మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

Advertisement - 2

Image3

........

Advertisement - 3

Image3

........

ప్రకటనల కోసం 90358 80349 నెంబర్ కు సంప్రదించండి.
|

⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!

చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.

💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి

చిలకలూరిపేటలో నేటి నుండి ఫుల్ లాక్ డౌన్

చిలకలూరిపేటలో నేటి నుండి ఫుల్ లాక్ డౌన్ 


https://chilakaluripetspeednews.blogspot.com/


చిలకలూరిపేటలో కరోనా కేసులు రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ఈ రోజు అనగా 21-04-2021 బుధవారం నుండి పూర్తి స్థాయి లాక్ డౌన్ విధించాలి కమిషనర్, ఎంపీడివో, పోలీసుశాఖ వారికీ  ఆదేశాలు జారీ చేసారు తసీల్ధార్ సుజాత గారు. 

 * పట్టణములోని, మండలంలోని అన్ని గ్రామాలలో ఉన్న దుకాణాలు అన్ని ఉదయం 6 గంటల నుండి మధ్యాన్నం 1 వరకు మాత్రమే తెరిచి ఉంచాలి అని,
 * రెస్టారెంట్, హోటల్స్ పార్సెల్ మాత్రమే అనుమతి. 
 * టీ షాప్స్ కు అనుమతులు లేవు కావున తెరవకూడదు. 
 * శ్రీ రామ నవమి పండుగను ఎవరి ఇంటిలో వారే చేసుకోవాలి, పబ్లిక్ లో చేసుకోవటానికి అనుమతులు లేవు. 
 * పట్టణంలో,గ్రామాలలో జాతరలు,తిరునాళ్లలు  జరుపుకోవటానికి అనుమతులు లేవు. 
 * ముఖ్యంగా మాస్క్ లేకుండా బయట తిరిగితే 100 రూపాయల అపరాధ రుసుము వసూళ్లు చేస్తారు. 
 * తోపుడు బళ్ళు ఒకే చోట ఉండకుడదు. 
* ఫంక్షన్స్ , ఇతర కార్యక్రమాలకు ముందస్తు అనుమతులు తీసుకోవాలి. 

     పైన నిబంధనలు పాటించనివారు IPC సెక్షన్ 188 కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటారు అని తెలిపారు. 













Share:

చిలకలూరిపేట తహసీల్దార్,కమిషనర్, MLA ను కలిసిన చంద్రమౌళి కూరగాయల వర్తక సంఘం సభ్యులు

 చిలకలూరిపేట తహసీల్దార్,కమిషనర్, MLA ను కలిసిన చంద్రమౌళి కూరగాయల వర్తక సంఘం సభ్యులు

https://chilakaluripetspeednews.blogspot.com/

పట్టణంలోని చంద్రమౌళి కూరగాయల వర్తక సంఘం సభ్యులు మంగళవారం నాడు MLA , తహసీల్దార్,కమిషనర్ గారిని కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా కారణంగా మార్కెట్ మూసివేసి విశాలమైన మైదానంలో స్టాల్ ఎర్పాటు చేసిన అక్కడకు కూడా ప్రజలు గుంపులు గుంపులు గా వస్తారు. గత అనుభవాల దృష్ట్యా మార్కెట్ అక్కడ ఉంచి మొత్తం 80 షాపులలో 40 ఒక రోజు 40 ఇంకొక రోజు ఎర్పాటు చేసుకుంటూ, షాప్ వదిలి షాప్ తెరచి ఆలా అమ్మకాలు సాగిస్తాం అని తెలియచేసారు. అలాగే గత లాక్ డౌన్ లో హోల్సేల్ మార్కెట్ పెద్ద మార్కెట్ యార్డ్ నందు ఎర్పాటు చేసారు. ఆ సమయంలో అక్కడ నుండి కురగాయలు కొనుగోలు చేసి సంతలో ఎర్పాటు చేసిన రిటైల్ మార్కెట్ వెళ్లే సమయంలో రోడ్డు ప్రమాదం జరిగి మార్కెట్ వ్యక్తిని కోల్పోయాము అని తెలియచేసారు. ఈసారి వ్యవసాయ చిన్న మార్కెట్ యార్డ్ నందు హోల్ సేల్ కి అనుమతి ఇచ్చి రిటైల్ ను ప్రస్తుత మార్కెట్ నందు నిర్వహించుకుంటాం అని తెలియచేసారు. 

కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఎట్టి పరిస్థితిలో మార్కెట్ ఖాళీ చేసి 15 రోజుల పాటు శానిటైజేషన్ చెయ్యాలి అని. రిటైల్ దుకాణాలు అన్ని విశాలమైన మైదానాలలో మార్చాలి అని తెలియచేసారు. ఈ సమావేశంలో గుడిపల్లి భూషయ్య, కామయ్య, MNR శ్రీను, R  శ్రీనివాసరావు, కంచర్ల ప్రసాద్, గంటల రవి, CSR, వలీ,మరియు ముఖ్య సభ్యులు పాల్గొన్నారు.    





















Share:

చిలకలూరిపేటలో సర్ధార్ గౌతు లచ్చన్న వర్ధంతి నిర్వహించిన గౌడ యూత్, బీసీ సంఘ నాయకులు

చిలకలూరిపేటలో సర్ధార్ గౌతు లచ్చన్న వర్ధంతి నిర్వహించిన గౌడ యూత్, బీసీ సంఘ నాయకులు 

https://chilakaluripetspeednews.blogspot.com/


చిలకలూరిపేట పట్టణంలోని గౌడ కళ్యాణ మండపం నందు స్వతంత్ర సమర యోధుడు, బీసీ వర్గాల అభివృద్ధికి ఎంతో కృషి చేసిన శ్రీ సర్ధార్ గౌతు లచ్చన్న గారి 15వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. సర్ధార్ అంటే గుర్తు వచ్చేది రెండే పేర్లు 1 సర్ధార్ వల్లభాయ్ పటేల్, 2 సర్ధార్ గౌతు లచ్చన్న గారు  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పలు సార్లు మంత్రిగా చేసారు. బ్రిటిష్ వారికీ వ్వతిరేకంగా 1932 లో జరిగిన శాసన ఉల్లంఘన  ఉద్యమాల్లో పాల్గొని 5 నెలల పటు జైలు జీతాన్ని గడిపారు. 1930 లో గాంధీ గారి పిలుపు మేరకు ఉప్పు సత్యాగ్రహము లో పాల్గొని బారువా సమీపంలో ఉన్న ఉప్పు నీటితో ఉప్పు తయారు చేసి ఆ డబ్బులతో ఉద్యమాన్ని నడిపారు. తన  96 వ ఏటా కన్నుమూశారు  అని గుర్తుచేసుకున్నారు. ఈ కార్యకమాలొ చిలకలూరిపేట గౌడ్ యూత్, బీసీ సంఘ నాయకులూ పాల్గొన్నారు 













Share:

చిలకలూరిపేటలో పేకాటరాయుళ్ల - 16 మందిని అరెస్ట్

 చిలకలూరిపేటలో పేకాటరాయుళ్ల - 16 మందిని అరెస్ట్  

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేటలో పేకాట స్థావరాల పైనా సీఐ బిలాలుద్దీన్ ఆధ్వర్యంలో  దాడులు నిర్వహించారు . వివరాల్లోకి వెళితే పట్టణములోని పండరీపురంలోని ఒక అపార్టుమెంట్ నందు పేకాట ఆడుతున్నారు అని సమాచారంతో సీఐ ఆ ప్రాంతాన్ని చేరుకొని తనిఖీలు చేసారు. ఆ సమయంలో 16 మంది పేకాట రాయుళ్లని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 1.6 లక్షల నగదు ,16 సెల్ ఫోనులు స్వాధీనం చేసుకున్నారు. సీఐ బిలాలుద్దీన్ గారు మాట్లాడుతూ ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకుంటాము అని తెలిపారు. 























Share:

చిలకలూరిపేటలో రేపటి నుండి ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి - కళ్యణ మండపాలు, మార్కెట్, సినిమా హాళ్లు పైన ఆంక్షలు

చిలకలూరిపేటలో రేపటి నుండి ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి - కళ్యణ మండపాలు, మార్కెట్, సినిమా హాళ్లు పైన ఆంక్షలు 
https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేటలో కరోనా ఆంక్షలు పైన నోటీసు రిలీజ్ చేసారు తసీల్ధార్ సుజాత గారు . తక్షణమే ఆంక్షలు అమలులోకి రావని అని చెప్పారు. పట్టణంలోని రురల్,అర్బన్, పరిధిలో గల కళ్యాణ మండపాలను తక్షణమే మూసివేయ్యాలి అని, అలాగే సినిమా హాళ్లలో 50% సీట్ ఆక్యుపెన్సీ తో కొనసాగించాలి అని. మార్కెట్ ను తక్షణమే మూసివేసి విశాలంగా ఉండే మైదానాలో స్టాల్స్ ఎర్పాటు చెయ్యాలి అని తెలిపారు. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ, ప్రతి ఒక్కరు మాస్క్ వాడాలి అని సూచించారు.  





















Share:

ఏపీలో టెన్త్ , ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసారు

 ఏపీలో టెన్త్ , ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసారు

https://chilakaluripetspeednews.blogspot.com/

కరోనా కారణంగా ఇప్పటికే 1-9 తరగతులకు ఎగ్జామ్స్ లేకుండా ఫై తరగతులకు ప్రమోట్ చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే టెన్త్, ఇంటర్ పరీక్షలను వాయిదా వెయ్యకుండా వాటి టైం టేబుల్ రిలీజ్ చేసారు. 

పదవ తరగతికి :- సాధారణంగా ఉండే 11 పరీక్షలను 7 పరిక్షలుగా కుదించారు. 

జూన్ 7 - ఫస్ట్ లాంగ్వేజ్ ,

జూన్ 8 - సెకండ్ లాంగ్వేజ్,

జూన్ 9 - ఇంగ్లీష్,

జూన్ 10 - గణితం,

జూన్ 11 - భౌతిక శాస్త్రం,

జూన్ 12 - జీవ శాస్త్రం,

జూన్ 14 - సోషల్ ,

ఇంటర్ :- మే 5-22 వరకు ఫస్ట్ ఇయర్,

                  మే 5-23 వరకు సెకండ్ ఇయర్ 

















Share:

ఏపీలో విద్యార్ధులకి రేపటి నుండి సెలవలు - టెన్త్, ఇంటర్కు మినహాయింపు

 ఏపీలో విద్యార్ధులకి రేపటి నుండి సెలవలు - టెన్త్, ఇంటర్కు మినహాయింపు 

https://chilakaluripetspeednews.blogspot.com/

ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్న క్రమంలో సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రోజు పాఠశాలలోని విద్యార్థులు కరోనా భారీన పడటం లేదా ఉపాధ్యాయులు కరోనా బారిన పడటం చూస్తూనే ఉంటున్నాం . వీటి అన్నిటిని పరిగణలోకి తీసుకొని రేపటి నుండి అంటే మంగళవారం 19-04-2021 నుండి 1-9 తరగతుల వరకు పాఠశాలలకు సెలవలు ప్రకటించారు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.  స్కూలు సెలవలు ఇచ్చారు కానీ కరోనా రెస్ట్ తీసుకోదు పిల్లలని బయటకి పంపకుండా ఇంటి వద్దనే  ఉంచండి  














Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.
📸
మీ వార్తలను మాతో పంచుకోవడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి