మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

Advertisement - 2

Image3

........

Advertisement - 3

Image3

........

ప్రకటనల కోసం 90358 80349 నెంబర్ కు సంప్రదించండి.
|

⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!

చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.

💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి

నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయ వైసిపికి రాజీనామా

నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయ వైసిపికి రాజీనామా

పల్నాడు జిల్లా :- నరసరావుపేట ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయ వైసిపి పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఈరోజు ఉదయం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నరసరావుపేట పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రస్తుతం జరుగుతున్న పనులు గురించి ఆయన వివరించారు. పార్టీలో నెలకొన్న అనిచ్చితి వల్ల తను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. నరసరావుపేట పార్లమెంటు స్థానాన్ని బీసీలకు ఇవ్వడానికి వైసిపి అధిష్టానం నిర్ణయించుకుంది. అందువలన ఎంపీ లావు శ్రీ కిష్ణదేవరాయని గుంటూరు నుంచి పోటీ చేయమని అధిష్టానం ఆదేశించగా, ఆయన దానికి ససేమిరా అన్నారు. ఇప్పటికే నరసరావుపేట పార్లమెంట్ ప్రాంతంలో తనకంటూ ఒక ఇమేజ్ ని సంపాదించుకున్న ఆయన మరో స్థానంలో పోటీ చేయడానికి నిరాకరించారు. తనకు అండగా నిలిచిన పార్టీ పెద్దలు మరియు ఎమ్మెల్యేలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు‌.

Share:

రామనామ స్మరణతో దద్దరిల్లిన చిలకలూరిపేట పురవీధులు

రామనామ స్మరణతో దద్దరిల్లిన చిలకలూరిపేట పురవీధులు

రామనామ స్మరణతో దద్దరిల్లిన చిలకలూరిపేట పురవీధులు

చిలకలూరిపేట:- జనవరి 22 అయోధ్య లోని బాల రాముని ప్రాణ ప్రతిష్ట మహోత్సవాన్ని చిలకలూరిపేట పట్టణ ప్రజలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. పట్టణంలోని వీధులన్నీ శ్రీరామ నామ స్మరణతో మోత మోగిపోయాయి. పట్టణంలోని ముఖ్య వీధులలో పండుగ వాతావరణం నెలకొన్నది. ముఖ్యంగా గాంధీ పేట, సుబ్బయ్య తోట, చోత్రా సెంటర్, గోల్డ్ షాప్ బజార్ మద్ది మల్లయ్య వీధులలో భారీగా దేవుని కార్యక్రమాలను నిర్వహించారు. సాయంత్రం సమయాలలో చలివేంద్రం బజార్ నందు షరాఫ్ బజార్ మరియు మద్ది మల్లయ్య వీధి నందు భారీగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా మహిళలు భారీగా నగర సంకీర్తనలో పాల్గొన్నారు. చలివేంద్రం బజార్, గోల్డ్ షాప్ బజార్,మద్ది మల్లయ్య వీధి నందు ఉన్న రామాలయాలలో భక్తులు భారీగా చేరుకొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సుబ్బయ్య తోటలోని ప్రతి ఇంటి గోడ పైన జైశ్రీరామ్ అనే నామాన్ని అచ్చులుగా వేశారు. గౌడ కళ్యాణ మండపం వద్ద రామదండు యూత్ ఆధ్వర్యంలో కోలాట కార్యక్రమం మరియు భక్తిరస నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు.

రామనామ స్మరణతో దద్దరిల్లిన చిలకలూరిపేట పురవీధులు


Share:

వైసీపీ ఎంపీ బాలసౌరి రాజీనామా - జనసేనలో చేరిక

వైసీపీ ఎంపీ బాలసౌరి రాజీనామా - జనసేనలో చేరిక


ఆంధ్రప్రదేశ్ :- మచిలీపట్నం వైఎస్ఆర్సిపి ఎంపీ వల్లభనేని బాలశౌరి తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ట్విట్టర్లో ప్రకటించారు.వల్లభనేని బాలశౌరి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2004లో తెనాలి లోకసభ నియోజకవర్గం నుండి ఎంపీగా గెలిచాడు. ఆయన 2009లో నరసరావుపేట లోకసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. బాలశౌరి అక్టోబర్ 2013లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి,2014లో గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఆయన 2019లో మచిలీపట్నం లోకసభ నియోజకవర్గం నుండి గెలిచి రెండోసారి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.ఆయన ప్రస్తుతం సభార్డినెట్ లెజిస్లేషన్ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా ఉన్నాడు.వల్లభనేని బాలశౌరి 2024 జనవరి 13న వైసీపీకి రాజీనామా చేశాడు. 

వైయస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి పార్టీ స్థాపించినప్పటి నుంచి పార్టీలో తనకంటూ ఒక మార్కును చూపిస్తూ రాజకీయాలలో తను సత్తా చాటారు. గత కొన్ని రోజులుగా కృష్ణా జిల్లా రాజకీయాల్లో జరిగిన పరిణామాల వల్ల అసహనానికి లోనవటంతో పాటు గుంటూరు నుండి కానీ మచిలీపట్నం నుండి కానీ ఎంపీ సీటును ఆశిస్తూ ఉన్నట్లు అనుచరులు చెప్పారు. కానీ ఇప్పటికే ఆయా స్థానాలకు వేరే వాళ్ళని కేటాయించడంతో తను ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తన అనుచరులు తెలిపారు. త్వరలోనే శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జనసేనలో చేరుతున్నాను అని ట్విట్టర్ ద్వారా తెలిపారు.

బాలసౌరి రాజకీయ ప్రస్థానం 2024 వరకు :-

పోటీ చేసిన స్థానాలు

1)తెనాలి లోకసభ నియోజకవర్గం 2004 గెలుపు,

2)నరసరావుపేట లోకసభ నియోజకవర్గం 2009 ఓటమి,

3)గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం 2014 ఓటమి,

4)మచిలీపట్నం లోకసభ నియోజకవర్గం 2019 గెలుపు.

Share:

ప్రజా ప్రతినిధిగా నిలబెట్టిన లోకేష్ చంద్రబాబుకి ధన్యవాదాలు అంటూ కార్పొరేటర్ పదవికి రాజీనామా చేసిన కేశినేని శ్వేత

ప్రజా ప్రతినిధిగా నిలబెట్టిన లోకేష్ చంద్రబాబుకి ధన్యవాదాలు అంటూ కార్పొరేటర్ పదవికి రాజీనామా చేసిన కేశినేని శ్వేత


విజయవాడ :-  గత కొంతకాలంగా విజయవాడ రాజకీయాల్లో చర్చినియాంసమైన కేశినేని బ్రదర్స్ వార్ లో భాగంగా ఈరోజు కేశినేని శ్వేత తన కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు. కార్పొరేటర్ పదవికి రాజీనామా చేస్తూ నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఏమీ తెలియని తనను ప్రజా ప్రతినిధిని చేసి విజయవాడ ప్రజలకు సేవ చేసుకునే అవకాశం కల్పించిన నారా లోకేష్ గారికి మరియు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు అంటూ, తన వ్యక్తిగత కారణాలతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. తన తండ్రికి జరిగిన అవమాన దృశ్యం గౌరవం లేని చోట పనిచేయలేమని ఆమె తెలిపారు. యువత రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలని చంద్రబాబు నాయుడు గారి పిలుపుతో రాజకీయాలకు వచ్చినట్లు ఆమె తెలిపారు. అలాగే విజయవాడ మరియు 11వ డివిజన్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. దీంతో తెలుగుదేశం పార్టీ ఇటువంటి నిర్ణయం తీసుకుంటుందో అని అభిమానులు డైలమాలో పడ్డారు. నిన్న జరిగిన రా కదలిరా అనే చంద్రబాబు బహిరంగ సభకు కేశినేని చిన్ని అధ్యక్షత వహించటంతో కేశినేని నాని అభిమానులు అసహనానికి గురైనట్లు నాని వర్గీయులు తెలియజేశారు.

Share:

నరసరావుపేట ఎంపీ - పయ్యనమేటు ?

 నరసరావుపేట ఎంపీ - పయ్యనమేటు ?

పలనాడు జిల్లా :- నరసరావుపేట ఎంపీగా ఉన్నటువంటి లావు శ్రీకృష్ణదేవరాయల రాబోవు ఎన్నికలకు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనేది సందిగ్ధత ఏర్పడింది. పార్లమెంట్ పరిధిలో తనకంటూ ఒక మంచి పేరును సంపాదించుకోవడంలో సఫలమయ్యారు. అయితే వైఎస్ఆర్సిపి అధిష్టానం నరసరావుపేట నుంచి గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయాలని సూచించినట్లు సమాచారం. అయితే దానికి సదరు ఎంపీ ససేమీరా అనటంతో క్యాంప్ ఆఫీస్ లోని ముఖ్య నేతలు ఖంగుతున్నారు. అయితే ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తనను గుంటూరు పార్లమెంటు నుండి పోటీ చేయమని అధిష్టానం కోరిందని కానీ తాను నరసరావుపేట నుంచి పోటీ చేస్తానని కరాకండిగా తెలియజేశారు. నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో తాను చేయాల్సిన పనులు ఇంకా చాలా మిగిలి ఉన్నాయని వాటన్నిటిని తాను పూర్తి చేయాలని ఆయన తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో తాను గుంటూరు నుండి పోటీ చేయనని నరసరావుపేట నుంచి మాత్రమే పోటీ చేస్తానని తెలియజేశారు. గతంలో చిలకలూరిపేట శాసనసభ్యురాలుగా ఉన్న మంత్రి విడదల రజినికి మరియు ఎంపీకి మధ్య ఉన్న విభేదాల వలన పార్లమెంటు పరిధిలోని చాలా పనులు ఆటంకం కలిగాయని ఇప్పుడు మళ్లీ గుంటూరు నుంచి పోటీ చేస్తే అదే విడదల రజిని కూడా గుంటూరు పశ్చిమ నుండి పోటీ చేయడం తర్వాత వచ్చే పరిణామాలు దృష్ట్యా ఎంపీ గుంటూరు నుంచి పోటీ చేయకూడదని అనుకుంటున్నారని పలువురి అభిప్రాయం. మెయిన్ రోడ్, చిన్నరథం సెంటర్, చిలకలూరిపేట.



Share:

వైసీపీకి షాక్ ఇచ్చిన స్టార్ క్రికెటర్ అంబటి రాయుడు

వైసీపీకి షాక్ ఇచ్చిన స్టార్ క్రికెటర్ అంబటి రాయుడు 

ఆంధ్రప్రదేశ్ :- గత కొద్దిరోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున తన మార్కును చాటి విస్తృతంగా పర్యటన చేసిన స్టార్ క్రికెటర్ అంబటి రాయుడు తిరిగి అదే పార్టీకి షాక్ ఇవ్వటం అభిమానులను ఆందోళనకు గురిచేస్తుంది. ఉన్నట్టుండి తీసుకున్న నిర్ణయానికి అభిమానులు ఒకింత షాక్కి గురయ్యారు. కొన్ని నెలల క్రితం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ పార్టీలో చేరిన అంబటి రాయుడు గుంటూరు, విజయవాడ కాన్స్టెన్సీ లో టికెట్ ఆశించడం జరిగింది. అయితే ఆ రెండు కాన్స్టెన్సీలో గెలుపు రాయులకు టికెట్లు కన్ఫర్మ్ చేయడంతో అంబటి రాయుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి తాను వైసిపి నుండి బయటకు వస్తున్నట్లు కొన్ని రోజులు రాజకీయాలకు దూరంగా ఉండి తర్వాత కార్యాచరణను ప్రకటిస్తారని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు.

Share:

టిడిపికి బిగ్ షాక్ - ఆందోళనలో తెలుగు తమ్ముళ్లు

 టిడిపికి బిగ్ షాక్ - ఆందోళనలో తెలుగు తమ్ముళ్లు


ఆంధ్రప్రదేశ్ :- టిడిపికి వెన్నుదండగా ఉండే ముఖ్య నేతలలో విజయవాడ ఎంపీ కేసీనేని నాని ఒకరు. గత కొన్ని రోజులుగా తన తమ్ముడు కేశినేని చిన్నికి నానికి మధ్య జరుగుతున్న సంఘటన దృష్ట్యా కేశినేని నాని టిడిపికి రాజీనా మా చేయాలని ఆలోచనలో ఉన్నట్టు ఆయన చేసిన పోస్ట్ తెలుగు తమ్ముళ్లకు ఒకింత ఆందోళనకు గురిచేస్తుంది. "అందరికీ నమస్కారం. టిడిపికి నా అవసరం లేదని చంద్రబాబు భావించిన తర్వాత కూడా నేను టిడిపిలో కొనసాగడం కరెక్ట్ కాదు అని నా భావన. త్వరలో ఢిల్లీ వెళ్లి నా రాజీనామా ఆమోదించుకునే టిడిపికి రాజీనామా చేస్తానని" ఆయన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఈ పోస్టుతో టిడిపిలో తీవ్ర దుమారం రేగుతుంది.

Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.
📸
మీ వార్తలను మాతో పంచుకోవడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి