మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

Advertisement - 2

Image3

........

Advertisement - 3

Image3

........

ప్రకటనల కోసం 90358 80349 నెంబర్ కు సంప్రదించండి.
|

⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!

చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.

💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి

చిలకలూరిపేట పట్టణంలో నేడు భారీ కరోనా కేసులు నమోదు - 30-06-2021,బుధవారం

చిలకలూరిపేట పట్టణంలో నేడు భారీ కరోనా కేసులు నమోదు -  30-06-2021,బుధవారం 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట - దేశంలో, రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతుంటే మన చిలకలూరిపేటలో మాత్రం ఈ రోజు విపరీతంగా కరోనా కేసులు పెరిగిపోయాయి. 30-06-2021, బుధవారం పట్టణంలో నాడు భారీగా కేసులు నమోదు అయ్యాయి. 

చిలకలూరిపేట పట్టణంలో నేడు 17 కేసులు  నమోదు అయ్యాయి. వాటి వివరాలు. 

మదర్ థెరిస్సా కాలనిలో - 2

గాంధీ పేటలో - 1

పండరీపురం 4వ లైన్లో - 4

సాంబశివనగర్ లో - 3

మార్కండేయ నగర్ లో - 4

గుండయ్యతోటలో - 3 గా నమోదు అయ్యాయి. 





























 
Share:

చిలకలూరిపేట - వాదోపవాదాల మధ్య రసాభాసగా కొనసాగిన మునిసిపల్ కౌన్సిల్ సమావేశం.

చిలకలూరిపేట - వాదోపవాదాల మధ్య రసాభాసగా కొనసాగిన మునిసిపల్ కౌన్సిల్ సమావేశం. 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట మునిసిపల్ సమావేశంలో కొంచం సేపు రసాభాసగా మారింది. టీడీపీ , వైస్సార్సీపీ కౌన్సిల్ సభ్యుల మధ్య ప్రోటోకాల్ పాటించటం లేదు అన్న విషయంలో కొంచం సేపు వాదోపవాదం నడిచింది. వెంటనే సభాధ్యక్షులు రఫాని కలుగజేసుకొని సభ్యులు హుందాగా ప్రవర్తించాలి అని సమయాన్ని వృధా చెయ్యవద్దు అని కోరారు. వార్డులలో జరిగే కార్యక్రమాలకి టీడీపీ కౌన్సిలర్లని ఎందుకు పిలవటం లేదు అని ఇది ప్రోటోకాల్ కి విరుద్ధం అని కొత్త కుమారి ప్రశ్నించారు. కౌన్సిలర్లు ఉండగా ఇంచార్జులు ఏమిటి అని కౌన్సిలర్లు గా ప్రజల వద్ద గెలవని వారికీ ఇంచార్జ్ పోస్టు ఏంటి అని ప్రశ్నించారు.సమావేశంలో మాకు అవకాశం ఇవ్వటం లేదు అని గంగా శ్రీనిసరావు అడగగా గత టీడీపీ సమావేశంలో కూడా మీరు అలాగే మాకు అవకాశం ఇవ్వలేదు అని ఛైర్మెన్ రఫాని అనగా దానికి టీడీపీ సభ్యులు గతంలో మేము అలాగే చేసాం అని ఇప్పుడు మీరు కూడా అలాగే చేస్తారా అని సమాధానం ఇచ్చారు. ఇంకా కొనసాగుతుంది. 


 క్రింద లింక్ పైన క్లిక్ చేసి వార్త పొందండి. 






























Share:

చిలకలూరిపేట - అడ్డరోడ్డు సెంటర్ నందు ఆర్చి నిర్మాణ ప్రతిపాదన నిలిపివేయండి - మునిసిపల్ కౌన్సిల్ నందు టీడీపీ కౌన్సిలర్లు

చిలకలూరిపేట - అడ్డరోడ్డు సెంటర్ నందు ఆర్చి నిర్మాణ ప్రతిపాదన నిలిపివేయండి - మునిసిపల్ కౌన్సిల్ నందు టీడీపీ కౌన్సిలర్లు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలోని మున్సిపల్ హాళ్లు నందు ఈ రోజు అనగా బుధవారం నాడు జరిగిన కౌన్సిల్ సమావేశంలో 45 అంశాలతో కూడిన అజండాతో కౌన్సిల్ పారంభించారు. ఈ సమావేశమలో మునిసిపల్ కౌన్సిల్ అంతా సభ్యులతో నిండిపోయింది. చెర్మన్ రఫాని అధ్యక్షతన మొదలైన సభలో పలు ముఖ్యమైన అంశాల గురించి ప్రస్తావించారు. అందులో ముఖ్యంగా పురపాలక నిధులు తక్కువగా ఉన్నందు వలన అడ్డ రోడ్డు రోడ్డు సెంటర్ నందు ప్రతిపాదనలో ఉన్న ఆర్చి నిర్మాణాన్ని నిలిపివేయాలి అని టీడీపీ సభ్యులు తెలిపారు. అలాగే సింగల్ టెండర్లను అనుమతించకూడదు అని టీడీపీ సభ్యుడు గంగా శ్రీనివాసరావు తెలిపారు. టెండర్ వెయ్యటానికి ఎవరు రానందున వచ్చిన సింగిల్ టెండర్ ఆమోదిస్తున్నట్లు రఫ్ఫాని తెలిపారు. అర్బన్ హెల్త్ సెంటర్లకు ఆమోదం తెలిపారు. అలాగే అధికారుల ఆదేశాలతో గణపవరం లోని అర్బన్ హెల్త్ సెంటర్ను నిలిపివేసినట్లు తెలిపారు.మునిసిపల్ షాపుల వేలం గడువు పెంచాలి అని టీడీపీ సభ్యులు కోరారు. ఇంకా కౌన్సిల్ కొనసాగుతుంది. 


సమావేశమలోని తరువాత వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి. 

చిలకలూరిపేట - వాదోపవాదాల మధ్య రసాభాసగా కొనసాగిన మునిసిపల్ కౌన్సిల్ సమావేశం. 











































Share:

చిలకలూరిపేట నియోజకవర్గానికి చెందిన వ్యక్తికి డాక్టరేట్

 చిలకలూరిపేట నియోజకవర్గానికి చెందిన వ్యక్తికి డాక్టరేట్ 

https://chilakaluripetspeednews.blogspot.com/
చిలకలూరిపేట నియోజవకవర్గ పరిధి యడ్లపాడు మండలం కారుచోల గ్రామానికి చెందిన వ్యక్తికి డాక్టరేట్ లభించింది. కారుచోల గ్రామానికి చెందిన సయ్యద్ జిలాని కి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలం నుండి డాక్టరేట్ లభించింది.పెద్ద పెద్ద మ్యానుఫ్యాచరింగ్ పరిశ్రమలలో ఉత్పత్తులు తయారీ సమయం, ఖర్చు తగ్గించటం పట్ల చేసిన పరిశోధనకు ఈ డాక్టరేట్ వచ్చినట్లు తెలిపారు. 

















































Share:

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 29-06-2021,మంగళవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు.

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 29-06-2021,మంగళవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు. 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 29-06-2021,మంగళవారం నాడు మొత్తం 23 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు 

చిలకలూరిపేట పట్టణంలో 4 కేసులు నమోదు అయ్యాయి. 

గుండయ్యతోట లో - 1

మార్కండేయనగర్ లో - 3 గా నమోదు అయ్యాయి. 

చిలకలూరిపేట మండల గ్రామాలలో భారీగా 19 కేసులు నమోదు అయ్యాయి. 

మురికిపూడి గ్రామంలో - 7

వేలూరు గ్రామంలో - 5

గోవిందపురం గ్రామంలో - 3

యడవల్లి గ్రామంలో - 2

తాతపూడి గ్రామంలో - 1

పసుమర్రు గ్రామంలో - 1 గా నమోదు అయ్యాయి. 


 







































Share:

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధి - యడ్లపాడు, నాదెండ్ల మండల గ్రామాలలో 29-06-2021,మంగళవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధి - యడ్లపాడు, నాదెండ్ల మండల గ్రామాలలో 29-06-2021,మంగళవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు 

https://chilakaluripetspeednews.blogspot.com/


చిలకలూరిపేట నియోజకవర్గ పరిధి - యడ్లపాడు, నాదెండ్ల మండల గ్రామాలలో 29-06-2021,మంగళవారం నాడు మొత్తం 27 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు 


నాదెండ్ల మండల గ్రామాలలో 18 కేసులు నమోదు అయ్యాయి. 


చిరుమామిళ్ల గ్రామంలో - 3

కనపర్రు గ్రామంలో - 3

సంక్రాంతిపాడు గ్రామంలో - 6

నాదెండ్ల గ్రామంలో - 6 గా నమోదు అయ్యాయి. 



యడ్లపాడు మండల గ్రామాలలో 9 కేసులు నమోదు అయ్యాయి. 


జాలాది గ్రామంలో - 1

మైదవోలు గ్రామంలో - 2

లింగారావుపాలెం గ్రామంలో - 1

బోయపాలెం గ్రామంలో - 5 గా నమోదు అయ్యాయి. 











































Share:

ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి గా ఉండే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదు - పత్తిపాటి

ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి గా ఉండే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదు - పత్తిపాటి 

https://chilakaluripetspeednews.blogspot.com/


ఏపీలో చంద్రబాబు నాయుడి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బాధితులకు అండగా ఉండేందుకు మంగళవారం నాడు సాధన దీక్షకు పిలుపునిచ్చారు. అయితే గుంటూరు జిల్లాలో టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ రాష్ట్రంలోని పేద ప్రజలను మోసం చేస్తున్న ప్రభుత్వం జగన్ మోహన రెడ్డి ప్రభుత్వం అని విమర్శించారు. అలాగే రెండు సంవత్సరాల క్రితం పూర్తి చేసిన టిడ్కొ ఇళ్లను ఎంత వరకు ప్రజలకు అందజేయలేదు అని,ఇళ్ల స్థలాల్లో ఘరానా మోసం జరిగింది అని దాని పైన సిబిఐ ఎంక్వీయిరి వెయ్యాలి అని అన్నారు. కరోనా తో మరణించిన వారి కుటుంబాలకు 25 లక్షలు ఇవ్వాలి అని., అలాగే తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి 10 వేల ఆర్ధిక సాయం చెయ్యాలి అని, అమరావతి రైతు దీక్షను పట్టించుకోవటం లేదు అని, పోలీసులు MLA కనుసైగలలో మెలుగుతూ అన్యాయాన్ని ప్రశ్నించిన వారి పైన కేసులు పెడుతున్నారు అని, రాష్ట్రము మొత్తం పేకాట క్లబ్బులతో కళకళలాడుతుంది అని అన్నారు.అసలు జగన్ మోహనరెడ్డికి ఒక్క రోజు ముఖ్యమంత్రిగా ఉండే అర్హత కూడా లేదు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రత్తిపాటి పుల్లారావు తో పటు జివి ఆంజనేయులు,యరపతినేని శ్రీనివాస్, శ్రావణకుమార్,పిల్లి మాణిక్యరావు, కనపర్తి శ్రీనివాస్, రవీంద్ర, పార్టీ జిల్లా స్థాయి నాయకులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు 



































Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.
📸
మీ వార్తలను మాతో పంచుకోవడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి