూడు లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించిన నారా భువనేశ్వరి

చిలకలూరిపేట - మూడు లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించిన నారా భువనేశ్వరి

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట :- నియోజకవర్గ పరిధిలోని ఎడ్లపాడు గ్రామానికి చెందిన మొగిలి సత్యనారాయణ గతంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టును జీర్ణించుకోలేక మనస్థాపనతో గుండెపోటుతో మృతి చెందారు. నేడు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చిన నారా భువనేశ్వరి వారికి మూడు లక్షల రూపాయల చెక్కును ఆర్థిక సాయం గా అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని నాయకులు, పార్టీ కార్యకర్తలు, టిడిపి కౌన్సిలర్ సభ్యులు, మాజీ టిడిపి ఎంపీటీసీలు జడ్పీటీసీలు పాల్గొన్నారు.

మరినీ వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

Share:

చిలకలూరిపేటలో ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య

చిలకలూరిపేటలో ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య

చిలకలూరిపేటలో ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య

చిలకలూరిపేట టౌన్:- పట్టణంలో యువకుడి ఆత్మహత్య వివరాల్లోకి వెళితే పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీ చెందిన గోపి నాయక్ అనే యువకుడు పండరిపురం లోని ఒక వాటర్ ప్లాంట్ లో పనిచేస్తూ జీవం సాధిస్తున్నాడు. ప్రేమ విఫలం అవటంతో మనస్థాపానికి గురై ఈనెల ఐదవ తేదీ రాత్రి 10 గంటల సమయంలో సింగ్ నగర్ లో ఒక చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు విగత జీవుడై చెట్టుకి వేరేలాడుతున్న గోపి నాయక్ ను చూసి కంగుతిన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు.

మరిన్ని వార్తల కొరకు క్రింది లింకుపై క్లిక్ చేయండి.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

Share:

నేడు నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి చిలకలూరిపేట నియోజకవర్గంలో "నిజం గెలవాలి" యాత్ర

నేడు నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి చిలకలూరిపేట నియోజకవర్గంలో "నిజం గెలవాలి" యాత్ర

నేడు నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి చిలకలూరిపేట నియోజకవర్గంలో "నిజం గెలవాలి" యాత్ర

చిలకలూరిపేట:- టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టుతో మనోవేదనకు గురై మృతి చెందిన కుటుంబాలకు అండగా నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి చేపట్టిన "నిజం గెలవాలి" యాత్రలో భాగంగా... నేడు చిలకలూరిపేట నియోజకవర్గం ఎడ్లపాడు గ్రామానికి చేరుకోనున్నారు. చంద్రబాబు అరెస్టుపై మనోవేదనకు గురై గుండెపోటుతో మరణించిన ఎడ్లపాడు ఎస్టి కాలనీకి చెందిన మొగిలి సత్యనారాయణ కుటుంబాన్ని పరామర్శించడానికి నారా భువనేశ్వరి నేడు చిలకలూరిపేట నియోజకవర్గం చేరుకోనున్నారు.

మరిన్ని వివరాలకై క్రింది లింకుపై క్లిక్ చేయండి.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

Share:

మంత్రి రజిని అండ చూసుకొని మామ భూకబ్జాలకు పాల్పడుతున్నారు - వైసిపి నేత జాలాది సుబ్బారావు

మంత్రి రజిని అండ చూసుకొని మామ భూకబ్జాలకు పాల్పడుతున్నారు - వైసిపి నేత జాలాది సుబ్బారావు

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట :- పట్టణంలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల అనంతరం వైసీపీ నేత జాలాది సుబ్బారావు మాట్లాడుతూ... చిలకలూరిపేటలో మంత్రి విడుదల రజిని అండ చూసుకొని వారి మామ అయిన విడుదల లక్ష్మీనారాయణ భూకబ్జాలకు పాల్పడుతున్నారని తెలిపారు. చిలకలూరిపేట పట్టణంలోని ఓగేరు వాగు పక్కన ఉన్న గొర్రెల సంత వద్ద చిలకలూరిపేట టు పసుమర్తి రోడ్డు మధ్యలో అడ్డంగా గోడ కట్టడం వలన తారు రోడ్డు సాంక్షన్ అయినా కూడా రోడ్డు వేసే కార్యక్రమం ఇంతవరకు చేపట్ట లేదంటే దానికి కారణం రోడ్డుకి మధ్యలో అడ్డంగా గోడ కట్టడం. దాని వలన రోడ్డు నిర్మాణ కార్యక్రమాలు ఆగిపోయాయని, గోడను తొలగించాలంటే కోటి రూపాయలు ఇస్తే కానీ గోడను తొలగించమని విడుదల లక్ష్మీనారాయణ డిమాండ్ చేసినట్లు జాలాది సుబ్బారావు తెలిపారు. ఈ విషయం మంత్రిగారి దృష్టికి తీసుకొని వెళ్లడానికి చాలా సార్లు ప్రయత్నించామని సరైన స్పందన లేకపోవడంతో ఇబ్బందులు గురవుతున్నామని ఆయన తెలిపారు. పసుమర్తి టు చిలకలూరిపేట రోడ్డు వేస్తే రవాణా సౌకర్యానికి, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉంటుందని వారు తెలిపారు.

మరిన్ని వార్తలు కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.
📸
మీ వార్తలను మాతో పంచుకోవడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి