మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

Advertisement - 2

Image3

........

Advertisement - 3

Image3

........

ప్రకటనల కోసం 90358 80349 నెంబర్ కు సంప్రదించండి.
|

⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!

చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.

💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి

విద్యార్థులతో చెలగాటమా ఖబర్దార్ ఖబర్దార్ - చిలకలూరిపేట అఖిల భారత విద్యార్థి పరిషత్

విద్యార్థులతో చెలగాటమా ఖబర్దార్ ఖబర్దార్ - చిలకలూరిపేట అఖిల భారత విద్యార్థి పరిషత్

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట:- ఎయిడెడ్ స్కూల్స్ & కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్నందుకు గాను అనంతపురంలో విద్యార్థులపై జరిగిన ఘటనలను నిరసిస్తూ చిలకలూరిపేట అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి పట్టణ వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఇందులో భాగంగా అఖిల భారత విద్యార్థి పరిషత్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మురారి మాట్లాడుతూ ఎయిడెడ్ కాలేజీ & స్కూల్స్ నందు పేద విద్యార్థులు మాత్రమే చదువుకుంటానని విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దని, రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 38, 42 జీవోలను తక్షణమే రద్దు చేయాలని వారు కోరారు. ఎంతోమంది పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపిన ఎయిడెడ్ కాలేజీలను & స్కూళ్ల పై తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వారు కోరారు. అనంతరం నిర్వహించిన ర్యాలీలో "విద్యార్థులతో చెలగాటమా ఖబడ్దార్ ఖబడ్దార్" అనే నినాదంతో విద్యార్థులు పట్టణంలోని వీధులన్నీ మోత మోగించారు.

                                                VIDEO  మీకోసం 

Share:

విద్యార్థుల పై పోలీసుల లాఠీఛార్జ్ ను తీవ్రంగా ఖండిస్తున్నాము - చిలకలూరిపేట జనసేన పార్టీ

విద్యార్థుల పై పోలీసుల లాఠీఛార్జ్ ను తీవ్రంగా ఖండిస్తున్నాము -  చిలకలూరిపేట జనసేన పార్టీ

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ సమావేశాలలో జిల్లా కార్యదర్శి తోట రాజా రమేష్ మాట్లాడుతూ నిన్న అనంతపురంలో ఎస్ ఎస్ బి ఎన్ కళాశాలలో జరిగిన ఎయిడెడ్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయుటను నిరసిస్తూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థుల పై పోలీసులు జరిపిన లాఠీఛార్జ్ ను తీవ్రంగా జనసేన పార్టీ ఖండిస్తుంది అని అన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఎయి డెడ్ సంస్థల ద్వారా కొన్ని లక్షల పేద, మధ్యతరగతి విద్యార్థులు విద్యను అభ్యసించి ఉన్నతమైన స్థానాలకు వెళ్లారని, ఇప్పుడు ఆ సంస్థలు ప్రైవేటీకరణ చేయటం వలన ఐదు వేల రూపాయలు ఉండవలసిన ఫీజులు 20000 ,పాతిక వేలు అవటం వలన ఆ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థినిపై లాఠీ ఛార్జ్ చేయడం వల్ల ఆమె తలకు తీవ్ర గాయమైంది అని, అనేక మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి అన్నారు. ఎవరైతే ఈ దాడులకు పాల్పడిన పోలీసు అధికారులను తక్షణమే విధులు నుండి తొలగించవలసిందిగా డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న జి వో నెంబర్ 46 ను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో విద్యార్థులకు ఏ అన్యాయం జరిగినా వారికి జనసేన పార్టీ  అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కార్యదర్శి సుభాని, మునీర్ హసన్, కాకుమాను రమేష్ ,భాష, మల్ల కోటి,అమరేశ్వరి, కోటేశ్వరమ్మ, కిషోర్, తదితరులు పాల్గొన్నారు.



Share:

గెలిచి & ఓడిన భారత్ - నేటి మ్యాచ్ తో విరాట్ కోహ్లీ కెప్టెన్సీకి గుడ్ బై

గెలిచి & ఓడిన భారత్ - నేటి మ్యాచ్ తో విరాట్ కోహ్లీ కెప్టెన్సీకి గుడ్ బై

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1


ఐసీసీ టి20 వరల్డ్ కప్ 2021 భాగంగా ఈరోజు భారత్ నమీబియాల మధ్య మ్యాచ్ జరిగింది. మ్యాచ్ లో భాగంగా టాస్ గెలిచి ఫీలింగ్ ఎంచుకున్న భారత్. మొదటి బ్యాటింగ్ కు దిగిన నమీబియా 20 ఓవర్ లకు గాను 8 వికెట్ల కష్టానికి 132 పరుగులు చేసింది. నమీబియా మొదట తడబడి 100 లోపే స్కోర్ నమోదు చేస్తుంది - అని అందరూ అనుకున్నారు. కానీ 132 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్ కు దిగిన భారత్ లక్ష్యఛేదనలో 152 ఓవర్లకే ఫినిష్ చేశారు. గెలిచిన ఓడటం ఏంటి అనుకోవచ్చు - కానీ భారత్ సెమీ ఫైనల్స్ వెళ్లాలంటే మరొక మ్యాచ్ గెలవాల్సి ఉంది. కానీ భారత్ అంతకుముందే రెండు మ్యాచ్లను ఓడిపోయింది. ఈ మ్యాచ్ గెలిచిన భారత్ మాత్రం సెమీ ఫైనల్కు వెళ్లదు.

2021 టి-20లో భారత్ కు ఇది చివరి మ్యాచ్. దీంతోపాటుగా విరాట్ కోహ్లీ కి కెప్టెన్గా తన చివరి మ్యాచ్. అలాగే కోచ్ గా ఉన్న రవి శాస్త్రి కి కూడా ఇది చివరి మ్యాచ్. తరువాత జరగబోయే టి 20 లకు రోహిత్ శర్మ సారథ్యం వహించనున్నారు. అలాగే టీమిండియాకు కోచ్ గా రాహుల్ ద్రావిడ్ పగ్గాలు చేపట్టనున్నారు.




Share:

రోడ్డు ప్రమాదం - దారి మధ్యలో ప్రమాదాన్ని గుర్తించి క్షతగాత్రులను తన వాహనం లోనే ఆస్పత్రికి చేరిన టౌన్ సిఐ రాజేశ్వరరావు

రోడ్డు ప్రమాదం - దారి మధ్యలో ప్రమాదాన్ని గుర్తించి క్షతగాత్రులను తన వాహనం లోనే ఆస్పత్రికి చేరిన టౌన్ సిఐ రాజేశ్వరరావు

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట కావూరు గ్రామానికి చెందిన దంపతులు కుమార్ తో కలిసి చిలకలూరిపేట నుండి స్వగ్రామమైన కావూరికి ద్విచక్రవాహనంపై వెళుతుండగా మార్గమధ్యలో కొండ్రుపాడు వద్ద ఆటో ఢీ కొనడంతో రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో భార్య భర్తలు దుర్గాప్రసాద్, హైమావతి గాయపడ్డారు. అదే సమయంలో లో నరసరావుపేట నుంచి చిలకలూరిపేట కి వస్తున్న టౌన్ సిఐ రాజేశ్వరరావు ప్రమాదాన్ని గుర్తించి క్షతగాత్రులను తన వాహనంలో ఎక్కించుకుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న స్థానికులు సీఐ రాజేశ్వరరావు తీసుకున్న తక్షణ నిర్ణయానికి, మానవతా దృక్పథానికి హ్యాట్సాఫ్ తెలిపారు.





Share:

విద్యార్థుల తలలు పగిలేలా కొట్టించడం జగన్మోహన్ రెడ్డి అహంకార ధోరణికి నిదర్శనం - రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ జాకీర్ హుస్సేన్.

విద్యార్థుల తలలు పగిలేలా కొట్టించడం జగన్మోహన్ రెడ్డి అహంకార ధోరణికి నిదర్శనం - రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ జాకీర్ హుస్సేన్.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో TNSF రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ జాకీర్ హుస్సేన్ మాట్లాడుతూ, శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థుల పై లాఠీ ఛార్జ్ చేయించడం, తలలు పగిలేలా కొట్టించడం జగన్  మోహన్ రెడ్డి అహంకార ధోరణికి నిదర్శనం. అనంతపురంలోఎస్‍ఎస్‍బీఎన్ ఎయిడెడ్ కళాశాల దగ్గర విద్యార్థులను పోలీసులు విచక్షణారహితంగా కొడుతూ లాఠీఛార్జ్ చెయ్యడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్య సహాయం అందించాలి. విద్యార్థుల పై లాఠీఛార్జ్ చేసిన పోలీసుల పై కఠిన చర్యలు తీసుకోవాలి. ఎయిడెడ్ కళాశాల ప్రైవేటీకరణ ఆపాలంటూ నిరసన తెలపడం కూడా రాజారెడ్డి రాజ్యాంగంలో నేరమేనా? విద్యార్థి ఉద్యమాలు అణిచి వెయ్యాలని చూసిన ఎంతటి నియంత అయినా నేలకొరగడం ఖాయం. ఎయిడెడ్ విద్యా వ్యవస్థను ధ్వంసం చేసే నిర్ణయాలు వెంటనే వైసీపీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. ఇచ్చిన జిఓలు రద్దు చెయ్యాలి, లేకుంటే విద్యార్థులతో కలిసి పోరాటం చేస్తామని తెలియజేశారు.



Share:

చిలకలూరిపేట పట్టణంలో పలు ట్రాఫిక్ ప్రాంతాలలో అర్బన్ సిఐ ఉక్కు పాదం - ట్రాఫిక్ రూల్స్ పాటించ‌ని ప‌క్షంలో చ‌ర్య‌లు తప్పవు

చిలకలూరిపేట పట్టణంలో పలు ట్రాఫిక్ ప్రాంతాలలో అర్బన్ సిఐ ఉక్కు పాదం - ట్రాఫిక్ రూల్స్ పాటించ‌ని ప‌క్షంలో చ‌ర్య‌లు తప్పవు

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

పట్టణంలో ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా రోడ్లపై వాహనాలు నిలిపి ఉండడంతో అలాంటి స్థలాలను అర్బ‌న్ సీఐ రాజేశ్వ‌ర‌రావు గుర్తించారు. ప‌లు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించారు. ప్రధానంగా మార్కెట్ సెంటర్ లోని మెయిన్ బ‌జార్‌లో ట్రాఫిక్ పోలీస్‌ను నియ‌మించ‌నున్న‌ట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని తెలిపారు. ట్రాఫిక్ రూల్స్ పాటించకుంటే చర్యలు తీసుకోక తప్పదని హెచ్చరించారు. పట్టణంలోని కళామందిర్ సెంటర్ లలో రోడ్లపైకి పార్కింగ్ వెహికల్స్ రాకుండా బోర్డులు ఏర్పాటు చేశారు. వాహన దారుల వల్ల పాదచారులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నామని అర్బన్ సిఐ రాజేశ్వరరావు పేర్కొన్నారు.



Share:

చిలకలూరిపేట:- శివనామస్మరణతో మోత మోగిన పట్టణంలోని శివాలయాలు

చిలకలూరిపేట:- శివనామస్మరణతో మోత మోగిన పట్టణంలోని శివాలయాలు 

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో తెల్లవారుజాము నుండే పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది. తెల్లవారుజాము నుండే భక్తులు శివాలయాలకు పోటెత్తారు.చౌత్రా సెంటర్లోని శివాలయం పాటిమీద పెద్ద శివాలయాల్లో శివనామస్మరణతో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. కార్తీక మాసం సోమవారం రోజున భక్తులు తెల్లవారుజామునే తలస్నానం చేసి ఇంట్లో దీపారాధన పూర్తిచేసుకొని అనంతరం దేవాలయానికి వచ్చి ప్రత్యేక పూజలు మరియు అభిషేకాలలో పాల్గొని ఉపవాస దీక్ష చేపడతారు.


వీడియో మీకోసం 






Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.
📸
మీ వార్తలను మాతో పంచుకోవడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి