మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

Advertisement - 2

Image3

........

Advertisement - 3

Image3

........

ప్రకటనల కోసం 90358 80349 నెంబర్ కు సంప్రదించండి.
|

⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!

చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.

💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి

చిలకలూరిపేట - టెస్ట్ డ్రైవ్ కు తీసుకు వెళ్ళిన టు వీలర్ ఎలక్ట్రికల్ వెహికల్ దగ్ధం

 చిలకలూరిపేట - టెస్ట్ డ్రైవ్ కు తీసుకు వెళ్ళిన టు వీలర్ ఎలక్ట్రికల్ వెహికల్ దగ్ధం

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట పట్టణంలోని అడ్ రోడ్డు సెంటర్ సమీపంలో ఎలక్ట్రికల్ వెహికల్ పూర్తిగా దగ్ధం అయినది. వివరాల్లోకి వెళితే అడ్ రోడ్డు సెంటర్ సమీపంలోని ఒక ఎలక్ట్రికల్ టూ వీలర్ షో రూమ్ నందు వెహికల్ కొనుగోలుకు వచ్చిన వ్యక్తి దానిని టెస్ట్ డ్రైవ్ చేయడానికి రోడ్డుపైకి తీసుకొని వచ్చారు. అయితే సదరు వ్యక్తి డ్రైవ్ చేస్తుండగా వెహికల్ సీటు వేడిగా ఉండటంతో ఆ వ్యక్తి వెహికల్కు స్టాండ్ వేసి పక్కకు వచ్చారు. ఇదే సమయంలో వెహికల్లో నుంచి మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది. దగ్ధమైన ఎలక్ట్రికల్ వెహికల్ విలువ సుమారు 60 వేల రూపాయలు వరకు ఉండవచ్చు అని అంచనా.





Share:

మళ్లీ నవతరం పార్టీకే గాజు గ్లాస్ గుర్తు - నాడు తిరుపతి & నేడు బద్వేల్

మళ్లీ నవతరం పార్టీకే గాజు గ్లాస్ గుర్తు - నాడు తిరుపతి & నేడు బద్వేల్

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి ఆవిర్భవించినప్పుడు ఎన్నికల సంఘం గాజు గ్లాస్ గుర్తును జనసేన పార్టీ గుర్తుగా నిర్ణయించారు. అయితే గడిచిన అసెంబ్లీ ఎలక్షన్స్లో జనసేన పార్టీకి తగినన్ని సీట్లు దక్కపోవడంతో ఎన్నికల సంఘం గాజు గ్లాస్ గుర్తును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చారు. మొన్న జరిగిన తిరుపతి ఉప ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తును ఎన్నికల సంఘం జాతీయ పార్టీ అయిన నవతరం పార్టీకి కేటాయించింది. మళ్లీ ఈ నాడు బద్వేల్ ఉప ఎన్నికలకు కూడా గాజు గ్లాస్ గుర్తును నవతరం పార్టీకే ఎన్నికల సంఘం కేటాయించారు. ఈ విషయాన్ని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. బద్వేల్ ఉప ఎన్నికల్లో నవతరం పార్టీ తరఫున డాక్టర్ గోదా రమేష్ బాబు పోటీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. దీంతో తో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు తమ గాజు గ్లాస్ గుర్తు వేరే పార్టీకి కేటాయించడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.



Share:

వినియోగదారులు కొనుగోలు చేసే ప్రతీ వస్తువును విధిగా బిల్లు తీసుకోవాలి - అఖిల భారత అవినీతి నిర్మూలన & వినియోగదారుల సంఘం

వినియోగదారులు కొనుగోలు చేసే ప్రతీ వస్తువును విధిగా బిల్లు తీసుకోవాలి - అఖిల భారత అవినీతి నిర్మూలన & వినియోగదారుల సంఘం

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట : చీరాల రోడ్డు లో గల బాపూజీ వృద్ధుల సేవా ఆశ్రమంలో అఖిల భారత అవినీతి నిర్మూలన& వినియోగదారుల సంఘము సమావేశం జరిగినది. ఈ సమావేశానికి ఎం వెంకట రాం ప్రసాద్ అధ్యక్షత వహించారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న ప్రముఖ న్యాయవాది మాదాసు భానుప్రసాద్ గారు మాట్లాడుతూ వినియోగ దారుల హక్కుల గురుంచి తెలుయజేశారు.వినియోగదారులు కొనుగోలు చేసే ప్రతీ వస్తువును విధిగా బిల్లు తీసుకోవాలి అన్నారు. గ్యారంటీ, వారంటీ బిల్లులను భద్రపరుచుకోవాలి. మోసపోయిన సందర్భంలో వినియోగదారుల జిల్లా కమిషన్ ను సంప్రదించి వ్యాపారి నుండి నష్ట పరిహారం పొందవచ్చు అన్నారు. అర్యవైస్య సంఘం అధ్యక్షుడు పటేల్ మాట్లాడుతూ ఓటు హక్కు నిజాయితీగా వినియోగించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు కోడూరి వెంకటేశ్వర రావు మాట్లాడుతూ అవినీతి నిర్మూలన ద్వారానే అభివృద్ధి సాధ్యం అన్నారు. అవినీతి కి పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. కొనుగోలు దారులందరు వినియోగదారులే. వినియోగదారుల హక్కుల పరిరక్షణకు కోసం మా సంస్థ కృషి చేస్తుందన్నారు.ధరల్లో వ్యత్యాసం,అధిక ధరలు అమ్మడం,కల్తీ సరుకులు అమ్మడం,నకిలీ వస్తువులు అంట గడితే,తూకాల్లో మోసం చేస్తే వినియోగదారుల సంస్థను సంప్రదిస్తే అండగా ఉండి బాధితులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తాం అన్నారు. ఈ సందర్భంగా నూతన నియోజకవర్గ కమిటీని ఎన్నుకోవడమైనది.

అఖిల భారత అవినీతి నిర్మూలన&వినియోగదారుల సంఘము నియోజకవర్గ అధ్యక్షులు గా  మురికి పూడి ప్రసాద్, ఉపాధ్యక్షుడు షేక్ అబ్దుల్ జబ్బార్, ప్రధాన కార్యదర్శి గా పి.సురేష్ కుమార్,కార్యదర్శిగా పి.శ్రీనివాస రావు,సహాయ కార్యదర్శి గా నిడమానూరు రవి కుమార్, భవిరిసెట్టీమణి, కార్యవర్గ సభ్యులు గా ఎంవి ఎస్ గుప్తా,భలే.శ్రీనివాస్,ఎన్. రవీంద్ర, గౌరవ సలహాదారు లుగా ఎం.భానుప్రసాద్, ఏ. రామ కృష్ణ, డాక్టర్ టి.కృష్ణ ప్రసాద్ లు ఏక గ్రీవముగా ఎన్నికయ్యారు.ఎన్నికైన సభ్యులందరికీ రాష్ట్ర అధ్యక్షుడు శుభాకాంక్షలు తెలియజేశారు.



Share:

చిలకలూరిపేట :- చెరువు రోడ్లో వాకింగ్ కి వెళ్లే వారికి ఇక్కట్లు - ఈ సమస్యను పట్టించుకునేవారు లేరా అని విమర్శలు

చిలకలూరిపేట :- చెరువు రోడ్లో వాకింగ్ కి వెళ్లే వారికి ఇక్కట్లు - ఈ సమస్యను పట్టించుకునేవారు లేరా అని విమర్శలు

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1


చిలకలూరిపేట పట్టణంలోని చెరువు రోడ్ లో వాకింగ్ కి వెళ్లే వారికి ఇక్కట్లు తప్పేలా లేవు. వివరాల్లోకి వెళితే గత కొంత కాలంగా మంచినీరు చెరువు వెళ్లి దారులు భయంకరంగా మారాయి. వాహనదారులు మరియు వాకింగ్ కి వెళ్లే వారు ఇబ్బందులకు గురి అవుతున్నారు. కోటప్ప కొండ వైపు నుండి చెరువు రోడ్డు మీదుగా వైయస్సార్ కాలనీ రోడ్డు నుండి నరసరావుపేట రోడ్డులోకి ప్రతిరోజు పొద్దున మరియు సాయంత్రం సమయాలలో సుమారు 20 నుండి 30 టిప్పర్ వాహనాలు గ్రానైట్ లోడుతో వెళుతుంటాయి. దీంతో చెరువు రోడ్డు మొత్తం దెబ్బ తిన్నది. స్థానికుల సమాచారం మేరకు ఆయా గ్రానైట్ సంబంధించిన వారు రోడ్డుపై కంకరతో చదును చేపించారు.  అయినప్పటికీ వాహనాల టైర్లు కంకరలో ఇరుక్కు పోవటంతో సదరు గ్రానైట్ ఫ్యాక్టరీలో మిగిలిపోయిన డస్ట్ ని తీసుకువచ్చి రోడ్లపై పోశారు. దీంతో రోడ్డంతా దుమ్ముతో మరియు గుంతలతో వాహనదారులు & వాకింగ్ కి వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిపారు. అయితే దీనిపై మున్సిపల్ శాఖ దృష్టిపెట్టి సమస్యను పరిష్కరించే వలసిందిగా వాకింగ్ కు వెళ్లేవారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడిప్పుడే ఏరియాలో కన్స్ట్రక్షన్ అండ్ రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందుతున్న  సమయంలో ఇలాంటి  పరిస్థితులు తీవ్రప్రభావాన్ని చూపిస్తాయని. అలాగే పట్టణంలోనే ప్రశాంతంగా, ఆహ్లాదకరమైన వాతావరణం చెరువు రోడ్ లోనే ఉంటుందని దానిని ఇలా నాశనం చేయవద్దని వారు కోరారు.






Share:

చిలకలూరిపేట మండలం :- ఆగి ఉన్న లారీని ఢీకొన్న గ్యాస్ సిలిండర్ లారీ - క్లీనర్ మృతి

 చిలకలూరిపేట మండలం :-  ఆగి ఉన్న లారీని ఢీకొన్న గ్యాస్ సిలిండర్ లారీ - క్లీనర్ మృతి

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట మండలం తాతపూడి జాతీయ రహదారి వద్ద ఆగి ఉన్న లారీని గ్యాస్ సిలిండర్ తో వెళ్తున్న లారీ ఢీ కొనడంతో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే ఒంగోలు నుండి విజయవాడ వైపు వెళుతున్న లారీ టైర్ పడటంతో డ్రైవర్ దానిని తాతపూడి జాతీయ రహదారి పక్కనే ఉన్న బస్టాండ్ వద్ద ఆపారు. ఆయా లారీ కి సంబంధించిన క్లీనర్ పగిలిన టైర్లను మార్చి వేరే టైర్ మార్చే క్రమంలో గ్యాస్ సిలిండర్ లోడుతో వెళ్తున్న మరో లారీ వెనక నుండి వచ్చి ఆగి ఉన్న లారీని ఢీకొన్న ది. ఈ సమయంలో క్లీనర్ లారీ కింద టైర్ మారుస్తూ ఉన్నాడు. ఇంతలో ఈ ఘటన జరగడంతో క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందాడు. గ్యాస్ లోడుతో వెళ్తున్న లారీ డ్రైవర్ తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు అక్కడికి వచ్చిన 108 అంబులెన్స్ ఇబ్బంది క్లీనర్ మృతి చెందినట్లు తెలిపారు. అలాగే గాయపడిన లారీ డ్రైవర్ ని గుంటూరు జిజిహెచ్ కి తరలించారు. ఈ ఘటన మంగళవారం అర్ధరాత్రి సుమారు రెండు గంటల ఆ సమయంలో జరిగినట్లు స్థానికులు తెలిపారు.



Share:

13వ తేదీ జరగవలసిన వైద్యుల సన్మాన కార్యక్రమం వాయిదా - చైర్మన్ రఫాని

13వ తేదీ జరగవలసిన వైద్యుల సన్మాన కార్యక్రమం వాయిదా - చైర్మన్ రఫాని

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట:- కరోనా సమయంలో కరోనా బారిన పడిన పేషెంట్లకు వైద్య సేవలు అందించిన వైద్యులకు 13వ తేదీ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించ తలపెట్టారు. అయితే  దసరా పండుగ సందర్భంగా కొంతమంది వైద్యులు అందుబాటులో ఉండటం లేరని తెలియటం వల్ల  ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు మున్సిపల్ చైర్మన్ రఫాని తెలియజేశారు.  వైద్యులకు సన్మానం చేసే విషయంలో తర్వాత తేదీని ప్రకటిస్తామని మున్సిపల్ చైర్మన్ రఫాని తెలిపారు.



Share:

పట్టు వస్త్రాలను సమర్పించే అవకాశం దక్కటం నా అదృష్టం - MLA రజిని - బోయ‌పాలెం పార్వ‌తి దేవి అమ్మ‌వారికి ప‌ట్టువ‌స్రాల స‌మ‌ర్ప‌ణ‌

పట్టు వస్త్రాలను సమర్పించే అవకాశం దక్కటం నా అదృష్టం - MLA రజిని - బోయ‌పాలెం పార్వ‌తి దేవి అమ్మ‌వారికి ప‌ట్టువ‌స్రాల స‌మ‌ర్ప‌ణ‌

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

జ్ఞానానికి అధిష్టాన దేవ‌త స‌రస్వ‌తి అని చిల‌క‌లూరిపేట శాస‌న‌స‌భ్యురాలు విడ‌ద‌ల ర‌జిని తెలిపారు. ద‌స‌రా ఉత్స‌వాలు, మూలా న‌క్ష‌త్రం కావ‌డంతో మంగ‌ళ‌వారం య‌డ్ల‌పాడు మండ‌లంలోని బోయ‌పాలెంలో వేంచేసి ఉన్న ప్ర‌సిద్ధ పార్వ‌తి దేవి అమ్మ‌వారికి ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జిని ప‌ట్టు వ‌స్త్రాలు అంద‌జేశారు. వ‌రుస‌గా రెండో ఏడాది కూడా ఉత్స‌వాల్లో భాగంగా ఎమ్మెల్యే అమ్మ‌వారికి వ‌స్త్రాలు బ‌హుక‌రించారు. ఈ స‌ద‌ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నవరాత్రి ఉత్సవాలలో మూలా నక్షత్రం రోజున అమ్మవారు సరస్వతీ దేవిగా భక్తులకు దర్శనమిస్తార‌ని తెలిపారు. సరస్వతి అమ్మ‌వారు బ్రహ్మ చైతన్యంతో హంసవాహనాన్ని అధిష్టించి ఉంటార‌ని తెలిపారు. సరస్వతీ దేవిని అర్చిస్తే అజ్ఞానాంధకారం తొలగిపోతుందన్నారు. బోయ‌పాలెంలోని పార్వ‌తి దేవి అమ్మ‌వారి ఆలయానికి వందేళ్ల‌కు పైగా చ‌రిత్ర ఉంద‌ని తెలిపారు. విజ‌య‌వాడ క‌న‌క‌దుర్గ అమ్మ‌వారి ఆల‌యం త‌రువాత ఈ ప్రాంతంలో అత్యంత ప్రాశ‌స్త్యం క‌లిగిన ఆల‌యం బోయపాలెంలోని అమ్మ‌వారి ఆల‌య‌మేన‌ని చెప్పారు. ప‌ట్టువ‌స్త్రాల‌ను స‌మ‌ర్పించే గొప్ప అవ‌కాశం త‌న‌కు ద‌క్క‌డం త‌న అదృష్ట‌మ‌ని తెలిపారు. తొలుత ఎమ్మెల్యేను అర్చ‌కులు పూర్ణ‌కుంభంతో స్వాగతం ప‌లికారు. ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. కార్య‌క్ర‌మంలో జడ్పీటీసీ ముక్తా వాసు,జడ్పీటీసీ కాట్రగడ్డ మస్తాన్ రావు,స్థానిక సర్పంచ్ వడ్డేపల్లి నరసింహారావు, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని,ఎంపీటీసి సయ్యద్ సుభాని,బింజు బుల్లయ్య,ఉన్నవ సర్పంచ్ ఏసోబు, నాయకులు ఖాదర్ బాషా,శ్రీను నాయక్,గుత్తి సింగయ్య,పల్లపు లక్ష్మీనారాయణ, వంకదారి శ్రీనుబాబు,పందుల బుల్లెబ్బాయి,పఠాన్ అల్లావుద్దీన్, కామినేని రామకృష్ణ మరియు పలువురు పాల్గొన్నారు.



Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.
📸
మీ వార్తలను మాతో పంచుకోవడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి