మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

Advertisement - 2

Image3

........

Advertisement - 3

Image3

........

ప్రకటనల కోసం 90358 80349 నెంబర్ కు సంప్రదించండి.
|

⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!

చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.

💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి

ఓడరేవు - చిలకలూరిపేట - పిడుగురాళ్ల హైవే పనులు త్వరగా మొదలు పెట్టాలని గడ్కరిని కోరాం - చిలకలూరిపేట పర్యటనలో రాజ్యసభ సభ్యుడు G V L నరసింహారావు

ఓడరేవు - చిలకలూరిపేట - పిడుగురాళ్ల హైవే పనులు త్వరగా మొదలు పెట్టాలని గడ్కరిని కోరాం - చిలకలూరిపేట పర్యటనలో రాజ్యసభ సభ్యుడు G V L నరసింహారావు

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రాంతాలలో పర్యటిస్తూ ఆయా ఏరియాలలో ఉండే సమస్యలను తెలుసుకుంటూ ఈరోజు సోమవారం నాడు చిలకలూరిపేటలో పర్యటించారు రాజ్యసభ సభ్యుడు GVL నరసింహారావు. పట్టణంలోని బిజెపి నాయకులతో నిర్వహించిన చర్చల అనంతరం ఆయన విలేకర్ల సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ చిలకలూరిపేట పట్టణానికి ప్రభుత్వం అనేక నిధులను కేటాయించిందని ముఖ్యంగా చిలకలూరిపేట బైపాస్ పనులు త్వరగా పూర్తిచేయాలని.. ఆలస్యానికి గల కారణాలను రాష్ట్ర మంత్రులతో చర్చించి త్వరగా బైపాస్ పనులు పూర్తిచేయాలని.. అలాగే చీరాల ఓడ రేవు నుండి చిలకలూరిపేట మీదుగా నరసరావుపేట, పిడుగురాళ్ల వరకు బైపాస్ పనులను త్వరగా మొదలు పెట్టాలని కేంద్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారిని కోరామని.. కేంద్ర ప్రభుత్వం ద్వారా అమృత పథకం కింద సుమారు 180 కోట్ల రూపాయలను కేటాయించిందని దానిద్వారా పట్టణంలోని అన్ని ఏరియాలకు త్రాగునీటి సదుపాయాన్ని ఏర్పాటు చేయాలని.. అలాగే ప్రధానమంత్రి  ఆవాస్ యోజన కింద 4500 ఇళ్లను కేటాయించామని కానీ వాటిని ఇంకా అర్హులకు అందలేదని వాటిపై చర్చిస్తామని ఆయన తెలిపారు. అలాగే పట్టణంలోని పలు సమస్యలపై ఆయన చర్చించి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అనంతరం పట్టణంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను సందర్శించారు.



Share:

అయ్యప్ప మాల ధారణ ఎప్పుడు చేయాలి ? ఎప్పుడు చేయకూడదు ?

అయ్యప్ప మాల ధారణ ఎప్పుడు చేయాలి ? ఎప్పుడు చేయకూడదు ?

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1


1. తల్లిదండ్రులు గతించినచో ఏడాదికాలము వరకు మాల ధరించరాదు.

2. సవతి తల్లిదండ్రులు గతించినచో 6 నెలల వరకు మాల ధరించరాదు.

3. భార్య గతించినచో 6 నెలల వరకు మాల ధరించరాదు.

4. సవతి భార్య (రెండవ భార్య) గతించినచో 3 నెలల వరకు మాల ధరించరాదు.

5. పెదతండ్రులు , పినతండ్రులు , పెద్దతల్లులు , పినతల్లులు , గతించినచో 3 పక్షములు (45  రోజులు) మాల ధరించరాదు.

6. సోదరులు , పుత్రులు , మేనత్తలు , మేనమామలు , తాత (తండ్రి తండ్రి), బామ్మ (తండ్రి తల్లి) గతించినచో  41 దినములు  మాల ధరించరాదు. 

7. కన్నకూతురు , కోడళ్ళు , అల్లుళ్ళు , మరదళ్ళు , వదినెలు , మరుదులు , బావలు , బావమరుదులు  గతించినచో 30 దినములు (1 నెలపాటు) మాల ధరించరాదు.

8. మనవాళ్ళు , మనవరాళ్ళు , దాయాదులు   గతించినచో 21 దినములు  మాల ధరించరాదు.

9. ఇంటిపేరు గలవారు , రక్తసంబంధీకులు గతించినచో  21 దినములు  మాల ధరించరాదు.

10. వియ్యాలవారు , దూరపుబంధువులు గతించినచో 13 దినములు మాల ధరించరాదు.

11. ఆత్మీయులు , మిత్రులు  గతించినచో 13 దినములు (దుఃఖము అనుష్ఠించి) మాల ధరించరాదు.

12. ఒకరు దత్తపుత్రులై వెళ్ళిన పిమ్మట దత్తత తీసుకున్న తల్లిదండ్రులు గతించినను అతనికి ఏడాదికాలము సూతకముండును కావున మాల ధరించరాదు.          దత్తతకు వెళ్ళిన తరువాత వాని కన్న తల్లిదండ్రులు గతించినచో 6 నెలలు సూతకముండును , కావున మాల ధరించరాదు.

13. పైన తెలిపిన వారిలో ఎవరు గతించినను వారికి విధిగా కర్మకాండలు నిర్వహించే వారసులు లేక ఇంకెవరైనా కర్మలు చేసినచో అట్టివారికి కుడా ఏదాడి సూతకముండును. కావున అట్టివారు ఏడాది కాలము మాల ధరించరాదు.

14. తల్లి , భార్య , కూతురు , కోడలు , మరదళ్ళు , సోదరి , మున్నగువారు 7 నెలల గర్భిని అయినచో మాల ధరించి దీక్ష తీసుకొనరాదు , ఏలనగా దీక్షలో ఉండగా     వారు (7వ నెల , 8వ నెల , 9వ నెలలో ఎప్పుడైనా) ప్రసవించినచో శుభ సూతకము వస్తుంది , కావున మాలను విసర్జన చేయవలసి వచ్చును. అందువలన మాల ధరించరాదు.

15. మాల ధరించి దీక్షలో ఉండగా కన్నకూతురు రాజ్వరాలు అయితే ఆ వార్త వినగానే తాను ఎన్ని దినములు దీక్ష ముగించినానను , వెంటనే దీక్ష విరమించి , గురుస్వామి ద్వారా మాల విసరర్జించి , మాలను కడిగి , దేవును వద్ద వుంచి , పై సంబరాలలో పాల్గొని , కూతురుకి న్యాయము చేకూరునట్లు తన కర్తవ్యాన్ని ఆచరించాలి. అదియే అయ్యప్పకు ఆనందదాయకము , భక్తులకు శ్రేయదాయకం.

16. దీక్షలో ఉండగా బందువర్గాదులలో ఎవరైన గతించినను ఆ వార్త తెలియగానే  మాల విసర్జన చేసి వారి దుఃఖములో పాలు పంచుకోవలయును , అలా కాక మాలో మాకు మాటలు , పలకరింపులు , రాకపోకలు అసలే లేవు మాకు ఆ మరణముతో ఎలాంటి పట్టింపులు లేవు నేను మాలలో ఉన్నాను రాకూడదు అని సాకులు చెప్పి మాల విసర్జింపక సూతకముతో పావన శబరిగిరి ఎక్కుట అపచారము అని మన పెద్దలు ఆదేశించి యున్నారు , కావున శుభాశుభ  సూతకములు కలవారు పైన చెప్పిన సూచనల ప్రకారము తమ గురుస్వాములను సంప్రదించి,మాల విసర్జించి,శబరియాత్ర చేసి సద్గురునాధుడైన శబరిగిరీశుని అనుగ్రహము పొందుటకు ప్రయత్నించవలయును.

17. కుటుంబములో శుభసూతకము లేదా అశుభసూతకము కలిగి మద్యలో దీక్ష విరమించవలసి వచ్చినవారు,తదుపరి వెంటనే మాల వేసుకొనక పావన పద్దెనిమిది మెట్లు ఎక్కే రోజు నాటికి మండలకాలము అనగా 41 దినములు దీక్ష వహించే అవకాశము ఉంటేనే మరల మాల ధరించవలయును,అలా వీలుకాని పక్షములో వారు ఆ సంవత్సరం ఇరుముడి లేకుండా శబరిమలై సన్నిధానములోనే ఉత్తరవైపు మెట్లెక్కి శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్పస్వామి వారిని దర్శించి వచ్చుటకు దోషము లేదు.

18. ఎవరైనా భార్య గర్భవతిగా ఉన్నప్పుడు మాలవేసుకొని దీక్షలో ఉండగా పొరపాటున గర్భము పోవడము కాని , గర్భస్రావము గాని , లేదా జన్మించిన తరువాత శిశువు పోవడము కాని జరిగినట్లయితే 10 రోజులు సూతకముండును. కావున మాలను విసర్జించవలయును. అలాగే మరల మండల కాలము సమయమున్నచో దీక్షబూని శబరియాత్ర చేయవచ్చును.

19. స్త్రీలు మాత్రము 10 సంవత్సరాల వయస్సు దాటినా వారు మాల ధరించరాదు,ఏలనగా వారు ఏ సమయాన్నైనా ప్రథమ రజస్వ అయ్యే అవకాశముంది దాని వలన శుభసూతకం ఏర్పడుతుంది. అందువలన పావన శబరిగిరిని అపవిత్రం చేయరాదు. అలానే 50 సంవత్సరాలు వయస్సు దాటని వారు మాల ధరించి దీక్ష (41 రోజులు) పూర్తి కాదు. అందువలన వారికి శబరియాత్ర చేసే అర్హత లేదు.

20. దీక్షా సమయములో మన సన్నిదానము దరిలో ఎవరైనా గతించినచో విన్న వెంటనే ఎవరైనా అందరూ స్నానమాచరించి శరణుఘోష చెప్పుతూ అఖండ దీపము ఆ రోజు వెలిగించి సన్నిదానము మూసివేయవలెను. సన్నిదానము స్వాములంతా కలిసి వేరే సన్నిదానములో ఉండవలెను. ఆ కళేబరము తీసిన తరువాత సన్నిదానమంతా శుభ్రపరచి ఆవు పంచకముతో శుద్ధి చేసి మరల పూజలు విధి విధానంగా జరుకోవలెను.

21. మండల దీక్షలో ఉండగా గ్రహణములు (సూర్యగ్రహణము,చంద్రగ్రహణము) ఏర్పడినపుడు విధివిధానంగా పట్టు స్నానము విడుపుస్నానము చేయాలి. అలాగే మన సన్నిదానములో కలశం వద్ద , గ్రహణము విడిచిన తరువాత కుశదర్భరేకులు వేసి ఉంచవలెను. గ్రహణము విడిచిన తరువాత స్నానమాచరించి  సన్నిదానము శుభ్రపరచి స్నానమాచరించి విధిగా దేవుని పూజలు జరిపించాలి. అలాగే గ్రహణ సమయమున తిను బండారము భిక్షలు చేయరాదు.

ఇంకా ఏవైనా తెలియని విషయాలు ఉంటే మీ గురుస్వామి ద్వారా తెలుసుకొని ఆయనగారు చెప్పినట్లు నడుచుకుని సద్గురునాధుని కటాక్షాన్ని పొంది ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటు - మీ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్

పైన సూచించిన అన్నియు చాలా వరకు ఏ దీక్ష చేపట్టిన సుమారుగా ఇవే నియమాలు ఉంటాయి.

ఓం శ్రీ అనాధ రక్షకనే శరణం అయ్యప్ప



Share:

తగ్గేదే లే ! బిల్లులో సమగ్రమైన మార్పులు చేసి మళ్లీ తీసుకొని వస్తాము - అమరావతి ప్రజల పట్ల అపారమైన ప్రేమ ఉంది - సీఎం జగన్

తగ్గేదే లే ! బిల్లులో సమగ్రమైన మార్పులు చేసి మళ్లీ తీసుకొని వస్తాము - అమరావతి ప్రజల పట్ల అపారమైన ప్రేమ ఉంది - సీఎం జగన్

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

మధ్యాహ్నం నుండి మూడు రాజధానుల విషయమై రాష్ట్రం మొత్తం చర్చలకు దారి తీసింది - వాటన్నిటికీ తెరదించుతూ ఏపీ అసెంబ్లీ లో సీఎం జగన్ మోహన్ రెడ్డి వికేంద్రీకరణ బిల్లును వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రజాభిప్రాయ భేదాలు, న్యాయపరమైన చిక్కులు, ఆందోళనలను... దృష్టిలో పెట్టుకొని సమగ్రమైన విచారణలను సేకరించి అందరి ఆమోదయోగ్యం తో బిల్లులను మార్పు చేసి మళ్లీ తీసుకువస్తామని సీఎం తెలిపారు. ఈ సభలో అమరావతి ప్రజల పట్ల తనకు అపారమైన ప్రేమ ఉందని... కానీ ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో మూడు రాజధానులు అంశాన్ని తెర మీదకు తీసుకు వచ్చినట్లు తెలిపారు.




Share:

అంబటి & కోడాల నాని దిష్టిబొమ్మలను తగలబెట్టిన చిలకలూరిపేట టిడిపి శ్రేణులు - తాతపూడి జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించిన టిడిపి నాయకులు

అంబటి & కోడాల నాని దిష్టిబొమ్మలను తగలబెట్టిన చిలకలూరిపేట టిడిపి శ్రేణులు - తాతపూడి జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించిన టిడిపి నాయకులు

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట ఈ రోజు అసెంబ్లీలో జరిగిన ఘటనలను నిరసిస్తూ మండలంలోని టిడిపి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార మధంతో సభా విలువలను తుంగలో తొక్కి నిండు శాసనసభలో శ్రీమతి భువనేశ్వరి గారి పై అనుచిత వ్యాఖ్యలు చేసి శాసనసభను కౌరవ సభగా మార్చారని.. రాష్ట్రంలో మహిళలపై అనేక దాడులు జరుగుతున్నాయని అందులో భాగంగానే నేడు శాసనసభలో మహిళలపై నోటికి ఏది వస్తే అది అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారని. పట్టణంలోని టిడిపి శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఘటనలను నిరసిస్తూ పట్టణంలోని NRT సెంటర్ నందు శాసనసభ్యుడు అంబటి రాంబాబు, మంత్రివర్యులు కొడాలి నాని దిష్టిబొమ్మలను తగులబెట్టారు. అలాగే తాతపూడి జాతీయ రహదారిపై నిర్వహించారు టిడిపి నాయకులు.



Share:

చిలకలూరిపేట:- పట్టణంలో రేపు అనగా 20/11/2021 ఉదయం 9 నుండి మధ్యాహ్నం 2 వరకు విద్యుత్ నిలిపివేసే ప్రాంతాల వివరాలు

చిలకలూరిపేట:- పట్టణంలో రేపు అనగా 20/11/2021 ఉదయం 9 నుండి మధ్యాహ్నం 2 వరకు విద్యుత్ నిలిపివేసే ప్రాంతాల వివరాలు

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

పట్టణంలోని బొందిలి పాలెం ఫీడర్ మరమ్మతులు కారణంగా రేపు అలాగా రేపు అనగా 20/11/2021 శనివారం నాడు జాగు పాలెం, బొందిలి పాలెం, చీరాల రోడ్డు, కొమరవెల్లి పాడు, గంటలమ్మచెట్టు, సుందర్ రెడ్డి హాస్పటల్, పెట్రోల్ బంక్ వరకు ఉన్న అన్ని ప్రాంతాలలో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 2 వరకు విద్యుత్ నిలిపివేస్తున్నట్లు సిహెచ్ రామ్ బొట్లు తెలిపారు. వినియోగదారుడు సహకరించాలని ఆయన తెలియజేశారు.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1


Share:

టిడిపి పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో తన భార్య ఎప్పుడూ రాజకీయాల్లోకి రాలేదంటూ ఒక్కసారిగా ఎక్కిళ్ళు పెట్టి ఏడ్చేసిన చంద్రబాబు నాయుడు - వీడియో

టిడిపి పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో తన భార్య ఎప్పుడూ రాజకీయాల్లోకి రాలేదంటూ ఒక్కసారిగా ఎక్కిళ్ళు పెట్టి ఏడ్చేసిన చంద్రబాబు నాయుడు - వీడియో

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

అసెంబ్లీ సమావేశాల నుండి శపథం చేసి బయటికి వచ్చిన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అనంతరం అమరావతిలోని ఎన్టీఆర్ భవన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో భాగంగా మాట్లాడుతూ డిగ్నిఫైడ్గా ,పరువుతో ఉంటున్న తనపై వ్యక్తిగత దూషణలు చేస్తున్నారని.. ప్రపంచంలోని నలుమూలల నుండి చాలా మంది ప్రముఖులు రాష్ట్రానికి తీసుకు వచ్చాను ,అని చాలా మంది రాజకీయ నాయకులతో తాను పని చేశానని తెలుపుతూ.. తన భార్య ఎప్పుడు రాజకీయాల్లోకి రాలేదంటూ ఒక్కసారిగా ఎక్కిళ్ళు పెట్టి కన్నీటిపర్యంతమయ్యారు.

Video

Share:

శపథం చేసి అసెంబ్లీ నుండి బయటికి వచ్చిన చంద్రబాబు నాయుడు - మళ్లీ అసెంబ్లీకి వస్తే ముఖ్యమంత్రి గానే వస్తా

శపథం చేసి అసెంబ్లీ నుండి బయటికి వచ్చిన చంద్రబాబు నాయుడు - మళ్లీ అసెంబ్లీకి వస్తే ముఖ్యమంత్రి గానే వస్తా

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

ఆంధ్రప్రదేశ్ రెండవ రోజు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా పలు అంశాల గురించి చర్చించారు. అయితే వైసీపీ నేతలు తమ పార్టీని అవహేళన చేశారని. అయినా తాము పట్టించుకోలేదని, పార్టీలోని సభ్యులను విమర్శించారని అయినా తాము పట్టించుకోలేదని, చివరకు తన భార్యపై సభలో చర్చ జరగడం పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన చంద్రబాబు నాయుడు మళ్లీ తాను ముఖ్యమంత్రిగా తిరిగి అసెంబ్లీలో అడుగు పెడతానని శపధం చేసి అసెంబ్లీ నుండి వెళ్లిపోయారు.



Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.
📸
మీ వార్తలను మాతో పంచుకోవడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి